Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉగ్రమూకలకు ముచ్చెమటలు.. 800 మంది ఉగ్రవాదులు హతం
posted on: Apr 25, 2016 5:01PM
.jpg)
ఒకపక్క ఉగ్రవాదుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. మరోపక్క ఉగ్రవాదాన్ని అంతమొందించే దిశగా యెమెన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఏడాది కాలంలో అరబ్ సంయుక్త దళాలతో కలిసి జరిపిన దాడుల్లో ఇప్పటికి 800 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల అధీనంలో ఉన్న ముకల్లా నగరాన్ని, షెహర్లోని మినా అల్-ధాబాలోని ఆయిల్ టెర్మినల్ను మిలటరీ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఈ దాడుల్లో కీలక ఉగ్రవాదనేతలు కూడా మృత్యువాత పడ్డారని సంబంధిత అధికారులు చెప్పారు. దీంతో యెమెన్ ప్రభుత్వం జరుపుతున్న దాడులతో అల్ఖైదా ఉగ్రమూకలకు ముచ్చెమటలు పడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇరాక్-సిరయాల ఉగ్రవాదులపై కూడా అగ్రరాజ్యాలు కూడా పోరాటం చేస్తుండటంతో అక్కడ కూడా చాలావరకూ ఉగ్రవాదులు తగ్గిపోయారు.






