కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కుమార్తె మృతి..


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కుమార్తె కర్ణిక సింగ్ మృతి చెందింది. గత కొంతకాలంగా కర్ణిక సింగ్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఆమె గత ఏడాది యూఎస్ లో చికిత్స కూడా చేయించుకున్నారు. కానీ పూర్తిగా నయం కాకపోవడంతో గత కొద్దిరోజులుగా బాధపడుతున్నారు. ఆ క్రమంలో ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు. ఆమె భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ కు తరలించనున్నారు.

 

కాగా దిగ్విజయ్ సింగ్, ఆశా దంపతులకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు. దిగ్విజయ్ భార్య ఆశా 2013లో మృతి చెందారు. అనంతరం దిగ్విజయ్ టీవీ యాంకర్ అమృతారాయ్ ని వివాహం చేసుకున్నారు.