Latest News
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల లెక్కింపు ప్రారంభం...
posted on: May 19, 2016 9:43AM

తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 7 గంటలకు మొదలైన ఈ లెక్కింపు సాయంత్రం మూడు గంటల వరకూ జరగనుంది. మొదట బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అధికారులు.. ఆ తరువాత ఈవీఎం ఓట్లు లెక్కింపు మొదలుపెట్టారు. కాగా ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల లెక్కింపు ప్రకారం.. తమిళనాడులో అన్నా డీఎంకే పార్టీ ముందంజలో ఉండగా.. కేరళలో ఎల్డీఎఫ్, అస్సాంలో భాజపా, పశ్చిమబెంగాల్ లో టీఎంసీ, పుదుచ్చేరిలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.



.jpg)


