బ్రదర్ అనిల్ న్యాయ పోరాటం
posted on Feb 19, 2013 4:29PM
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పై ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన పోరాటం చేస్తామని జగన్ సలహాదారు సోమయాజలు చెప్పారు. ప్రతి కుంభకోణంతో అనిల్ కి లింక్ పెట్టి మాట్లాడుతున్నారని, అలా ఆరోపణలు చేసిన వారిపై ఆయన న్యాయ పోరాటం చేసే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. పరువునష్ట దావా కూడ వేస్తారన్నారు. చంద్రబాబు నాయుడు సహనం కోల్పోయి బ్రదర్ అనిల్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే బ్రదర్ అనిల్ తనపై వచ్చిన విమర్శలపై వివరణ ఇవ్వకపోవడం, ఆయన తరపున వేరేవారు మాట్లాడడం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది. నిజంగానే అనిల్ న్యాయపోరాటం చేస్తారా లేక పత్రిక ప్రకటనల వరకే పరిమితమౌతారో చూడాలి.