తెలుగువాళ్ళతో కాంగ్రెస్ ఆడుకుంటుంది

posted on: Jul 13, 2013 12:15PM

 

cpi narayana, telangana cpi, narayan telangana issue

 

 

తెలంగాణాపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వాయిదా వేయడంపై సిపిఐ నేత నారాయణ మండిపడ్డారు. తెలుగు వాళ్ళ చెవిలో కాంగ్రెస్ పువ్వు పెట్టడానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఇరుప్రాంతలవారి భావోద్రేకాలతో కేంద్రం ఆడుకుంటూ వేడుక చేసుకుంటోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ది నీచపు ఎత్తుగడ అని, ఎన్నికలలో లబ్ది పొందాలన్నదే దాని ఆలోచన తప్ప, ప్రజల సంక్షేమం పట్టదని అన్నారు. ఈ నెల పదిహేడు తర్వాత తెలంగాణ కోసం ఆందోళన చేస్తామని ఆయన చెప్పారు. 2014లోపు తెలంగాణ సమస్య పరిష్కరించకుంటే కాంగ్రెస్పార్టీకి సమాధి కడతామని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ విషయంలో టిఆర్ఎస్ అదినేత చంద్రశేఖరరావుకు కూడా చిత్తశుద్ది లేదని ఆయన విమర్శించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...