మీకూ శ్వాస సమస్యలున్నాయా? దీపావళి సీజన్ లో ఈ జాగ్రత్తలు పాటించండి!
దీపావళి అంటే చిన్నా పెద్ద అందరికీ చాలా ఇష్టం. ఈ పండుగ రోజున పెద్దలు కూడా చిన్నపిల్లలలై తమ పిల్లలతో కలసిపోతారు. ఒకప్పుడు దీపావళి అంటే ఇల్లంతా దీపాలు పెట్టడం, కాసిన్ని టపాసులు పేల్చడం జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. కేవలం దీపావళి మాత్రమే కాదు శుభకార్యాలు, జాతరలు, ఉత్సవాలు, సినిమా రిలీజ్ ఫంక్షన్లు, రాజకీయనాయకుల రాక, సినీతారల రాక ఇలా చాలా సందర్బాలలో బాణసంచా పెద్ద ఎత్తున కాలుస్తారు. కాలం గడిచే కొద్దీ వాహనాల రద్దీ ఎక్కువ కావడం, వాయు కాలుష్యం పెరుగుతూ వస్తోంది. దీనికారణంగా గతంతో పోలిస్తే శ్వాస సంబంధ సమస్యలు కూడా ఎక్కువ అయ్యాయి. ఇక దేశం అంతా పెద్ద ఎత్తున జరుపుకునే దీపావళి నాడు బాణసంచా చాలా ఎక్కువగానే కాలుస్తారు. ఈ సమయంలో ఆరోగ్యపరంగా అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. శ్వాస సంబంధ సమస్యల ముప్పు.. ఇప్పటికే ఆస్తమా, ఊపిరితిత్తుల బలహీనత, ఇతర శ్వాస సంబంధ సమస్యలు ఉంటే దీపావళి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాణసంచా కాల్చినప్పుడు వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, చిన్న రేణువులతో కూడిన అనేక హానికరమైన వాయువులను విడుదల చేస్తాయి. ఇవి గాలిని కలుషితం చేస్తాయి. ఇవి శ్వాసకోశ వ్యవస్థ ద్వారా శరీరంలోకి ప్రవేశించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే శ్వాస సంబంధ సమస్యలున్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పొగకు దూరం ఉండాలి. ముందు చూపు.. ఆస్తమా, శ్వాస కోశ సమస్యలున్నప్పుడు చాలామంది ఇన్ హేలర్ ఉపయోగిస్తుంటారు. బాణసంచా పొగ, వాతావరణ కాలుష్యం మొదలైనవి ఎక్కువగా ఉండే ఈ సమయంలో బయట ఉన్నప్పుడు, అందరిలో సందడిగా ఉన్నప్పుడు ఉన్నట్టుండి సమస్యలు ఎదురయ్యే అవకాసశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇన్ హేలర్ ను వెంట ఉంచుకోవాలి. శ్వాస సమస్యలు ఏర్పడినప్పుడు ఇన్ హేలర్ లు చాలా గొప్పగా సహాయపడతాయి. మాస్క్.. కరోనా వచ్చినప్పటి నుండి మాస్క్ వినియోగం పెరిగింది. ఆ మాస్క్ లు అంటువ్యాధుల నుండే కాదు విపరీతమైన వాయు కాలుష్యం నుండి కూడా కాపాడుతాయి. దీపావళి బాణసంచా ప్రభావం నుండి రక్షణ కావాలి అంటే మాస్క్ ధరించడం చాలా మంచిది. ఇది శ్వాసకోశ సమస్యలు తలెత్తకుండా నిరోధిస్తుంది. బయటకు వెళ్లొద్దు.. ఆస్తమా, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు బాధిస్తుంటే దీపావళి బాణసంచా కాల్చే సమయంలో అసలు బయటకు వెళ్లకుండా ఉండటం ఎంతో మేలు. ఇంట్లో కూడా గాలి వెలుతురు బాగా ఉండేలానూ, గాలి కాలుష్యం అరికట్టడానికి ఎయిర్ ప్యూరిపైయర్లు, గాలి కాలుష్యాన్ని అరికట్టే ఇండోర్ మొక్కలు వంటివి పెంచుకోవాలి. దీనివల్ల సమస్యను అరికట్టచ్చు. ఒక వేళ బయటకు తప్పనిసరిగా వెళ్లాల్సివస్తే మాస్క్ తో వెళ్లాలి, అలాగే వెంట ఇన్ హేలర్ ఉంచుకోవాలి. *నిశ్శబ్ద.
read moreసైలెంట్ గా ఉన్నా ఇన్ని లాభాలా? రోజూ గంటసేపు మౌనంగా ఉంటే..
ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ బిజీ బిజీ గా గడిపేవారు ఇప్పట్లో చాలామంది ఉన్నారు. నిమిషం తీరిక లేకుండా ఉంటారంటూ నలుగురూ ఇలాంటి వాళ్లను తెగ పొగిడేస్తుంటారు. ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా చక్కని ప్లానింగ్ తో ఉంటామంటూ ఇలాంటి వారు తమని తాము చూసుకుని సంతోష పడుతుంటారు. మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. వీరికి వాగుడూకాయ్ అనే బిరుదు కూడా ఇచ్చేసి ఉంటారు చుట్టూ ఉన్నవారు. కానీ రోజులో కనీసం ఒక్క గంటసేపు సైలెంట్ గా ఉండమని వైద్యులు చెబుతున్నారు. సైలెంట్ గా అంటే ఏ పని చేయకుండా అని కాదు, పనులు మాత్రమే కాకుండా అస్సలు వాగకుండా మౌనంగా ఉండటం. ఈ వేగవంతమైన కాలంలో ప్రతి రోజూ గంట సేపు మౌనంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలున్నాయట. ఇలా సైలెంట్ గా ఉండటం వల్ల కలిగే 6 పెద్ద ప్రయోజనాలు ఏంటో పూర్తీగా తెలుసుకుంటే.. రోజులో ఉన్న 24గంటల్లో 1 గంటసేపు ఖచ్చితంగా మౌనాన్ని పాటిస్తూ ఉంటే మానసిక రుగ్మతలు అన్నీ మంత్రించినట్టు మాయమైపోతాయట. శరీరంలో ఒత్తిడి హార్మోన్లు త్కకువగా ఉత్పత్తి కావడానికి సైలెంట్ గా ఉండే ఈ గంట సమయం చాలా సహాయం చేస్తుంది. ఫలితంగా మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఇదే మానసిక సమస్యలు మెల్లగా తగ్గేలా చేస్తుంది. ఎవ్వరితోనూ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేవారు సహజంగానే తమ గురించి తాము ఆలోచించుకోగలుగుతారు. సెల్ఫ్ చెక్, సెల్ప్ టాక్ అనేది భావోద్వేగాలతో అనుసంధానం కావడం, తప్పొప్పులను బేరీజు వేసుకోవడం, జీవితంలో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయం తీసుకోవడం. సరైన దారిలో ప్రయాణించడానికి తోడ్పడుతుంది. ప్రస్తుతకాలంలో చాలామంది నిద్ర విషయంలో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. పక్క మీదకు వాలినా నిద్రరాకపోవడం, కలత నిద్ర, నిద్ర మధ్యలో పదే పదే మెలకువ రావడం వంటి సమస్యలన్నీ కేవలం రోజులో గంట సేపు మౌనంగా ఉండటం వల్ల పరిష్కారమవుతాయి. గంట సేపు మౌనంగా ఉండటం వల్ల కలిగే మానసికంగా కలిగే మార్పులు మంచి నిద్రను ప్రేరేపిస్తాయి. ఫలితంగా రాత్రి సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా చక్కగా నిద్రపోతారు. చిన్న వయసులోనే రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు. కానీ రోజూ గంట సేపు మౌనంగా ఉంటే ఎంత రక్తపోటు అయినా మంత్రించినట్టు అదుపులోకి వస్తుంది. అధిక రక్తపోటు వల్ల సహజంగానే గుండెపోటు, పక్షవాతం వంటి ప్రమాదాలు ఎదురవుతాయి. ప్రతిరోడూ గంటసేపు మౌనంగా ఉంటూ ఉంటే ఈ ప్రమాదాలన్నీ అస్సలు దరిచేరవు. తక్కువగా మాట్లాడటం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది. ఈ రెండూ శరీరంలో రోగనిరోధక శక్తిని మరింత మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తి బలంగా ఉంటే ఎలాంటి అనారోగ్యంతో అయినా పోరాడగలిగే సామర్థ్యం శరీరానికి ఉంటుంది. కాబట్టి రోజులో గంటసేపు మౌనంగా ఉంటే రోగనిరోధక శక్తిని పెంచుకున్నట్టే. ఎప్పుడూ లొడలొడా వాగుతుండేవారి మాటలకు అడ్డూ అదుపు ఉండదు. పరిస్థితులు, సందర్బాలతో ప్రమేయం లేకుండా నోటి మాటలు అలా వచ్చేస్తుంటాయి. కొన్ని సార్లు ఎదుటివారి పరిస్థితిని కూడా ఆలోచించకుండా మాట్లాడేస్తారు చాలామంది. కానీ ప్రతిరోజూ గంట సేపు మౌనంగా ఉండటం వల్ల మాటను అదుపులో పెట్టుకోగలుగుతారు. మాట్లాడే ముందు ఆచి తూచి మాట్లాడగలుగుతారు. ఇతరులను ఆకట్టుకునేలా మాట్లాడటం, ఎదుటివారు చెప్పేది పూర్తీగా వినే ఓపిక, దానికి సరైన సమాధానం ఇచ్చే నేర్పు అన్నీ అలవడుతాయి. కేవలం రోజులో ఒక్క గంటసేపు మౌనంగా ఉండటం వల్ల పైన చెప్పుకున్న లాభాలు కలిగి జీవితాన్నే మార్చేస్తాయి. *నిశ్శబ్ద.
read moreరక్తంలో యూరిక్ యాసిడ్ పెంచే ఆహారాలు ఇవే..వీటికి దూరంగా ఉండండి!
మన శరీరంలో అన్నీ సరిగ్గా ఉంటే మన ఆరోగ్యం చాలా కాలం పాటు ఉంటుంది. ఇది చిన్న పొరపాటు అయినప్పటికీ, దాని ప్రభావాలు మన శరీరంపై వివిధ మార్గాల్లో ప్రతికూలంగా ఉంటాయి.మనకు అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ముఖ్యంగా మనం తిన్న తర్వాత మన శరీరంలోని వ్యర్థాలు సక్రమంగా బయటకు వెళ్లకపోతే దాని వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. దీనికి సంబంధించి యూరిక్ యాసిడ్ అనే విష పదార్థం మన శరీరంలో ఎప్పుడూ పెరగకూడదు. అయితే దీన్ని మరింత పెంచే కొన్ని ఆహారాలు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. అవయవాల మాంసం: జంతువుల మూత్రపిండాలు, కాలేయం మొదలైనవి దీనికి ఉదాహరణ. వీటిలో ప్యూరిన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల సహజంగా మీ రక్తంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. వీటిని మితంగా తీసుకోవడం మంచిది. ఎరుపు మాంసం: ఉదాహరణకు, మేక, ఆవు, గేదెలకు సంబంధించిన మాంసంలో కూడా అధిక ప్యూరిన్ కంటెంట్ ఉంటుంది.దీన్ని తీసుకోవడం వల్ల మీ రక్తంలో యూరిక్ యాసిడ్ అకస్మాత్తుగా పెరుగుతుంది. అంతే కాకుండా రెడ్ మీట్ గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. సీఫుడ్స్: పీత గింజలతో సహా అనేక ఇతర జలచరాలలో ప్యూరిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ రక్త ప్రసరణ సజావుగా జరగడానికి అనుమతించదు. ఇది మీ రక్తప్రవాహంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి కూడా కారణమవుతుంది. ప్రాసెస్ చేసిన మాంసాలు: ఏదైనా ప్రాసెస్ చేసిన ఆహారాలు ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసాలలో యూరిక్ యాసిడ్ పెంచే గుణాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు తాజా మాంసం తినడానికి ప్రయత్నించండి. మద్యం వినియోగం: మీరు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, అది మీ శరీరం మరింత యూరిక్ యాసిడ్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరం విసర్జించకుండా కూడా నిరోధిస్తుంది. బీరు, ఇతర మద్యపానమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. కానీ రెడ్ వైన్ వినియోగంతో అలా జరగదని తెలిసిన వారి వాదన. కెఫిన్ పానీయాలు: కొన్ని పరిశోధనల ప్రకారం కాఫీ ఎక్కువగా తాగే వారి రక్తంలో యూరిక్ యాసిడ్ కూడా పెరుగుతుందని తెలిసింది. కేవలం కాఫీ మాత్రమే కాదు, ఏ కెఫిన్ ఉన్న పానీయానికైనా ఈ సామర్థ్యం ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ అది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది.
read moreఖరీదైన ఆహారాలు అక్కర్లేదు.. రోజూ వీటిని గుప్పెడు తింటే ఉక్కులా మారతారు..
ఆరోగ్యమే మహాబాగ్యం అన్నారు. తీసుకునే ఆహారం అంతా శరీరం కోసమే. కానీ చాలామంది శరీరం కోసం కాకుండా రుచి కోసం, జిహ్వచాపల్యం కోసం అహారం తింటారు. దీని వల్ల ఆరోగ్యంగా ఉండాల్సిన శరీరం ట్రబుల్ ఇచ్చిన ఇంజిన్ లా మారుతుంది. కొందరు శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన ఆహారాలు తినాలనే భావనలో ఉంటారు. అందుకే తాము ఆరోగ్యంగా లేమని సమర్థించుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే శరీరానికి అద్బుతమైన బలాన్ని చేకూర్చే ఆహారాలు ఖరీదైనవే కాదు, తక్కువ ధరలో సాధారణ పౌరులకు కూడా లభిస్తాయి. కానీ వాటిని గుర్తించి తినడం చాలా ముఖ్యం. చాలామంది రాత్రి బాదం పప్పులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తింటుంటారు. కానీ బాదం పప్పులు అక్కర్లేదు. చికెను, మటనూ అసలే వద్దూ.. ప్రతిరోజూ గుప్పెడు నానబెట్టిన శనగలు తింటే చాలు. శరీరం ఉక్కులా మారుతుంది. అసలు నానబెట్టిన శనగలు తింటే కలిగే లాభాలేంటి? వీటిని ఎలా తినాలి? తెలుసుకుంటే.. నల్లశనగలు బాదం పప్పు కంటే అద్బుతమైన పోషకాలు కలిగి ఉంటాయి. మాంసాహారం కంటే బలం చేకూరుస్తాయి. వీటిలో కాల్షియం, ప్రోటీన్, పైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్దిగా ఉంటాయి. వీటిని వేయించి తినవచ్చు, లేదంటే నానబెట్టి తినవచ్చు, నానబెట్టిన శనగలను మొలకలు తెప్పించి ఆ మొలకలు కూడా తినవచ్చు. ఇవి చాలా బలం. గుప్పెడు శనగలను రాత్రి సమయంలో కప్పు నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఈ శనగలను పరగడుపున తినాలి. మగవారు నానబెట్టిన శనగలను తిన్న తరువాత గోరువెచ్చని పాలు తాగితే వారిలో స్పెర్మ్ కౌంట్ మెరుగవుతుంది. లైంగిక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ మొలకెత్తిన శనగలు తినడం వల్ల మలబద్దకం అనే సమస్య అసలు వేధించదు. ఎన్నో రోజులుగా బాదిస్తున్న మలబద్దకం కూడా కేవలం నల్ల శనగలను తినడం వల్ల పరిష్కారం అవుతుంది. వీటిలో ఉండే ఫైబర్ పేగులు మూసుకుపోకుండా చేస్తుంది. వృద్దులలో కీళ్ల నొప్పులు సాధారణం. కానీ నానబెట్టిన శనగలను తింటూంటే వృద్దులలో కీళ్లనొప్పులు ఆశ్చర్యకరంగా తగ్గిపోతాయి. వీటిలో ఉన్న కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి కాలేయం పనితీరు సమర్థవంతంగా ఉండటం ఎంతో అవసరం. ఈ పనితీరులో కాలేయం కొన్నిసార్లు పాడైపోతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ నానబెట్టిన నల్ల శనగలు తినడం శ్రేయస్కరం. వయసు పెరిగేకొద్ది ఎముకలు బలహీనంగా మారతాయి. బలహీనమైన ఎముకలుంటే బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. బోలు ఎముకల వ్యాధి రాకూడదంటే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ నల్ల శనగలు తినాలి. నల్లశనగలలో ఐరన్, పాస్పరస్ సమృద్దిగా ఉంటాయి. ఈ కారణంగా ఇది హిమోగ్లోబిన్ ను పెంచుతుంది. రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారు ప్రతి రోజూ నల్లశనగలు తింటూంటే తొందరగానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. బద్దకం, అలసట నివారించడానికి. శరీరంలో నూతనోత్తేజం నింపడానికి నల్లశనగలు భలే ఉపయోగపడతాయి. మొలకెత్తిన శనగలను ప్రతిరోజూ తింటూంటే తొందరలోనే శరీరంలో శక్తి పుంజుకుంటుంది. శరీరం దృఢంగా, చురుగ్గా మారడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పట్లో చాలామందిలో చక్కెర వ్యాధి పెద్ద సమస్యగా ఉంది. నల్లశనగలు ప్రతిరోజూ తినడం వల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. శరీరంలో అదనపు గ్లూకోజ్ ను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారు వీటిని రోజూ తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. *నిశ్శబ్ద.
read moreమద్యపానం కంటే మహా ప్రమాదకరమైన అలవాటు.. తెలీకుండానే ప్రజల ఆయుష్షు హాం.. ఫట్..
