చిరుతో 'మాజీ పీఆర్పీ' భేటి

 

 

 

పూర్వ పిఆర్పీ నాయకులు చిరు ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారట. విభజన నిర్ణయం నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ పైన ప్రజలు కసి పెంచుకున్నారని, వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. కాంగ్రెసు పార్టీలోనే ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆవేదన వ్యక్తం చేశారట. కాంగ్రెసు పార్టీని అందరూ ఉమ్మడి శత్రువుగా చూస్తున్నారని, కేడరంతా పార్టీ మారుదామని సూచించారట. అయితే, చిరు మాత్రం ఎవరు తొందరపడవద్దని సూచించారట. 2014 ఎన్నికలు దగ్గర పడిన దరిమిలా, పార్టీ కోసం పనిచేయాలని మాజీ పీఆర్పీ నేతలకు సూచించిన చిరంజీవి, రాష్ట్ర విభజన దిశగా వేగంగా అడుగులు పడ్తున్నప్పటికీ ఎన్నికల్లోగా విభజన జరిగేందుకు అవకాశాలు తక్కువని చిరంజీవి వారికి సమాచారం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.