Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎంపీలపై గజపతిరాజు కామెంట్స్.. వారేమి సూపర్ సిటిజన్స్ కాదు
posted on: May 6, 2016 12:27PM
.jpg)
టీడీపీ సీనియర్ నేత, కేంద్రం పౌరయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఎంపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. లోక్సభలో విమానాశ్రయాల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన గజపతిరాజు.. విమానాశ్రయాల్లో ప్రత్యేక సదుపాయాలు పొందడానికి పార్లమెంటు సభ్యులు సూపర్ సిటిజన్స్ కాదని అన్నారు. అంతేకాదు వారికి సాధారణ పౌరులకు మించి సౌకర్యాలు కల్పించడం కుదరదు. సీట్ల అందుబాటు, ప్రాధాన్యాన్ని బట్టి వాటి కేటాయింపులు ఉంటాయి. అంతేగాని ఎంపీలైనంత మాత్రాన ప్రత్యేకంగా పరిగణించే అవకాశం లేదు. రోగులు, వృద్ధుల విషయంలో మానవత్వంతోనే వ్యవహరిస్తాం. సీట్ల కేటాయింపులో వాణిజ్య కోణమే ఎక్కువగా ఉంటుంది'' అని ఆయన చెప్పారు.






