క్రికెటర్ అంకిత్ కేసరి దుర్మరణం
Published on: Mon Apr 20, 2015 4:49PM

క్రికెట్ అంటే చాలామంది ఇష్టపడతారు. కానీ ఆ క్రికెట్ వల్లే క్రీడాకారులు ప్రాణాలను కోల్పోతున్నారు. గతంలో ఆస్ట్రేలియా క్రీడాకారుడు హ్యూస్ బ్యాటింగ్ చేస్తూ బంతి తగలడంలో అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈస్ట్ బెంగాల్ క్లబ్ క్రికెటర్ అంకిత్ కేసరి మరణించాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సీనియర్ నాకౌట్ పోటీల్లో భాగంగా సోమవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భవానీపూర్ క్లబ్ ఆటగాడు కొట్టిన బంతిని అంకిత్, మరో ఆటగాడు క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించి ఒకరికొకరు గట్టిగా ఢీ కొట్టుకోవడంతో అంకిత్ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.


