మిజోరాంలో కాంగ్రెస్ కి ఓదార్పు
posted on: Dec 9, 2013 6:10PM
.jpg)
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఓటమితో కుంగిపోయిన కాంగ్రెస్ పార్టీకి మిజోరంలో కొంత ఊరట లభించింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 24 స్థానాలలో గెలవగా, మరో ఆరు స్థానాలలో ఆధిక్యంలో ఉంది.ముఖ్యమంత్రి లాల్ తన్హాల్వా తన సొంత నియోజకవర్గం సెర్చీఫ్లో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఎంఎన్ఎఫ్ అభ్యర్థి సి లాల్ రామ్ జావాపై 734 ఓట్ల తేడాతో గెలుపొందారు. తన్హాల్వాకు 5719, లాల్ రామ్ జావాకు 4985 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపై సీఎం లాల్ తన్హాల్వా హర్షం వ్యక్తం చేశారు. ఇది చిన్న రాష్ట్రం అయినా ,ఈ తరుణంలో ఇది కాంగ్రెస్ కు కొంత ఉపయోగపడేదే.



.jpg)
.jpg)


