
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)వన్ మాన్ షో 'హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu)పార్ట్ 1 'ప్రస్తుతం థియేటర్స్ లో తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. టాక్ తో సంబంధం లేకుండా పవన్ కెరీర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరింది. అగ్ర నిర్మాత 'ఏఎంరత్నం'(Am Rathnam)నిర్మించిన ఈ చిత్రానికి 'క్రిష్'(Krish)మరియు 'జ్యోతికృష్ణ'(Jyothi Krishna)సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ మేరకు మేకర్స్ కూడా మూవీ టైటిల్స్ లో చెప్పడం జరిగింది.
రీసెంట్ గా 'జ్యోతికృష్ణ' ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'హరిహర వీరమల్లు' ప్రారంభం నుంచి నేను ఉన్నాను. వీరమల్లు కథని ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ 'మాయాబజార్ 'టైపులో ఫన్ సినిమాగా తెరకెక్కించాలని 'క్రిష్' అనుకున్నారు. ఒక యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ ప్రారంభించాం. కానీ కోవిడ్ రావడంతో చిత్రీకరణ ఆగిపోయింది. కొంచం తగ్గుముఖం పట్టాక, ఇంకో యాక్షన్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసాం. కోవిడ్ సెకండ్ వేవ్ రావడంతో ఆపేశాం. ఆ తర్వాత ఎన్నికలు వచ్చి వీరమల్లు షూటింగ్ కి వరుస బ్రేక్స్ వచ్చాయి. ఈ విధంగా క్రిష్ ఏడాది పాటు వెయిట్ చేసిన తర్వాత,ఆయన అంగీకరించిన ప్రాజెక్ట్స్ ఉండటంతో వీరమల్లు నుంచి వైదొలిగారు. పవన్ గారితో రెండు పార్టులుగా వీరమల్లుని తెరకెక్కిస్తానని కథని చెప్పాను. చాలా బాగుందని మెచ్చుకొని దర్శకత్వం చెయ్యమని చెప్పారు.
క్రిష్ అనుకున్న 'కోహినూర్'డైమండ్(kohinoor Diamond)కథ పార్ట్ 2 లో వస్తుంది. మొదటి భాగం కథలో నేను మార్పులు చేశాను. రెండవ భాగంలో కోహినూర్ కోసం అసలేం జరిగిందనేది చూపిస్తున్నాం. వీరమల్లు కోసం 4399 సిజి షాట్స్ ని ఉపయోగించాం. వాటిల్లో నాలుగైదు షాట్స్ బాగా రాలేదు . మూవీ ఎంత బాగా వచ్చినా ఏదో ఒక మైనస్ పాయింట్ చెప్తూనే ఉంటారు. వీరమల్లు విషయంలో మాత్రం సినిమా బాగాలేదని ఎవరు చెప్పడం లేదు. కొన్నిసన్నివేశాల్లో సిజి వర్క్ బాగాలేదని చెప్తున్నారంతే. సెకండ్ పార్ట్ ఇంకా చాలా బాగుంటుందని జ్యోతికృష్ణ చెప్పుకొచ్చాడు. జ్యోతికృష్ణ గతంలో గోపి చంద్ హీరోగా బలమైన సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన 'ఆక్సిజన్' తో పాటు 'నీ మనసు నాకు తెలుసు', కేడి, రూల్స్ రంజన్ వంటి పలు చిత్రాలకి దర్శకత్వం వహించాడు.
