హీరో అల్లు శిరీష్ పై యువతి పిర్యాదు
posted on: Jun 10, 2013 11:12AM

స్టైలిష్ అల్లు అర్జున్ తమ్ముడు, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ పై ఓ యువతి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడం, ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అల్లు శిరీష్ పబ్ లో మద్యం సేవించి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఢిల్లీ యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అల్లు శిరీష్ తండ్రి అల్లు అరవింద్ కు తీవ్ర ఇబ్బందికరంగా మారనుంది. రీసెంట్ గా రామ్ చరణ్ నడి రోడ్డుపై పెద్ద విద్వంస౦ సృష్టించాడు. తన కారును ఓవర్ టేక్ చేశారని ఇద్దరు వ్యక్తులపై తన బాడీగార్డ్ లతో కొట్టించాడు. బాధితులు పోలీసులకు కూడా పిర్యాదు చేశారు. రాజకీయాల్లో నానా యాతనలు పడుతున్న చిరంజీవికి, మెగా హీరోలు తీసుకొస్తున్న ఈ వివాదాలు తలనొప్పిగా మారాయి.






