ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల లెక్కింపు ప్రారంభం...

 

తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 7 గంటలకు మొదలైన ఈ లెక్కింపు సాయంత్రం మూడు గంటల వరకూ జరగనుంది. మొదట బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అధికారులు.. ఆ తరువాత ఈవీఎం ఓట్లు లెక్కింపు మొదలుపెట్టారు. కాగా ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల లెక్కింపు ప్రకారం.. తమిళనాడులో అన్నా డీఎంకే పార్టీ ముందంజలో ఉండగా.. కేరళలో ఎల్డీఎఫ్, అస్సాంలో భాజపా, పశ్చిమబెంగాల్ లో టీఎంసీ, పుదుచ్చేరిలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.