* * *
కొడుక్కి కాస్త బుద్ది వచ్చి, ఈ పరీక్ష గట్టేక్కిస్తే , కొండకి పిల్లాడిని తీసుకు వచ్చి మొక్కు తీర్చుకుంటానని మొక్కుకున్న వరలక్ష్మీ కొడుకు మూడు నెలలు తండ్రి భయంతో చదివి , అత్తెసరు మార్కులతో తన పేరుకి డిగ్రీ తగిలించు కున్నాడు. ఆ సంతోషం సంబరం తో, తిరుపతి ప్రయాణం పెట్టుకుంది . రిజల్స్ వచ్చిన పది రోజులకు. ఏవో మీటింగ్ లు ఉన్నాయని డిల్లీ రమ్మని కబురోచ్చి, "కారులోనేగా మీ ఇద్దరు వెళ్ళండి అన్ని ఏర్పాట్లు చేశా' అన్నాడు దశరద్. "అవిదకయితే భర్త లేకుండా వెళ్లాలనిపించక పోయినా ప్రయాణం అయ్యాక.......వద్దనుకుంది. కొడుక్క్జైయే తండ్రి రావడం లేదని తెలిసి ఎంజాయ్ చేయవచ్చని సంబర పడ్డాడు.
దర్శనం మొక్కు అన్ని యధావిధిగా పూర్తీ అవగానే రాత్రికి కింద తిరుపతి లో వుండి తెల్లారి ఐదు గంటలకు రష్ లేనపుడు బయలుదేరితే తొందరగా ఇల్లు చేరదాం అని కొడుకు తొందర పెట్టితే సరే అంది వరలక్ష్మీ. డ్రైవర్ కి ఎంత గట్టిగా చెప్పినా స్టీరింగ్ ఇవ్వద్దని తండ్రి చెప్పినా, తల్లి వారిస్తున్నా వచ్చినపుడు వూరు పొలిమేరలు దాటిన తరువాత అధారిటీ చేసి తల్లిని బతిమాలి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కొడుకు బాగానే చేస్తున్నాడు బాధ్యతగానే ఉన్నాడని వెళ్ళేటప్పుడు ఇంకేం అనలేదు వరలక్ష్మీ.
తిరుగు ప్రయాణం లో వూరు ఇంకో అరగంట లో చేరిపోతాం అనుకునే లోపలే మృత్యువు లారీ రూపంలో అతి వేగంగా దూసుకు వచ్చి , సెల్లో స్నేహితుడితో మాట్లాడుతూ కాస్త పరధ్యానంగా వున్న ఆదిత్య తేరుకుని స్టీరింగ్ పక్కకి తిప్పెలోగానే ఎదురుగా లారీని డీ కొట్టాడు. రెండు బళ్ళు వేగంలో ఉండడం తో ముందు సీట్లో కూర్చున్న తల్లి కొడుకు లిద్దరూ అక్కడి కక్కడే కన్ను మూసారు. లారీ ముందు భాగం లోకి కారు సగం దూసుకు పోయింది. వెనక సీట్లో కూర్చున్న డ్రైవర్ కి చాలా దెబ్బలు తగిలినా బతికి బయట పడ్డాడు.
పాతికేళ్ళు తనలో సగ భాగంగా నిలిచిన భార్య, తన రక్తం పంచుకు పుట్టిన ఇరవై మూడేళ్ళ కొడుకు, నాటకంలో పాత్రల్లా హటాత్తుగా చెప్పకుండా, నాటకం మధ్యలోంచి మాయమై పొతే, అది, ఆ మాట , ఆయనకి అర్ధమవడానికి అరగంట పట్టింది. తరువాత నోట మాట పడిపోయినట్టు శూన్యం లోకి చూస్తూనే ఎవరేం చెపితే అది చేసాడు. కంట్లో నించి నీటి చుక్క రాలేదు. భార్యని కొడుకుని ఏ లోపం లేకుండా జరగాల్సిన సకల మర్యాదలతో సాగనంపి, గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. ఆ మూసిన తలుపులు మూడో రోజుకి గానీ తెరుచుకోలేదు. ఎందరు ఎన్ని విధాలు ప్రయత్నించినా.