జీవితకాలాన్ని తగ్గించడంలోనూ, ప్రాణ ప్రమాదాలు పెంచడంలోనూ మద్యపానం ఎప్పుడూ ప్రథమ స్థానంలోనే ఉంటుంది. దీని కారణంగా క్యాన్సర్ లు చాలా తొందరగా వచ్చేస్తాయి. ఇన్నాళ్ళు మనుషులలో ఉన్న చాలా చెడ్డ అలవాటు అంటే మద్యపానంనే పేర్కొనేవారు, దాన్నే చూపించేవారు. కానీ మద్యపానం కంటే అతిపెద్ద ప్రమాదకరమైన అలవాటు చాలా మంది ప్రజలలో ఉంది. ఇది మనిషి జీవితకాలాన్నిగణనీయంగా తగ్గిస్తుందని తేలింది.అసలంత ప్రమాదకరమైన అలవాటు ఏమిటి? ప్రమాదమని తెలియకుండానే ప్రజలు దీని బారిన ఎలా పడుతున్నారు తెలుసుకుంటే.. ఈ రోజుల్లో ప్రజలు గంటల తరబడి ఆఫీసులలో కూర్చొని పని చేయవలసి వస్తోంది. సగటున ఒక ఉద్యోగి రోజుకు 9 నుండి 10 గంటలు కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేస్తున్నారు. ఇలా పనిచేసేవారిలో చాలామందికి శారీరక శ్రమ చేసే అలవాటు ఉండదు. ఎందుకంటే ఉరుకులు పరుగుల మీద ఆఫీసులకు వెళ్ళడం, ఆ తరువాత అక్కడ 10గంటలు పని చేయడం తిరిగి ఇంటికి చేరుకోవడంతో చాలా అలసిపోతారు. ఆ తరువాత ఇంట్లో కూడా టీవి, మొబైల్ బ్రౌజింగ్ లో సమయం గడుపుతారు. దీంతో అసలు శారరీక శ్రమ చేసే వెలుసుబాటే ఉండదు. మరికొందరు రోజంతా మంచం లేదా సోఫాపై పడుకుంటారు. పెద్దగా పనులు చేయకుండానే రోజు గడిపేస్తారు. ఇలా ప్రత్యేకత ఏమీ లేకుండా నిశ్చలమైన జీవనశైలి కలిగిన వ్యక్తులను మీద చేసిన పరిశోధనలలో చాలా షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. దాదాపు 12వేల మంది జీవనశైలిని పరిశోధకులు పరిశీలించారు. వీరు కనీసం రెండేళ్ళపాటు ఫిజికల్ యాక్టివిటీ రీడింగ్ ట్రాక్ చేయగల డిజిటల్ పరికరాన్ని తమ వెంటే ఉంచుకున్నారు. వీరిలో ప్రతి రోజూ సగటున 10గంటల సేపు నిశ్చలంగా కూర్చుని ఉన్నవారిలో ఆరోగ్య పరంగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతిరోజూ 12గంటల కంటే ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారిలో 7శాతం మంది 5సంవత్సరాలలో ఒకరి తరువాత మరొకరు మరణించారు. ప్రతిరోజూ 12గంటలు కూర్చుని పనిచేసి రోజులో 22నిమిషాల కంటే తక్కువగా శారీరక శ్రమ చేసేవారిలో మరణ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం అనేది ఇప్పటి ఉద్యోగాల రీత్యా తప్పించుకోలేని విషయం. కానీ దీని వల్ల కలిగే ప్రమాదాలను తప్పించుకోవాలంటే మాత్రం ప్రతిరోజూ కనీసం 22నిమిషాల కంటే ఎక్కువసేపు వ్యాయామం చెయ్యాలి. లేకపోతే 10 నుండి 12 గంటలు పనిచేయడమనే అలవాటు ముందుగానే మరణాన్ని వెంటబెట్టుకొస్తుంది. వ్యాయామానికి కూడా షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. సైక్లింగ్, రన్నింగ్, ఏరోబిక్ వ్యాయామాలు మొదలైనవి రోజులో కనీసం 10నిమిషాలు అయినా ఉండాలి. ఇవి మాత్రమే కాకుండా ఇంటి పని, తోట పని మొదలైనవి సొంతంగా చేసుకుంటే చాలా మంచిది. బిజీ షెడ్యూల్ కారణంగా వ్యాయామం చేయడానికి సమయం లేదని చెప్పేవారు కనీసం 10నిమిషాలు అయినా వ్యాయామాలు చేయడం ద్వారా మరణ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. కేవలం వ్యాయామం చేయడం ద్వారా మరణ ప్రమాదాన్ని 35శాతం తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజూ కనీసం 22నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయడం, వీలైన వరకు శారీరక శ్రమ చేయడం వల్ల మరణ ప్రమాదాన్ని దూరంగా ఉంచవచ్చు. *నిశ్శబ్ద.
read moreచలికాలంలో ఈ డ్రైఫ్రూట్స్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
డ్రై ఫ్రూట్స్ మీ బరువు, కొలెస్ట్రాల్ను తగ్గించడమే కాకుండా మీ ఎముకలు, రోగనిరోధక శక్తికి కూడా ఉత్తమమైనవి. చలికాలంలో కొన్ని ప్రత్యేకమైన డ్రై ఫ్రూట్స్ తినడం మొదలుపెడితే.. మరెన్నో ప్రయోజనాలను పొందొచ్చు.. జంక్ ఫుడ్ కు ఇవి ఉత్తమ ప్రత్యామ్నాయం. చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ మీకు బలాన్ని అందించడమే కాకుండా మీ ఆహారాన్ని సమతుల్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. ఇది మీ చర్మం, జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.డ్రై ఫ్రూట్స్లో ఉండే పోషకాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు అవసరం. పాలీఫెనాల్-రిచ్ డ్రై ఫ్రూట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్లను చూపించడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ డ్రై ఫ్రూట్స్లో షుగర్, క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు వాటిని తినకూడదు. ఎందుకంటే ఇది షుగర్ లెవెల్ పెంచి గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి చలికాలం కోసం ఉత్తమమైన డ్రై ఫ్రూట్స్ ఏవో తెలుసుకుందాం. వాల్ నట్స్: క్యాన్సర్, ఊబకాయం, మధుమేహం, బరువు నిర్వహణ, అభిజ్ఞా, పునరుత్పత్తి ఆరోగ్యం, అనేక ఇతర జీవనశైలి సమస్యలతో సహా అనేక వ్యాధుల చికిత్సకు వాల్నట్లు సహాయపడతాయని పరిశోధనలో తేలింది. ఇది పోషకాల పవర్హౌస్గా కూడా పనిచేస్తుంది. వాల్నట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, నిద్రను ప్రేరేపిస్తాయి. చర్మం, జుట్టుకు అనుకూలంగా ఉంటాయి. ఎండు ద్రాక్ష: చలికాలంలో జుట్టు పొడిబారడం, బలహీనంగా మారడం వంటి సమస్యలతో సతమతమవుతున్నట్లయితే రోజూ నల్ల ఎండుద్రాక్షను తినండి. ఇందులో పెద్ద మొత్తంలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది తలకు పోషణనిస్తుంది. జీడిపప్పు: జీడిపప్పులో అధిక మొత్తంలో బహుళ అసంతృప్త, మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం. వీటిలో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పు: చలికాలంలో బాదంపప్పు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బాదం యొక్క గ్లైసెమిక్ లోడ్ మీకు బలమైన జీర్ణ వ్యవస్థను కూడా అందిస్తుంది. పిస్తా: పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల వార్మింగ్ గుణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, బరువును నియంత్రించడంలో, జీర్ణ సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. అందువల్ల, డ్రై ఫ్రూట్స్ మంచి ఆరోగ్యాన్ని పెంపొందించడం వల్ల ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం. కాబట్టి ఇప్పుడు వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి.
read moreసైకోటిక్ బ్రేక్ డౌన్.. సెలబ్రిటీస్ నుండి సాధారణ వ్యక్తుల వరకు ఎవ్వరినీ వదలదిది..
అనారోగ్యం వచ్చిందంటే హాస్పిటల్స్ కు పరిగెత్తి వైద్యం చేయించుకుంటారు. పేదల దగ్గర డబ్బులుండవని, ధనికుల దగ్గర.. ముఖ్యంగా సెలబ్రిటీస్ దగ్గర డబ్బు చాలా ఉంటుందని అందుకే వారు ఏ జబ్బుకైనా వైద్యం చేయించుకోగలుగుతారని అంటారు. కానీ సెలబ్రిటీలు సైతం జయించలేని జబ్బులు ఏవైనా ఉన్నాయంటే అవి మానసిక సమస్యలే. నిజానికి సెలబ్రిటీలకు కూడా చాలా తొందరగా మానసిక సమస్యలు వస్తుంటాయి. దీనికి కారణం వారి జీవనశైలి కూడా. మానసికంగా ఇబ్బంది పట్టే సమస్యలలో సైకోటిక్ బ్రేక్ డౌన్ ప్రధానమైనది. అమెరికన్ గాయని లేడీ గాగా తన 19సంవత్సరాల వయసులో ఓ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో అత్యాచారానికి గురై సైకోటిక్ బ్రేక్ డౌన్ కు లోనైంది. ఆ సమయంలో తను పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడ్డానని స్వయంగా ఆమె చెప్పుకుంది. సైకోటిక్ బ్రేక్ డౌన్ లో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ప్రధానమైనది. అసలు ఈ మానసిక సమస్య లక్షణాలు ఏంటి? ఇది మనిషిని ఎలా ప్రభావితం చేస్తుంది? పూర్తీగా తెలుసుకుంటే.. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్.. కొన్ని వ్యాధుల లక్షణాలు బయటకు కనిపిస్తే కొన్ని బయటకు కనిపించవు. సాధారణంగా శారీరక వ్యాధులు కొన్ని లక్షణాల రూపంలో బయటపడుతుంటాయి. కానీ మానసిక వ్యాధులు మాత్రం క్లిష్టతరమైనవి. చాలా గమనిస్తే తప్ప వాటిని తెలుసుకోలేం. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్టర్ అనేది మనిషి మానసికంగా చాలా దారుణంగా దెబ్బ తిన్న వారిలో కలుగుతుంది. కానీ దాని ఫలితాన్ని బాధితులు అంత తొందరగా అర్థం చేసుకోలేరు. భావోద్వేగాలు.. కొన్నిసార్లు మీరు అతిగా భావోద్వేగానికి గురైనప్పుడు, మీరు చిన్న విషయాలకు కూడా ఏడుపు ప్రారంభిస్తారు. ఒక వ్యక్తి ఎటువంటి కారణం లేకుండా విపరీతమైన అలసటను అనుభవిస్తాడు. మనస్సు సున్నా స్థితికి వెళుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అసలైన, అలాంటి సమయాల్లో మీరు మానసికంగా అలసటకు గురవుతారు. ఇది మీ మెదడుకు విరామ సమయం అని అర్థం. ఇందులో మీరు ఒత్తిడికి గురవుతారు మరియు పరిస్థితులను సరిగ్గా నిర్వహించలేరు. ఇది కెరీర్పైనే కాదు వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఆందోళన, ఒత్తిడి.. ఆందోళన, ఒత్తిడి సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు చిన్న విషయాలకు కూడా ఆందోళన పడతారు. ఒత్తిడి అనుభవిస్తారు. భావోద్వేగాల విషయంలో అలసటకు గురికావడం ఈ సమస్య ఉన్నవారిలో బయటకు కనిపించే లక్షణం. ఈ సమస్య ఉన్న వారు చుట్టుప్రక్కల విషయాలపై దృష్టిపెట్టలేరు. భావోద్వేగాలను అదుపు చేసుకోలేరు. నిరంతరాయంగా ఇలాంటి ఫీలింగ్స్ ఎదుర్కొంటున్నట్టైతే వారు వ్యాధి బారిన పడ్డారని అర్థం చేసుకోవాలి. దీన్నుండి బయటపడాలంటే మనిషికి విరామం కావాలి. ఆ విరామంలో సరైన నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ అలా తీసుకోలేని పక్షంలో అది వ్యక్తికి చాలా హానికరం. ఇలాంటి సమస్య ఉన్నవారు చాలా జాగ్రత్తగా జీవితాన్ని లీడ్ చేసుకోవాల్సి ఉంటుంది. *నిశ్శబ్ద.
read moreశీతాకాలంలో డయాబెటీస్ పేషెంట్లకు సూపర్ ఫుడ్స్ ఇవే..!
ఈ సీజన్లో జలుబు, దగ్గు వంటి సమస్యలు రావడం సర్వసాధారణం.ఈ వ్యాధులు అంత తీవ్రమైనవి కానప్పటికీ, ఒక వ్యక్తికి వచ్చినప్పుడుఅనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు సిరప్ తాగుతుంటారు. ఇంకొంతమంది ఈ సమస్య నుండి బయటపడటానికి సులభమైన ఇంటి నివారణలను ప్రయత్నిస్తారు. అటువంటి పరిస్థితిలో, జలుబు, దగ్గు సమస్యను తగ్గించేందుకు సహాయపడే కొన్ని సులభమైన, ఎఫెక్టివ్ హోం రెమెడీస్ గురించి తెలుసుకుందాం. మీరు కూడా జలుబు, దగ్గు సమస్యతో బాధపడుతున్నట్లయితే, ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. తేనె,అల్లం రసం: అల్లం రసం జలుబు, దగ్గు దివ్యౌషధం కంటే తక్కువ కాదు. దీని నుండి ఉపశమనం పొందడానికి, మీరు తేనె, అల్లం రసం తీసుకోవచ్చు. మీరు జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లయితే, అల్లం, తేనె రసాన్ని వేడి చేసి వెంటనే త్రాగితే, తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఉప్పు నీటితో పుక్కిలించాలి: మీరు జలుబుతో పాటు గొంతు దృఢత్వం, కఫం, దగ్గుతో బాధపడుతున్నట్లయితే, ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇలా చేయడం వల్ల గొంతులో పేరుకుపోయిన కఫం పోతుంది. గొంతు వాపు నుండి ఉపశమనం లభిస్తుంది, అటువంటి పరిస్థితిలో, మీరు కూడా జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లయితే, ఖచ్చితంగా పుక్కిలించండి. ఆవిరి తీసుకోవడం: ఆవిరి పట్టుకుంటే జలుబు, దగ్గు నుండి చాలా ఉపశమనం ఉంటుంది. ఇలా చేయడం వల్ల మూసుకుపోయిన ముక్కు క్లియర్ అవుతుంది. దీని కోసం, సాధారణ నీటి ఆవిరిని తీసుకోవడం ద్వారా లేదా ట్రీ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్, లెమన్ గ్రాస్ ఆయిల్, లవంగం నూనె జోడించడం ద్వారా ఆవిరిని తీసుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు కూడా జలుబు, దగ్గుతో బాధపడుతుంటే, ఖచ్చితంగా ఈ ఇంటి నివారణలను అనుసరించండి. తులసి అల్లం టీ తాగండి: జలుబు, దగ్గు, ఫ్లూ సాధారణంగా ఇంటి నివారణల ద్వారా నయమవుతాయి. అటువంటి పరిస్థితిలో, మీరు కూడా జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లయితే, తులసి, అల్లం వేసి టీ తయారు చేసి, సిప్ చేస్తూ త్రాగండి. ఇది మీకు దగ్గు, జలుబు నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. తేనె, లవంగాలు తినండి : మీరు దగ్గు లేదా జలుబుతో బాధపడుతున్నట్లయితే, లవంగాలు, తేనెను తినండి. లవంగాలను గ్రైండ్ చేసి తేనెతో కలిపి రోజుకు 2-3 సార్లు తింటే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.
read moreకోవిడ్ వచ్చి తగ్గిన వారికోసం కేంద్ర ఆరోగ్యమంత్రి ప్రత్యేకంగా చేసిన ప్రకటన..
కోవిడ్ అనే పేరు వింటేనే ఎంత భయపడతామో అందరికీ తెలిసిందే. కరోనా మొదలైన దగ్గరనుండి అది వివిధ రకాల వేవ్ లు అంటూ ప్రజల మధ్యకు చొచ్చుకు వస్తూనే ఉంది. ఇది రెండు సార్లు చాలా పెద్ద విలయతాండవమే సృష్టించింది. చాలామంది కోవిడ్ కారణంగా చావు అంచులదాకా వెళ్లివచ్చారు. కోవిడ్ మరణపు రుచి చూపించిన తరువాత చాలామంది ఆరోగ్య దృష్ట్యా తీసుకుంటున్న జాగ్రత్తలే ప్రాణాల మీదకు తెస్తున్నాయని వైద్యులు అంటున్నారు. సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రే కోవిడ్ వచ్చి తగ్గినవారు ఎవరూ రెండేళ్ల వరకు కొన్ని పనులు చేయకూడదంటూ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ ఎల్ మాండవ్య తెలిపిన ఆ విషయాలేంటో తెలుసుకుని వాటిని ఫాలో అవ్వడం ప్రతి ఒక్కరి కర్తవ్యం కూడా.. కోవిడ్ సంభవించిన చాలామంది మీద పరిశోధనలు, దేశంలో సంభవిస్తున్న మరణాలను సర్వే చేసిన వైద్యులు కొన్ని విస్తుపోయే నిజాలు వెలిబుచ్చారు. దేశంలో సంభవిస్తున్న గుండెపోటు మరణాలలో కోవిడ్ గుప్పెట్లో చిక్కుకుని నరకం అనుభవించి మరీ బయటపడినవారే అధికశాతం మంది ఉన్నారు. అందుకే కోవిడ్ వచ్చి దాని నుండి బయటపడినవారు ఎవరూ అధికబరువులు ఎత్తడం, రన్నింగ్ చేయడం, వేగవంతమైన డాన్స్, ఏరోబిక్ వ్యాయామాలు, అధిక శ్రమతో కూడుకున్న ఇంటి పనులు మొదలైనవాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన వ్యాయామానికి, గుండెపోటుకు మధ్యగల సంబంధం గురించి వైద్యులు చేసిన పరిశోధనలలో చాలా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. చాలా తీవ్రమైన వ్యాయామాలు చేసినప్పుడు రక్తపోటు, శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం చాలా వేగంగానూ, ఆకస్మాత్తుగానూ జరుగుతున్నాయని వైద్యుల పరిశోధనలలో తేలింది. ఇది గుండెమీద ఒత్తిడి కలిగించి గుండెపోటుకు దారితీస్తుంది. ఇప్పటికే అధిక రక్తపోటు, గుండె సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. పైన చెప్పుకున్న విషయాల ప్రకారం కోవిడ్ బాధితులలో గుండె సంబంధ సమస్యల ప్రమాదం ఎక్కువ కాబట్టి వ్యాయామం ఆపేయాలనే ఆలోచన రావచ్చు. కానీ గుండె ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చాలా అవసరం. అయితే తీవ్రమైన వ్యాయామం గుండెను దెబ్బతీస్తుంది. కాబట్టి కోవిడ్ నుండి బయటపడినవారు గుండె ఆరోగ్యానికి, శారీరక ఫిట్నెస్ కోసం తేలికపాటి వ్యాయామాలను మాత్రమే ఎంచుకోవాలి. వాకింగ్, మెట్లు ఎక్కడం, యోగా, సైక్లింగ్ వంటి వ్యాయామాలు ప్రతిరోజూ చేయవచ్చు. అయితే నిశ్చలమైన జీవనశైలి నుండి మాత్రం తప్పక బయటపడాలి. ఒకే రకమైన జీవనశైలి ఉంటే శరీరానికి తగినంత మార్పు లభించదు. కాబట్టి తేలికపాటి వ్యాయామాలు చేస్తూ గుండెను, ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలి. *నిశ్శబ్ద.
read moreచలికాలంలో వచ్చే జలుబు, గొంతు నొప్పికి ఇవి దివ్యౌషధం..!
కొందరికి తరచుగా జలుబు, ఫ్లూ, దగ్గు వస్తుంటాయి. ఈ సందర్భంలో గొంతు నొప్పి సాధారణం. ఇది వివిధ ఇన్ఫెక్షన్ల వల్ల సంభవించవచ్చు. చలికాలం వస్తే ఇది మామూలేనని పలువురు వాపోతున్నారు. కొందరు వ్యక్తులు గొంతు నొప్పితో వాపును కూడా అనుభవిస్తారు. అయితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు అనేక హోం రెమెడీస్ ఉన్నాయి. మన పెద్దలు కూడా వీటి గురించి చెబుతుంటారు. చలికాలంలో వేధించే గొంతునొప్పి, జలుబుకు సంబంధించిన హోం రెమెడీస్ గురించి ఇప్పుడు చూద్దాం. తేనె: తేనె చాలా సంవత్సరాలుగా సాంప్రదాయ ఔషధం యొక్క సహజ రూపంగా ఉపయోగిస్తున్నారు. ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నందున ఇది మన శరీరంలో మంటను తగ్గించడంలో గొప్పగా పనిచేస్తుంది. ఇది కాకుండా, ఇది వెంటనే గొంతు నొప్పి తగ్గిస్తుంది. ఉప్పు నీటితో గార్గ్లింగ్: గోరువెచ్చని ఉప్పు నీరు మీ స్క్రాచీ గొంతు, జలుబు వల్ల వచ్చే గొంతు నొప్పికి ఉత్తమ ఔషధంగా కనిపిస్తుంది. ఇది గొంతులోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది. నొప్పిని కూడా తగ్గిస్తుంది. దీని కోసం, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు వేసి, బాగా మిక్స్ చేసి రెండు నిమిషాలు పుక్కిలించాలి. చమోమిలే టీ తాగడం: ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, ఇతర ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి గొంతు నొప్పికి నివారణగా పనిచేస్తాయి. మీరు తాగే చమోమిలే టీలో కొంచెం తేనె కలుపుకుంటే మరింత మేలు జరుగుతుంది. ఇది కెఫిన్ కలిగి ఉండదు కాబట్టి, ఇది కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. వేడి నిమ్మరసం తాగడం: చలికాలంలో మీ గొంతు నొప్పికి గోరువెచ్చని నిమ్మరసం దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీర బరువును తగ్గించడమే కాకుండా అనేక చర్మ సమస్యలకు ఇది ఔషధంగా పని చేస్తుంది. చలికాలపు లక్షణాలను తొలగించడమే కాకుండా, యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్ లక్షణాల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, గొంతులో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
read moreఆహారంలో ఇదొక్కటి లోపించడం వల్లే ఇరవై ఏళ్ళకే ముసలోళ్ళుగా కనబడుతున్నారు
మనిషిని బట్టి వయసు అంచనా వేస్తుంటారు చాలామంది. ఈ అంచనాలో కొన్ని సార్లు నిండా 20ఏళ్ళు కూడా లేనివారు ఆంటీలు, అంకుల్స్ అనే ట్యాగ్ లోకి వెళతారు. చిన్న వయసులోనే ఇలా పిలవడం వల్ల మనసులో భోరుమని కుమిలిపోయేవారు చాలామంది ఉన్నారు. నేను ఆంటీలా కనబడుతున్నానా అని ముఖం మీద అనేసేవారు కూడా ఉన్నారు. అయితే ఇది ఎదుటివారి తప్పూ కాదూ, మీ వయసు తప్పూ కాదు. అక్కడున్న తప్పల్లా శరీర చర్మంలో వచ్చిన మార్పే. చిన్నవయసులో చర్మం ముడుతలు పడటం, బలహీనంగా మారటం, శరీరం కూడా వయసు మించినట్టు కనబడటం జరుగుతుంది. ఈ కారణం వల్లే అన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్య ఏర్పడటానికి శరీరంలో తీసుకునే ఆహారంలో ఒకే ఒకటి లోపించడం కారణమని ఆహార నిపుణులు చెబుతున్నారు. చిన్నవయసులోనే శరీరం ముసలిగా మారకూడదంటే అవసరైన పోషకం ఏంటి? అది ఏ ఆహారాలలో లభిస్తుంది? పూర్తీగా తెలుసుకుంటే.. సాదారణంగా వయసు పెరిగేకొద్ది శరీరం ముసలిగా మారుతుంది. చర్మం యవ్వనంగా ఉండటానికి కారణమయ్యే కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం. చిన్నవయసులోనే కొల్లాజెన్ సరిగా ఉత్పత్తి కాకపోతే చిన్నవసులోనే ముసలివాళ్లుగా కనబడతారు. చిన్నవయసులో వృద్దాప్య సమస్యను అధిగమించాలంటే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించే ఆహారాలను సమృద్దిగా తీసుకోవాలి. కింది ఆహారాలు తీసుకుంటే శరీరానికి కొల్లాజెన్ సమృద్దిగా అందుతుంది. పైపెచ్చు ఇవి అందుబాటులో ఉండేవే. అవేంటో తెలుసుకుంటే.. టమోటా.. చర్మం వృద్దాప్యంలోకి జారుతుందనడానికి మొదటి సూచన ముఖంలోనే కనిపిస్తుంది. ముఖం మీది చర్మం ముడతలు పడుతూ ఉంటే వెంటనే టమోటా వినియోగం పెంచాలి. టమోటాలు తినడం వల్ల లైకోపీన్, కొల్లాజెన్ కంటెంట్ శరీరంలో పెరుగుతాయి. ఇది ఒకరకమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఆకుపచ్చని కూరగాయలు.. కొల్లాజెన్ లోపాన్ని అధిగమించడానికి మాంసాహారులు, శాఖాహారులు కూడా తినగలిగే ఆహారం ఆకుపచ్చని కూరగాయలు. ఆకుపచ్చని కూరగాయలను సహజంగానే ఆరోగ్యానికి ఎంతో మంచివని అంటారు. ఆకుకూరలలో పాలకూర, బ్రోకలి, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న కూరగాయలు తీసుకోవడం వల్ల కొల్లాజెన్ పొందడం సులువు. అరటిపండు.. బాగా ఆకలిగా ఉన్నప్పుడు భోజనం ఏమీ లేకపోయినా రెండు అరటిపండ్లు తిని గంటకు పైగా ఆకలిని అధిగమించవచ్చు. అరటిపండు కడుపునింపడంతో పాటు శరీరానికి ఆరోగ్యం చేకూరుస్తుంది. అయితే అరటిపండు తింటే వృద్దాప్యాన్ని కూడా జయించవచ్చు. అరటిపండులో కొల్లాజెన్ ఉంటుంది. ప్రతిరోజూ అరటిపండు తింటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది వృద్దాప్యాన్ని ఆమడదూరంలో ఉంచుతుంది. పై మూడు రకాల పండ్లు, కూరగాయలను ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే కేవలం నెలరోజులలోపే ముడుతలు పడిన చర్మం యవ్వనంగా మారడం గమనిస్తారు. ఈ ఆహారాలు రోజువారి లైఫ్ స్టైల్ లో భాగం చేసుకుంటే యాబై ఏళ్ళు దాటినా యవ్వనంగా యూత్ లా కనిపిస్తారు. *నిశ్శబ్ద.
read moreఇందుకే రోజులో ఒక్కసారైనా బెల్లం ముక్క తినాల్సిందే..!!
పంచదారతో పోలిస్తే బెల్లం ఆరోగ్యకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బెల్లంలో సహజసిద్ధమైన ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. కాబట్టి శుద్ధి చేసిన చక్కెరతో పోలిస్తే బెల్లం చాలా మంచిది. అంతేకాకుండా, మన శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియం, పొటాషియం కూడా ఇందులో ఉన్నాయి. వీటన్నింటి వల్ల బెల్లం మన శరీరానికి మరింత శక్తిని అందిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా బెల్లం తీసుకోవడం వల్ల శరీరానికి మంచి కేలరీలు, కార్బోహైడ్రేట్లు అందుతాయి. అనేక కారణాల వల్ల రోజుకు ఒక్కసారైనా బెల్లం హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయి: బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్తో పోరాడుతాయి. క్యాన్సర్, గుండె సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి మనలను రక్షిస్తాయి. జీర్ణవ్యవస్థకు మంచిది: మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావాలి కాబట్టి దానికి బెల్లం లాంటి మరో ఆహారం కావాలి. ఎందుకంటే ఇలాంటి ఆహారాలు మన శరీరంలోని అజీర్ణం, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తాయి. ఇది మన జీర్ణశక్తిని పెంచుతుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది: బెల్లం ఒక ప్రధాన సహజ డిటాక్సిఫైయర్గా పనిచేస్తుంది. కాబట్టి ఇది మన శరీరం నుండి విషాన్ని సులభంగా తొలగిస్తుంది. దీని వల్ల మన కాలేయ భాగం మునుపటి కంటే మెరుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. కాలేయం వల్ల మన శరీరంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. శక్తిని పెంచుతుంది: కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న బెల్లం తీసుకోవడం వల్ల మన శరీరంలో శక్తిని పెంచి, మనల్ని ఎల్లప్పుడూ ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. అలసట, అనిపించే వారు బెల్లం తినడం అలవాటు చేసుకోవాలి. ఋతు నొప్పి ఉపశమనం: బెల్లంలో ఐరన్, పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో రక్తప్రసరణను నిర్వహించి, బహిష్టు నొప్పి, తిమ్మిరి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో బెల్లం తీసుకోవడం వల్ల మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: బెల్లంలో అవసరమైన మినరల్స్, విటమిన్లు ఉండటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లకు ఔషధంలా మారుతుంది. దీని వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు. బెల్లం తినే విధానం: మీరు బెల్లాన్ని అనేక రకాలుగా ఆస్వాదించవచ్చు. మీరు నీటిలో బెల్లం కలుపుకొని తినవచ్చు లేదా మీ రోజువారీ టీ-కాఫీలో చక్కెరకు బదులుగా బెల్లం త్రాగవచ్చు. మీరు తయారుచేసే వివిధ తీపి వంటకాలకు బెల్లం జోడించవచ్చు. మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
read moreఒంట్లో కొవ్వును ఐస్ లా కరిగించే ఫిట్నెస్ రూల్..
కొవ్వును కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు. శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయి. అవి ఆరోగ్యకరమైన కొవ్వులు, చెడు కొవ్వులు. ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బులను తగ్గించడంతో పాటు మెదడు పనితీరు, హార్మోన్ ఉత్పత్తి, కణాల పెరుగుదల.. ఇలా చాలా విధులు నిర్వర్తిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా తగ్గిపోతాయి. కొలెస్ట్రాల్ కు, అధిక బరువుకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. అధిక బరువు తగ్గాలన్నా, కొలెస్ట్రాల్ ఐస్ లా కరిగిపోవాలన్నా ఒక శక్తివంతమైన ఫిట్నెస్ రూల్ ఫాలో అవుతున్నారు చాలామంది. ఆ ఫిట్నెస్ రూలే 30-30-30.. అసలు 30-30-30 అంటే ఏంటి? బరువు తగ్గడంలో దీని ప్రాముఖ్యత ఏంటి? ఇది ఎంతవరకు బరువు తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది? పూర్తీగా తెలుసుకుంటే.. అధికబరువుకు ప్రధాన కారణం జీవనశైలి సరిగా లేకపోవడం. ఈ జీవన శైలిని సింపుల్ రూల్ తో ఒకదారిలోకి పెట్టవచ్చు. దీనికి 30-30-30 రూల్ పేరు పెట్టారు. వ్యాయామం, ఆహారం, ప్రశాంతంగా తినడం. కేవలం ఈ మూడు ప్రధానంగా సాగే ఈ రూల్ గురించి తెలుసుకుంటే.. 30 గ్రాముల ప్రోటీన్ తినాలి.. ప్రోటీన్ అనేది బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ 30గ్రాముల ప్రోటీన్ ఆహారంలో ఉండేలా చూసుకుంటే అది శరీర అవసరాలకే కాకుండా బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది. ఈ 30 అనే మార్క్ కు ఉన్న మరొక అర్థం ఏమిటంటే రోజూ తీసుకునే ఆహారంలో 30శాతం కేలరీలు తగ్గించాలని. కేలరీలు తగ్గిస్తే సహజంగానే బరువు పెరగరు. ఇక 30గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరం బలహీనంగా మారకుండా ఉంటుంది. ప్రోటీన్ కండరాలకు ఎంతో అవసరమైనది కాబట్టి 30గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి, 30శాతం కేలరీలు తగ్గించుకోవాలి. వ్యాయామం.. వ్యాయామం చేసేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. వారు స్వతహాగా అన్ని పనులలో చురుగ్గా పాల్గొంటార. ఫిట్నెస్ రూల్ ప్రకారం రోజులో 30నిమిషాలపాటు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కొవ్వు కరిగించడం సులువు అవుతుంది. ఈ వ్యాయామంలో వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, గేమ్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మొదలైనవి ప్రభావవంతంగా ఉంటాయి. ప్రశాంతంగా తినడం.. ప్రశాంతంగా తినడాన్ని ఇప్పట్లో మైండ్ పుల్ ఈటింగ్ అని అంటున్నారు. తినే ఆహారం మీద ద్యాస పెట్టడమే మైండ్ పుల్ పద్దతి. ఇప్పట్లో చాలామంది ఉద్యోగాలు, చదువుల హడావిడిలో వేగంగా తినేయడం చేస్తుంటారు. మరికొందరు భోజనం చేస్తున్నప్పుడు కూడా టీవి, మొబైల్ చూస్తూ తింటారు. దీనివల్ల కడుపు అయితే నిండుతుంది కానీ ఆహారంలోని శక్తి శరీరానికి సంపూర్ణంగా అందదు. మనం తినే ఆహారం చాలా శక్తివంతమైనదని, అది అమృత సమానమైనదని భావిస్తూ ఆహారాన్ని చేత్తో కలుపుకుని ఆహారం మీద ఎంతో ఇష్టంతో తినాలి. ఇలా కొన్ని రోజులు చేసిన తరువాత మునుపు ఆహారం తీసుకున్నప్పటికి, తరువాత మైండ్ ఫుల్ గా తిన్నప్పటికి గల తేడాను స్పష్టంగా చూడగలుగుతారు. ఆహారంలో నిఘూడమైన ఉంటుంది. దాన్ని పొందగలగాలి. ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుడిని పూజిస్తున్నప్పుడు ఎంత భక్తితో ఉంటామో ఆహారం దగ్గరా అంతే భక్తితో ఉండాలి. ఆహారాన్ని ఇలా ఫీలవుతూ తినడానికి 30నిమిషాల సమయాన్ని కేటాయించాలి. కేవలం పై మూడు ఫాలో అయితే కొన్ని రోజులలోనే బరువు తగ్గడం స్పష్టంగా గమనించగలుగుతారు. *నిశ్శబ్ద
read moreఈ ఐదు రకాల నూనెల గురించి పూర్తీ తెలుసుకోకుండా వంటల్లో అస్సలు వాడకూడదు!
