Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రోజుకో మలుపు తిరుగుతున్న నటి హేమశ్రీ మర్డర్
posted on: Oct 16, 2012 7:20PM
.jpg)
కన్నడనటి హేమశ్రీ హత్యకేసులో కీలక వివరాలు ఒక్కొటొక్కటిగా బైటపడుతున్నాయి. బెంగళూరు పోలీసులు కార్పొరేటర్ మురళిని అదుపులోని తీసుకుని ప్రశ్నించినప్పుడు విస్మయం కలిగించే నిజాలు వెల్లడయ్యాయి. బెంగళూరు పోలీసులకు కార్పొరేటర్ మురళి చెప్పిన వివరాల ప్రకారం.. హేమశ్రీ మురళి కూతురు పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యింది. ఓమంత్రిగారినికూడా ఈ వేడుకలకు ఆహ్వానించారు. ఆయన కోరిక తీర్చమని హేమశ్రీని బలవంతపెట్టారు. ససేమిరా అనడంతో క్లోరోఫామ్ ని ప్రయోగించారు. మోతాదు ఎక్కువై హేమశ్రీ చనిపోయింది. మృతదేహాన్ని ఆమె భర్త సురేంద్రబాబు, మురళి కలిసి బెంగళూరుకి తీసుకెళ్లారు. బాప్టిస్ట్ ఆసుపత్రికి తీసుకెళ్లి డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు. హెబ్బాళ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఉదయం నాలుగున్నరకల్లా సురేంద్రబాబు రెడ్డిపల్లి ఫామ్ హౌస్ కి హేమశ్రీ శవాన్ని తీసుకొచ్చాడు. అంతా ప్లాన్ ప్రకారం జరిగింది. తప్పించుకునేందుకు ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని ఎత్తులూ వేశారు. కానీ.. పోలీసులు హేమశ్రీ భర్త సురేంద్రబాబుకి మర్యాదలు చేసినప్పుడు నిజం కక్కేశాడు. మాజీ కార్పొరేటర్ మురళికికూడా అందాల్సిన ట్రీట్ మెంట్ అందేసరికి నిజాలు గడగడా బైటికొచ్చాయ్. బెంగళూరులో సురేంద్రబాబుపై పాతిక్కిపైగా కేసులున్నట్టు తెలుస్తోంది.



.png)


