ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది.శని,ఆదివారాల్లో హైదరాబాద్‌లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం విజయవాడ చేరుకున్నారు.రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీవర్షాలు,వరదలు,రాజధాని నిర్మాణంలో ముందుకెళ్లడం,గృహనిర్మాణం ,రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి,నిత్యావసర వస్తువుల,ధరులు,ఇసుక విధానం ప్రభుత్వ శాఖల్లో ఈ -పరిపాలన పురోగతి తదితర అంశాల పై ఈ సమావేశంలో చర్చించనున్నారు.