ముంబై జైళ్లో అబూ సలేంపై కాల్పులు

posted on: Jun 28, 2013 12:41PM

 

 Gangster Abu Salem attacked, Abu Salem attacked in Taloja prison, Abu Salem jail

 

 

ముంబయి బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు, గ్యాంగ్ స్టర్ అయిన అబూ సలెం మీద తోటి ఖైదీ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అబూ సలెం చేతికి తీవ్ర గాయం అయింది. అబూ సలెం ప్రస్తుతం నవీ ముంబయిలోని తలోజా కేంద్ర కారాగారంలో ఉంటున్నాడు. ఓ న్యాయవాది హత్య కేసులో ఉన్న నిందితుడుగా ఉన్న దేవేంద్ర జగ్ తప్ అనే ఖైదీ ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. నిన్నరాత్రి 8.30 గంటలకు ఈ సంఘటన జరిగింది. పోర్చుగల్ తో భారత్ కు ఉన్న ఒప్పందం మేరకు అక్కడ ఉన్న అబూ సలెంను 2005 లో భారత్ కు తీసుకువచ్చారు. 2010లో అబూ సలెం అర్ధర్ రోడ్ జైలులో ఉన్నప్పుడు కూడా తోటి ఖైదీ చేతిలో గాయపడ్డాడు. ఇప్పుడు రెండో సారి మళ్లీ దాడి జరిగింది. అసలు దేవేంద్రకు తుపాకి ఎలా చేరింది అన్నది విచారణ జరుగుతుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...