బాగ్దాద్‌లో జంట పేలుళ్లు.. 22 మంది మృతి

 

బాగ్దాద్‌లో మరోసారి జంట పేలుళ్లు సంభంవించాయి. ఈ పేలుళ్లలో  22 మందికి పైగా మరణించగా.. 70 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. బాగ్దాద్‌లోని మార్కెట్‌ స్ట్రీట్‌లో ఒక పేలుడు సంభవించింది. ఇరాక్‌ భద్రతా దళాలు బాగ్దాద్‌కు పశ్చిమ దిశలో ఉన్న ఫల్లూజా ప్రాంతంనుంచి ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులను తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఈ పేలుళ్లు సంభవించాయి. పేలుడులో 15 మంది మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు.

 

మరోవైపు తాజిలోని ప్రధాన ఆర్మీ చెక్‌ పాయింట్‌ వద్ద ఆత్మాహుతి దళ సభ్యుడితో కూడిన కారుబాంబు పేలుడులో ఏడుగురు జవాన్లు మరణించారు. 20 మందికిపైగా గాయపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu