Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వేధింపులకు విద్యార్ధిని ఆత్మహత్య
posted on: Oct 21, 2012 5:03PM

ఆకతాయిల వేధింపులు బరించలేక విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సంతోష్ నగర్ లో విజేత డిగ్రీ కాలేజీలో బిఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న హారికను గత కొద్దిరోజులుగా కొంత మంది ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తున్నారు. వేధింపులు ఎక్కువ కావటంతో ఆమె నెలరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు అనంతరం పోకిరీలు వేధింపులు ఎక్కువ చేశారు. దాంతో మనస్తాపంకు గురైన హారిక బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఆకతాయిల వేధింపుల వల్లే హారిక ఆత్మహత్య చేసుకుందని, ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.



.jpeg)