మూడో రోజు గదిలోంచి వచ్చిన దశరద్ కొత్త జన్మ ఎత్తినట్టు, గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారి ఎగిరి వచ్చినట్టు , గౌతముడు భోధి వృక్షం కింద కూర్చుని మారి బుద్దిడై నట్టు అతి ప్రశాంతంగా బయటికి వచ్చాడు. అర్జున విషాద యోగం ముగిసినట్టు ఎవరేం ఓదార్పు మాటలు చెప్పబోయినా చెయ్యి యెత్తి ఇంక వద్ద అన్నట్టు ఎవరిని మాట్లాడనీయ లేదు . ఇకలే అర్జునా! విషాద యోగం ముగిసింది. నీ కర్తవ్యమ్ నెరవేర్చు అని గదిలో మూడు రోజులుగా ఆపకుండా విన్న భగవద్గీత లో శ్రీకృష్ణుడు బోధించినట్టు , కార్యాచరణ కు దిగిపోయాడు అయన.
మరో నెల రోజులలో అయన అమ్మాల్సిన పొలాలు, పట్నం లో ప్లాట్ లు , ఇల్లు, తోటలు, రైసు మిల్లులు, ఆయిల్ మిల్లులు అన్నీ అమ్మి చేతిలో డబ్బు చేసుకున్నాడు. తన పలుకు బడితో ఆఘమేఘాల మీద పరుగులేత్తించి , ఉండేందుకు ఇల్లు వాడు కోడానికి కారు , భుక్తి కి తగిన డబ్బు మాత్రం ఉంచుకున్నాడు. ఏనాడో తండ్రి కొని పడేసిన భూములు ఈనాడు కొన్ని కోట్లు కురిపిస్తాయని , అయన ఊహకి అందని విషయం. ఎందరికో భుక్తి నిచ్చే మిల్లులు, పొలాలు, అమ్మడానికి కాస్త ఆలోచించినా అందులో పని చేసేవారి బాధ్యత తీసుకునే షరతు మీదే అమ్మి ఎవరికీ అన్యాయం జరక్కుండా చేసారు. ఇన్నేళ్ళుగా తమని, తమ భూమిని నమ్ముకుని బతికిన అందరికీ ఎవరికీ చెందాల్సినవి వారికి అప్పజెప్పి, కార్యాచరణ కు దిగిపోయి, డబ్బు ఉంటె చేయలేని దేముంటుంది.అని మరో రెండు నెలల్లోనే నిరూపించాడు.
నలభయి రోజుల్లో అయన తన వూరిని ఎలా మార్చేసాడో చూసిన ఎవరు నమ్మలేకపోయారు. డబ్బు వుండి, కార్య చరణకి , చిత్తశుద్ది చేతిలో పలుకుబడి , పవర్ ఉంటె, ఏమి చేయగలడో చేసి చూపాడు దశరద్.
