చంద్రబాబుపైనే ఎర్రబెల్లి కామెంట్లు..


తెలంగాణ టీడీపీ నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికార పార్టీ టీఆర్ఎస్ లో జంప్ అయిన సంగతి తెలిసిందే. అయితే అలా పార్టీ మారారో లేదో ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేసేస్తున్నారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎర్రబెల్లి స్పందిస్తూ.. నీటి విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని.. తెలంగాణ నీటి వాటాను అడ్డుకునే యత్నాలు చేయవద్దని కోరారు. తెలంగాణను అభివృద్ధి చేసేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నారన్నారు. తెలంగాణలో విద్యుత్ సమస్య లేకుండా చేశారని, ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలకు మద్దతు తెలపాలనే తాను టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చానని ఇటీవలే పార్టీ మారిన ఎర్రబెల్లి అన్నారు.