వెనక్కి తగ్గిన కేంద్రం.. ఒక శాతం పన్ను తొలగింపు..

posted on: May 31, 2016 12:17PM

 

కేంద్రం వివిధ రకాల విలువైన లోహాలతో తయారుచేసే ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అరుణ్ జైట్లీ వీటిపై కొత్త పన్ను విధిస్తూ ప్రతిపాదించగా.. దానిని వ్యతిరేకిస్తూ ఆభరణాల దుకాణాదారులు దాదాపు ఆరు వారాల నుండి సమ్మె చేశారు. దీంతో కేంద్రం ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచిస్తామని ప్రకటించింది. దీంతో ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చి ఆభరణాల నగదు కొనుగోళ్లపై విధించిన ఒక శాతం పన్నును తొలగిస్తున్నట్టు ప్రకటించింది.. ఈ నిర్ణయం రేపటి నుంచి (జూన్ 1) అమలులోకి వస్తుందని ప్రకటించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...