చాలా రకాల వంటలలో నూనె వినియోగం తప్పనిసరి. అస్సలు నూనె ఉపయోగించకుండా చేసే వంటల రుచి బాగుండదనే మాట వాస్తవం. నూనె వినియోగానికి బాగా అలవాటు పడిపోవడం వల్ల అలా అనిపిస్తుంది. వంట చేయడానికి వినియోగించే నూనెలలో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని నూనెలు ఆరోగ్యానికి మంచివి కావని, మరికొన్ని ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతుంటారు. అయితే అందరూ ఆరోగ్యానికి చాలా మంచివని అనుకునే అయిదు రకాల నూనెలతో వంట చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని తేలింది. డైటింగ్ చేసేవారు, ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు ఉపయోగించే కొన్ని రకాల నూనెలు కూడా వంటల్లో వినియోగించడం మంచిది కాదని తేలింది. ఆ నూనెలేంటంటే.. ఆవనూనె.. ఆవనూనె వంటల తయారీలో ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. అయితే ఈ నూనెను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇందులో ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. కల్తీ లేని ఆవనూనె మాత్రమే వంటకు ఉత్తమమైనది. లేని పక్షంలో మంచి ఫలితాల కంటే కలిగే నష్టాలే ఎక్కువ. సోయాబీన్ నూనె.. సోయాబీన్ నూనెలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా శరీరంలో ఒమేగా -6, ఒమేగా -3 నిష్పత్తి అసమతుల్యమవుతుంది. దీని వల్ల శరీరంలో వాపు, కీళ్లనొప్పులు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. సోయాబీన్ నూనెను రోజూ వంటల్లో వినియోగించడం వల్ల ఊబకాయం, మధుమేహం తొందరగా వస్తుంది. మొక్కజొన్న నూనె.. వెజిటబుల్ నూనె మాదిరి మొక్కజొన్న నూనెలో కూడా ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు అధిక స్థాయిలో ఉంటాయి. ఆహారంలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటే వాపుకు కారణమవుతుంది. దీన్ని తీసుకుంటే 100% కొవ్వులు శరీరంలో చేరతాయి. ఇకపోతే ఈ నూనెలో ప్రోటీన్ లేదా కార్బోహైడ్రేట్లు ఏమీ ఉండవు. మొక్కజొన్న నూనె వంట విషయంలో ఆరోగ్యకరమైన ఎంపిక కాదు. ఆలివ్ నూనె.. ఆలివ్ నూనె ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. సలాడ్లు, ఆహారంలో నూనెను జోడించడం విషయానికి వస్తే ఆలివ్ నూనె అత్యంత ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. అయితే ఈ నూనె వేడెక్కే ఉష్టోగ్రత ఇతర నూనెల కంటే తక్కువగా ఉంటుంది, అంటే ఇది అధిక మంట మీద వంట చేయడానికి తగినది కాదు. ఆలివ్ నూనెను ఎప్పుడూ పైపైన వాడాలే తప్ప నేరుగా మంటమీద వేడి చేసి ఆహారాన్ని వండకూడదు. అలా వండితే దాని పోషకాలు చెడిపోతాయి, అలాంటి నూనె శరీరానికి హానికరం అవుతుంది. పామాయిల్.. ఒకప్పుడు పామాయిల్ చాలా విరివిగా వాడేవారు. ఈ పామాయిల్ లో సంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని అధికంగా తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయి. ఈ నూనెను ఎక్కువగా స్నానపు సబ్బు తయారీలో ఉపయోగిస్తారు . ఇది చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది, అందుకే దీనిని రెస్టారెంట్లలో లేదా టాఫీ చాక్లెట్ మొదలైన వాటి తయారీలో ఉపయోగిస్తారు, తద్వారా ఇది నోటిలోకి వెళ్ళిన వెంటనే కరిగిపోతుంది. ఆరోగ్యం బాగుండాలంటే పైన చెప్పిన నూనెలను ఆహారం వండటానికి అస్సలు వినియోగించకూడదు. దీనికి బదులుగా కొబ్బరి నూనె, అవకాడో నూనె, నువ్వుల నూనె వంటి ఆరోగ్యకరమైన నూనెలు వినియోగించవచ్చు. అయితే ఆహారం తయారీలో నూనెల వినియోగం పరిమితంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. *నిశ్శబ్ద.
read moreతులసి గురించి ఆయుర్వేదంలో ఉన్న షాకింగ్ చిట్కాలు!!
చర్మవ్యాధుల్ని పోగొట్టడంలో తులసి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. తామర మొదలైన చర్మ వ్యాధులకు తులసి ఆకులను నూరి, నిమ్మపండు రసం కలిపి పైన రాస్తారు. క్రిములను సైతం తులసి సంహరిస్తుంది. ఎక్కిళ్ళు, ఆయాసం, దగ్గు మొదలైన శ్వాసకోశ సంబంధ వ్యాధులు నయమవుతాయి. నిమోనియా, మలబద్ధకాలకు తులసి మంచి ఔషధం. మలేరియా జ్వరానికి తులసీ దళాల కషాయం బాగా పనిచేస్తుంది. ఎండు తులసి ఆకులను నీళ్ళలో (10 తులాల నీళ్ళకు ఒక తులం ఆకు వంతున) వేసి మరిగించి, ఆ కషాయాన్ని రొమ్ము పడిసెం మొదలైనవాటికి వాడతారు. చెవిపోటు వస్తే తులసి ఆకు రసాన్ని చెవిలో పిండితే తగ్గిపోతుంది. మానకుండా ప్రతి రోజూ రెండు పూటలా తులసీ దళాలను సేవించడం వల్ల రక్తపోటు, క్యాన్సర్, కడుపులో పుండు మొదలైనవి రావు. అలాగే ప్రతి రోజూ ఉదయం తులసి ఆకును నలిపి, ఒక తులం రసం తీసి తాగుతుంటే జీర్ణజ్వరాలు, విరేచనాలు మొదలైనవి తొలగిపోతాయి. పిల్లలకు కడుపుశూల వస్తే, తులసి ఆకు రసంలో కొద్దిగా అల్లపు రసాన్ని కలిపి తాగిస్తారు. ఒక తులం తులసి రసంలో పావు తులం నల్ల మిరియాల రసం కలిపి తాగిస్తే, జలుబుతో కూడిన జ్వరం, విడవకుండా వస్తున్న జ్వరం కూడా తగ్గిపోతాయి. అలాగే, అప్పటికప్పుడు తాజాగా తీసిన తులసి రసాన్ని తాగిస్తే వాంతులు కట్టేస్తాయి. పేగుల్లో ఉండే క్రిములు నశిస్తాయి. వాంతులు, విరేచనాలు అవుతుంటే, పిల్లలకు తులసి గింజలను ఆవు పాలతో నూరి తాగిస్తారు. శరీరంలో వేడిని పెంచే గుణం తులసికి ఉంది. అందుకే, అవసాన దశలో శరీరం చల్లబడుతున్నప్పుడు గొంతులో తులసీ రసం (తీర్థం) పోస్తారు. తులసి ఆకుల్ని వాసన చూస్తే జలుబు పోతుంది. తులసీ రసాన్ని కళ్ళల్లో వేస్తే చూపు బలపడుతుంది. కళ్ళల్లో నీళ్ళు కారడం ఆగుతుంది. చెవిలో పోస్తే చెవుడు పోతుంది. ఆకును నమిలి చెవిలో పెడితే, చెవి పోటు తగ్గుతుంది. సూర్యోదయం కన్నా ముందే ఆకులు నమిలి, దంతాలకు రుద్దితే పంటి నొప్పి రాదు. తులసి ఆకుల్ని నూరి, వేడి నీటితో కలిపి పుక్కిలించినా, నమిలినా నోరు పొక్కడం మానుతుంది. ఇక, తులసి గింజల్ని తాంబూలంతో సేవిస్తే, గొంతు వాపు పోతుంది. దీని ఆకు రసంతో తేనె కలిపి ఇస్తే, గట్టిగా ఉండే శ్లేష్మం పల్చబడి బయట పడుతుంది. అలాగే, దగ్గు, రొమ్ము పడిసెం మొదలైనవి కలిగినప్పుడు తులసి రసంలో తేనె, అల్లపు రసం, నీరుల్లి రసం కలిపి ఇస్తే, కఫం తెగి పడుతుంది. తులసి ఎండుటాకును నూరి, నస్యం చేస్తే ఉబ్బసం తగ్గుతుంది. తులసి రసాన్ని తేనెతో కలిపి ఇస్తే, ఆకలి కలుగుతుంది. అన్నకోశానికి శక్తి నిస్తుంది. జీర్ణశక్తిని కలిగిస్తుంది. వాంతులు ఆగుతాయి. తులసి ఆకుల రసాన్ని, శొంఠి పొడి కలిపి ఇస్తే చలి జ్వరం పోతుంది. జలుబు చేసిన వాళ్ళు రోజుకు మూడు, నాలుగు సార్లు తులసి ఆకులు కొన్ని తీసుకొని, బాగా నమిలి మింగాలి. లేదంటే, మరుగుతున్న నీటిలో ఆ ఆకులు వేసి కొద్దిసేపు ఉంచి, వడపోసి, అందులో కాస్త పంచదార, రెండింతల పాలు పోసి, కాఫీ లాగా తాగాలి. దీని వల్ల రొంప తగ్గి, జ్వరం రాదని వైద్యులు చెబుతుంటారు. ఇలా గృహ కృత్యాలలో, సామాన్య వ్యాధులకు అన్నిటికీ తులసి దివ్యౌషధం. ప్రాణదాయక, ప్రాణరక్షక శక్తులు తులసిలో ఉండడంతో జగద్రక్షకుడైన విష్ణుమూర్తికి ఇది ప్రియమైనదని హిందువులు నిశ్చయించారు. *నిశ్శబ్ద.
read moreఅలారంతో నిద్రలేచే అలవాటుందా? అయితే వెంటనే మానేయడం మంచిది!
