ఏపీ నేతలకు కేసీఆర్ వార్నింగ్.. మీకు చేత కాకుంటే చెప్పండి.. పడుకున్న బెబ్బొలిని లేపొద్దు

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రా నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ తన ఉగ్రస్వరూపం చూపించారు. మీ చిల్లర రాజకీయాలు మా దగ్గర చూపించొద్దు.. అవి మా దగ్గర పనిచేయవు.. అని హెచ్చరించారు. అంతేకాదు ఏపీకి చెందిన ఇద్దరు నేతల సంగతి తనకు తెలుసని ఆయన అన్నారు. తన దగ్గర నాటకాలాడవద్దని ఆయన హితవు పలికారు. తెలంగాణలో ఉన్న అంతో ఇంతో మర్యాదని పొగొట్టుకోవద్దని ఏపీ నేతలకు ఆయన సూచించారు. గోదావరి నీళ్లు ఎలా ఉపయోగించాలో తెలివిలేని మీరు తెలంగాణ మీద పడి ఏడవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. మీకు చేత కాకుంటే చెప్పండి, గోదావరి నీరు ఎలా వినియోగించుకోవాలో వివరిస్తానని ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారు. పడుకున్న బెబ్బొలిని లేపి గొడవ పెట్టుకోవద్దని హెచ్చరించారు.