Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రోడ్డుపై నీళ్లు పోస్తే ఇక జైలుకే..
posted on: May 5, 2016 1:20PM

అసలే ఇప్పుడు పలు రాష్ట్రాలు నీటి సమస్యతో అల్లల్లాడుతున్నాయి. మహారాష్ట్రలోని లాతూర్ కి అయితే రైళ్లతోనే నీటిని సరఫరా చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే హర్యానా ప్రభుత్వం ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై నీటిని వృథాగా పాడు చేసే వారికి జైలు శిక్ష విధించడానికి సిద్దమైంది. అసలు సంగతేంటంటే.. హర్యాలోని పలు ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. అయితే దీనికి జర్మన్ తరహా గ్రీన్ టెక్నాలజీని వాడుతున్నారంట. దీంతో ఈనిర్మాణాలకి దాదాపు 5 కిలోమీటర్లు దూరానికి రూ. 3 కోట్ల రూపాయలు ఖర్చువతోందట. అయితే హర్యానాలో పలు గ్రామాల్లో.. గ్రామస్తులు నీటిని వృథా చేస్తూ రోడ్లపైన పోస్తున్నారు. దీనివల్ల రోడ్లు కొట్టుకుపోయి పాడైపోతున్నాయట. దీంతో అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా.. రోడ్డు మీద కనీసం ఒక బక్కెట్ నీళ్లు పోసిన శిక్ష లేదా రూ.10,000 జరిమానా విధించాలనే నిర్ణయానికి వచ్చింది.



.jpg)