వూరులోంచి హైవే వరకు కిలోమీటరున్నర కంకర రోడ్డు సిమెంట్ రోడ్ అయింది....ఏనాడో ఏ జమిందారు లో కట్టిన, శివాలయం, రామాలయం బాగుపడి తల్లి తండ్రుల పేర్లతో వెలిసి రంగులతో, విద్యుద్దీపాలతో వెలిగిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాల జూనియర్ కాలేజీ గా వెలిసింది. కొత్త గదులు, ల్యాబ్, బ్లాక్ బోర్డులు, టాయిలెట్లు రెండు కొత్త మోడర్న్ గా తయారయి మెరిసిపోతూ ప్లే గ్రౌండ్ ,టీచర్స్ రూం ఒకటేమిటి అన్ని హంగులతో రూపు రేఖలు మార్చుకుంది. భార్య పేరుతొ ఊరిలో నాలుగు దిక్కులా నాలుగు మంచినీళ్ళ ఓవర్ హెడ్ ట్యాంకులు, బజారు లో ప్రతి కూడలి లో , ప్రతి వీధి లో మంచి నీళ్ళ కుళాయి లు, అరడజను బోర్ పంపులు, ఒక వెటర్నరీ ఆసుపత్రి కొడుకు పేరుతొ కొడుక్కి పెంపుడు కుక్కని ప్రాణంగా చూసుకునే వాడని, ప్రభుత్వ ఆసుపత్రి బాగు చేయించి, పాతిక పడకల ఆసుపత్రిగా సకల సదుపాయాలతో , ఉదయం సాయంత్రం రెండు బస్సులు పట్నం నుండి వెళ్ళేవి, వచ్చేవి. పట్నంలో స్కూల్స్ చదివే పిల్లలకి రాకపోకలకు ప్రత్యేకం వేన్. రోడ్డుకి అటు ఇటు బస్ షెల్టర్స్. తల్లి గారి పేర ఒక ఓల్డ్ ఏజ్ హోం. పొలాల మధ్య లో మూడు బోర్ వేల్స్ , ఓ ట్రాక్టర్, రోడ్ల మీద విద్యుద్దీపాలు ....ఒకటేమిటి....చేతిలో వున్న డబ్బంతా ఆఖరు అయ్యే వరకు వూరుకేమి కావాలో సకల సదుపాయాలూ కూర్చాడు. ప్రజలు ఆశ్చర్య ఆనందాలతో ఊరికి దేముడి రూపంలో ఆ దశరధరాముడే వెలిసి వరాలు కురిపించినట్టు కధలు పురాణాల్ల చెప్పుకున్నారు. నిస్వార్ధ సేవ, అంటే ఏమిటో జనానికి అర్ధమైంది. చేతనయింతగా వారి సహాయ సహకారాలు అందించి, తలో పని బాధ్యత యువత తమ భుజాల మీద వేసుకుని, అహర్నిశలు , ఓ యజ్ఞం లా పనులు పూర్తి చేసి కావాల్సిన వేమిటో సూచిస్తూ తోడ్పాటు అందించడమే కాదు డబ్బున్న అసామీలు ఒకరు కోళ్ళ ఫారం , ఇంకొరు కోళ్ళ దాణా మిల్లు, పిండి మిల్లు ఊర్లో దేనికి వెతుక్కునే అవసరం లేకుండా చేసారు.
జనం నోట, పేపర్లో వార్తలు టీవీలో వీడియోలు, ఊరు పొలిమేరలు దాటిపోయి, ఆగమేఘాల మీద రాష్ట్రము అంతా వెళ్ళింది. ముందు నించే అయన ఊర్లో పలుకుబడి, ఎమ్మెల్యే గా వున్నప్పుడే ఆయన చేసిన మంచి పనులు, ప్రజాభిప్రాయం ముఖ్యమంత్రి గారికి కంట గింపుగా వుండేది. తన కంటే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయి తన పదవికే ఎసరు పెట్టి ముఖ్యమంత్రి పదవి కోసమే ఇదంతా చేస్తూ వున్నాడన్న అభిప్రాయం బలపడి ఆయన్ని శత్రువు లా ఎదుర్కోడానికి మర్గాలు వెదక సాగాడు. పోటీపడి అంత ఖర్చు పెట్టగలడా దాచినదంతా జనం పాలు చేయాలి. ఇంకెన్ని ప్రలోభాలు చూపించాలి ప్రజలకి. తలపట్టుకున్నాడు. ఎలక్షన్లు రోజుల్లోకి వచ్చేసాయి. అయన వెర్రి ఎత్తిపోయాడు. పెళ్లాము, కొడుకు చచ్చారు. ఇంకేం చేసుకుంటానని డబ్బంతా వూడ్చి పెట్టి, ఏదో మంచి పనులు చేసేసి, ముఖ్యమంత్రి పదవి కొట్టేడ్డామనుకుని ఎత్తు వేశాడు. గొర్రెల్లా, వెధవలు, వాడి వెంట పడ్డారు. అయన ఉడికి పోయాడు. ఏం చెయ్యాలో తోచక. గోరు చుట్టూ మీద రోకలి పోటులా డిల్లీ నించి దశరద్ పిలుపు వచ్చిందన్న వార్త వచ్చింది . అయిపొయింది తనపని అని నీళ్ళు కారిపోయాడు.
