వైకాపా అభిమానులకి శుభవార్త

posted on: Oct 30, 2013 6:11PM

 

Jagan Bail, Jagan CBI court, Jagan assets case, jagan bail conditions

 

 

వైకాపా అభిమానులకు శుభవార్త...ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పై విధించిన షరతులను సీబీఐ కోర్టు సడలించింది. ఇకా జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అంతేకాదు.. ఢిల్లీకి కూడా వెళ్లేందుకు అవకాశమిచ్చింది. తాను ఒక రాజకీయ పార్టీకి అద్యక్షుడనని, ఎమ్.పిని అని ,ప్రజలకు సంబంధించిన అంశాలపై ఆయా ప్రాంతాలలో పర్యటించవలసి ఉంటుందని , కనుక తనపై పెట్టిన ఆంక్షలను సడలించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ తరఫున న్యాయవాది కోర్టులో అదే వాదనను వినిపించారు. ఈ వాదనను సిబిఐ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. ఢిల్లీ వెళ్ళడానికి, రాష్ట్రంలో పర్యటించడానికి అనుమతినిస్తే కేసుపై తీవ్ర ప్రభావం పడుతుందని వాదించారు. చివరికి జగన్ తరుపు న్యాయవాది వాదనకు ఏకీభవించి కోర్ట్ అనుమతి మంజూరు చేసింది.    

google-ad-img
    Related Sigment News
    • Loading...