మరోసారి సీబీఐ విచారణలో హరీష్ రావత్..


ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ను మరోసారి సీబీఐ విచారణలో పాల్గొననున్నారు. గతంలో ఒకసారి ఆయన విచారణలో పాల్గొన్నా.. తగిన సమాచారం అందించలేదని సీబీఐ మరోసారి విచారణలో పాల్గొనాలని ఆదేశించింది. దీంతో ఆయన ఈరోజు సీబీఐ విచారణలో పాల్గొననున్నారు. కాగా  స్టింగ్‌ ఆపరేషన్‌ సిడిలో శాసనసభలో బల నిరూపణ సందర్భంగా తనకు ఓట్లు వేయడానికి రెబెల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు రావత్‌ డబ్బు ఇస్తానని చెప్పినట్లు ఉండటంతో సీబీఐ కేసు నమోదు చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే.