Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ముందస్తు బెయిల్ కోసం ఎంఎల్ఎ ప్రయత్నం
posted on: Dec 20, 2012 11:45AM
.jpg)
ఓ కాంగ్రెస్ కార్యకర్త హత్య కేసులో నిందితునిగా ఉన్న గుంటూరు జిల్లా గురజాల ఎంఎల్ఎ యరపతినేని శ్రీనివాస రావు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.
గత నెల 28 న పిడుగురాళ్ళ లో జరిగిన ఉన్నం నరేంద్ర హత్య కేసుకు సంభందించి పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఇద్దరు నిందితులు లొంగిపోయారు. మరో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో కొందరు డబ్బుల కోసం ఈ హత్య చేసినట్లు సమాచారం.
అయితే, యరపతినేని వాదన మరోలా ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఎల్ఎ కృష్ణా రెడ్డి పోలీసులఫై వత్తిడి తెచ్చి తనను ఈ కేసులో ఇరికించారని అంటున్నారు. తన బెయిల్ పిటీషన్ లో ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తన నియోజకవర్గంలో తాను ఇంతవరకూ ఎప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదని యరపతినేని అంటున్నారు. ఈ బెయిల్ పిటీషన్ విచారణ నరసరావుపేట కోర్టులో జరుగనుంది.


.jpg)
.jpg)


