Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దస్పల్లా భూములకు దొంగడాక్యుమెంట్లు?
posted on: Sep 23, 2012 1:41PM
విశాఖ నగరంలోని దసపల్లాభూములకు కొందరు ఆక్రమణదారులు దొంగడాక్యుమెంట్లు సృష్టించారు. ఈ డాక్యుమెంట్ల సాయంతో వేలాది కోట్ల విలువైన ఆ భూముల అమ్మకాలు జరుగుతున్నాయి. యథేశ్ఛగా రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోతున్నాయి. వందల కోట్ల రూపాయలు ఆక్రమణదారులు సొమ్ము చేసుకున్నారు. అయితే ప్రభుత్వపరంగా స్పందన వచ్చేప్పటికే ఆలస్యమైంది. దీంతో వారు చెలరేగుతున్నారు. గతంలో ఈ భములన్నీ ప్రభుత్వానివేనని ఆక్రమణదారులకు అవకాశం కల్పించిన అధికారులూ ధృవకకరిస్తున్నారు. అయితే వీరు ప్రస్తుతం ఉద్యోగవిరమణ చేసినందున ప్రస్తుత సిబ్బంది సాయంతో ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే శాసనమండలిలో ఈ అంశం తీవ్రదుమారం లేపింది. వెయ్యికోట్లకు పైచిలుకు ఉన్న ఈ భూములను రక్షించుకుంటామని రెవెన్యూశాఖ మంత్రి రఘవీరారెడ్డి స్పష్టం చేశారు. విజిలెన్స్ సహాయంతో దర్యాప్తు జరిపిస్తామన్నారు. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టులో ప్రభుత్వపరంగా కౌంటర్ దాఖలు చేయటంలో జరిగిన ఆలస్యాన్ని ప్రతిపక్షనేత దాడివీరభద్రరావు తదితరులు గుర్తు చేశారు. ఎకరం వంద కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూములను వదిలేస్తే ఎలా అని నిలదీశారు. దీనిపై సభాకమిటీని కూడా వేయాలని పాలడుగు వెంకట్రావు తదితరులు డిమాండు చేశారు. రెవెన్యూ మంత్రి తన వివరణలో 1958లో గ్రౌండ్రెంట్ పట్టా ఇవ్వటంతో మొదలైన ఆక్రమణలు కొనసాగాయని స్పష్టం చేశారు. అన్ని చర్యలూ చేపట్టి ఆ భూమిని ఆక్రమణదారుల నుంచి వెనక్కి తీసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.