తాను పదవులు ఆశించి ఇదంతా చేయలేదని, ఏదో డబ్బున్నందుకు మంచి పనులు చేసి ప్రశాంతంగా బతకడం, తన ఉద్దేశం . క్షమించండి అని తిరస్కరించాడు దశరద్.
'చూడండి పట్టుమని ఏభయి ఏళ్ళు లేవు మీకు. ఎంతో జీవితం వుంది. మీ ముందు మంచి పనులు చేసే అవకాశం దేముడు మీకిచ్చాడు. మీకు వచ్చిన కష్టం సామాన్యమైనది కాదు, జీవితం అంతా పోగొట్టుకున్న దాన్ని తల్చుకు బాధపదలేరు ఎవరు. వంటరిగా అదే ఆలోచనలతో పిచ్చెత్తి పోయేకంటే మీ ఊరికి చేసినట్టే మీ రాష్ట్రానికి కూడా చేయగలిగినంత చేస్తే మీ మనసుకి తృప్తి , ఏదో చేయగలిగానన్న ఆత్మ తృప్తి లభించి ఏదో సాధించిన సంతోషం దక్కుతుంది. మీ నిస్వర్ద్ సేవ జనం గుర్తించారు. ప్రజలు మీ వెంట వున్నారు. చూడండి చేతిలో అధికారం, డబ్బు ఉంటె ఏదన్నా చేయటానికి సుళువు అవుతుంది. పదవి ఉంటె పరుగులెట్టి పనిచేసే మనుషులు మీ కింద ఉంటారు. ఖాళీ గా కూర్చుని మీ జీవితం వృధా చేసుకోకుండా , చేతికి అందిన అవకాశం తీసుకు ప్రజలకి ఉపయోగపడి మీ జీవితానికి ఓ పరమార్ధం సంపాదించుకోండి. ఇప్పటి ప్రభుత్వం అవినీతి మయం అయి గోల పడుతున్నారు. మీరు ఆదుకుని మీ రాష్ట్రాన్ని కాపాడు కొండి. ఇంతకంటే చెప్పలేను మీ వెంట మేముంటాం ఎప్పుడు అన్నారు.
ఎవరు లేరు ఇంకెందుకు , ఈ డబ్బు ఏం చేసుకుంటాను అన్న ఆలోచనతో ఏడూ ఊరికి మంచి చేద్దాం అన్న ఆలోచన. ఈ విధముగా మలుపు తిరిగి మళ్లీ కొత్త జీవితానికి నాంది అవుతుందని ఎదురు చూడని ఆయన రాత్రంతా ఆలోచించినా, ఎవరు లేని జీవితంలో నిజంగా తాను కోరుకున్న ప్రశాంతత దొరుకుతుందా, అలా బతకడం ...అడవుల్లో ముక్కుమూసుకుని, ఇదివరకు మునీశ్వరుల్లా బతకగలడా సాధ్యమవుతుందా , అంతకంటే మిగతా జీవితం నలుగురికి ఉపయోగ పడితే ప్రజలు, అభిమానుల, పార్టీ వాళ్ళ విన్నపాలతో ఆఖరికి మనసు రెండో మార్గం నే ఎన్నుకుంది.
* * *
అ ఊరులో ఎమ్మెల్యే గా ఎప్పుడూ ఆయనకి ఎదురు లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే లందరూ ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి గా ఎన్నుకున్నారు. ప్రతిపక్ష హోదా కూడా అవతల పార్టీకి దక్కలేదు. ముఖ్యమంత్రి పదవే ఆయన్ని వెతుక్కుంటూ చేరింది. మనం చేసిన మంచైనా, చెడు అయినా స్థిత ప్రజ్ఞుడిగా ఉంటె ఫలితం మనల్ని వెతుక్కుంటూ వచ్చి చేరుతుంది అని జనం గుర్తు చేసుకుంటారు ఎప్పుడు.
* * *