ఉదయాన్నే లేచి ఇంటిపనులు చేసుకోవడం కోసం కొందరు మహిళలు, ఉదయాన్నే లేచి జిమ్ కో, వాకింగ్ కో వెళ్లాలని కొందరు, చదువుకోవాలని కొందరు ఇలా ఎంతోమంది ఉదయం సమయంలో తొందరగా నిద్ర లేవడానికి అలారం సహాయం తీసుకుంటున్నారు. అయితే ఇలా అలారం సహాయంతో నిద్రలేస్తామని, పనులన్నీ చక్కగా చేసుకుంటామని, చక్కగా చదువుకుంటామని గొప్పగా చెప్పుకునేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇలా అలారం సహాయంతో నిద్రలేవడం అనేది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదనే చేదు వార్త ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న అంశం. అసలు అలారం సహాయంతో నిద్రలేవడం ఎందుకు మంచిది కాదు? దీనివల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటి? ఈ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుంటే ఇకమీదట ఎప్పుడూ అలారం పెట్టుకుని నిద్రలేవడానికి ప్రయత్నించరు. ఒకప్పుడు పిల్లలు పరీక్ష సమయాల్లో ఉదయమే లేచి చదువుకోవాలంటే అలారం ఉపయోగించేవారు. ఆ తరువాత మొబైల్ లోనే అలారం అందుబాటులోకి వచ్చాక నిద్రపోయే ముందు పక్కనే పెట్టుకుని పడుకునే మొబైల్ అలారం సహాయంతో నిద్రలేస్తుంటారు. కానీ చాలామంది అలారం మోత మోగగానే మొదట్లోనే లేవరు. అది ఒకటికి పదిసార్లు మోగితే కానీ నిద్రలేవరు. అసలు సమస్య ఎక్కడుందంటే.. ఉదయాన్నే నిద్రలేవడానికి ఉపయోగింటే అలారం సౌండ్ ఆరోగ్యం మొత్తాన్ని చెడగొట్టేస్తుంది. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న శరీరం ఉదయాన్నే పెద్ద శబ్దాలతో మేల్కొనడం అంటే అది రక్తపోటు, గుండె సమస్యలకు కోరి దారి ఇస్తున్నట్టేనట. రాత్రంతా నిశ్చల స్థితిలో పడుకుని ఉండటం వల్ల శరీరంలో రక్తం చిక్కగా ఉంటుంది. అలారం శబ్దం కారణంగా మేల్కోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ చురుగ్గా జరగదు. శరీరం సాధారణంగా మేల్కొన్నప్పుడు శరీరంలో రక్తం చురుగ్గా ప్రసారమవుతుంది. నిద్రమత్తులో, గాఢంగా ఉన్నప్పుడు అలారం శబ్ధం ద్వారా మేల్కోవడం అంటే జ్ఞాపకశక్తి, మెదడు సామర్థ్యాన్ని క్రమంగా తగ్గిస్తుంది. అలారం ద్వారా మేల్కోవడం అడ్రినలిన్ పై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అలారం ద్వారా నిద్ర నుండి మేల్కొనే అలవాటు ఉన్నవారు దీన్ని మానేయడం ఉత్తమం. అలారం అలవాటు ఎలా మానాలంటే.. అలారం ద్వారా లేవడం రోజులో భాగమైపోయినవారు దీన్ని మానుకుని సాధారణంగా నిద్రలేవడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది. కానీ ఈ అలవాటు మానడం వల్ల దీర్ఘకాల అనారోగ్యాలు నివారించవచ్చు. అలారం వరుసపెట్టి అరుస్తున్నా నిద్రమత్తుతో లేవకుండా బద్దకంగా అలాగే పడుకునే అలవాటు మానుకోవాలి. ఒకటి లేదా రెండు సార్లు అలారం మోగగానే దాన్ని కట్టేయాలి. ఇది క్రమంగా సాధారణంగా లేచే సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుంది. బిగ్గరగా భయపెట్టేలానూ, పెద్ద పెద్ద శబ్దాలతో కూడిన అలారం ను ఉపయోగించడం మానుకోవాలి. సన్న శబ్దంతో పేస్ ఫుల్ గా ఉండే అలారం వాడితే ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇంట్లో సూర్యకాంతి నేరుగా ముఖం మీద పడేలాగా నిద్రపోయే ప్రాంతాన్ని సెట్ చేసుకోవాలి. దీనివల్ల ఏ అలారం అక్కర్లేకుండా నిద్రలేవవచ్చు. ప్రతిరోజూ ఒకేసమయంలో నిద్రపోవడం, నిద్రలేవడం చేస్తుంటే ఉదయం సమయంలో అలారం అక్కర్లేకుండానే దానికదే మెలకువ వస్తుంది. ప్రతి రోజూ 7నుండి 8గంటలపాటు నిద్రపోవాలి. ఆరోగ్యకరమైన నిద్ర ఉన్నప్పుడు మేల్కోవడం కూడా సులువుగానే జరుగుతుంది. అదే నిద్ర తక్కువైతే మేల్కోవడం కష్టం. *నిశ్శబ్ద.
read moreచలికాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే అతిపెద్ద సమస్య ఇదే..
ఇప్పటిదాకా ఎండలు ఏమాత్రం తగ్గకుండా వేసవిని తలపిస్తున్నా శరత్కాల ప్రభావం వల్ల క్రమంగా చలి పెరుగుతుంది. సాధారణంగానే అక్టోబర్ నెలలో వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటాయి. క్రమంగా ఉదయం, సాయంత్రం సమయాలలో చలి ఎక్కువ అవుతుంది. ఈ సీజన్ లో ఇన్ఫ్లూయెంజా వంటి వైరల్ లు పెరగడంతో పాటు మైగ్రేన్ సమస్య కూడా పెరిగే ప్రమాదం ఉంది. మైగ్రేన్ అనేది మొండి తలనొప్పి. ఇది వచ్చిందంటే బాధితులను చాలా దారుణంగా హింసిస్తుంది. అసలు మైగ్రేన్ కు చలికి ఉన్న సమస్య ఏంటి? చలికాలంలో దీనికి చెక్ పెట్టడానికి ఏం చెయ్యాలి? పూర్తీగా తెలుసుకుంటే.. మైగ్రేన్ సమస్య ఉన్నవారు చలికాలంలో ఈ సమస్యను మరింత ఎక్కువగా ఎదుర్కొంటారు. ఈ సీజన్ లో గాలి పొడిగా ఉండటం, విపరీతమైన చలి కారణంగా మైగ్రేన్ వస్తుంది. సూర్యరశ్మి తగినంత లేకపోయినా మైగ్రేన్ వస్తుంది. సూర్యరశ్మి లేకపోవడం వల్ల మెదడులో సెరోటోనిన్ వంటి రసాయనాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది తలనొప్పి, మెగ్రేన్ వంటి సమస్యలు పెంచుతుంది. సూర్యరశ్మి లేకపోవడం వల్ల సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలుగుతుంది. ఇది అంతర్గత నిద్ర గడియారం. ఇది అసమతుల్యతకు గురికావడం వల్ల నిద్రలేమి, తద్వారా తలనొప్పి, మైగ్రేన్ కు దారితీస్తుంది. కేవలం సూర్యరశ్మి మాత్రమే కాకుండా ధూమపానం, మద్యపానం, కెఫిన్ పానీయాలు తీసుకోవడం, అధికంగా వెలుగు కలిగిన, మెరుస్తున్న లైట్లముందు, ఘాడత కలిగిన వాసనల మధ్య ఉండటం కూడా మైగ్రేన్ కు కారణం అవుతాయి. మైగ్రేన్ ఎలా నివారించాలంటే.. చలి భరించలేని వారు, చాలా సున్నితమైనవారు మైగ్రేన్ బారిన తొందరగా పడతారు. శీతాకాలంలో వీరు మైగ్రేన్ బారిన పడే అవకాశం ఎక్కువ. మైగ్రేన్ ను నివారించడానికి చలికి లోనుకాకుండా ఉండటం ముఖ్యం. వ్యాయామం శరీరంలో వేడి పుట్టిస్తుంది. కాబట్టి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం సెరటోనిన్ స్థాయిలను పెంచుతుంది. అలాగే చలికాలపు జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. వేడి నీరు, వేడి ఆహారం, వెచ్చని వాతావరణం, ఆరోగ్యాన్ని కాపాడతాయి. మైగ్రేన్ ను దూరంగా ఉంచుతాయి. *నిశ్శబ్ద.
read more



.webp)








.webp)
.webp)
.webp)
.webp)
.webp)
.webp)
.webp)


.webp)
.webp)