మహారాష్ట్రలో లోయలో పడ్డ బస్సు: 27 మంది మృతి

 

 

 

దేశంలో జరుగుతున్న రైలు,బస్సు ప్రమాదాలు సామాన్య ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రజలు బస్సు, రైలు ప్రయాణాలు చేయాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అనంతపురంలో నా౦దేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదా సంఘటన మరచిపోకముందే...తాజాగా మహారాష్ట్రలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 27 మంది మృతి చెందారు.

 

40 మంది ప్రయాణీకులతో ప్రయాణిస్తున్న బస్సు థానే జిల్లా తోకవాడే సమీపంలో మాల్‌సేజ్ ఘాట్ వద్ద అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఓ మూలవద్ద బస్సు పైకి ఓ టెంపో దూసుకు రావడంతో డ్రైవర్ దానిని తప్పించబోయాడు. దీంతో బస్సు అదుపు తప్పి 250 మీటర్ల లోతు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందగా, అందులో 19 మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారు.