హార్ట్ ఎటాక్ నిర్ధారణ ?

వ్యాధి నిర్ధారణ... పేషంట్ ఆరోగ్య చరిత్రను బట్టి,కొన్ని ప్రత్యేక టెస్టులు ద్వారావ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంది. తక్షణంగా ఇ సి జి పరీక్ష చేస్తారు. అప్పటికే డ్యామేజి అయిన గుండె కండరం రక్తం లోకి రిలీజ్ చేసే కొన్ని రకాల ఎంజైమ్ పరీక్షలు జరుపుతారు.ఒక వేళ సర్జరీ చేయాలన్న ఆలోచనకు వస్తే ఎమర్జెన్సీ కోరోనరీ ధమని యంజియో గ్రఫీ ని నిర్వహిస్తారు. డాక్టర్ ఏమి చేస్తారు?... తగిన మందులతో మొదట నొప్పిని తగ్గించడానికి ప్రయాత్నిస్తారు.మందులతో ఇంటి వద్దే వైద్యాన్ని కొనసాగించాలా వద్దా అన్న విషయాన్ని తగిన నిర్ణయం తీసుకోవాలి.నిర్ధారణకు ఇ సి జి బ్లడ్ టెస్ట్ లు మొదలైన వాటిని చేయిస్తారు. హార్ట్ అట్టాక్ ఎంతవరకూ ప్రమాదం?.... హార్ట్ అట్టాక్ వచ్చిన కొన్ని గంటల దాకా తట్టుకోగలిగి వారిలో 8౦%మంది కోలుకోడానికి అవకాశం ఉంది.హార్ట్ అట్టాక్ సీరియస్ గా వచ్చినా కూడా పేషంట్ 4౦ ఏళ్ల లోపు వాళ్ళయితే పెద్ద ప్రమాదమేమి జరగదు.చాలా మంది తిరిగి తమ పనుల్లో పాల్గొన గలుగుతారు.కొద్ది మందికి మాత్రం శరీరానికి శ్రమ నిచ్చే పనుల్లో పాల్గొంటే యాంజైనా తలెత్తే అవకాశం ఉంది. కొందరు పేషంట్లు మాత్రం శారీరక శరం అంటూ చేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది తిరిగి  మళ్ళీ గుండె పోటు రాకుండా ఉండడానికి డాక్టర్స్ సూచించిన విధంగా తగు ఆహారం విషయంలో జాగ్రతలు తీసుకోవడం శరీరం బరువు పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. పొగతాగడం మానివేయాలి.మీ శరీర అవసరాన్ని బట్టి నిపుణులైన వ్యాయామ పద్దతులు అనుసరిస్తూ దీర్ఘకాలిక జాగ్రత్తలు పాటించాలి. గుండెపోటు వచ్చినప్పుడు ఏం చేయాలి? గుండె పోటు ఎవరికైనా రావచ్చు. ఏ సమయం లోఅ యినా రావాచ్చు. ప్రతి యేటా వేలాది మంది గుండె పోటు మూలంగా చనిపోతున్నారు. వీళ్ళంతా అధి కబరువు ఉన్న వాళ్ళు కాదు. వొత్తిళ్ళ కు గురి అవుతున్న వాళ్ళూ కాదు.అంటే చాలా సాదా  సీదాగా కనిపించే వాళ్ళు కూడా గుండె పోటు తో చనిచానిపోతున్నా రన్న విషయం మీరు తెలుసుకోవాలి.గుండె పోటు అందించే వార్నింగ్ సిగ్నల్స్ ని పసిగట్టడం ద్వారా దాని నుండి బతికి బయట అవకాశాన్ని మెరుగు పరుచుకోవచ్చు. గుండె పోటు వచ్చే అవకాసం ఉందన్న వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుందా?... ఛాతీ మధ్య భాగాన,చాతి ఎముకకు వెనుక వైపున బిగాదీసినట్లుగా బరువుగా నొప్పి ఉంటుంది.ఆ నొప్పి భుజాల వైపు కు అక్కడినుండి అక్కడి నుండి చేతులకూ వ్య్యపిస్తుంది.తూలు తున్నట్లుగా అనిపించడం.చెమటలు పోసి ఊపిరి అందక పోవడం లాంటి లక్షణాలు కనిపించినప్పుడు. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి.గట్టిగా దగ్గండి.మీ గుండె అప్క్రమామ్గా కొట్టుకుంటే గట్టిగా దగ్గడం వల్ల హార్ట్ బీట్ మళ్ళీ మామూలు క్రమానికి రావచ్చు. యామ్బులేన్సును పిలవండి... కారులో రావడం కంటే యాంబు లెన్స్ లో వచ్చినప్పుడు మిమ్మల్ని వెంటనే ఎడ్మిట్ చేసుకుంటారు. యాస్పిరిన్ తీసుకోండి... వెంటనే ఒక యాస్ప్రిన్ టాబ్లెట్ ను చప్పరించండి. (మింగవద్దు) దీనివల్ల క్లాట్ ఫార్మ్ కాకుండా నివారించ వచ్చు. డాక్టర్ ను పిలవండి... మీ ఫ్యామిలీ డాక్టర్ కు ఫోన్ చెయ్యండి. మీ మెడికల్ ఆయనకు బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి ఎమెర్జెన్సీ డాక్టర్లకు వాటి గురించి అయన వివరిస్తారు. నిబ్బరంగా ఉండండి... ఒకవేళ ఎమర్జెన్సీ రూముకు తీసుకు వెళ్తుంటే బెదిరి. పోకండి గుండె ధైర్యంగా  ఉండండి  మీరు పెద్ద విపత్తులో ఏమి లేరు. నాకు ఏమి జరగా లేదనే భావన లో ఉండండి. బి పోజిటివ్ గా ఉండదానికి ప్రయాత్నించాలి అనుకోకుండా హార్ట్ అట్టాక్ వచ్చిన వాళ్ళలో ౩౦ నుండి 4౦% మంది చనిపోడానికి అవకాసం ఉంది.అనుకోకుండా హార్ట్ అట్టాక్ తో పోయే వాళ్ళలో 75% మంది మొదటి రెండు గంటల్లో చనిపోతున్నారు వాళ్ళలో సగం మంది వైద్య సహాయం లభించే లోపు 5 నుండి 1౦ నిమిషాలలోనే చనిపోవడం మనం గమనించ వచ్చు.అందుకే హార్ట్ అట్టాక్ వచ్చినప్పుడు తక్షణం స్పందించడం తప్పనిసరి. తక్షణం తీసుకోవాల్సిన చర్యలు... ఎత్తిపరిస్తుతుల లోనూ భయపడ కూడదు.రోగి చుట్టూ ఉన్నవాళ్ళు హడావిడి చేయకుండా భయపడకుండా ప్రశాంతంగా ఉండాలి. మీరు గుర్తు ఉంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే 5 నుండి1౦ నిమిషాలే కీలకం అది గడిచిందా చనిపోయే అవకాశాలు 5౦% తగ్గినట్టే ఆసుపత్రిలో ఉన్నా కాని వెంటనే తక్కువ వ్యవధిలో వైద్య సహాయాన్ని పొందలేరన్నది అందరికీ తెలిసిందే.మీకు  కడుపులో అల్సర్లు లేకపోతే సగం అస్ప్రిన్ టాబ్లెట్ నోట్లో వేసుకోవచ్చు. వంటి మీద దుస్తుల్ని వదిలి వేయండి.మీకు ఎగదిలో అయితే గాలి వీస్తుందో ఆ మంచం మీద మీకు అనువైన విధంగా పడుకోండి. శ్వాస ఇబ్బందిగా ఉంటె ఒకటి రెండు దిళ్ళ ను తలకింద ఉంచుకోండి.డైజిన్ లాంటి యాంటీ యాసిడ్ టాబ్లెట్స్ ఉంటె 2-లేదా ౩ టాబ్లెట్స్ వేసుకోండి.గ్లూకోజ్ నీళ్ళు లేదా కొబ్బరి నీళ్ళు తాగండి.మధ్యం లేగా సిగరెట్ల జోలికి పోకండి.   హార్ట్ అట్టాక్ నుండి కోలుకున్నాక... హార్ట్ అట్టాక్ నుంచి కోలుకున్నాక ఎవరైనా చాన్నాళ్ళ దాకా మనస్సులోపల  భయం వర్రీ, డిప్రెషన్, లాంటి వాటికి లోనవుతారు. హార్ట్ అటాక్ కి ముందు ఛాతీలో చిన్న చిన్న నొప్పి వచ్చినా కూడా పట్టించుకోక పోయి ఉండవచ్చు. గాని ఇప్పుడు మాత్రం ఏ చిన్న నొప్పి వచ్చినా కూడా గుండెల్లో రైళ్ళు పరు గెట్టు తుంటాయి. ఇది సహజం కొన్నాళ్ళకి మామూలుగా అయిపోతారు.హార్ట్ అట్టాక్ నుంచి కోలుకున్న పేషంట్లలో 8౦ -9౦% మంది 8 -1౦ వారాల లోపల తిరిగి తమ మా,మూలు పనులు చేసుకోవచ్చు.గుండెకు ఎంత మేర డ్యామేజ్ జరిగిందన్న దానిని బట్టి అతను ఎంత శ్రమకు తట్టుకో గలుగు తాడనేది ఆధార పది ఉంటుంది దీనికి సంబంధించి డాక్టర్స్ తగిన సలహాలు సూచనలు అందిస్తారు.< హార్ట్ పేషంట్ వచ్చిన వారు వ్యాయామం క్రీడలు ఆడవచ్చా... బరువు లేత్తకూడదు.హడా విడిగా భోజనం చేయకూడదు.రాత్రి మీరు తీసుకునే భోజనం పాడుకోడానికి రెండు గంటలు ముందుగా తీసుకోవాలి. అది కూడా తేలిక పాటి ఆహారాన్ని తీసుకోవాలి.డాక్టర్స్ సూచించిన విధంగా రెగ్యులర్ గా మందులు వాడాలి. డాక్టర్ సూచించిన విధంగా రెగ్యులర్గా మందుల్ని వాడాలి.ఇండ ర్నల్, సిప్లర్, టెనో మీనన్ ,బేటా -బ్లాకింగ్ మందుల్ని వాడుతున్నప్పుడు.ఎప్పుడూ వెంట తెచ్చు కోవాలి. ఈ మందులు తయారు చేసిన 6 నెలల లోపల ఉండాలి.ముఖ్యంగా ఎక్సపైరీ డేట్ కు ముందు వాడాలి.హార్ట్ చాలా చిన్నది ఆ చిన్న గుండెకే నొప్పి వస్తే భద్రం మరి.  

read more
ఉదయాన్నే గుండెపోటు ఎందుకు వస్తుంది??

  గత కొన్ని ఏళ్లుగా అంటే 2౦14 నుండి 2౦19 వరకు గణనీయం గా గుండె పోటు తో మరణిస్తున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి.ముఖ్యంగా గుండె పోటు తో మరణిస్తున్న వారిలో చలా మంది సెలబ్రటీ లు ,రాజ కీయ నాయకులు ఉండడం గమనార్హం అయితే వయస్సుతో నిమిత్తం లేకుండా వస్తున్న గుండెపోటుకు కారణాలు ఏమిటి? ముఖ్యంగా గుండెపోటు ఉదయం 7 గం నుండి 11 గంటల మధ్యలోనే ఎందుకు వస్తుంది? దీనికి కారణాలు ఏమిటి ? అన్న సందేహం వస్తుంది. అదీకాక ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఉదయం వేళ్ళల్లో జిమ్ చేస్తున్నప్పుడు కుప్ప కూలిపోవడం  లేదా జిమ్ చేసిన తరువాత హార్ట్ ఎట్టాక్ గుండెపోటు రావడం గమనించవచ్చు .మరొక కోణం చూసినప్పుడు పోస్ట్ కోవిడ్ వచ్చిన వాళ్ళకు గుందేపోటుకు గురికావడం మరొక కోణం గా చెప్పవచ్చు.అసలు పోస్ట్ కోవిడ్ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందని అప్రమత్తం గా ఉండాలని వైద్యులు సూచించక పోవడం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గుండెపోటు వచ్చి నట్లయితే తక్షణం ఎలాంటి చికిత్స అందించాలి అన్న అంశం పై కోవిడ్ రోగులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత చికిత్స చేసిన డాక్టర్లదే కదా. అసలు కోవిడ్ బారిన పడిన తరువాత శరీరం పై ఎలాంటి మార్పులు వస్తాయి? ముఖ్యంగా ఊపిరి తిత్తుల లో ఇబ్బందులు వచ్చి,ఆతరువాత శరీరంలోని రక్త నాళాలు ఎలా బలహీన పడే అవకాశం ఉంది? ఊపిరి తిత్తులకు ఆక్సిజన్ అందక పోవడం తద్వారా గుండెనుండి మెదడుకు చేరాల్సిన రక్త ప్రసారం లో ఇబ్బందులు వస్తున్నాయా? ఇది కోవిడ్ తరువాత వచ్చే పరిణామం గా చెప్పవచ్చ.వీటి అన్నిటి సామగ్ర సమాధానం వెతికే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. గుండె పోటు హార్ట్ అట్టాక్... గుండె కండరానికి రక్తాన్ని తీసుకు వెళ్ళే కరోనరీ ధమనిలో ఎదో ఒక భాగం లో లేదా కొన్ని భాగాలాలో కొవ్వు గాని, రక్తపు గడ్డ కాని పేరుకుని ఆమార్గం పూర్తిగా మూసుకు పోయి నప్పుడు రక్త ప్రవాహానికి ఆటంకం కలిగి అక్కడ రక్త సరఫరా నిలిచిపోతుంది.దానితో రక్త సరఫరా నిలిచిపోయిన గుండె కండరం లోని కొద్ది భాగం నిరుపయోగం అయిపోతుంది. దీనిని వైద్య పరిభాషలో మై కార్దియల్ఇంఫ్రాక్షన్ అని అంటారు. ఆసమయంలో వ్యక్తిలో కలిగే  లక్షణాలని బట్టి మనం గుండె పోటు అని అంటున్నాము.గుండె పోటు వచ్చిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతలు...గుండె పోటు సమయంలో తగిన జాగ్రత లు తీసుకుంటే మనిషి బతికి బయట పడితే మెత్తగా అయిన గుండె కండరం కొన్ని వారాలకు మచ్చలాఅయి క్రమేపి తరువాత గట్టి పడిపోతుంది. హార్ట్ అట్టాక్ వచ్చినప్పుడు ఎలాంటి బాధ ఉంటుంది... హార్ట్ అట్టాక్ వచ్చినప్పుడు మనుషులు బాధ పడే విధానాలు వేరు వేరుగా ఉన్నా కూడా ఆ సమయాన సహజంగా కనిపించే ముఖ్య లక్షణం.చాతిలో నొప్పి ఇంగ్లాండ్ లో ప్రతియేటా 2,5౦,౦౦౦ మంది గుండె పోటు కు గురిఅవుతున్నట్లు అంచనా. వారిలో 1,6౦.౦౦౦ మంది మృత్యు వాత పడుతున్నారు.అమెరికాలో ప్రతి ముగ్గురిలోనూ ఒకరు గుండె పోటు కు గురి అవుతున్నారు. అభివృ ద్ది చెందిన దేశాలలో మనుషుల మరణాలకు గుండె పోటు ముఖ్య కారణంగా ఉంటుందంటే అతిశయం కాదు వాస్తవం అని అంటున్నారు నిపుణులు.గుండె చుట్టూ ఉండే కరోనరీ ధమనులలో ఏ ఒకాటన్నా బ్లడ్ క్లాట్ మూలంగా పూడుకు పోయినప్పుడు గుండె కవాటానికి వెళ్ళాల్సిన ముఖ్యమైన రక్త సరఫరా ఆగిపోయి గుండె కండరపు కణజాలం నసిన్చిపోతుంది.   గుండె పోటు లక్షణాలు / చాతి నొప్పి తీవ్రతకు గుండె పోటు తీవ్రతకు సంబంధం ఉందా? సడన్ గా చాతి మధ్య భాగం లో నొప్పి రావడం. హార్ట్ అట్టాక్ ముఖ్య లక్షణం.నొప్పి యాంజైనాలో లాగానే చాతీ మీద బరువుగా ఉన్నట్లు నొక్కి పెడుతున్నట్లు గా ఉండవచ్చు.యాంజైనా నొప్పి పది ఇరవై నిమిషాల లోపు తగ్గిపోతుంది. అలాగే చేస్తున్న పనిని ఆపేసి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది.కాని హార్ట్ అట్టాక్ నొప్పి అలా కాదు.రెస్ట్ తీసుకుంటున్న సమయంలో కూడా రావచ్చు రాగానే రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గదు. విడవకుండా అరగంట దాకా నొప్పి వచ్చిందంటే దానిని పూర్తి స్థాయి హార్ట్ అట్టాక్ కింద తీసుకోవచ్చు.చాతి భాగాన తిమ్మిరి ఎక్కుతున్నట్లు లేక సూదితో పొడుస్తున్న అనుభూతి ఉంటుంది.నొప్పి క్రమంగా భుజాలకు,మెడ వైపుకు,చేతులకు వ్యాపించ వచ్చు. ముఖ్యంగా నొప్పి ఎడమ భుజం నుంచి వ్యాపించి మోచేయి వద్ద ఆగిపోవచ్చు.నొప్పి తీవ్రంగా ఉంటె తీవ్రమైన గుండెపోటు వచ్చినట్లుగా అనుకోవాల్సి న పనిలేదు. ఒక్కోసారి స్వల్పమైన నోప్పి తో నే తీవ్రమైన గుండెపోటు రావచ్చు. కాబట్టి చాతి నొప్పి తీవ్రతకు గుండె పోటు తీవ్రతకు సంబంధం లేదు.కొన్ని సందర్భాలలో అసలు నొప్పి అనేదే లేని హార్ట్ అట్టాక్స్ కూడా ఉంటాయి. అవి ముఖ్యంగా డయాబెటిస్, వ్యాధి గ్రస్తులకు వ్రుధులకు వస్తూ ఉంటాయి.చల్లటి చెమటలు పోయటం హార్ట్ అట్టాక్ లోని మరో ముఖ్య లక్షణం.తేమలటం,వాంతి తో పాటు శరీరం చచ్చు బడ్డట్లు గా మరీ బలహీనంగా అనిపిస్తుంది. ఊపిరి ఆడక పోవడం,అందక పోవడం తల తిరుగుతున్నట్లు,స్పృహ కోల్పోతున్నట్లు కూడా అనిపించ వచ్చు.చచ్చి పోబోతున్నట్లు లేక ఎదో విపత్తు జరగ బోతోంది. అన్న ఫీలింగ్,ఆందోళన కలగ వచ్చు.ఒక్కో సారి ఛాతీ నొప్పి అనేది లేకుండా ఈ చెప్పిన లక్షణా లాతో పాటు మాత్రమే హార్ట్ అట్టాక్ వస్తుంది.హార్ట్ అట్టాక్ రావడానికి  కొన్ని వారాలముందు ఏ కారణమూ లేకుండా అలసట ఊపిరి అందక పోవడం అంతకు మునుపు ఎన్నడూ లేని అజీర్ణం లాంటి లక్షణాలు.కనిపించ వచ్చు. ఉదయం వేళలో గుండెపోటువస్తోందికారణం... సహజంగా మనం చూస్తున్న మరణాలలో ఉదయం వేళలో నే ఎక్కువమంది సెలబ్రేటీ లు ఉదయం వేళలో హార్ట్ అట్టాక్జ్స్ తో మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు వెల్లడించారు. ప్రమాద భరితమైన గుండెపోటు ఎక్కువగా ఉదయాన 7 నుంచి 11 గంటల మధ్యనే వస్తుందని ఒక పరిశీలనలో వెల్లడైయ్యింది.ఇందుకు కారణం బహుశా రాత్రంతా రెస్టు తీసుకున్న శరీరం పగలు చేయాల్సిన పనులకు సన్నద్ధం అవుతున్న క్రమం లో ఒత్తిడి కి లోనవుతున్నందునే ఉదయం హార్ట్ అట్టాక్స్ వస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ సమయం లో నే అంతకు మునుపు దాకా ప్రశాంతం గా ఉన్న బిపి,గుండె చలనాలు వేగవంతం కావడం మొదలెడతాయి.అలాగే ఈ సమయంలోనే రక్తం తాలూకు ప్లేటిలేట్స్ గడ్డ కట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దానాదీనా మనిషి మీద పడే హార్ట్ అట్టాక్స్ కు కారణాలు ఇవీ అయ్యి ఉండవచ్చు. మీ వయస్సు 4౦ ఏళ్ళు పైన ఉన్నాయా ? ఛాతీలో మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా ? చాతీ ఎముకకు వెనక వైపున అజీర్ణం గ్యాస్ కి చెందిన మంట లాంటి ఫీలింగ్ అనిపిస్తే గ్యాస్ కాదు అది హార్ట్ అట్టాక్ అయ్యిఉండవచ్చు.ఎ మాత్రం అశ్రద్ధ చేసినా అది హార్ట్ అట్టాక్ కు దారి తీయ వచ్చు. చాతీ లో ని ఈ నొప్పి బరువుగా ఉండి. అక్కడి నుంచి ఎడమ భుజం ఆకింద మోచేతి దాకా వ్యాపిస్తుందా ?.చాతి నొప్పితో పాటు చెమటలు పోసి ఊపిరి అందనట్లుగా అనిపిస్తోందా ?నొప్పి పైన పేర్కొన్న విధంగా ఉంటె అది మీ గుండెకు రక్త సరఫరా అందక పోవడం వల్ల వచ్చినదై ఉంటుంది.మీకు 4౦ ఏళ్ళు ఉండి మీ కుటుంబీకులలో ఎవరికన్నా బీపి గుండె జబ్బులు డ యాబెటిక్స్ లాంటి వ్యాధులు చరిత్ర మీకు ఉంటె తప్పనిసరిగా మీరు కార్డియాలజిస్ట్ ను కలిసి ఇ సి జి టెస్ట్ ను చేయించుకోవడం అవసరం.ఇ సి జి టెస్ట్ నార్మల్ గా ఉండి పైన చెప్పిన లేదా పేర్కొన్న లక్షణాలు మీలో ఇంకా కొనసా గుతుంటే. స్ట్రెస్ టెస్ట్ నుకూడా చేయించు కొండి. హార్ట్ అట్టాక్ కు సొంత వైద్యం... హార్ట్ అట్టాక్ రాగానే లేచి కూర్చోడం మంచిది. లేదా దిళ్ళకు అంటే తలగడా కు ఆనుకుని కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల గుండె మీద ఒత్తిడి కొంత తగ్గుతుంది. హార్ట్ అట్టాక్ ఎవరికీ వస్తుంది... స్త్రీలకంటే పురుషులకు ఎక్కువగా వస్తుంది.అయితే స్త్రీలకు మెనోపాజ్ దశ వచ్చి వాళ్ళలో హార్మోన్లు ఉత్పత్తి తగ్గిపోవడం ప్రారంభించగానే వాళ్ళకు హార్ట్ అట్టాక్ రావడానికి అవకాశాలు ఎక్కువ అవుతాయి. అక్కడి నుంచీ వాళ్ళు హార్ట్ అట్టాక్ విషయం లో పురుషులతో పోటీ పడతారు.పొగతాగని వాళ్ళ కంటే పొగ తాగే వాళ్ళకు ఎక్కువగా హార్ట్ అట్టాక్స్ వస్తాయి.హార్ట్ అట్టాక్ తో చనిపోయిన వారి పిల్లలకు వార సత్వంగా సంక్రమించ వచ్చువయస్సు మీద పడుతున్న కొద్దీ అంటే 5౦ ఏళ్ళు పై బడ్డ వాళ్ళకు హార్ట్ అట్టాక్ రావడానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ౩౦ నుంచి5౦ ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళకి కూడా ఈ మధ్య కాలం లో హార్ట్ అట్టాక్స్ రావడం పెరుగిపోతున్నాయి. ముఖ్యంగా ఎవరికీ వస్తుంది?... స్థూల కాయులకు హై పర్ టెన్సన్ బిపి తో బాధపడుతున్న వాళ్ళ కు హార్ట్ అట్టాక్ వస్తుంది. డయాబెటీస్ వ్యాధి గ్రస్తులకు హార్ట్ అట్టాక్స్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు ఉద్రేక పూరితంగా ఉండే వారికి చీకు చింత చికాకు ఉండేవాళ్లకు హార్ట్ అట్టాక్ వచ్చే అవకాశం ఉంది. థాయ్ రాయిడ్ వ్యాధి ఉన్న వాళ్ళకి హార్ట్ అట్టాక్స్ వచ్చే అవకాశం ఉంది. హార్ట్ అట్టాక్ వల్ల వచ్చే అనార్ధాలు... గుండె కండరానికి జరిగిన డ్యామేజ్ తీవ్రంగా ఉంటె అది హార్ట్ ఫెయి ల్యూర్ కి దారి తీయవచ్చు. దీనికారణంగా గుండె క్రమ బద్ధత లేకుండా అపసవ్యంగా కొట్టుకోవచ్చు.  ARRHYMIAS అంటారు. గుండె పంప్ చేసే సామర్ధ్యం మీద దీనిప్రభావం ఉంటుంది.గుండె పోటుతో మరణించిన మరణించిన పేషంట్లలో చాలా మంది మరణానికి ముందు కొన్ని ఘంటల పాటు VENTRICULAR FIBRILLATION అన బడే గుండె దడ తో బాధ పడినట్లుగా పరిశీలనలు చెపుతున్నాయి. అయితే పేషంట్ ను సకాలం లో హాస్పిటల్ కు తీసుకెళ్తే డాక్టర్ దీనిని సరి చేయగలరు.హార్ట్ అట్టాక్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి?...మీ ఎదురుగా ఉన్న వ్యక్తి కి...తీవ్రమైన చికాకు ఆందోళన తో కనిపిస్తే.విపరీతంగా చెమటలు పోస్తుంటే.మొహం తెల్లగా పాలిపోతుంటే. ఊపిరి అందక ఇబ్బంది పడిపోవచ్చు.ఇది మామూలే అప్పుడప్పుడూ వచ్చి పోతూ ఉంటుంది అంటూ తోసి పాడే యకండి. సహజంగా పేషంట్ ఆసుపత్రికి వద్దు అంటూ ఉంటారు ఒక మిత్రునిగా స్నేహితునిగా అంబు లెన్స్ ని పిలవడం,లేదా మీకు అందుబాటులో ఉన్న కారులో కార్డియాక్ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళండి. ఆ వ్యక్తి స్పృహ కోల్పోయి ఉంటె మీకు సి పి ఆర్ అంటే కార్డియో పల్మనరీరిసుస్ సిటేషన్ నోటితో అతని నోట్లోకి గాలిని ఊదడం.చేతులతో చాతీని నొక్కి పెట్టడం లాంటి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్ మెంట్ ని పాటించాలి. అసలు హార్ట్ అట్టాక్ వచ్చిన లక్షణాలు ఉన్నవారికి సరైన సమయం లో సహకారం అందిస్తే బతికి బట్ట కట్టవచ్చు.  గుండె రక్తనాళాలపై కరోనా దెబ్బ  వర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి ఫిబ్రవరి 22: కరోనా వైరస్‌.. గుండెలోని సూక్ష్మ రక్తనాళాలను ఇన్ఫెక్ట్‌ చేయకుండానే వాటిని తీవ్రంగా దెబ్బతీస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ (యూకే) పరిశోధకుల బృందం అధ్యయనంలో తేలింది. తమ పరిశోధనలో భాగంగా.. గుండెలోని సూక్ష్మ రక్తనాళాలను కప్పి ఉంచే పెరిసైట్స్‌పైకి కరోనా వేరియంట్లన్నింటినీ ప్రయోగించారు. కానీ, అవేవీ పెరిసైట్స్‌ను ఇన్ఫెక్ట్‌ చేయలేకపోయాయి. అయితే  కేవలం స్పైక్‌ ప్రొటీన్లను ప్రయోగించినప్పుడు మాత్రం.. ఆ ప్రొటీన్లు ఎండోథీలియల్‌ కణాలతో సంభాషించకుండా పెరిసైట్లను నియంత్రించడమే కాక, వాపును కలిగించే సైటోకైన్లను స్రవించేలా చేసినట్లు పరిశోధకులు గుర్తించారు. కరోనా సోకిన రోగుల్లో ఉండే  స్పైక్‌ ప్రొటీన్లు, మొత్తం రక్తప్రసరణ వ్యవస్థ అంతా ప్రయాణిస్తూ అన్ని అవయవాలనూ దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తమ అధ్యయనాన్ని ‘క్లినికల్‌ సైన్స్‌’ జర్నల్‌లో వారు ప్రచురించారు. కాగా అపోలో ఆసుపత్రికి చెందినా కార్దియాక్  సర్జన్ పద్మశ్రీ డాక్టర్ గోకలే మాట్లాడుతూ దివంగత మంత్రి గౌతం రెడ్డి కి రక్తం గడ్డ కట్టడం వల్లే మరణించారని అన్నారు. అయితే మంత్రి గౌతం రెడ్డి కి ఒకసారి గుండె పోటు వచ్చిందా అన్న సందేహం కలుగుతుందని హార్ట్ అట్టాక్ ఒక్కసారిగా రాదనీ హెచ్చరిక చేస్తుందని మనం ఆసంకేథాన్ని గమనించకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే తీవ్రగుండే పోటు కు దారి తీస్తుందని అంటున్నారు.ఇదిలా ఉంటె మాన్ శరీరం రాత్రి నిద్ర పోతుందని అనంతరం నిద్ర లేవగానే శరీరం డీ హైడ్రే షణ్  వల్ల రక్తప్రసారం సరిగా లేకపోయినా రక్తం చిక్కపదిపోతుందనిఅనుతున్నారు. ఈ క్రమంలో ఉదయం లేచిన తరువాత మంచి నీళ్ళు తీసుకోవాలని రక్తం చిక్కబడ కుండా రక్త ప్రసారం సరిగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు                                        

read more
ads
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
నాడీపతి  వైద్యం అంటే ...

నేడు సామాన్యులకు వైద్యం ఆర్ధికంగా భారంగా మారింది. మోయలేనిభారం కావడం తో ప్రజలు ప్రత్యామ్నాయ వైద్యం పై ఆధార పడుతున్నారు. ఈ ప్రక్రియలో శస్త్ర చికిత్స లేకుండా మందులు లేకుండా దీర్ఘ కాలిక వ్యాధులకు ప్రత్యామ్నాయ వైద్యం ముఖ్యంగా ప్రాకృతిక వైద్యం లేదా ప్రత్యామ్నాయ వైద్యం పై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపధ్యం లో నాడీ పతి వైద్యం చరిత్ర దాని ప్రాసస్త్యం  గురించి తెలుసుకుందాం. నాడీ వైద్యం గురించి... మన పూర్వీకులు ఒక సామెత చెపుతూ ఉండేవారు. ఆరోగ్యమే మహా భాగ్యము. అది మన దీర్ఘ కాలం జీవిం చేందుకు ఉపయోగ పడుతుంది. అని అంటారు. వ్యక్తి కి ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకుంటే వృధా, కొందరికి అన్నీ ఉంటాయి అలాగే రోగాలు ఉంటాయి. కన్నీ అనారోగ్యం కారణం దేనిని అనుభవించ లేరు.ఇలాంటి దీర్ఘ కాలిక వ్యాధులకు మన పూర్వీకులు మనకు అందించిన  అత్యంత పురాతన వైద్యం నాడీ పతి అంటున్నారు ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు.నాడీ పతిలో దాదాపు ౩౦౦ కు పైగా చికిత్సలు ఉన్నాయని అంటునారు వీటితో రిగాన్ని పూర్తిగా నయం చేయలేమని కేవలం ఉపసమనం కల్పించడం లేదా దీర్ఘకాలికంగా మార కుండా నియంత్రించ వచ్చని డాక్టర్ కృష్ణం రాజు వివరించారు. వాస్తవానికి మనం జీవితాన్ని అనందం గా విజయవంతంగా జీవించవచ్చు. అయితే మన శరీరం అలిసిపోతోంది.అనారోగ్యానికి గురి అవుతుంది. ఈ కారణంగానే మనిషికి జీవించడం కష్టంగా మారుతోంది.ఇందులో ఈ మధ్య కాలం లో ఎన్నోరకాల తెరఫీ విధానాలు అందుబాటులోకి రావడం తో తిరిగి మనజీవితాన్ని తిరిగి పొందవచ్చని నాడి పతి చికిత్స నిపుణులు   డాక్టర్ పి కృష్ణంరాజు తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు. ప్రత్యామ్నాయ తెరఫీలలో హోమేయో పతి, అలోపతి, ఆయుర్వేద, యునాని పద్దతులు అందుబాటులో ఉన్నాయని.ప్రాచూర్యం పొందిన తెరపి పద్ద తులలో నాడీ పతీ ఒకటిగా చేపవచ్చని డాక్టర్ కృష్ణం రాజు వివరించారు.ఇతర ప్రభావ వంతమైన తెరఫీ అయినప్పటికీ పెద్దగా ప్రాచుర్యం లేకపోవదం పట్ల ఆవేదన వ్యక్తం చేసారు.కొన్ని వేల సంవత్సరాల క్రితం బౌతిక శరీరం అనారోగ్యానికి గురి అయినప్పుడు. వారు సూక్ష్మ శరీరానికి చికిత్స చేసేవారు. అప్పుడు శారీరకంగా ఆరోగ్యంగా ఉండేవారు.మళ్ళీ సూక్ష్మ శరీరామ్ వల్ల శరీరం తో ఏర్పడిన భౌతిక శరీరం ఆరోగ్యంగా ఉండేది.సూక్ష్మ శరీరం 2,72,౦౦౦ నాడులతో తయారు చేయబడిందని వాటిని పరీక్షించిన తరువాతే  పాత వ్యాధులకు  నివారణ చికిత్స సాధ్యమని అన్నారు నాడీ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణం రాజు  స్పష్టం చేసారు ఇటీవలి కాలం లో వ్యాధి ని పూర్తిగా నివారణ చేయాలంటే కేవలం నాడులను సరి చేస్తే చాలని అంటున్నారు అలాగే అన్ని వైద్య విధానాలాలో ఇచ్చినట్లుగా నోట్లో వేసుకునే మందులు ఇవ్వబోమని. ఇటీవలి కాలం నాడీ తెరఫీ ని ప్రత్యామ్నాయ చికిత్సగా పేర్కొనడం తో మనం మందుల వల్ల వచ్చే కొన్ని రకాల రీయాక్షన్స్ వస్తాయని నాడీ వైద్యంలో ఎలాంటి రీయాక్షన్స్ ఉండవని అంటున్నారు నాడీ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణం రాజు. నాడీ పతి ని అందుబాటులోకి తెచ్చినప్పుడు ఎన్నో సందేహాలు లేవనేత్తారని ఇదెలా సాధ్యమని కనుబొమ్మలు ఎగరేశారుతమలో తాము గోణుక్కున్నారని  అని అన్నారు.నేడు నాడిపతి ప్రత్యామ్నాయ వైద్యంగా ఎదిగిందని ఎలాంటి మందులు అవసరం లేకుండానే నాడీ పతి వైద్యం చేయవచ్చని అంటున్నారు డాక్టర్ పి కృష్ణం రాజు నాడీ వైద్యం లో షుమారు 18 సంవత్సరాల నాడీ వైద్యం అనుభవం గడించామని. మరెన్నో వ్యాధులకు నాడీ పతి లో పరిశోదనలు  చేపట్టినట్లు తెలుగు వన్ కి తెలిపారు. నాడీ వైద్యం చరిత్ర... నాడీ వైద్యం మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప ప్రక్రియ గా పేర్కొన్నారు. కాగా కొన్ని6౦,౦౦౦ సంవత్సరాల క్రితం రాజులు పరిపాలించే వారని ఈ భూమిపై జీవించేందుకు వారి వారి శరీరం పై ఏమాత్రం శ్రద తీసుకునే వారు కాదని. 4౦,౦౦౦ సంవత్సరాల తరువాత అంటే క్రీస్తు పూర్వం భారతదేశానికి చెందిన మునులు, సిద్ధులు,యోగులు, రెండు రకాల శరీరాలను కనుగొన్నారు. అది ఒకటి బౌతికమైనది,రెండవది సూక్ష్మమైనది గా పేర్కొన్నారు. బౌతిక శరీరం కనిపిస్తుంది. మరొకటి మనశరీరంలో 2,72,౦౦౦ నాడులు  బౌతిక దేహానికి అనుసంధానం చేయబడి ఉంటాయని తెలిపారు. నిపుణులు కనుగొన్న మరో అంశం ఏమిటి అంటే సూక్ష్మ శరీరం ఆధారం గా నే వీటి మధ్య తేడా తెలుస్తోంది. కాగా సూక్షం శరీరానికంటే ముందు బౌతిక శరీరం ముందుకు వస్తుంది ఈ పరిణామ క్రమం లోనే 72వేళా నాడుల తో పాటు ౦7 నాడులు చక్రాలు సూక్ష్మ శరీరంలో  ఉంటాయని కనుగొన్నారు. అలాగే వీటిని కలుపుతూ నాడీ కేంద్రాలు సూక్ష్మ శరీరానికి కలపబడి ఉంటాయి. అవి మన అరచేతులు మడమలు అరికాళ్ళలో అవి సమగ్రంగా  పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. మనశరీరంలో ఉన్న నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకుంటే మనం అనారోగ్యం పలు కాక తప్పదు.అని నిపుణులు అంటున్నారు. వ్యాధి ఎలా విస్తరిస్తుంది... వ్యాధి రెండుకార ణాలని తేల్చారు. రెండు మార్గాలలో వస్తుందని నిర్ధారించారు. వ్యాధి క్రమంగా పెరగడం, త్వరగా పెరగడం. నాడీ వైద్యం మనదే అనేందుకు మన పురాణాలే సాక్ష్యం... నాడీ వైద్యం మనదే అని మన పూర్వీకులు దీనిని కనుగొన్నారని దీనికి ఆధారం గా మన పురాణాలను ఆధారాలుగా చూపవచ్చని అంటున్నారు డాక్టర్ కృష్ణం రాజు ఇందుకు ఉదాహరణ గా క్షీర సాగరమదనం చేసినప్పుడు. వెలువడ్డ విషం నుండి కాపాడేందుకు ధన్వంతరి వచ్చాడని. అప్పుడే అమృతం తెచ్చాడని. ఆ సమయం లో  దేవతలకు చేసిన వైద్యమే నాడీ వైద్యమని. నాడి ని తిరిగి పురుద్ద రించేందుకు శరీరాన్ని బౌతిక,సూక్ష్మ శరీరాల ద్వారా నాడీ వ్యవస్థను క్షుణ్ణంగా తెలుసుకోవడం ద్వారా ఒక వ్యక్తిలో ఉన్న అనారోగ్య సమస్యలు,శారీరక స్థితి, మానసిక స్థితిని అంచనా వేయవచ్చని అతనికి దీర్ఘకాలం పాటు ఎదుర్కునే వైద్య సమస్యను  సైతం కనిపెట్ట వచ్చని  అంటున్నారు. నాడీ వైద్యం ఒక చారిత్రక ఆధారం... నాడీ వైద్యం అందే మన భారతీయులు మన పూర్వీకులు మనకు అందించిన వరమని అన్నారు.క్రీస్తుపూర్వం మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ రాజధానిగా దేశాన్ని పరిపాలించమని అంతర్గత యుద్దాలలో మన సంపదను ఒక చోట బద్ర పరిచామని యుద్ధసమయంలో మన ఆయుర్వేద గ్రంధాలు కొన్ని తస్కరించారని మరికొన్ని తగుల పెట్టరాని ఇప్పుడు ఈ వైద్య ప్రక్రియా మాదే అని అంటున్నారని డాక్టర్ కృష్ణం రాజు అన్నారు.యోగులు సిద్ధులు చరకుడు,సంహితుడు మనకు అందించిన వైద్య ప్రక్రియ మనకు వరమని నేడు మనపూర్వీకులు మనకు మాత్రమే సాధ్యమైన నాడీ వైద్యాన్ని ప్రజలకు అందించేందుకు తీవ్రమైన కృషి చేస్తున్నామని డాక్టర్ కృష్ణం రాజు పేర్కొన్నారు.మరో సంచికలో నాడీ పతి చికిత్స నిర్ధారణా చేసే నాడీ పరీక్ష/ నాడీ వైద్యానికి మందులుఅవసరమా /చికిత్స పద్దతులు పరిశోదన అంశాలు పూర్తిగా అందిచే ప్రయత్నం చేస్తాము.   

read more
సర్జన్ లేకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయవచ్చా ?...

  అండగా ఉండాలని చూడగానే ఆకట్టుకునే అంగసౌష్టవం కావాలని ఎవరికీ ఉండదు చెప్పండి. అలాగాని శాస్త్రీ యత లేని క్రీములు ఇంజక్షన్లు వాడారో అంతే మీరు మీ సౌందర్యం దేముడెరుగు శరీరం ముఖం చచ్చుపడి పోకుండా చూసుకోండని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఈ మధ్యకాలం లో ఆధునిక యుగం లో చర్మ సంరక్షణ చికిత్స లు చాలా ప్రభావ వంతంగా ఉంటున్నాయి.ముఖ్యంగా కత్తి, నీడిల్ లేకుండానే సర్జరీలు చేసేస్తున్నారు.అది ఎలా అని అనుకుంటున్నారా అసలు కాస్మెటిక్ పద్దతులు చాలా ప్రాచుర్యం లో ఉన్నాయి. ఇప్పటికేగత సంవత్సరం లో  6.9 మిలియన్ల ప్రజలు  చికిత్సలు చేయించుకున్నారు. మీకు సరైన్స సమయం డబ్బు లేకుంటే మీఊబకాయాన్ని మీ పొట్టను తొలగించాలంటే క్లినికల్ పద్దతికి వెళ్ళాల్సిందే. సౌం దర్య సాధనాలను ఉత్పత్తి చేసే సంస్థలు నలుగు రకాల చికిత్స పద్దతుల లతో కూడిన ఉత్పత్తులను అందిస్తున్నాయి. వీరు అందించే అనాలుగు ఉత్పత్తులు ఏమిటి?... బొటో క్స్, కాల్లజెన్ ఇంజక్షన్స్, మైక్రో డెర్మఅబ్రేషణ్, లేదా కెమికల్ పీల్స్, దీనిని ఎదుర్కోడానికి దాదాపు గా ఏరకమైన ఊహాత్మక ప్రిస్కిప్షన్ లేదా బలం చేకూర్చే కొన్ని రకాల పదార్ధాలు చూసినప్పుడు మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కాగా ఈ పద్దతికి డాక్టర్స్ అవసరం లేదా అంటే ఈ సమాధానం చూస్తే మీకే ఆశ్చర్యం కలగక మానదు. ఫాక్స్ బోటక్స్...డాక్టర్స్ ఆఫీస్ లో... బొటో క్ష్ను ప్రాధమిక స్థాయిలో బ్రౌ ఫుర్రోస్  కు మధ్య వినియోగిస్తారు.కాగా ఇది ఒక ప్యూరిఫైడ్టాక్సిన్ ను ఇంజక్ట్ ను  మీ ముఖం లోని కండరాలకు ఎక్కిస్తారు. దీనిధర 4౦౦$ ఉంటుంది. అమెరికన్ సొసైటీ ఇచ్చిన వివరాల ప్రకారం ఏస్తటిక్  ప్లాస్టిక్ సర్జరీ గా పేర్కొన్నారు. ఇది చాలా తగ్గింపు ధరలో సాధారణ ధరలో  అన్ని రకాల పద్దతులలో అందుబాటులో ఉంటుందని తెలిపారు.దీనిని ఒకరంగా పెరలైజ్ చేయడం వల్ల సంప్రదించరు. ఇంటి వద్దే చికిత్స... ఉత్పత్తి దారులు బొటో క్ష్ను క్రీం  పద్దతిలో వాడడం వల్ల మంచి ఫలితాలు రెండువారాల్లో ఉంటాయని. లేదా రెండు నెలలలు ప్రతిరోజూ వాడండి ఈ పదార్ధం చాలా ప్రభావ వంతం గా  పనిచేస్తుంది. హెక్ష పెప్ట యిడ్, లేదా ౩ అచటి థెక్ష పెప్టైడ్ ౩ పేరుతో ఉత్పత్తి చేస్తున్నామని ఉత్పత్త్తి దారులు తెలిపారు కాగా ఇందులో వినియోగించే సబ్ స్టాన్ సెస్ కండరాల్ లోకి ఇంకిపోతాయి. ఎంజయం ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఎంజాయిం కాంట్రాక్షన్ కు అవసరం కొన్ని సందర్భాలలో ఇది వికటిస్తే ముఖం కదలకుండా సమస్య లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎస్ సి ఓ టో పికల్ బొటో క్ష్ ... ఎస్ సి ఓ టో పికల్ ఇంఫ్యుజన్ 76 $జువామెడిస్పాస్ పెప్ టైడ్ ఐ లిఫ్ట్ క్రీం 65$డాలర్ల తో ఉత్పత్తులు అందిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం... మీ శారీరక సౌందర్యాన్ని అందాన్ని మరింతగా పెంచే మోఇస్చ రైజర్స్ వాడండి. మీకంటి కింద చారలు,ముడతలు ముఖ్యంగా డ్రై స్కిన్ అంటే పొడిబారిన చర్మం మీకు తెలిపిన ఉత్పత్తులు అన్నీ కూడా మీ ముఖం లోని కండరాలకదలిక లను నిలిపి వేస్తాయి.  ప్రెసిడెంట్ ఎలెక్ట్ అమెరికన్ సొసైటీ కి చెందినా ర్హోడా ఎస్ నారిన్స్ ఎం డి డెర్మటాలజీ సర్జరీస్ ఒక టోపికల్ క్రీం ద్వారాచర్మం లో ఉండే  అన్ని లేయర్స్ ఇందులో ఉండే కణాలు రక్తనాళాలు కండరాలలోకి  నీడిల్ వెళ్ళినంత లోతుగా ఏ క్రీం వెళ్ళదని నారిన్స్ ఇతరులు ఇతనిపుణు లు మాట్లాడుతూ దీనికి ఏరకమైన సాక్ష్యాలు లేవని హెక్షపెప టై ట్  ౩ వల్ల పూర్తిగా చచ్చుబదిపోతాయని తెలిపారు. అందం కోసం సౌందర్యం కోసం  క్రీములు వాడారో అంతే --- సర్జన్ లేకుండానే ప్లాస్టిక్ సర్జరీ చేస్తే సమాస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు.      

read more
సామాన్యుడి  ప్రశ్న..నిపుణుల సమాధానం..

మీరు వైద్య చికిత్స కు సంబందించిన సందేహం ఏదైనా సరే మా నిపుణులు మీకు సమాధానం ఇస్తారు. ప్రశ్న1 ) నేను రాత్రి పూట ధరించే కాంటాక్ట్ లెన్స్ గురించి విన్నాను పొద్దున్న కాంటాక్ట్ లెన్స్ లేకుండా ఎలా ఉండగలం అసలు అవి విలు వైనవేనా ఉపయోగపడతాయా?  జవాబు ....వీటిని డాక్టర్స్ దీనిని రిఫ్రాక్టివ్ తెరఫీ లో ఈ లెన్స్ ను వాడతారు.యు ఎస్ ఎఫ్ డి పాలనా విభాగం జూన్ 2౦౦2 లో అనుమతిం చారని తెలిపారు.  అవి ఎలా పని చేస్తాయి....ఇవి చాలా ప్రత్యేక మైనవి దృడంగా ఉంటాయి. పారగమ్యమైన లెస్స్ గా పేర్కొన్నారు. కంటి కి ముందు భాగం లో ఉండే కార్నియా ఉండే విధంగా అదే ఆకారం లోగుండ్రంగా ఉంటుంది. దీనిని మీరు నిద్రకు ఉపక్రమించే ముందు మీరు ధరించండి. దీనిని ప్రతిరోజూ నెల లేదా రెండు నెలలు  ధరించండి . మీరురోజు మొత్తం కూడా మీరుమీ కళ్ళ అద్దాలు లేకుండా  భయపడకుండా గడప వచ్చు. కాంటాక్ట్ లెన్స్ ఎలా వేసుకోవాలో మీ దగ్గరలోని డాక్టర్ ను సంప్రదించి ఎలా వేసుకోవాలో అసలు మీకు అవసరమో కాదో పరీక్షలు చేయించుకుని వాడ వచ్చు.కాంటాక్ట్ లెన్స్ వేసుకున్న వాళ్ళకు చాలా దగ్గరలోదూరపు చూపు, లేదా దగ్గర చూపు కు దగ్గరలో ఉన్నవారికి ఎవరైతే బైఫోకల్ అద్దాలు వాడుతున్నారో. వారికి సి ఆర్ టి లెన్స్ ద్వారా వారి దృష్టి లోపాన్ని  అంటే దూరపు చూపు సరిదిద్దేందుకు అలాగే దగ్గరి చూపు ముఖ్యంగా రీడింగ్ గ్లాస్ పై మరిన్ని పరిశోదనలు చేయాల్సి ఉంది. కాగా దీనివల్ల దీర్ఘ కాలం లో కార్నియా పై ఎలాంటి  ప్రభావం,వివిదరకాల సమస్యలు  ఉంటాయి అన్న  అంశం పరిశీలించాల్సి ఉంది.  కొన్ని రకాల ఫిర్యాదులోచూపు సరిగా లేకపోవడం  మబ్బుగా అస్పష్టం గా ఉండడం, కంటిలో నీరు లేక పోవడం కళ్ళు ఎందిపోయినట్లుగా డ్రై గా ఉండడం వంటి సమస్యలు ఇతర రకాల లేన్సెస్ లో కూడా వస్తాయి. ఇక ఉదయం వేళ మీ కంటి చూపుకు కాస్త విముక్తి లభించినట్లే అని అంటున్నారు.అయితే కంటికి సంబందించిన రక రకాల వస్తువులు చాలా తక్కువధరకు రావు. ముఖ్యంగా సి ఆర్ ఐ లేన్సెస్ గతం లో ఉన్న వాటికి బదులుగా మార్చారు. దీని ధర దగ్గరదగ్గర 1౦౦౦ $అంటే దీనికి దాదాపు పదిరెట్లు దీనిధర రోజూ మీరు వాడే చాలా బలమైన కాంటాక్ట్స్ అవి ఇన్సూరెన్స్ పరిధిలోకి రావు. ఇన్ఫెక్షన్లు...ప్రశ్న2 ) నేను మా డాక్టర్ సూచించిన సలహాలను అనుసరిస్తాను అయినా నాకు బ్లాడర్ లో ఇన్ఫెక్షన్ వేదిస్తోంది.నేను ఏమిచేస్తే  సమస్య  నుండి బయట పడగలను? అందుకు ఏమి చెయ్యాలి? జవాబు...ఇప్పటికీ డాక్టర్స్ వివరించలేని అంశం ఏమిటి అంటే యాంటి బాయిటిక్స్ కొన్ని సార్లు పనిచేయవు ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం రాదు. ముఖ్యంగా బ్లాడర్ ఇన్ఫెక్షన్ ను నివారించడం లో విఫల మయ్యాయి. మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. దీనికి కారణం ఆలోచిస్తే బ్లాడర్ లో బ్యాక్టీరియా వల్లే ఇన్ఫెక్షన్ కు కారణం గా గుర్తించారు. అయితే ఇటీవల జరిగిన పరిశోదనలో మళ్ళీ మళ్ళీ వచ్చే  కొన్ని రకాల ఇంఫెక్షన్లకు కారణం బ్యాక్టీరియాయే కారణం కొన్ని సందర్భాలాలో వారు వాడే ప్యాడ్స్ అంటే బయో ఫిలింక్లింగ్స్ బ్లాడర్ వాటి చుట్టూ కొన్ని రకాల క్రిములు పెరుగు తాయి. యాంటి బాయిటిక్స్ మీ శరీరం లో ఉన్న రోగనిరోధక శక్తి ఎలా స్పందిస్తోంది స్వతహాగా రాండం గా పోడ్ తెరుచుకుని ప్రనిజం ను విడుదల చేస్తాయి.ఒరగానిజం కారణం గానే మరో ఇన్ఫెక్షన్ ఇలాంటి పరిశోదనలు చాలా ప్రభావ వంతమైన తెరఫీస్ కు కనుగొనవచ్చు అని అంటున్నారు నిపుణులు. మీకోసం ఇపుడు చాలా నాణ్యత తో కూడిన సలహా ఏమిటి అంటే... ఇన్ఫెక్షన్ నివారణకు యాంటి బాయిటిక్స్ తీసుకుంటూనే ఎక్కువగా రసాలు తీసుకోండి పరిశుబ్రం పాటించండి. 64 ఔన్సుల్ మంచి నీరు. 1౦ ఔన్సుల క్రంబెర్రీ రసం రోజూ తీసుకోండి. సోయా మంచిదేనా ? ప్రశ్న౩) నాకు వేరుసేనక్కాయలు అంటే పల్లీ తింటే ఎలర్జీ, మరి నేను సోయా తినవచ్చా ?జవాబు....ఇవి దాదాపు గుల్లగా ఉండే అల్పాహారామే వీటిని పప్పులు గానే భావిస్తారు. వాస్తవానికి వీటిని లేగ్మేస్ ఇవి బీన్స్, బట్టానీ మాదిరిగా ఉంటుంది.ఎవరైతే ఎలర్జీ తో సత మత మౌతున్నారో వారు ఒక్క పల్లీ తిన్న ఎలర్జీ వస్తు ఇటీవలికాలం లో జరిగిన పరిశోదనలో లేగ్మెస్ వల్ల అలాగే జరుగుతుందని  ఎలర్జీ వస్తుందని చెప్పలేము. ఎందుకైనా మంచిది ఎలర్జీ టెస్ట్ చేయిస్తే మంచిది మీ ప్రశ్నకు సరైన సమాధానం. .               .           

read more
ఆసేవలు మరువలేం..వెలకట్టలేం.... 

అది కోవిడ్ మహమ్మారి ఉసురు తీస్తున్నవేళ ఆసుపత్రులు రోగులతో క్రిక్కిరిసిన వేళ అటు పురుషులు సైతం కోవిడ్ సేవలకు జంకుతున్న వేళ. ప్యాండ మిక్ ను సవాలుగా స్వీకరించి న ఫిజిషియన్ల సేవలను స్మరిస్తూ ఫిబ్రవరి నెలలో  జాతీయ మహిళ ఫిజిషియన్ల స్మారక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మజుందార్ షా మెడికల్ సెంటర్ నారాయణ  హెల్త్ సిటీ లో నిర్వహించిన కార్క్రమం లో కన్సల్టెంట్ నియో నాటలజిస్ట్,పిడియా ట్రీ షియన్, డాక్టర్ హరిణీ శ్రీధరన్ మాట్లాడుతూ కోవిడ్ ప్యాండ మిక్ జీవితాలనే మార్చేసిందని అని అన్నారు. వృత్తి పరమైన సవాళ్ళు ఎదురయ్యాయని,వ్యక్తి గతంగా కుటుంబాలలోనూ మార్పులు వచ్చాయని అన్నారు.   జాతీయ మహిళా ఫిజీషియన్ల దినోత్సవం సందర్భంగా ఇతర రంగాల లోనూ జరుపుకున్నప్పటికీ ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్న మహిళలు పలు సవాళ్ళను కష్టాలను ఎదుర్కుంటూ అధిగమించామని డాక్టర్ హరిణీ శ్రీధరన్ వివరించారు . వాస్తవానికి ప్యాండమిక్ జీవితం సవాలుగా మారిందని అన్నారు. ప్యాండ మిక్ సవాళ్లు.... ప్యాండ మిక్ ను మూడు రకాల సవాళ్లు గా విభజించారు.అవి వృత్తిపరమైన సవాళ్ళు, వ్య్సక్తిగత మైన సవాళ్ళు కుటుంబ పరమైన సమస్యలు ఎదుర్కున్నామని డాక్తర్ హరిణీ  శ్రీధరన్. వివరించారు. సార్క్ కోవిడ్ 2 ప్యాండ మిక్ మూడవ సంవత్సరం లో ప్రస్తుతం మనం ఉన్నామని. ప్రతి సంవత్సరం మన ఊహలకు అందకుండా  చాలా కొత్తగా విచిత్రమై నదిగా వ్యవహరిస్తోందని  పేర్కొన్నారు. వ్యక్తి గత మైన సవాళ్లు.... పెద్ద సంఖ్యలో మరణాలు,మార్బి డిటీస్ ఫిజీషియన్ గా చూసామనిఅన్నారు. ప్యాండ మిక్ ఫిజీషియన్లకు మానసికంగా ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిందని. ప్రతి రోజూ ఒక్కోవాతావరణం లో కొన్ని ఘంటలు గడిచిపోయయని. సరైన సమయంలో నిద్ర ఉండేది కాదని,సరైన సమయానికి ఆహారం సైతం ఉండేది కాదని చాలా అలిసిపోయే వారమని డాక్టర్ హరిణీ శ్రీధర్ అనుభవాన్ని పంచుకున్నారు.ఇంత సేవచేసిన ఒక్కోసారి సరైన ప్రోత్సాహం ప్రేరణ లభించేది కాదని  చాలా మంది వైద్య రంగం లో కి వచ్చినవారికి ఒకటే లక్ష్యం ఉంటుందని అది కేవలం రోగికి ప్రజలకు వ్యాధి నయం చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తామని ఆమె అన్నారు. అయితే అలా చేయనప్పుడు ఒత్తిడి గురై సందర్భాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. చాలా అనారోగ్యం తో ఉన్న వారిపట్ల ఆందోళన ఉంటుందని నా కుటుంబం కూడా రేపు ఇలాంటి పరిస్థితే వస్తే అదే సమయానికి ఇంట్లో ఇన్ఫెక్షన్ వస్తే? అన్న సందేహం భయం మమ్మల్నీ మాకుటుంబాన్ని వెంటాడేది. ఈ అంశాన్ని గురించి అమెరికన్ జర్నల్ సైకియాట్రీ లో కోవిడ్ వచ్చినవారిలో సహజంగానే ఆత్మ హాత్య చేసుకోవాలనే ఆలోచన ఒత్తిడి  వంటివి ఉండేవని స్త్రీలలోను సాధారణ ప్రజానీకం లోనూ చాలా ఎక్కువగానే ఉండేదని ఇతరులతో పోల్చి చూసినప్పుడు ఫిజీషి యన్లలో ప్యాండ మిక్ సమయం లో మరింత ఎక్కువగా ఉండేదని ఆమె అన్నారు. చాలా మంది మహిళలు తాత్కాలికంగా వారి వారి ఉద్యోగాలను వృతిని మానుకున్నారని దీనికి వివిదరకాల ఉన్నాయని డాక్తర్ హరిణీ శ్రేధరన్ అన్నారు. మాకు చాలా గిల్టీ గా ఉండేదని మాకుటుంబానికి కూడా ఇన్ఫెక్షన్ వస్తుందేమో అన్న భయం ఒకపక్క కుటుంబం ఎలా ఎదుర్కుంటుంది అనేవిష యం మమ్మల్ని మాకుటుంబాన్ని తీవ్ర వేదనకు గురిచేసిందని అలాగే మరో పక్క వైద్యరంగం లో ఉంటూనే కోవిడ్ రోగులతో కాంటాక్ట్ ఉంటూనే పిల్లల సంరక్షణ పై నిర్లక్ష్యం చేసచేసమని పిల్లలకు ఎక్కడైనా వై రస్ కాంటాక్ట్ వస్తుందేమో అన్న భయం తో పిల్లల్ని దూరంగా ఉంచే వరమని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.ఎందుకంటే వాళ్ళు చాలా చిన్నపిల్లలని అలాగే మాఇంట్లో వృద్ధులు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారని మళ్ళీ లాక్ డౌన్ రెండు సంవత్సరాలుగా సాగుతున్న పరిణామ క్రమం లో ఇంట్లో  వారికి పెద్దగా సహాయ పడలేదు. అసలు ఎలాంటి సందర్భం ఎదుర్కోవాల్సి వచ్చిందంటే ముఖ్యంగా స్త్రీలు రెండు రకాల సందర్భాలలో ఎదుర్కునేందుకు శక్తి కావాలి. రెండు ఒత్తిడిని కలిగించే అంశాలే వృత్తిలోను, ఇంట్లోనూ ఒత్తిడే ఉంటుంది ఆ సమయంలో అటు భర్తకు భార్యగా, వృత్తిపరం గా  వైద్యురాలిగా ఒక మెట్టు దిగి ప్యాండ మిక్ లో ఉన్నరిస్క్ ను పక్కన పెట్టి ఇంటికి సంబందించిన విషయాలలో ముందుండి నడిపించమని వివరించారు.స్వచ్చందంగా కొన్ని ఘంటలు అదనంగా పనిచేశామని అమ్మే చెప్పారు. అయితే చాలామంది స్త్రీలు వారి వారి బాధ్యతల వల్ల ఇంటివద్దే ఉండిపోయారని అలాగే గిల్టీ తోనే పనిచేశామని ఆమె స్పష్టం చేసారు. వృత్తిపరంగా ఎదురైన సమస్యలు.... వృత్తిపరంగా చాలా మంది మిత్రులు ముఖ్యంగా బంధువులు ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురియ్యరనిచాలా చిన్న ఆసుపత్రులలో సైతం కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రులుగా మార్చారని అందులో చాలామంది వృతి పరమైన ఉద్యోగాల అవసరం ఎక్కువగానే ఉంటుందని కొన్ని చోట్ల స్త్రీల అవసరం తక్కువగా ఉంటుంది. అయితే సందర్భాలలో వారు ఇచ్చే జీతాలకు  రాజీ పడక తప్పలేదని ఆమె పేర్కొన్నారు. ఆర్ధికంగా ఎక్కడి కక్కడ లావాదేవీలు నిలిచిపోయాయని ఒక స్లంప్ ఏర్పడిన సందర్భంలో చాలా మంది  స్త్రీలకు గర్భం దాల్చిన లేదా నెలలు నిండిన స్త్ర్రేలకు ఇచ్చే మెటర్నటీ  సెలవులు  తిరిగి ఇవ్వలేదని ఇటీవల వెలువడిన వ్యాసం లో పేర్కొన్న అంశాలలో తాత్కాలిక కాంటాక్ట్- టేన్యుర్ పోస్టులు ఉన్న వారే ఉద్యోగం కోల్పోయారని ఉద్యోగం కొనసాగించినవారి పట్ల వ్యతిరేకత వ్యక్తం వచ్చింది. విద్య పరంగా,ప్రచురణలు ,కిలినికల్ గా వారు నిర్వహించిన పనితీరు. పురుషులు రానందువల్ల వారి అవకాశాల పై తీవ్రప్రభావం చూపింది.వారి అవకాశాలు మరింత దెబ్బతిన్నాయి. దానికరణంగా వారికి రావాల్సిన ప్రమోషన్స్ మహిళా ఫిజీషియన్స్ కు అవకాశాలు మెరుగు పడ్డాయి.బయటికి రాక తప్పలేదని ఆమె అన్నారు.వ్యక్తిగత ప్రభావం...నాకు నేనుగా చాలా అదృష్ట వంతు రాలినని అన్నారు. నాకుటుంబం నాకు పూర్తి మద్దత్తు ప్రకటించింది. పనిచేసే ప్రదేశంలో ప్యాండమిక్ సమయం లో చాలా మంది మహిళా ఫిజీషి యన్లు అందరికీ అలాజరగ లేదని ప్రస్తుత ప్యాండమిక్ మహిళా ఫిజీషియన్ల పై బాధ్యత ఉందని ఆసుపత్రులలో వైద్య పరంగా కాని పనిచేసే ప్రదేశాలలో పనిచేసిన ఆపని తీరును ఇప్పుడు గుర్తింపు లభించడం అభినందనీయమని ఆమె అన్నారు. ఎవరికీ తోచిన విధంగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అందరి సహకారం తో సవాళ్ళను ఎదుర్కున్న మహిళా ఫిజీశియన్లు మాట్లాడతారని వారి అనుభవాన్ని మనకు పంచుతారని ఇప్పుడైణా చాలామంది స్త్రీలు వృత్తిపట్ల ఆకర్షితులు అవుతారని వస్తారని ఆశిస్తున్నట్లు అందుకే ప్యాండ మిక్ సమయంలో వారి సేవలు మరువలేమని-వారి సేవలకు వెలకట్ట లేమని డాక్టర్ హరిణీ శ్రీధరన్ అన్నారు.     

read more
ప్రాణాలు హరిస్తున్న ఎఫ్ జి ఎంపై పోరాటానికి సిద్ధం కావాలి మహిళల పిలుపు...

జననేంద్రియ వికృతీ కరణతో 2౦౦ మిలియన్ల  మంది మరణిస్తున్నారు. యవన్నం లోఉన్న బాలికలు 24 ఘంటల లో జననేంద్రియ వికృతీకరణ ఎఫ్ జి ఎం తో మరణిస్తున్నారని యునిసెఫ్ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు,బాలికలు ఏకం కావాల్సిన అవసరం ఉందని. ఎఫ్ జి ఎం వ్యతిరేక పోరాటం చస్తున్న సంఘాలు పిలుపు నిచ్చాయి. కొన్ని సంవత్సరాలుగా అవగాహన కల్పించేందుకు సాధన చేస్తున్న ఇంకా ప్రపంచ లోని మహిళలకు పూర్తిగా అవగాహన కల్పించలేక పోయామని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రపంచ జనాభాలో స్త్రీల సంఖ్య గణనీయం గా పెరుగుతున్నప్పటికీ ఆధునికత ను అంగీకరించ లెం. మనం చేస్తున్న అవలంబిస్తున్న  పద్దతులలో కారణంగానే హాయిగా సాగాల్సిన యవ్వనం బుగ్గిపాలై పోతోందన్న మరణిస్తున్నారన్న విషయం  గ్రహించాలి. అంచనా ప్రకారం 2౦౦ మిలియన్ల  బాలికలు ౩౦ దేశాలలో ఎఫ్ జి ఎం జననేంద్రియ విక్రుతీకరణ చేసుకుతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 21 సంవత్సరాల మసేరి కి  తీవ్ర రక్త శ్రావం కావడం ఎఫ్ జి ఎం శస్త్ర చికిత్సకు వెళ్ళడం ఇలాంటి అంశాల పైన స్లేరా లియాన్ దృష్టి పెట్టింది. ఎఫ్ జి ఎం అంటే వివిదపద్దతుల ద్వారా బాహ్య జననేంద్రియాల ను తొలగించడం దీనివల్ల కొన్నిరకాల ప్రమాదాలు ఏర్పడా వచ్చు. ముఖ్యంగా జననేంద్రియాలు అవయవాలకు ప్రమాదం పొంచి ఉందన్న విషయం తెలుసుకోవాలి. కొన్ని పద్దతులలో శాస్తీయత లేనికారణం గా సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ జి ఎం /సి స్త్రీల పై జరుగుతున్న అత్యాచారాలలో భాగమే అని, స్త్రీ హక్కులను హరించడమే దీనిని మనహక్కుల ను కలరాయడమే అంటున్నారు  అంతార్జాతీయ మనహక్కుల సంఘం సంఘాలు. ఆఫ్రికన్ యునియన్ ఎఫ్ జి ఎం ను తీవ్రంగా ఖండించింది.ఇది చాలా ప్రమాదకరమైన క్రేడగా పేర్కొన్నారు. కాగా ఎఫ్ జి ఎం స్త్రీల హక్కులను హరించడమే అని అంటున్నారు. ఎఫ్ జి ఎం లో రకాలు... ఎఫ్ జి ఎం లో 4 రకాలు ఉన్నట్లు వెల్లడించారు. టైప్ 1 లో క్లిమో టోరిస్ దాని చుట్టూ ఉన్న భాగం కొంతభాగం లేదా పూర్తిభాగాన్ని తొలగిస్తారని అంటున్నారు. టైప్ 2 లో క్లిటోరిస్ ను తొలగిస్తారు. దాని చుట్టూ పక్కల మడత పడ్డ చర్మం లోపల మడత పడ్డ పుల్వా బయట ఉన్న వాటిని తొలగించడం లేదా తొలగించాకుండానే  క్లిట్టర్ ను తొలగిస్తారు. టైప్ ౩ లో వజీన్ ను తెరచి దానిని మరింత దగ్గరగా చేస్తారు. దీనిని ఇంఫబులేషన్ అంటారని నిపుణులు పేర్కొన్నారు. టైప్ 4 లో ఫ్లేరిసింగ్ ఇంసిసింగ్ ఇందులో వైద్య విధానం అంటూ ఉండదు. కాని ప్రామాద కరమైన పద్దతులు అమలు చేస్తే ప్రామాడమే అని అంటున్నారు నిపుణులు. ఎఫ్ జి ఎం /సి రేట్స్... ౩౦ సంవత్సరాలుగా మొత్తం మీద ఎఫ్ జి ఎం ను వ్యతిరేకిస్తున్నారు. అన్నిదేశాలు సమాంతరంగా అభివృద్ధి సాధించలేదు.ఎఫ్ జి ఎం ను తగ్గించుకున్న బాలికల లో 15 నుండి 19 సంవత్సరాల వయస్సు ఉన్నవారే అని ఈజిప్ట్ లో 96% 1985 -2౦౦5 మధ్య  కాలం లో 7౦% ఉన్నారని పొరుగు దేశాలలో చోటు చేసుకుంటున్న ఘటనలను యుని సేఫ్ వెల్లడించింది. ఆఫ్రికాలో సేలేరా లియోన్ అధికశాతం లో ఉందని. ఎఫ్ జి ఎం 8౩% మహిళలు బాలికలు ఈ ప్రక్రియను అమలు చేస్తున్నారని వేల్లడించింది. ప్రస్తుతం తగ్గినప్పటికీ జనాభా సంఖ్యా పెరుగుతుందనే ఉంది. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే బాలికల సంఖ్య మహిళలు రానున్న 15 ఏళ్లలో ఎఫ్ జి ఎం /సి పెరిగే అవకాసం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎవరైతే స్త్రీలు,మహిళలు, ఎఫ్ జి ఎం/సి చేయిన్చుకున్నారో ప్రపంచ వ్యాప్తంగా తక్కువలో తక్కువ 2౦౦ మంది మిలియన్లకు ౩౦ దేశాలలో 15 సంవత్సరాల బాలికలు 44 మిలియన్లకు చేరినా మనం ఆ శ్చర్య పోనవసరం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఎఫ్ జి ఎం ఇండోనేషియాలో సహజంగా ఉందని. ఈ జిప్ట్,ఇథియోపియా, లో కొనసాగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెదర్లాండ్స్ లో 41.౦౦౦ బాలికలు మహిళలు ఎఫ్ జి ఎం తో జీవిస్తున్నట్లు సమాచారం. సి డి సి సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ అందించిన వివరాల ప్రకారం ఇందులో చాలా మంది సగానికి సగం బాలికలు అంటే 5౦ యాభై మిలియన్ల ప్రజలు యుఎస్ లో ఎఫ్ జి ఎం చేయించుకుంటున్న వారి సంఖ్య మరింత పెరగవచ్చని ఇది అత్యంత ప్రమాదకరమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎఫ్ జి ఎం చేయించుకున్న వారు,లేదా చేయించుకుంటున్న వారి కి  భవిష్యత్తులో ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాజిక సాంఘిక అంశాల కారణం గానే ఎఫ్ జి ఎం కు సి ద్ధపడుతున్నారని తెలుస్తోండమి విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. ఈ పరిణామం దేశం పైన ఆ ప్రాంతం పైన ఆధారపడి జీవిస్తున్నారు.చాలా ప్రాంతాలలో  ఎఫ్ జి ఎం సాంస్కృతిక సాంప్రదాయ అంశం గా వివిధ కారణాలను జోడించారు.  1) ఎఫ్ జి ఎం కు గల కారణాల పై సోదించినప్పుడుకొన్ని అంశాలు వెలుగు చూసాయి.వారిని సామాజికంగా బహిష్కరించినప్పుడు సామాజిక ఒత్తిడి ఖచ్చితంగా ఉందని పేర్కొన్నారు. 2) ఒక బాలికను ఎదిగే వరకు పెంచడం పెళ్లి చేయడం వంటి సామాజిక కట్టుబాటుకు ఆమెను సిద్ధం చేయాలి. ౩) పెళ్ళికి ముందే ఆమె కన్యకాదా? ఆమె పెళ్ళికి అర్హురాలా కదా అన్న విషయంతెలుసుకునే ప్రయత్నం చేయడం శోచనీయం ఒకవిధంగా ఆమెను అవమానించడమే అని అనక తప్పదు.ఆయా దేశాలలోసంస్కృతులు అచార వ్యవహారాల పై ఆధారపడి ఉందిఅని నిఒపునులు విశ్లేషిస్తున్నారు . 4) ముఖ్యంగా ఫెమినిటి, ఆధునిక భావాజాలం పరిశుభ్రత అందం వంటి అంశాలు సైతం కలిగి ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు.చాలా దేశాలలో ప్రభుత్వాలు అనుమతి లేకుండా ముఖ్యంగా స్త్రీ,లేదా బాలిక అంగీకారం లేకుండా అయిష్టంగానే ఎఫ్ జి ఎం సియరా లియాన్ ను అమలు చేయడాన్ని తప్పు పడుతూ ఎఫ్ జి ఎం ను నిషె దించడం తప్పనిసరి అని ప్రపంచ మానహక్కుల మహిళ సంఘాలు  డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్ జి ఎం సంబంధిత నేరాలు,ప్రాసిక్యూషన్ ను అడ్డ్డ్డుకోవాలని చూస్తున్నారని. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న రిపోర్ట్ ఆధారంగా పార్లమెంట్ లో సియారా లియాన్ చేయించుకున్న వారికి ఎఫ్ జి ఎం చేసుకున్న బాలికలకు రూపాయాలు 15౦ /-చెల్లించడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఎఫ్ జి ఎం వల్ల ఆరోగ్య లాభాలు ఉన్నాయా?... ఎఫ్ జి ఎం వల్ల ఆరోగ్య లాభాలు లేవు. అదీకాక ఆరోగ్యంగా ఉన్న కణాలాను తొలగించడం ద్వారా జీవితాంతం సమస్యలు వస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ఎఫ్ జి ఎం తరువాత వెంటనే వచ్చే సమస్యలలో అధిక రక్త శ్రావం, నొప్పి , జ్వరం, ఇన్ఫెక్షన్లు లేదా షాక్ తో మరణిస్తారని నిపుణులు తమ పరిశీలనలో గ్రహించారు. దీర్ఘ కాలం లో జీవితాన్ని కుదించడం కొన్నిరకాల సమస్యలు చేరతాయి. మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు నొప్పి, మూత్ర నాళాలలో ఇన్ఫెక్షన్, నెలసరి సమస్యలలో మరింత నొప్పిగా ఉండడం రక్త శ్రావం లో సమస్యలు వచ్చి అప్పుడే పుట్టిన కొత్తగా పుట్టిన వారు చనిపోవడం మళ్ళీ మళ్ళీ సర్జరీలు చేయాల్సి రావడం. మానసిక అనారోగ్యం,ఒత్తిడి, యాంగ్ జయిటీ పి టి ఎస్ టి వంటి సమస్యలు రావచ్చని వైద్య నిపుణులు తమ పరిశోదనలోగమనించినట్లు వెల్లడించారు. ఎఫ్ జి ఎం ని అమలు చయడం అంటే  అంతర్జాతీయ స్త్రీహక్కులను హరించడమే... అంతార్జాతీయ మానవహక్కుల సంస్థ స్త్రీల,బాలికల సంరక్షణ పై దృష్టి పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్ జి ఎం ను నేరంగా పరిగణించలని  అంతర్జాతీయ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యేకంగా ప్రభుత్వాలు సిరా లియాన్ చట్టాన్ని తయారు చేయాలనీ ఖటి నంగా చేయడం ఎఫ్ జి ఎం కు వ్యతిరేకంగా స్త్రీలు,బాలికల సంరక్షణ చేపట్టడం అవసరం. ఎఫ్ జి ఎం రాక్షస క్రేడకు ముగింపు పలకాలి... ప్రపంచం మొత్తం అందరినీ సమానంగా చూడాలని ప్రపంచ వ్యాప్తంగా ౩౦ దేశాలలో సంరక్షణ సంస్థలు చేపట్టాలని మహిళలు బాలికలు ఒక లేఖ పై సంతకాలు చేసినట్లు తెలిపారు. ఎఫ్ జి ఎం ను నిషే దించాలని లేదాసమూలంగా పారద్రోలాలని వివక్ష చూప్స్డం తగదని,జండర్ లో 8 వ స్థానం కల్పించాలని. చట్టపరంగా పోలీసు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.పలు చోట్ల చట్ట వ్యతిరేకంగా వారిని పడుపు వృత్తి చేయడం వల్లే చిన్న వయస్సులో ఆర్దాంతరం గా మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఎఫ్ జి ఎం పై ఫిబ్రవరి 1౦ -2౦ 22 లో పలు సమావేశాలు నిర్వహించారు. ఎఫ్ జి ఎం బారిన పడిన వారికి రక్షణ వ్యవస్థ తోపాటుధైర్యంగా ఎదుర్కునే శక్తిని స్పూర్తిని ఇవ్వగలిగి నప్పుడే ఎఫ్ జి ఎం బాధితులను కాపాడగలం అని నిపుణులు అంతర్జార్జాయ మనవ హక్కుల  ఉద్యమ నేతలు మానవహక్కుల సంఘాలు మాట్లాడుతూ మంచి సాంప్రదాయాలు కావాలంటే  చెడు ను తొలగించాలి ఎఫ్ జి ఎం కు వ్యతిరేకంగా పార్లమెంట్ కు లేఖ రాయాలని నిర్ణ యించినట్లు స్పష్టం చేసారు.                                            

read more
రుమటాయిడ్ ఆర్థరైటిస్...

రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక దీర్ఘ కాలిక వ్యాధి ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డ ర్ లలో ఒకటిగా చెప్ప వచ్చు రుమటాయిడ్ ఆర్థరైటిస్ నివారణకు అలోపతి కాక ఇతర ప్రత్యామ్నాయ వైద్యం చేసుకోవచ్చని అందులో మూలికలు మరెన్నో సప్లిమెంట్స్  ఉన్నాయని నిపుణులు తెలిపారు. మూలికలు /సప్లిమెంత్స్... రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల మీ ఎముకలలో ఉన్న జాయింట్స్  కదలక పోవడం గట్టిగా బిగుసుకు పోయి వాపులు,తీవ్రమైన నొప్పులు తో తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ సమస్యకు కొన్ని రకాల హెర్బల్ చికిత్సపద్దతులను అనుసరించడం ద్వారా వాపు,నొప్పులు తగ్గించ వచ్చు అంటున్నారు నిపుణులు. బోన్ వేరియో ఇండియన్ ఫ్రంకిన్సస్.... పిల్లి పంజా దండర్ గాడ్ వైన్ పసుపు మూలికతో రోమటైడ్ కు చికిత్స... ముఖ్యంగా పసుపులో ఉండే కుర్కొమిన్ ఇది చాలా సహజమైన మూలికలు ఇతర మందుల వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి కొన్ని రకాల ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయన్న విషయం మీ వైద్యులకు తెలుసు. ఆక్యు పంక్చర్ చికిత్స... చైనా దేశపు సాంప్రదాయ వైద్య పద్దతిలో చేసే ఆక్యుపంక్చర్ చికిత్సలో నీడీల్స్ ద్వారా శరీరానికి తిరిగి మరల శక్తి నిచ్చి రక్త ప్రవాహం మెరుగుపడేందుకు దోహదం చేస్తుంది.ఆక్యుపంక్చర్ కింది స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ వైద్య ప్రక్రియ ట్యూమర్ ,నేక్రోసిన్ ఫ్రాక్చ్గర్ వల్ల జాయింట్లలో వాపు సహజంగా నేఉంటుంది.  కాళ్ళ నొప్పుల కు పెయిన్ కిల్లర్స్ వాడతారు. అయితే ఒక పరిశోదనలో ఆక్యుపంక్చర్ పెయిన్ వాపులు తగ్గిపోయి,నొప్పి తగ్గిస్తుందని నిరూపితం కాలేదు.ఇంకా వీటిపై పూర్తిగా పరిశోదన చేయాల్సిన అవసరం ఉంది. అని నిపుణులు స్పష్టం చ్ర్సారు. టాయిచి-చికిత్స... మీరు శారీరక వ్యాయామం చేస్తే జాయింట్లలో ఉండే వాపుతగ్గాలంటే ఇందుకోసం టాయిచి వైద్యం సరైన జవాబు చెపుతుందని ఇది మూలకణాలును కదిలిస్తాయని మీ మూడ్ ను పెంచుతాయని నిపుణులు అంటున్నారు. పోషక ఆహారం తోనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎదుర్కొ గలం... ఇంఫ్లా మేషన్ ను ఎదుర్కోవాలంటే మంచి ఆహారం తీసుకోవడం అవసరం. సాల్మన్, ట్యునా,  పళ్ళు, శాఖా హారం, పప్పులు, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకుంటే కీళ్ళ మధ్యలో ఉన్న జాయింట్ లలో వాపు రాదని, రోమాటాయిడ్ ఫ్యాక్టర్ ను తగ్గిస్తాయి. రిలాక్సే షాన్ టెక్నిక్... రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుండి విముక్తికి మీ కండరాలు బిగుసుకు పోకుండా కండరాలు వదులుగా ఉంటాయి. మీ శరీరం లో ఉన్న తల నుండి కింద  పాదం వరకు మీరు మీ శరీరాన్ని వదులుగా ఉంచడం వ్యాయామం చేయడం వల్ల మీ మెదడు, నొప్పి, శ్వాశ పీల్చుకోవడం వదలడం వంటి టెక్నిక్  ఉపయోగిస్తే మీరు మీశరీరం చాలా ఒదులుగా ఉంటుంది. యోగా తో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు చక్... యోగాలో ను ఉచ్వాస నిశ్వాస లు తీసుకోవడం. ధ్యానం చేయడం మీ దృష్టి యోగ సాధన పై నిలిపి నప్పుడు రోమటాయిడ్ ఫ్యాక్టర్ పెద్దగా ప్రభావం చూపదు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. యోగ సాధన ద్వారా మీ చేతులకు బలం పెరుగుతుంది. చేతులు, శరీరం లోని జాయింట్స్ నొప్పుల నుండి కాస్త ఉపసమనం లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. కండరాలు బలోపేతమై మీ శరీర సమతౌల్యం సాధిస్తుంది. మసాజ్ దేరఫీ... మీ జాయింట్స్ బాగా బిగుసుకు పోయి నట్లయితే మసాజ్ దేరఫీ ద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది. నొప్పులకు గల కారణాలలో జరిపిన పరిశోదన లో ముంజేయి, చేయి, మర్దనా మసాజ్ చేయడం ద్వారా మీకు శారీరకంగా కండరాలకు బలం లభించడం తో పాటు. కొంత పట్టు లభిస్తుంది. బాగా మసాజ్ చేసిన తరువాత పై నుండి కిందకు చేయడం వల్ల ఒత్తిడి యాంగ్ జయిటి ని తరిమి కొట్టవచ్చు. మీరు ప్రశాంతంగా నిద్ర పోయేందుకు మీకు మసాజ్ దోహదం చేస్తుంది. మొదటి దశలో మీరు మీ రోమటాల జిస్ట్ ను సంప్రదించండి. అది మీకు  ఏమాత్రం ప్రమాదకరం కాదని సురక్షిత మని తెలుసుకున్న తరువాతే మసాజ్ దేరపిస్ట్ రోమటాయిడ్ ఫ్యాక్టర్ గురించి వివరించి చికిత్స చేయించుకోండి.                                      

read more
లక్నోలో అరుదైన బ్రెయిన్ సర్జరీ విజయవంతం... 

  అరుదైన బ్రెయిన్ సర్జరీ లో లక్నో డాక్టర్లు విజయం సాధించారు.  వైద్య రంగాలు చేస్తున్న అద్భుతాలు ఏమని చెప్పగలం. లక్నోలోని సిటి   ఆసుపత్రిలో  కాంప్లెక్స్ బ్రెయిన్  సర్జరీ ద్వారా వాడ్లర్  స్కల్ బోన్ ను బయో మెటీ రియల్ ఇంప్లాంట్ ను పోరాస్ పోలితిన్ అందులోనూ హై డెన్సిటీ ఉన్న పోలిమర్  ను కేవలం వైద్య అవసరాల కోసం వాడతారని వైద్యులు వెల్లడించారు. ఇక కేసుకు సంబందించిన వివరాల లోకి వెళితే లక్నోలో అప్పుడే పుట్టిన వెంటనే రాచే రెల్లి రూఫ్ గార్డెన్ నుండి 2౦2౦ లో పడిపోయా డని వైద్యులు  వెల్లడించారు. ఆసమయంలో ఆబాలుడి తలకు బలమైన గాయం తీవ్రమైన ఇంజురీ అయ్యిందని అత్యవసరం గా అపోలో ఆసుపత్రి లోని న్యూరో  సర్జరీ  అత్యవసర చికిత్స విభాగం లో ఉంచారు. ప్రముఖ న్యూరో సర్జన్ సునీల్ కుమార్ సింగ్ బాలిడికి జరిగిన గాయం ఇంజురీ వల్ల అతని పుర్రె లోని స్కల్ ఎముక ఎడమ వైపు భాగం లో పాడై పోయింది  అతనిని బతికించ డం తక్షణ కర్తవ్యం ఆబాలుడిని అత్యవర చికిత్సా విభాగం లో నెలరోజుల పాటు పోరాడాడు. నాటి నుంచి న్యూరో సర్జన్ డాక్టర్ సునీల్ కుమార్ సింగ్ కాంప్లెక్స్ సర్జరీ చేద్దామంటే చాలా చిన్న పిల్లవాడు కావడం తో డి ఇ సి ఆర్ పద్ధతి ద్వారా ప్రోటో కాల్ ను అనుసరించి  ఏ ప్రాంతం లో అయితే పుర్రె ఎముక స్కల్ బోన్ పుర్రె ఎముక పడయ్యిందో వాపు పెరగ కుండా నిరోదించారు . పుర్రె ఎముక లోపలి భాగం చిన్నది కాకుండా పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాక  వాటిని మళ్ళీ ఇంప్లాంట్ చేసేందుకు నిర్బ్నయించామని డాక్టర్ సునీల్ కుమార్ సింగ్ వివరించారు. జూలై 2౦21 లో ఆబాలుడు ఆసుపత్రికి తిరిగి వచ్చాడని. అతనికి సర్జరీ  చేసిన ఎముక బోన్ తిరస్కరించిందని. కేవలం ఇక ఇంప్లాంట్ ఒక్కటే మార్గమని  సునీల్ నేత్రుత్వం లోని వైద్య బృందం ఒక నిర్ణయానికి వచ్చింది.  వయసుతో పాటు పుర్రె ఎముక పెరిగిందని. ఇంప్లాంట్ చేయడం కూడా అసాధ్యమే  అని తేల్చి చెప్పారు. అయితే సమస్యను ఒక సవాల్ గా భావించిన డాక్తర్ సునీల్ కుమార్ ఇంప్లాంట్ ను పోరస్ పోలితిన్ ద్వారా తయారు చేయించి నట్లు సర్జన్సునీల్ కుమార్ సింగ్  తెలిపారు. 2౦21 నవంబర్  న్ సిటి ఆసుపత్రి లో సర్జరీ నిర్వహించారు. అసుపత్రి సి ఇ ఓ ఎం డి మయాంక్ సోమాని మాట్లాడుతూ ఇలాంటి అరుదైన బ్రెయిన్ సర్జరీ జరగడం లక్నోలో ముఖ్యం గా యు పి లో జరగడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు. కొత్త డిల్లి, ముంబాయి వంటి నగరాలాలో మాత్రమే లభించే ఇలాంటి సర్జరీ నిర్వహించి చేసి విజయం సాధించడం వైద్య రంగం లో ఒక ముందడుగుగా పేర్కొన్నారు. బయో ఇంప్లాంట్ ద్వారా తలలో ఎలాంటి మార్పులు లేవని వయస్సుతో పాటు ఇంప్లాంట్ పెరిగిన ఆబాలుడు ఆనందంగా జీవినచగలడ ని మరిన్ని శస్త్రచికిత్సలు చేసేందుకు మున్ముందు పరిశోనలు చేసి న్యూరో సైన్సెస్ లో పురోగతి సాధించాలన్నదే కీలకమని వైద్య రంగం లో అరుదైన శస్త్ర చికితలు చేసేందుకు బయో ఇం ప్లాంట్ సర్జరీ తమకు స్ఫూర్తి నిచ్చిందని  న్యూరో సర్జన్ డాక్టర్ సునీల్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.  

read more
బ్రెయిన్ ఫాగ్ రోగులకు కొత్త తెరఫి...

కోవిడ్ తరువాత బ్రెయిన్ ఫాగ్ తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వారిలో మానసిక అనారోగ్యం నుండి బయట పడాలంటే వారి శక్తి సామర్ధ్యాలు వైరస్ వాళ్ళ క్షీనించాయా ? దోచుకున్నారా? అన్నది ముఖ్యంగా స్ట్రోక్ వల్ల దానిప్రభావం ఎలా ఉంటుంది?ట్రమో టిక్ బ్రెయిన్ ఇంజురీ ఇతర వైరల్ డిజార్డర్స్ ను శాస్త్రజ్ఞులు గుర్తించారు. పరిశోదన వివరాలు..కోవిడ్ తరువాత బ్రెయిన్ ఫాగ్ 8 నెలలు ఉంటుంది.కోవిడ్ తరువాత వెన్నుపూసలో ఉన్న రసాయనం ఫ్లూయిడ్ వల్ల బ్రెయిన్ ఫాగ్ కు కారణం అవుతుందా? దీర్ఘ కాలం పాటు కోవిడ్ ఉంటె ఎలా తెలుసుకోవాలి? ప్రజలలో కొంతమంది అదృష్ట వంతులు కోవిడ్19 స్వల్ప లక్షణాలు చాలా రోజులు కోవిడ్19   వైరస్ లక్షణా లలో చాలా కోల్పోయారు. ఒక అంచనా ప్రకారం ౩7% ఎవరైతే కోవిడ్ కోవిడ్ వైరస్ లక్షణా లలో వారాల పాటు కొనసాగాయి  నెలల పాటు కొనసాగాయి, కొంత మందికి సంవత్సరాల పాటు కొనసాగింది. ఇందులో ప్రాధాన మైన లక్షణం బ్రెయిన్ ఫాగ్ ఒక్కమాటలో చెప్పాలంటే జీవితాన్ని కుదించేసింది. ఈ స్థితిలో చాలా నెమ్మదిగా ఆలోచించడం ఒకరకమైన ఆత్మవిస్వాశం, కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉండడం ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు ఎదుర్కొనారు. ఇలాంటి సమస్యలకు పునరావాస కార్యక్రమం ద్వారా తిరిగి దానికదే పునరుత్తేజం కలుగుతుంది. బ్రెయిన్ ఫాగ్ తో సతమత మయ్యేవారికి జీవితాలను మార్చవచ్చుఅన్న ఆశను కల్పించారు. న్యూరో ప్లాస్టి సిటి ఆధారం గా బ్రెయిన్ ఫాగ్ నిర్ధారణ చేస్తారు. ఈ పద్ధతి ద్వారా వ్యాయామం చేయడం లో శిక్షణ ఇస్తారు. న్యూరో ప్లాస్టి సిటి అంటే మ్రేదడులో శక్తి ని తిరిగి పొందడం.మెదడుకు ఏదైతే ఒక ప్రమాదం సంభవించిందో దానినుండి బయట పడడానికి చాలా మందికి శిక్షణ ఇచ్చినట్లు నిపుణులు తెలిపారు.  ఎవరికతే మెదడులో కణితలు ఉన్నాయో,సర్జరీల ద్వారా లేదా మెదడులో రేడియేషన్ ఇచ్చారో,ఎవరైతే వెస్ట్ నైలె,హెచ్ ఐ వి మేనేజిటిస్ ఉన్న వారికి మాయో క్లినిక్ కు చెందిన క్లినికల్ న్యూరో సైకాలజిస్ట్ రోచెస్టర్ బెర్గ్ క్యుస్ట్ కోవిడ్ నుండి కోలుకున్న వారిని  చూడలేదని అన్నారు. రోచెస్టర్  క్లినిక్ లో కొన్నిరకాల పద్దతులను అనుసరించినట్లు తెలిపారు.కాగా వారి వద్దకు చాలామంది జ్ఞాపక శక్తి కి సంబందించిన సమస్యలతో రోగులు వచ్చే వారని చెప్పిన విషయాన్ని పలుమార్లు తప్పులేకుండా చెపుతూ ఉండేవారని అలాగే మళ్ళీమళ్ళీ చెపుతూ ఉండడం వల్ల వారిలో జ్ఞాపక శక్తి నైపుణ్యం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గించ వచ్చని బెర్ కుఇస్ట్  అన్నారు.  ఇందుకు ఉదాహరణగా ఒక యదార్ధ ఘటన వివరాలను పేర్కొన్నారు...ఆమె ఎకోవర్కర్ 9 సంవత్సరాల 4 నెలలక్రితం కోవిడ్ వచ్చింది ఆమె నర్సింగ్ స్టూడెంట్ ఆమె బ్రెయిన్ ఫాగ్ సమస్యతో వచ్చింది. ప్రతి రోజు  ఆమె పనితీరును పరిశీలించినప్పుడు. నాణ్యత లేకపోవడాన్ని గమనించారు. అయితే ఆమెకు బ్రెయిన్ స్కాన్ చేయించాలని సూచించారు. అందుకు ఆమె భయపడింది. బ్రెయిన్ ఫాగ్ ఉన్నవారిలో మున్ముందు వైరల్ ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంది. న్యూరో ప్లాస్టి సిటి దేరఫీ విధానాన్ని బిన్ ఎహేరెన్స్ ఊపిరి పోశారు. అయితే బిన్ ఎహిరెన్స్ దీర్ఘకాలం పాటు లైం ఇన్ఫెక్షన్ కాగ్నేటివ్  సమస్యలు ఉన్నాయని. లైం వ్యాధి ప్రతి పది మందిలో ఒకరికి వస్తుందని ముఖ్యంగా ఎవరతే ఎక్కువగా ఇన్ఫెక్షన్ లకు గురిఅవుతారో వారికి లైం వ్యాధి వస్తుందని ఎహిన్స్ అన్నారు.1౦ సంవత్సరాల క్రితం  లైం వ్యాధితో బాధ పడ్డానని అలాగే బ్రెయిన్ ఫాగ్,జాయింట్ పెయిన్ తో బాధ పడ్డానని బ్రెయిన్ లీజన్స్,ను స్కాన్ ద్వారా గుర్తించా మని చాలా ఇన్ఫెక్షన్స్ తరువాత తరువాత వేదించాయని కొన్ని సంవత్సరాలు ఇన్ఫెక్షన్లతో బాధ పడ్డామని బెన్ ఎహేరేన్స్ వివరించారు. ఎహేన్స్ చెప్పిన వివరాల ప్రకారం న్యూరో ప్లాస్టి సిటి ఆధారిత  తెరఫీ లు ఎదుర్కోవడానికి సహాయ పడుతుందని వెల్లడించారు. గతంలో జరిపిన పరిశోదనలో గతం లో జరిగిన విషయాలు జ్ఞాపకం ఉంచుకోవడం పడే పడే చెప్పడం గతంలో ఇన్ఫెక్షన్ వాళ్ళ ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువగా ఉంటుందని దీర్ఘ కాలం పాటు అదే పనిగా రిపీట్ చేయడం లక్షణం గా పేర్కొనారు. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత వచ్చే సమస్యలు...కోవిడ్ నుండి కోలుకున్న తరువాత వచ్చే సమాస్యలలో ముఖ్యంగా బ్రెయిన్ ఫాగ్ సమస్య ప్రధానం కాగా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండడం యాంగ్ జైటి ఎక్కువగా ఉంటుంది. దీర్ఘ కాలం పాటు కోవిడ్ తో బాధ పడ్డ వారు ఓమైక్రాన్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తే దీర్ఘ కాలిక ప్రభావం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోవిడ్ తరువాత 9౦ రోజులకి లక్షణాలు కనిపిస్తాయి అని డబ్ల్యు హెచ్ ఓ వెల్లడించింది. కోవిడ్ బారిన పడి బతికి బట్ట కట్టిన వాళ్ళు. దీర్ఘ కాలిక అనారోగ్యం లో భాగం గా అలసట అంటే ఫాటి గో తో పాటు యాంగ్ జైటి తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. అదే పనిగా అనారోగ్య సమస్యలు వేదిస్తాయి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు వస్తాయని పరిశోధకులు వెల్లడించారు. గత సంవత్సరం లో డెల్టా తో ఓమిక్రాన్ పోటీ పడిందని ఒమైక్రాన్ ప్రభావం తీవ్రత తక్కువే అని డెల్టా వేరియంట్ ఆసుపత్రిలో చేరిన వాళ్ళు ఉన్నారని అని నిర్ధారించారు. ఈ విషయానికి సంబంధించి వెన్ కోర్కోవ్ మాట్లాడుతూ అసలు ఏ పరిశోదన లేదని. కోవిడ్19 నుండి బయట పడ్డ వారు దీర్ఘ కాలం పాటు కోవిడ్ బారిన పడిన వారు. దీర్ఘకాలం పాటు  ఒమైక్రాన్ వేరియంట్ తో మార్పులు వచ్చాయన్నది పరిశోదన లో తెలియరాలేదని పేర్కొన్నారు. స్తాన్ ఫర్డ్ విశ్వ విద్యాలయానికి చెందిన డాక్టర్ లండా జంగ్ చాలా ఆసుపత్రులకు ఆమె డైరెక్ట్ మరో కొత్త వేవ్ వస్తుందని చెప్పలేమని ఆమె స్పష్టం చేసారు. అయితే గతం లో జరిగిన ఘటనల దృష్ట్యా మనం అప్రమత్తం గా ఉండాలని. దేనికైనా సిద్ధంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. ఈ మధ్య  కాలం లో దీనివెనుక అసలు రహాస్యం చేదించేందుకు ప్రయస్తున్నారు. కొన్ని సిద్ధాంతాల ప్రకారం అటో ఇమ్యూన్ డిజార్దర్స్, చిన్న చిఇన మైక్రో క్లాట్స్ వంటి లక్షణాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటి సమాస్యలకు వ్యాక్సిన్ ఒక్కటే సమాధానమా యాలె విశ్వవిద్యాలయానికి చెందినా బృందం చేసిన పరిశీలనలో దీర్ఘకాలం పాటు కోవిడ్ లక్షనాలాను వ్యాక్సిన్ నివారించాగాలదా? అన్న ప్రశ్నకు సమాధానం కోసం భావిష్యతులో మరిన్ని పరిశోదనలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు వెల్లడించారు.కొత్త తెరఫి తో బ్రెయిన్ ఫాగ్ నుండి కోలుకోగాలరని ఆశిద్దాం.   

read more
కొత్త కోవిడ్ స్టెల్త్ వేరియంట్...

  ఓమైక్రాన్ లో మరో కొత్తవేరియంట్ పుట్టుకొచ్చింది. దానికి స్టీల్త్ వేరియంట్ గా నామకరణం చేసారు.సార్క్ కోవిడ్ -2 లో బి ఎ 2 గా రూపాంతరం చెందింది. దీనిప్రభావం ఎలా ఉంటుంది? అన్న విషయం  పై నిపుణులకు పూర్తిగా తెలియదు. ఇప్పటికే బిఎ 2 వేరియంట్ 2౦ సార్లు మార్పులు చెందిందని ఈ  వేరియంట్ కు త్వరగా విస్తరిస్తోందని కోవిడ్ వ్యాక్సిన్ లక్ష్యంగా వేరియంట్ పనిచేస్తుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. అంటే వేరియంట్లు ప్రాకృతికంగా వాచ్చయా లేకా రోపొందించారా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. అనినిపుణులు అభిప్రాయ పడ్డారు. ప్రజాల్ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం గణాం కాల ఆధారం గా సమాచారం అందిస్తున్నట్లు నిపుణులు వెల్లడించారు. శాస్త్రజ్ఞులు తొలుత ఓమైక్రాన్ సబ్ వేరియంట్ బి ఎ 2 ను భారత్ సౌత్ ఆఫ్రికాలో గుర్తించారు. 2౦21 డిసెంబర్ లో సౌత్ అఫ్రికా లో ఈవేరియంట్ ను గుర్తించారు. నాటి నుంచి నేటివరకూ వివిధ దేశాలలో వ్యాపించింది. యూస్,యుకే లో ఇజ్రాయిల్ దేశాలలో వ్యాపించింది. సబ్ వేరియంట్ వైరస్ డెన్మార్క్ లోను తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది. దీనివల్ల కోవిడ్ 19 --2౦ % కేసులు నమోదు అయ్యాయి. వారానికి 52 కేసులు నమోదు కాగా రెండవ వారం నాటికి 45% చాలా త్వరిత గతిన విస్తరిస్తోంది. ప్రాధమిక పరిశీలనలో ఆసుపత్రులలో చేరుతున్నవారి లో పెద్దగా మార్పులేదని. బిఎ 1, బి ఎ2 , మధ్య పెద్దగా మార్పు లేదు ప్రస్తుతం బిఎ2 వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బి ఎ2 వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా ఎలా ప్రావార్తిస్తాయి. ఇన్ఫెక్షన్ శాతం ఎంత అన్న అంశాల పై పరిశోదనలు జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బి ఎ2 పై ఇంకా పరిశోదనలు జరుగుతున్నాయి. ఈ అంశం పై 6 గురు సభ్యుల బృందం పబ్లిక్ హెల్త్ ఇమ్యునాలజీ ఇన్ఫెక్షన్ డిసీజ్ పై పరిశోదనలు చేస్తున్నారు. త్వరగా విస్తరిస్తుంది... ఓమైక్రాన్ లో ౩ రకాల సబ్ వేరియంట్స్ బిఎ1 ,బిఎ2, బిఎ౩ లు ఉన్నయని డబ్ల్యు హెచ్ ఓ కు సంబందించిన నిపుణులు డోనాల్డ్ సి విన్ సహాయ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ ఎం సి గిల్ యునివర్సిటి కెనడాకు చెందిన ఈయన కొన్ని ఆశక్తి కర అంశాలను వెల్లడించారు . ఇప్పటివరకూ పెద్ద సంఖ్యలో ఉన్న ఓ మైక్రాన్ కేసులు బిఎ1 కొన్ని ప్రాంతాలలో ఆక్టివ్ గా ఉంటె మరికొన్ని ప్రాంతలాలో బిఎ2   యాక్టివ్ గా ఉందని అది కలిసిపోయిందని బిఎ 1 కన్నా బిఎ 2 వేగంగా విస్తరిస్తోందన్న విషయం గుర్తించాలని అని అభిప్రాయ పడ్డారు.ఓమైక్రాన్ సిస్టర్ వేరియంట్ ఒక్కో ప్రాంతంలో ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నయన్నది ఊహ అంచనా మాత్రమేనా? లేకా అంచనా గా చెప్పవచ్చ?లేకా వాస్తవం ఏమిటి అన్నది తేలాల్సి ఉందని జాన్స్ వదికిన్స్ ఆసుపత్రికి చెందిన హెల్త్ సెక్యూరిటీ కి చెందిన డాక్టర్ అమేష్  అడల్జా స్కాలర్ గా పనిచేస్తున్నారు. బిఎ2 సబ్ వేరియంట్ విస్తరిస్తోందన్న అంశం ఇంకా పరిశోదనలో ఉంది. ఒమైక్రాన్ సార్స్ కోవిడ్2 పై శాస్త్రజ్ఞులు ఆశక్తి ప్రదర్శిస్తున్నారని ఎందుకంటే ఎక్కువసార్లు పరివర్తన చెందడం మ్యుటేట్ కావడం ప్రజల రోగనిరోదక  వ్యవస్థ పై ఒక భాగం ప్రభావం చూపుతుంది అనే అంశాన్ని పూర్తిగా పరిశోదన చేయాల్సి ఉందని పేర్కొన్నారు. వైరస్ ఇమ్యూన్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది వేరియంట్ యొక్క పెతో జనసిటీ విస్తరణ వ్యాధి రావడా నికి ఇన్ఫెక్షన్ కు కారణాలు స్వల్ప స్థాయి నుంచి తీవ్రస్థాయి గా మార డానికి కారణాల పై గ్లోబల్ హెల్త్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ టి ఐ ఇంటర్ నేషనల్ డాక్టర్ రిచర్ద్ రేల్తిన్ జర మాట్లాడుతూ కొత్తగా గుర్తించిన సబ్ వేరియంట్ బిఎ2 మూడు లక్షణాలు సహజమైనవి సార్క్ కోవిడ్2 వైరస్ ఓమైక్రాన్ వేరియంట్ ఒకటేనా ఎందుకు? కొన్ని దేశాలాలో బిఎ 2 ఉప్పెనగా మారిందని వార్తలు వస్తున్నాయి. బి ఎ2 ఇన్ఫెక్షన్లు అదనంగా మార్పు చెందుతూ ఉండడం వల్లే వేరియంట్ తీవ్రంగా విస్తరిస్తోందని రోగనిరోధక శక్తి పై ఎలా ఎలా స్పందిస్తుంది. ఓమై క్రాన్ లోని ఇతర వేరియంట్స్ బిఎ2 ఒకే రకంగా ఉన్నాయని.ఓమై క్రాన్ పేరెంట్ వేరియంట్      బి.1.1 ,529  సబ్ వేరియంట్స్ బిఎ 1, బిఎ౩ లకు థర్డ్ ఆప్షన్ బిఎ 2 పై వ్యాక్సిన్ ప్రభావం అన్న ప్రశ్నల పై ప్రజా ఆరోగ్య నిపుణులు తెలిపారు.అసలు మనకు ఏమి తెలుసు...బి ఎ2 పై సమాచారాన్ని నిపుణులు సేకరిస్తున్నారు. బిఎ2 ప్రజల పై తీవ్ర ప్రభావం చూపుతోందని ల్యాబొరేటరీ లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు ఒర్జినల్ ప్రాపర్టీ పై పరిశీలించారు. బిఎ 2 స్పైక్ ను కోల్పోతోంది?... ఇప్పటికే బిఎ 2 వేరియంట్ 69 నుంచి7౦ రకాలుగా మ్యుటేట్ అంటే రూపాంతరం చెందుతోందని జీన్ టార్గెట్ చేయడం లో విఫలం పి సి ఆర్ లో ను గుర్తించడం మరింత కష్టంగా మారింది.పెన్ స్టీల్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పబ్లిక్ హెల్త్ సహాయ ప్రొఫెసర్ డాక్టర్ అన్న ఎస్ సేతోగో మాట్లాడుతూ వైరస్ ఆరోగ్యంగా ఉన్న కణా లలో ప్రవేసిస్తోందని ఈ మార్పు బి ఎ2 వ్యాక్సిన్ ను సైతం తట్టుకుంటుందా అన్నది ఒక ప్రశ్న, కాగా దీనివల్ల వచ్చే ప్రభావం తప్పనిసరిగా నిర్ధారించాలి. ఓమై క్రాన్ త్వరగా విస్తరిస్తోందని వ్యాధి  తీవ్రత డెల్టా లేదా బీటా వేరియంట్స్ ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ వేసుకున్న వారిలో బాగానే ఉన్నారని. వారిలో కొంచం ఉత్తేజాన్ని శక్తిని ఇచ్చిందని. డాక్టర్ రేతిం జర అన్నారు కాగా ప్రస్తుతం ప్రాయోగ శాల లో ఇంకా పరిశీలించాల్సి ఉందని. పూర్తిగా క్లినికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని మరో రెండు వరాలాలో నివేదిక రావచ్చని అంచనా. డాక్టర్ విన్ మాట్లాడుతూ ఒక ముగింపునకు రావాలంటే సబ్వేరియంట్ ప్రజా ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం ఉంటుందో పరిశోదన చేయాల్సిన అవసరం ఉందని విన్ అభిప్రాయ పడ్డారు. అయితే ప్రస్తుతం ఈ అమ్శాన్మికి సంబంధించి చాలా తక్కువ సమాచారం ఉందని బిఎ2 ,బిఎ1 కు సంబందించిన ఖచితమైన దాటా ప్రకారం ఈ వైరస్ అంటు వ్యాదా కాదా? అది అందరికీ అన్తుకున్తుండా లేదా ? వ్య్యాది తీవ్రత బిఎ1 కన్నా కన్నా రోగనిరోదక శక్తి డెన్మార్క్ యుకే లో బిఎ1 బిఎ2 విస్తరణ వ్యాప్తి ఎలా ఉంటుంది అన్న విషయం పై సమగ్ర పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. సామగ్ర పరిశోదన తోనే సమగ్ర అవగాహన.అన్నది వాస్తవం.                  

read more
యాంటీ బాడీలు శరీరంలో ఎన్నాళ్ళు ఉంటాయి?...

కోవిడ్ ఇన్ఫెక్షన్ సంమయం లో యాంటీ బాడీలు కోల్పోతారా? వ్యాక్సిన్ తరువాత  యాంటీ బాడీలు ఎన్నాళ్ళు ఉంటాయి ? శరీరంలో కోవిడ్ బారిన పడ్డవారిలో యాంటీ బాడీలు 6 నెలలు మాత్రమే ఉంటాయా ? యాంటీ బడీలు ఉంటె దీర్ఘకాలం పాటుమనం బతికేయ్యచ్చ అన్నదే ప్రశ్న ప్రజలను వేదిస్తోంది.  కోవిడ్ ఇన్ఫెక్షన్ తరువాత యాంటీ బడీలు పోతాయా ? అన్న అంశం పై కొంతమని శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదన సారాంశాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం  చేస్తున్నామువ్యాక్సిన్ తీసుకున్న తరువాత కాలిఫోర్నియా లో వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ముఖ్యంగా గదులలో ఉన్నవారిలో మాస్క్ అవసరమా ? అన్న అంశంపై కూడా పరిశోధకులు పరిశోదనలు నిర్వహించారు. పరిశోధకులు చేసిన పరిశోధనలలో 4 రకాల కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఎవరి కైతే కోవిడ్ వల్ల స్ట్రోక్స్ వచ్చాయో వారు ఎక్కువరోజులు మాస్క్ వాడారని దీర్ఘకాలం పాటు సి డి సి విటమిన్ డి  లోపం తో పాటు కోవిడ్19 బారిన పడ్డారు . మీరు ఇప్పటికే కోవిడ్ బారిన పడి ఉంటె  మీ శరీరంలో  సహజంగా ఉన్న యాంటీ బాడీలు 2౦ నెలల తరువాత కోల్పోతారని నిపుణులు కనుగొన్నారు. నూతన పరిశోదన ప్రకారం చేసిన సూచనలు,నిపుణుల అధ్యనం లో కనుగొన్న అంశాలను తక్షణం అప్రమత్తం గా ఉండాలని ఇన్ఫెక్షన్ నుండి రక్షణ పొందాలంటే కోవిడ్ నియంత్రణలో వ్యాక్సిన్ కీలకం కోవిడ్ నివారణలో ఒక ఎత్హుగడగా మాత్రం చెప్పవచని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ఈ పరిశోదనలో ప్రజలు యాంటీ బాడీలు కోవిడ్ తరువాత  చుట్టూ ఉంటాయని ఆ తరువాత మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి ఉందొ లేదో తెలియదు. శరీరంలో సహజంగా ఉండే యాంటీ బాడీలను సంరక్షించుకోవడం అవసరమని కాలి ఫోర్నియా విశ్వ విశ్వ విద్యాలయానికి చెందిన ఇమ్యునలజిస్ట్ డాక్టర్ ఒట్టో యాంగ్,లోస్ ఎన్జిలిస్  స్కూల్ ఆఫ్ మెడిసిన్ డేవిడ్ జేఫిన్ పరిశోదనలను సమీక్షించారు. ప్రజలలో కోవిడ్19  యాంటీ బాడీలు ఉన్నప్పటికీ మళ్ళీ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు తేల్చి చెప్పారు. యు ఎస్ లో వ్యాక్సిన్ తీసుకొని వారిలో 816 మందివద్ద సేకరించిన రక్త నమూనా ల పై పరిశోదనలు నిర్వహించారు. కోవిడ్ 19 పోజిటివ్ ఉన్న వారిలో పరిశోధకులు యాంటీ బాడీలు 99 % ఉండాలని ఇప్పుడు ఎంత ఉందొ కనుగొన్నారు. వారిలో కోవిడ్ ఉన్న విషయం  తెలిసినా 55% మందిని పరీజ్శించలేదు. ప్రతి ఒక్కరిలో కోవిడ్ 19 యాంటీ బాడీలు ఉన్నాయని. యాంటీ బడీలు కొంత కాలం పాటు ఉంటాయనిబాల్టీ మోర్  హోప్ స్కిన్ విశ్వవిద్యాలయానికి చెందిన  పరిశోధకులు ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ డోర్రి సేగివ్ సహజంగా వచ్చే రోగనిరోదక శక్తి ఇమ్యూనీటిని యాంటీ బాడీలను సంరక్షించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ప్రస్తుత పరిస్థితులలో ఇమ్యునిటీ ని మదింపు చేయాలని. వ్యాక్సిన్ వెరిఫికేషన్ ఇమ్యునిటీ ఇన్ఫెక్షన్ పరిశీలించాల్సి ఉందని పేర్కొనారు. ఇప్పటికే యాంటీ బాడీల లెవెల్స్ శాశ్వతం కాదని నిపుణులు తేల్చి చెప్పారు. వారిలో ఇన్ఫెక్షన్ కు గురికావు ఖచ్చితమైన సాక్ష్యంగా యాంటీ బాడీలలెవెల్స్ క్లినికల్ సంరక్షణకు సంబంధం ఉంది. కోవిడ్ స్మ్రాక్షణలో వ్యాక్సిన్ ఒక కేవియట్ లాంటిదని. సహజంగా వచ్చే రోగ నిరోధక శక్తి ని అవి సంరక్షిస్తాయని నిపుణులు గమనించారు. ఈ అంశం పై అమెరికన్ మెడికల్ అసోసియేషన్ పరిశోదనలో ప్రచురించారు. ఇతర పరిశోదనలో కోవిడ్19 యాంటీ బాడీలు కేవలం 6 నెలలు మాత్రమే ఉంటాయని తేల్చారు.నూతన పరిశోదనలో అందిన సమాచారం ప్రకారం కొన్ని వర్గాల ప్రజలలో ఒకే వర్గం లో సహజంగా యాంటి బాడీలు పడిపోతాయని యాంగ్ గుర్తించినట్లు తెలిపారు. మీలో సహజంగా ఉండే యాంటీ బాడీలు ఉంటె అంటే దాని ఆర్ధం మిమ్మల్ని మీరు ఇన్ఫెక్షన్ సోకకుండా సంరక్షిస్తుందని లేనోక్స్ ఆసుపత్రికి చెందినా స్పూలర్ హిల్ ఆసుపత్రికి చెందినా పల్మనా లజిస్ట్ డాక్టర్ లేన్ హీరోవిత్జ్ అన్నారు. కొన్ని నెలలలో మీరక్తంలో యాంటీ బాడీలు కోల్పోతారని ఈ అంశం పై అలా జరగకుండా ఉండాలంటే ఏమి చేయాలి? ఎలా సంరక్షించాలి? అన్నదే కీలక అంశమని హలో విన్జ్ అభిప్రాయ పడ్డారు. ప్రజలు ఎవరైతే కోవిడ్19 వ్యాధిలో తీవ్రంగా బాధపడ్డారో వారిలో ఎక్కువ మొత్తంలో యాంటీ బాడీలు ఉన్నప్పటికీ ఎప్పటికీ మిమ్మల్ని మీరు సంరక్షించుకోలేరు.అని నిపుణులు గుర్తించారు. కోవిడ్ 19 నుండి బతికి బట్టకట్టిన వారిలో కొన్ని రకాల కణాలలో రోగనిరోధక శక్తి పెంచేందుకు ప్రయత్నించారు. వీరిలో యాంటీ బాడీలు ఇమ్యునిటీ వేరు వేరుగా ఉంటాయని.లేదా రెండూ ఉండవచ్చని హిలోవిట్జ్ అన్నారు. సార్క్ కోవిడ్ లో మాత్రమే యాంటీ బాడీలు న్యూక్లియో క్యార్ సిద్ సంరక్షణ సాధ్యమని కోవిడ్ నుండి కోలుకున్న వారిలో వ్యాక్సిన్ సహజంగా వచ్చిన ఇన్ఫెక్షన్లు,యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తాయి. కోవిడ్ 19 నుండి మిమ్మల్ని మీరు సంరక్షించు కోవాలంటే ఏదైనా చెయ్యవచ్గని విజ్ఞప్తి చేసారు. వ్యాక్సిన్ వేయించుకోవాలని పబ్లిక్ ప్లేసులలో మాస్క్ తప్పనిసరిగామాస్క్  ధరించాలని యాంటీ బాడీలు పెంచుకోవాలని సామాజిక దూరం పాటించాలని, అనారోగ్యంగా ఉంటె ఇంటి వద్దే ఉండాలని నిపుణులు సూచించారు.                                 

read more
మానవాళి ని కాపాడుకోడం మన అందరి బాధ్యత.. 

ఇన్సులిన్ కు వందవపుట్టిన రోజు... ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మేటాబాలిక్ డిజార్దర్ లలో ఒకటి డయాబెటేస్. జీవన మరణ సమస్యగా మారిన డయాబెటిస్ కు ఇన్సూలిన్ ప్రాణం పోసిందనే చెప్పాలి. ఇన్సులిన్ కనుక్కుని నేటికి వంద సంవత్చరాలు పూర్తి అయిన  సందర్భంగా డబ్ల్యు హెచ్ ఓఏ ప్రిల్ 1 4 ను నళినీ సాలిగ్రాం ఆరోగ్యా వరల్డ్. వ్యవస్థాపకురాలు స్వచ్చంద సేవాసంస్థ వ్యాపార కోణంలో కాకుండా ప్రపంచ ఆరోగ్యం కోసం ఉద్యమ స్పూర్తితో ఇన్సులిన్ ను  అందరికీ అందించే ప్రయత్నం చేసారు. 2౦21  ప్రపంచ కోవిడ్  సంబందిత అంశాలను గుర్తు చేసుకుంటోంది. ఈ రోజును అందరు గుర్తుంచుకోవాలి. ప్రపంచ మానవాళికి ఒక అద్భుతాన్ని అందించింది ఈ అద్భుతం ఆవిష్కృత మై నేటికి వంద ఏళ్ళు దాటింది.ఇన్సూలిన్ ను కనుగొనడం ద్వారా ప్రాణం కపాడినట్లే అని చెప్పక తప్పదు. వైద్య రంగం లో హాల్ ఫేం గా నిలిచిపోతుంది యాంటీ బాయిటిక్స్, వ్యాక్సిన్లు, సాంకేతికత వృద్ధి చెందిన రోజులలో క్యాన్సర్ కు ధేరపీలు, తది తరాలాలో వృద్ధి సాధించాం. దీనివల్ల నాణ్యతతో కూడుకున్న జీవితాన్ని అందించిన ఘనత శాస్త్రజ్ఞులదే వారి బాధను తగ్గించగలిగాం. కాబట్టి ఇప్పటికీ మనం జీవించగలుగుతున్నాం. టైపు 1 డయాబెటీస్ ను నిలువరించేందుకు డాక్టర్ ఫ్రెడ్రిక్ బెంటింగ్ చార్లెస్ బెంట్ వారి సహాయక బృందం అద్భుతాన్ని కనుగొన్నారు.  డయా బెటిస్ జీవన మరణ సమస్య గా మారిన డయాబెటీస్ కు ఇన్సూలిన్ ప్రాణం పోసినట్లయింది అని చెప్పాలి. మిగిలిన 5౦౦  మంది మిలియన్ల ప్రజలు నేటికీ డయాబెటిస్ తో జీవిస్తున్నారు. టైప్2 డయాబెటిస్ కు శక్తి వంతమైన ఆయుధం ఈ సమస్యనుండి బయట పడడానికి మందులు మాత్రలు వాడే వారు కొందరైతే ఇన్సులిన్ ద్వారా డయాబెటిస్ ను నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఇన్సులిన్ ద్వారా భవిష్యత్తులో వచ్చే తీవ్ర పరిణామాలాను నియంత్రించ లేమని అయితే డయాబెటిస్ వల్ల వచ్చే గుండె నొప్పి, కిడ్నీ సమస్యల వల్ల ఎప్పటికీ పాడై  పోకుండా కొంత మేర ఇన్సులిన్ సహకరిస్తుంది. డయాబెటీస్ వల్ల వచ్చే డయాబెటిక్ ఫుట్ డయాబెటిక్ నేఫ్రోపతి, డయాబెటిక్ న్యూరో పతి, వల్ల వచ్చే దీర్ఘ కాలిక సమస్యలు కంటి చూపు కోల్పోకుండా ఇన్సులిన్ సహకరిస్తుంది. డయాబెటిస్ నాన్ కామ్యునికేబుల్ డిసీజ్ దీని వల్ల గుండె సమస్యలు, క్యాన్సర్, దీర్ఘ కాలిక ఊపిరి తిత్తుల సమస్యల తోపాటు మారో పది కారణాలు మరణానికి కారణ మౌతున్నాయి. శతాబ్దంగా వృద్ధి చెందు తున్న డయాబెటిస్ పై  పోరాడేందుకు మిలీనియంలో సాధించిన ఘనతగా చెప్పవచ్చు. డయాబెటిస్ నిరోధం - చిన్న పరిష్కారం... డబ్ల్యు హెచ్ ఓ లెక్కల ప్రకారం 8౦% గుండె సంబదిత వ్యాధులు.               8౦% టైప్ 2 డయాబెటిస్                4౦ % క్యాన్సర్లు  జీవనశైలి మార్పు ద్వారా డయాబెటిస్ ను కొంతమేర పెరగకుండా నిరోధించ వచ్చు. సరైన సమయానికి తినడం, పొగతాగడం  మానేయాలి, శరీర వ్యాయామం చేయాలి. డయాబెటిస్ ను నివారించేందుకు చేసే క్లినికల్ ట్రైల్స్  కార్యక్రమం చేపట్టడం అవసరం. ప్రజా ఆరోగ్యం పై వైద్యం, ఆహారం శరీర వ్యాయామం ద్వారా డయాబెటిస్ ను నిరోధించ వచ్చు. ఒక రోజు చేస్తే పది సంవత్సరాల జీవన ప్రమాణం పెరుగుతుంది. 4 నాలుగు బిలియన్ల ప్రజలు నేడు నాన్ కమ్యునికేబుల్  డి సీజ్ తో బాధపడు తున్నారని ఈ సమస్యకు చికిత్స చేయడం అంత సులభం కాదని అన్నారు. దీనికి కారణం సమస్య చాలా పెద్దది. దీనిని నిరోధించాలంటే సులువైన పరిష్కారం ఆరోగ్యం లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా  గమనించడం. ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చెయడం. ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యు హెచ్ ఓ ప్రభుత్వాలకు డయాబెటిస్ నివారణ నిరోధానికి సహకరించేందుకు సిద్ధ మయ్యింది. ప్రత్యేకంగా యువతీ యువకులు స్థూల కాయం తగ్గించేందుకు దృష్టి పెట్టాలని సూచించింది. డయాబెటిస్ వంటి సమస్యపై డబ్ల్యు హెచ్ ఓ చేస్తున్న ప్రాయాత్నాన్ని ముందు చూపును ప్రతి ఒక్కరు అబ్భినందించాలి.  చర్యలు ఒక్కటే మార్గం కాదు... భారాత్ లో ప్రతి నలుగురిలో ముగ్గురికి డయాబెటిస్ తో బాధ పడుతున్నరాని, డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని అంచనా. 1౦ -2౦ సంవత్సరాల కు ముందే పస్చిమ ప్రాంతం  లోని ప్రజలు డయాబెటిస్ బారిన పడ్డట్టు సమాచారం. ప్రజా ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని ప్రమాద ఘంటికలు సూచిస్తున్నాయని డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరించింది. ఇందుకోసం ఏమైనా చెయ్యాలి స్వచ్చంద సంస్థలు, నాయకులు, ప్రతిరోజూ డయాబెటిస్ నివారణకు ప్రయత్నం చెయడం అవసరం. కోవిడ్ సమయంలో నివారణ చాలా ముఖ్యం అత్యవసరం. ఎందుకు అంటే ప్రజలు తమకు తెలియ కుండానే డయాబెటిస్ బారిన పడడం విచారకరం.  ఇది చాలా ప్రమాదకరమైన డిజార్డర్ గా పేర్కొన్నారు. కోవిడ్ తరువాత అత్యంత ప్రమాదకరమైన దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్సులిన్ వందరోజుల పుట్టిన రోజు సందర్భాగ వైద్య రంగంలో అత్యంత ప్రభావ వంతమైన పరిణామం గా దీనికోసం శాస్త్రజ్ఞ్యులు పడిన తాపత్రయం, శ్రమ, కృషి, అభినందానీయం శ్లాఘనీయం ఇన్సులిన్ ను వ్యాపారాత్మక కోనాం లో కాక ఒక్కదాలార్ కు కూడా అమ్మరాదని, ఇన్సూలిన్ నాకోసం కాదు మానవాళి కోసం అన్నదే లక్ష్యంగా ముందుకు సాగారని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలన్న ఆలోచనతో కలిసి రావాలని సహక రించాలని డబ్ల్యు హెచ్ ఓ కోరింది. నగరాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ స్థాయిలో అన్ని రంగాలవారు,సమాజంలోని, అన్ని వర్గాలు,విభాగాలు, తరువాత తరాన్ని, కాపాడాల్సిన బాధ్యత ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యతగా గుర్తించాలాని   అని డబ్ల్యు హెచ్ ఓ పిలుపునిచ్చింది. వ్యక్తులు... కోవిడ్ సమయంలో దానిదశ మార్చు కుంటోంది. ఆమార్పుకు అనుగుణంగా ప్రతిరోజూ కొన్ని చర్యలుచేపట్టాలి. మన ఆరోగ్యం పట్ల ముందు చూపుతోవ్యావహ రించండి.సరైన ఆహారం తీసుకోడం సరైన చర్యలు కార్యాచరణ అమలు చెయడం అవసరం. కంపెనీలు... నిత్యం నిర్ణయాలాతో పోరాడుతున్న  కార్మికులు, ఉద్యోగుల బధ్రత కల్పించాలి. కార్మికులు తిరిగి పనికి రావాలంటే మీకార్యాలయాల్లో ఆరోగ్యంగా ఉండాలి. పని చేసే ప్రదేశాలాలో కార్మికుల మానసిక ఆరోగ్యం ముఖ్యం. అప్పుడే మీశక్తి యుక్తులుమార్కెట్లో మీ లక్ష్యం నెరవేరడానికి వీలు అవుతుంది. డయాబెటిస్ నిరోదానికి పెద్ద సంఖ్యలో ప్రచారం అవగాహన కల్పించవచ్చు.  విద్యా- స్వచ్చంద సంస్థలు... మీరు ఓల ఉత్త మొత్తమమైన వృత్తిలో పవిత్రమైన వృత్తిలో పిల్లలకు జ్ఞానాన్ని అందిస్తూ వారిని చైతన్యం చేయగల శక్తి మీలో ఉంటుంది. స్వ్సచ్చంద సంస్థల సహకారం తో కలిసి పని చేస్తే దీర్ఘ కాలిక అనారోగ్యం పై విజయం సాధించవచ్చు. సామాజిక సంఘాలు... స్వచ్చంద సేవా సంస్థలు  తమ సేవలను అందిస్తు నప్పుడు ఆయా సంఘాల ద్వారా మిలియన్ల  స్త్రీలకు  పిల్లలకు పని చేసే ఉద్యోగులు ఆరోగ్యంగా  జీవించడానికి నూతన విధానాల ద్వారా మార్పు సాధించవచ్చు. వంద సంవత్సరాల కృషిని 1౦౦ మిలియన్లలో జీవించగలిగే ఇన్సూలిన్ అవసరం ఉన్నవారికి ఇవ్వడం ముఖ్యం. డయాబెటిస్ ను నివారించడం ద్వారా ఆరోగ్య జీవన ప్రమాణం పెంచవచ్చు. సి ఎస్ అర్ ఫండింగ్... కార్పోరేట్ సోషల్ రేస్పొంసిబులిటి ఫండ్ కింద పలు కార్యక్రమాలు చేపట్టే కోర్పోరేట్ సంస్థలు నాన్ కమ్యునికేబుల్ డిసీజ్ గ చెప్పబడే డయాబెటిస్ నివారణకు గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి స్వచ్చంద సంస్థల తో కలిసి పని చేయాలి కార్పోరేట్ రేస్పొంన్స్ బులిటీ ఫండ్ అందించాలి అని డబ్ల్యు హెచ్ ఓ స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ ప్రాణాలు హరించక ముందే మానవాళి ని కాపాడుకోడం మన అందరి బాధ్యత.      

read more
ఒక్క పరీక్షలో మహిళల క్యాన్సర్ గుర్తించవచ్చు...

  ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా స్త్రీ లలో వచ్చే వివిదరకాల క్యాన్సర్ ను గుర్తించాలంటే మేత్రిమల్ రిస్క్ అయిడెంటి ఫికేషణ్ టెస్ట్ డబ్ల్యు ఐ డి టెస్ట్ ద్వారా మహిళల లో ఒకటి రెండు కాదు కాదు నాలుగు రకాల క్యాన్సర్స్ కు పరీక్షలు ఒకే సారి చేయవచ్చు ముఖ్యంగా డబ్ల్యు ఐ డి టెస్ట్ ద్వారా క్యాన్సర్ రాక ముందే నివారించేందుకు కొంత దోహదం చేస్తుంది. అని నిపుణుల అభిప్రాయం. నేచర్ జర్నల్ లో ప్రచురితమైన రిపోర్ట్ లో బ్రిటన్ శాస్త్రజ్ఞులు ప్రత్యేకంగా తొలి ఫలితంలో ప్రత్యేకంగా మహిళల కోసం ఒక ప్రత్యేక మైన పరీక్ష లను  వృది చేస్తున్నారు. దీని సహకారం తో ఒకటి లేదా రెండు లేదా నాలుగు రకాల క్యాన్సర్ పరీక్షలు ఒకే సారి చేయవచ్చని తెలుస్తోంది.డబ్ల్యు.ఐ.డి పరీక్ష ఎలా పనిచేస్తుంది... ఈ పరీక్ష పద్ధతి పేరు  ఉమెన్ క్యాన్సర్ అయిడెంటీ ఫికేషణ్ టెస్ట్ ఈ పరీక్ష పాప్సీ మేయర్ పరీక్షతో  కలిసిన సెల్స్ డి ఎన్ ఏ  ను పరీక్షిస్తుంది.  ప్యాప్సి మేయర్ పరీక్ష లో మహిళల యోని లో ఒక యంత్రం అమర్చి కొన్ని సెల్స్ ను తీసుకుంటారు. దీనిద్వారా క్యాన్సర్ కణాలను గుర్తిస్తారు. ఇది సర్వైకల్ క్యాన్సర్ కణాలను గుర్తిస్తారు.ఇది సర్వైకల్ క్యాన్సర్ ను పరీక్షించేందుకు ఒక పద్ధతి డబ్ల్యు ఐ డి ద్వారా సేకరించిన స్యామ్ ఫిల్ లో  ఓవరియన్ ఏండో   మెట్రిమల్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేస్తారని శాస్త్రజ్ఞులు అంటున్నారు. పరిశోదన ఏం చెపుతోంది ?... యూరప్ కు చెందిన శాస్త్రజ్ఞులు 15 సెంటర్లలో 2,౦ ౦ ౦  మంది మహిళల పై పరిశోదనలో వీరి అందరి వద్ద సర్వైకల్ సేల్స్ పరీక్షించగా పరీక్షలో డి ఎన్ ఏ విశ్లేషించగా దీనిసాహాకారం తో వారి జెనెటిక్ మూల కణాలు చరిత్ర తెలుస్తోంది. దీని ఆర్ధం మహిళలు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా ? ఈ పరీక్ష ద్వారా మరింత ఉపయోగ పడుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశోదకులు ఏమంటున్నారు.?... పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం రక్తపరీక్ష,అల్ట్రా సౌండ్ , ఓవేరియన్ ఏండో మెట్రి మల్ క్యాన్సర్ ను త్వరగా గుర్తించలేము వీటి గురించిన పూర్తి అవగాహన తెలుసుకునే లోపే ఆలస్యం చేసిన కొద్దీ మరింత ఆలస్యం అయిపోతుంది.అందుకోసం సకాలం లో రోగికి  చికిత్స చేయలేక పోతున్నాము. డబ్ల్యు ఐ డి లో పరీక్ష ద్వారా మహిళలకు క్యాన్సర్ తో పోరాడేందుకు అత్యంత కీలకంగా కాగలదని ఒక సాదనం గా ఉపయోగపడగలదు. మహిళల లో వచ్చే 4 రకాల క్యాన్సర్ లు... ఓవరియన్ క్యాన్సర్ ... ఒవరియన్ క్యాన్సర్ ప్రపంచం లో చాలా ఎక్కువ మందిని పొట్టన పెట్టుకుంటున్న క్యాన్సర్ 75% ఓవేరియన్ క్యాన్సర్ చివరి స్టేజిలో గుర్తిస్తున్నారు. బృస్ట్ క్యాన్సర్ వక్షోజాల క్యాన్సర్... భారత్  లాంటి దేశాల లోని మహిళల లో వచ్చిన క్యాన్సర్ లలో 2 7 % బ్రస్ట్ వక్షోజాల క్యాన్సర్ చాలా చిన్న వయసున్న పిల్లలలో ఈ లక్షణాలలో కనిపిస్తున్నట్లు శాస్త్రజ్ఞులు ఉంటున్నారు. సర్వైకల్ క్యాన్సర్... ప్రపంచ వ్యాప్తం గా ప్రతి నిమిషానికి ఒక మహిళ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. చాలా కేసులలో అభివృద్ది చెందిన చెందుతున్న దేశాలలో గుర్తించి న ల్ట్లు  తెలుస్తోంది అంటే భారత్- చైనా దేశాలలో పరిస్థితి మరింత దీనంగా తయారయ్యిందని నిపుణులు పేర్కొన్నారు. ఏండో మెట్రి మల్ క్యాన్సర్... 55 సంవత్సరాల పై బడిన వారిలో ఈ క్యాన్సర్ వస్తుంది. హార్మోన్ లోపం కారణం గా తక్కువ వయస్సులో ఉన్న వారిలో పెరుగుతుంది. ఇలా కోణసాగితే భావిష్యత్తులో తక్కువ వయస్సులో ఉన్న మహిళలలో క్యాన్సర్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.   ఒక్క టెస్ట్ నాలుగు క్యాన్సర్ల నిర్ధారణ.  ప్రజలకు అందుబాటులోకి వస్తే  మహిళలు ఎదుర్కునే క్యాన్సర్ తో పోరాడవచ్చు.             

read more
మీ కిడ్నీలు ఆరోగ్యం గా ఉంచుకోండి.

శరీర అవయవాలలో కీలక అవయవం కిడ్నీ. రెండు కిడ్నీ లలో ఒకటి పాడైనా ఒక కిడ్నీ తో బతికేస్తున్న వాళ్ళు ఉన్నారు. కిడ్నీ సమస్యలకు కారణం ఇన్ఫెక్షన్, డయాబెటిస్, కిడ్నీ ఇంజురీ కిడ్నీ పూర్తిగా పాడై పోవడం ఒక్కసారి కిడ్నీ స్థానం లో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీర్ఘ కాలంగా కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడం అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ మోతాదులో మందులు వాడద్దు... సహజంగా నొప్పి వచ్చిందంటే పెయిన్ కిల్లర్స్ వాడేయడం అలవాటుగా మారిపోయింది. ఒక్కో సారి డాక్టర్ ను సంప్రదించకుండా నే గత నెల వాడిన మందులు మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎం ఎస్ ఏ ఐ డి ఎస్ నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇంఫ్లా మెటరీ మందులు ఇబుఫ్రూబిన్, నోప్రోక్సిన్, వంటి మందులు కిడ్నీలను నాశనం చేస్తాయి. ఒక్కోసారి అధికంగా ఎక్కువగా మందులు వాడితే లేదా తరచుగా వాడినా ప్రోటాన్ పంప్ ఇన్ హిబిటర్స్ ను అల్సర్స్ కు,దీర్ఘ కాలం కిడ్నీ వ్యాదులకు జీ. ఇ . ఆర్.డి వాడే టట్ల యి తే మీ డాక్టర్ సూచన మేరకు అవసర మైతే నే వాడండి. యాంటీ బాయిటిక్స్ తో జాగ్రతగా ఉండండి... బ్యాక్టీరియా ను ఎదుర్కునే మందులు మీకిడ్నీలను నాశనం చేస్తాయి. తరచుగా వాడినా మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాడిన మీకిడ్నీలు పనిచేయకుండా పోతాయి. అందులో పెన్సిలిన్,సల్ఫనా మైడ్స్,సేఫలా స్ పోరిన్స్ వల్ల సమస్యలకు దారి తీయ వచ్చు. హెర్బల్ సప్లిమెంట్స్ కు మారండి...  సప్లిమెంట్స్ ఉత్పత్తులు సురక్షితం అని నిరూపించాల్సి ఉంది.అందులో కూడా కొన్ని సప్లిమెంట్స్, కిడ్నీ లను నాశనం చేస్తాయి. మీకు ఒక వేళ కిడ్నీ వ్యాధులు ఉంటె మందుల వల్ల పరిస్థితి మరింత దిగజారి పోతుంది. హెర్బల్ సప్లిమెంట్స్ మందులు ఎలా పని చేస్తాయి వాటి ,వాడకం అన్న అంశం పై డాక్టర్ ను సంప్రదించాలి. ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం... మీరు తాగినా తిన్నా ఏదైనా అరగాలంటే కిడ్నీ నే కీలకం. అది మంచి అయినా చెడు చేసేవి అయినా కొవ్వు పదార్ధాలు ఉప్పు, చక్కేర, అధికంగా వాడితే బ్యాడ్ డైట్ వల్ల హై బిపి కి లేదా ఊబ కాయానికి ఇతర సమస్యలకు దారి తీస్తుంది. దీనివల్ల కిడ్నీ పై భారం పడి గట్టిగా తయారు అవుతుంది. కిడ్నీ ఆరోగ్యం గా ఉండాలంటే కూరగాయలు,పండ్లు, పప్పులు,త్రుణ ధాన్యాలు కొన్ని ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకుంటే మీ కిడ్నీ ఆరోగ్యం గా ఉంటుంది. మీ ఉప్పు వాడకం గురించి తెలుసుకోండి... మనం వాడే మినరల్ వివిదరకాల ప్రభావం చూపుతుంది. ఉప్పువల్ల మూత్రం లో ప్రోటీన్ ను పెంచుతుంది. ఒక వేళ ఉప్పు వాడకం ఎక్కువగా ఉంటె వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ఎక్కువగా వాడితే బిపి కి దారితీస్తుంది. బి పి వల్ల కిడ్నీ వ్యాధులు పెరగ వచ్చు. కిడ్నీలో రాళ్ళు పెరగడం వల్ల కిడ్నీ దగ్గర నొప్పిగా ఉంటుంది. కిడ్నీకి చికిత్స చేయకుండా కిడ్నీ పాడై పోయే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సరిపడా నీరు తాగండి... నీరు తాగడం వల్ల కిడ్నీలకు అత్యంత కీలక మైన న్యూట్రియం ట్స్ అందుతాయి. మీ బ్లాడర్ ద్వారా మూత్ర విసర్జన ద్వారా శరీరం లోని పనికి రాని చెత్త బయటకు పోతుంది. మీరు కనక సరిపడా నీరు తాగ నట్లైతే శరీరంలో ఉన్న చిన్న చిన్న క్రిస్టల్స్ ఏర్పడి రాళ్ళలా తయారు అవుతుంది. లేదా ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుంది. దీనివల్ల తాత్కాలికంగా స్వల్పంగా డీహైడ్రేషన్ జరిగి కిడ్నీ కి తీవ్రంగా నష్టం అయ్యే అవకాశం ఉంది. రోజుకు 4, లేదా 6 కప్పుల నీళ్ళు తాగడం కష్టం గా ఉంటుంది. మీరు అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే నీరు తాగాలి వేడిని తట్టుకోవాలంటే నీరు త్గాగడం తప్పని సరి. శరీర వ్యాయామం... అర్రోగ్యంగా ఉండేందుకు ఆహారం తో పాటు శరీర వ్యాయామం చేయడం వల్ల డయాబెటిస్, గుండెకు సంబందించిన వ్యాధులు నివారించాకుంటే కిడ్నీ ప్రమాదానికి దారి తీయవచ్చు. ఒకవేళ అందుకు మీరు సిద్ధంగా లేకుంటే మీరు తోచిన విధంగా పని చేస్తే 3౦ నిమీ 6౦ నిమి 5 వారాలలో మెల్లగా కిడ్నీ పాడై పోతుంది.లేదా ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలకు ఉంటె ముందుగా మీరు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. స్క్రీనింగ్ చేయించండి... అసలు మీ కిడ్నీ ఎలా ఉంది. కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున కిడ్నీ సైజు లో మార్పులు ఎలాఉన్నాయా ?అన్న విషయం తెలుసుకోవాలంటే కిడ్నీ స్క్రీనింగ్ అత్యవసరం లేదా మీ సమీప బంధువులకు గుండె వ్యాధులు ఉంటె హై బిపి డయాబెటిస్ ఉన్న చరిత్ర మీ కుటుంబానికి మీ కుటుంబం లో ఎవరికైనా కిడ్నీ ఫైల్యూర్ వంటి సమస్యలు ఉంటె డాక్టర్ ప్రత్యేకంగా కిడ్నీ పరీక్ష ను సూచించ వచ్చు. మీ రెగ్యులర్ చకప్ తో పాటు ప్రాధమిక స్థాయిలో కిడ్నీ సమస్యను గుర్తిస్తే సత్వరం చికిత్స చేసి కిడ్నీ పాడై పోకుండా నివారించవచ్చు. మద్యంతో జాగ్రతగా ఉండండి... మీరు ఆరోగ్యంగా ఉంటె కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుంది. కిడ్నీకి హానికలగ కుండా ఒకటి,లేదా రెండు గ్లాసులు తీసుకోండి. రెండు గంటలలో నాలుగు డ్రింక్స్ తీసుకుంటే తీవ్రంగా కిడ్నీ ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉంది. దీర్ఘ కాలిక సమస్యలకు దారి తీయవచ్చు. మీరు తీసుకునే మందు మద్యం మీకు డీ హైడ్రేషన్ కలిగించ వచ్చు. మీ కిడ్నీ సరిగా పనిచేయాకుండా నిలువరిస్తుంది. దీనివల్ల బరువు పెరగడం. హై బిపి ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. అది కిడ్నీ పై తీవ్ర ఒత్తిడికి గురి అవుతుంది. ధూమ పానం సిగరెట్ పొగను వదిలిపెట్టండి... మీకు సిగరెట్ తీసుకునే అలవాటు ఉంటె అది మీ కిడ్నీ సమస్యకు దారి తీస్తుందన్న విషయం మీకు తెలుసా? కిడ్నీ క్యాన్సర్ వల్ల రక్త నాళాలు నాశనం అవుతాయి. కిడ్నీలో సమస్య వస్తే రక్త ప్రసారం నెమ్మదిగా నెమ్మదిగా ఉంటుంది.  మీరు సిగరెట్ తాగే అలవాటు వల్ల కొన్ని మందుల పై ప్రభావం చూపుతుంది. హై బిపి వస్తుంది. దీనిని నివారించడం అసాధ్యం. ఇదే కిడ్నీ వ్యాధికి కారణం అవుతుంది. అనారోగ్యాన్ని సమార్ధ వంతంగా నిర్వహించుకోవాలి... మీ కిడ్నీ సమస్యకు కారణం రెండు ఒకటి డయాబెటిస్, రెండు హై బిపి సమతుల పోషక ఆహారం రోజూ వ్యాయామం చేయడం వల్ల డయాబెటిస్ ను నియంత్రించవచ్చు. బ్లడ్ షుగర్ పై దృష్టి పెట్టాలి అవసరమై నప్పుడు ఇంసూలిన్ తీసుకోండి. హై బిపి ని ఎప్పటి కప్పుడు చక్ చేయండి మీ డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడండి. కిడ్నీని కాపాడుకోండి.

read more
నియో కొవ్ ప్రమాదకరమా ?..

కరోనా కొత్త వేరియంట్ నియో కొవ్ ప్రమాదకరమా ?..కరోనా కొత్తవేరియంట్ పేరు నియో కొవ్ వింతగా ఉంది కాదు. కరోనా వైరస్ ఒకదాని తరువాత మరో వేరియంట్ ముందుకు వస్తున్నాయి. వేరు వేరు వేరియంట్లు విశ్వరూపం చూపిస్తున్నాయి. భారత్ లో కరోనా  డెల్టా వేరియంట్ కరోనా రెండవ విడతలో త్గీవ్ర రూపం దాల్చింది. అల్ల కల్లోలం సృష్టించింది. చాలా దేశాలలో డెల్టా వేరియంట్ స్థానం లో కరోనా కొత్తవేరియంట్ ఒమైక్రోన్ ముందుకు వచ్చింది. అయితే దీనిగురించిన పూర్తి సమాచారం పూర్తిగా రాలేదు. ఈ మధ్యలో మరోకొత్త వేరియంట్ పేరు తెరమీదకు వచ్చింది. దీని వల్ల ప్రజలలో మరింత ఆందోళన కలిగిస్తోంది. కొత్త వేరియంట్ పేరు నియో కొవ్... దక్షణ ఆఫ్రికా గబ్బిలాలలో గుర్తించారు. అయితే ఈ వైరస్ ఎంత ప్రామాదకరమంటే వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మరణించే అవకాశం ఉంది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరోనా కొత్త వైరస్ పేరు నియో కొవ్ గురించిన సమాచారం పెద్దగాలేదు. దీనిపై అందించిన సమాచారం ఏమేరకు సరైనది గా భావించాలి. రిపోర్ట్ సరైనదా కాదా? అన్న సమాచారం పూర్తిగా లేదు. ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్న అంశం చైనా శాస్త్రజ్ఞుల పరిశోదన కి సంబందించిన రీసెర్చ్ పేపర్ ఒకటి  కనుగొన్నట్లువైజ్ఞానికులు దృవీకరించలేదు. 'కరోనా వైరస్ కొత్త వేరియంట్ నియోకోవ్ ఏమిటి ? నియో కొవ్ వైరస్ కొంతకాలం ముందే దక్షిణ ఆఫ్రికాలో గబ్బిలాలలో వైరస్ గుర్తించారు. అసలు నియోకోవ్ తయారు చేసిన వైరస్ గా అనుమానం కలుగు తోంది. దాదాపు కోరోనా వైరస్ లాంటిదే 2౦12 లో దక్షిణ ఆశియాలో విస్తరించడం లో మిడిల్ ఈస్ట్ లో సంక్రమించింది. రేస్పి రేటరీ సిండ్రోం కు జన్మనిచ్చిందా? గబ్బిలాల లో వైరస్ అన్న విషయం గుర్తుకు వచ్చినప్పుడు ఊహాన్ ఘటన గుర్తుకు రాక మానదు. ఈ నేపధ్యం లో నియోకోవ్ జంతువులనుండి జంతువులకు సోకుతుందని మరో వాదన వినిపిస్తోంది. జంతువుల నుండి మనిషికి సోకడం ఎంతసేపు అయితే నియోకోవ్ వైరస్ ప్రభావం ఎలాఉంటుంది? నియోకోవ్ లక్షణాలు ఎలా ఉంటాయి అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. నియికోవ్ సోకిందో ప్రతి 5 గురిలో 3 ముగ్గురు ముగ్గురిలో ఒకరు మరణిస్తారని నిపుణులు పేర్కొన్నారు. ఓమై క్రాన్ సబ్ వేరియంట్ ను 5 7 దేశాలలో గుర్తించామన్న డబ్ల్యు హెచ్ ఓ వెల్లడి. బి ఏ 2 కొత్త వేరియంట్ తో ప్రజలు అప్రమతంగా ఉండాలి డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరిక. కొత్త వేరియంట్ బి ఏ 2 ముందు వచ్చిన వేరియంట్ల కన్న అత్యంత ప్రమాదకరమని బి ఏ 2 అత్యంత ప్రభ్హావ వంతమైన దని దీనిలక్షణాలు అర టి పి సి ఆర్ కు కూడా అందడంలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. త్వరిత గతిన విస్తరిస్తు-అనేక రకాలుగా రూపాంతరం చెందుతున్న వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా తన విశ్వరూపాన్ని చూపిస్తోందని... తొలి సారిగా దక్షిణ ఆఫ్రికా లో 1౦ వారాల క్రితం గుర్తించిన వేరియంట్ . ఒమైక్రాన్ కు అనుబంద వేరియంట్ బి ఏ 2 త్వరగా వ్యాప్తి చెందుతుందని. ఓమై క్రాన్ కోరోనా వైరస్ లో భాగామే నని కొన్ని పరిశోదనలలో బి ఏ 2 చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఒస్తుందని. దీని అసలైన వర్షన్ ఇప్పటికే 57 దేశాలాలో గుర్తించినట్లు డబ్ల్యు హెచ్ ఓ వెల్లడించింది. త్వరిత గతిన విస్తరిస్తూ ఎక్కువగా మార్పులు మ్యుటేట్ చెందుతున్న ఒమైక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా 1౦ రోజులుగా శాసిస్తోందని డబ్లు హెచ్ ఓ పేర్కొంది. ఈ వారం అందిన ఎపిడమా లజీ అప్ డేట్ లో డబ్ల్యు హెచ్ ఓ బి ఏ 2 వేరియంట్ లో కోరోనా వైరస్ లక్షణాలు ఈ స్టెయిన్ లో ఉన్నట్లు గతనెలలో నే నిపుణులు గుర్తించారని. ఇందులో మరిన్ని సబ్ వేరియంట్స్ బి ఏ1, బి .ఏ. 1.1 బి ఏ 2 మరియు బి ఏ 3 ఉన్నాయని డబ్ల్యు హెచ్ ఓ వెల్లడించింది. బి ఏ 1 , బి ఏ 1.1 ముందుగా గుర్తించిన వర్షన్ గా పేర్కొన్నారు. పెరుగుతన్న కేసులను బట్టి బి ఏ 2 వేరియంట్ కూడా రకరకాలుగా రూపాంతరం చెందిన విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఇందులో స్పైక్ ప్రోటీన్ మానవ శరీరానికి చేరుతుందని అన్నారు. యు ఎస్ హెల్త్ ఏజెన్సీ సబ్ వేరియంట్లో వస్తున్న మార్పులను పరిశీలించాల్సి ఉంది. సబ్ వేరియంట్స్ లో సగానికి పైగా ఒమైక్రాన్ సీక్వెన్స్ ఉన్నట్లు తెలిపారు. సబ్ వేరియంట్ వ్యాప్తి తీవ్రత వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి ని రక్షించడం గల సాధ్యా సాధ్యా లను పరిశీలించాల్సి ఉంది. ఇటీవల జరిగిన పరిశోదన అసలు ఒర్జినల్ కన్నా బి ఏ 2 వల్లే తీవ్రమైన ఇన్ఫెక్షన్ గుర్తించినట్లు త్గేలుస్తోంది. డబ్ల్యు హెచ్ ఓ నిపుణుల లో ఒకరైన మరియా వాన్ కేర్ఖోవే సబ్ వేరియంట్లలో బి ఏ1 కన్నా బి ఏ పెరుగుదల వ్యాప్తి తీవ్రత అధికమని అన్నారు అందుకే ఒమైక్రాన్ ప్రభావం స్వల్పంగానే ఉంటుందని పేర్కొన్నారు. డెల్టా కన్నా బి ఏ 2 సబ్ వేరియంట్ ప్రభావం లో ఏ మాత్రం మార్పు లేదని ఆమె అన్నారు. బి ఏ 2 స్ట్రైన్ కు కోవిడ్ కన్నా అత్యంత ప్రమాదకరం ప్రజలు తప్పనిసరిగా బి ఏ2 బారిన పడకుండా దూరంగా ఉండాలని సూచించారు. వైరస్ లు సుదీర్ఘంగా మార్పులు చెందుతున్న విషయం ప్రజలు గ్రహించాలని వేరియంట్ విస్తరిస్తున్న నేపధ్యం లో వైరస్ బారిన పడకుండా జాగ్రతలు తీసుకోవడం అత్యవసరం. అని డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరించింది.  

read more
ఆరోగ్య సంక్షేమానికి అంతంతే!!

  కేంద్ర బడ్జెట్ లో ఎదో అద్భుతం జరుగుతుందని ఆశించిన మధ్యతరగతికి తీవ్ర నిరాశే మిగిలింది. ఇక ప్రజా ఆరోగ్యానికి సంబంధించి బడ్జెట్ లో నిధులు కేటాయించక పోవడం పై ఆరోగ్య రంగానిపుణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. గడచిన రెండేళ్లుగా కోవిడ్ భారిన పడ్డ సామాన్యుడు ఆరోగ్యపరంగా కుదేలై పోయిన వాళ్లకు వైద్యం అయినా సామాన్యుడికి అందించేందుకు వైద్యం , వైద్య రంగసేవలు వంటి వైద్య ఉత్పత్తులపై రాయితీలు దిగుమతి సుంకం తగ్గ వచ్చన్న అంచనా తలకిందులు చేస్తూ అందరి అంచనాలకు భిన్నంగా సీతారామన్ విద్యారంగాన్ని ప్రజాఆరోగ్యానికి తీవ్ర నిరాశ మిగిల్చినదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వైద్య రంగం పరిశ్రమ పై కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మిశ్రమ స్పందన వెలువడింది. బడ్జెట్ 2౦22 లో వైద్యరంగం పై ఎదో కొంత బూస్ట్ ఇచ్చినట్లుగా ఉందని నిపుణులు వ్యాక్యా నిస్తున్నారు. బడ్జెట్ లో ఇతర అత్యవసర సేవల పై బడ్జెట్ లో దృష్టి పెట్టకపోవడం పై ఆరోగ్య రంగ నిపుణులు తీవ్ర అసంతృప్తి కి గురియ్యారు. కాగా బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా రామాన్ మాట్లాడుతూ 2౦ 22 బడ్జెట్ లో కోవిడ్ 19 వల్ల చాలా మంది అన్నివయసుల వాళ్ళు మనైకంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రాం ను ప్రకటించారు. ఇందులో 23 టెలి మెంటల్ హెల్త్ సెంటర్ల ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్సెస్ నోడల్ కేంద్రం గా ఉంటుందని నిర్మల ఆమె బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. నాణ్యమైన మానసిక ఆరోగ్యం కౌన్సిలింగ్ సేవలు ఎన్ టి ఎం హెచ్ పి ను  ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కౌన్సిలింగ్ సేవలకు గాను ఐ ఐ టి బెంగళూరు సంకేతిక సహకారం తో మెంటల్ హెల్త్ ప్రోగ్రాం కు సహకరిస్తుందని తెలిపారు. డిజిటల్ హెల్త్ ఎకో సిస్టం కు అందరికీ ఆహ్వానం అంటూ ఆర్ధిక మంత్రి ప్రకటించారు. డిజిటల్ రిజిస్ట్రీ స్ ను హెల్త్ ప్రొవైడర్స్ ఆరోగ్య సౌకర్యాలు గుర్తింపు ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సౌకర్యాల కల్పనా 95 % నుండి 112 % జిల్లాలలో ఆరోగ్యం మెరుగుపడిందని జిల్లాల పై దృష్టి సారించాలని అని అనడం చూస్తే ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వరని ప్రభుత్వ ఉద్దేశ్యం గా తెలుస్తోందని నిపుణులు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఆరోగ్యరంగానికి కేటాయింపుల విషయం లో నిపుణులు మిశ్రమ స్పందన వ్యక్తం చేసారు.  ఆరోగ్యానికి విద్యకు కేటాయించిన బడ్జెట్ నిరుత్సాహ పరిచిందని అన్నారు. రోడ్లు, పోర్ట్లు నిరక్షరాస్యులకు తెలియవని అనారోగ్యం తో ఉన్నవారికి అవి వారి అవసరం తీర్చవని నిపుణులు ఆవేదన  వ్యక్తం చేసారు. అత్యవసర సమాయం లో ఆరోగ్య రంగం లో సరైన వైద్య విధానమంటూ లేకనే వైద్యవిధానం అంటూ లేకపోవడం ప్రభుత్వానికి హెల్త్ పాలసీ అంటూ లేకపోవడం వల్లే మనం కోవిడ్ ను ఎదుర్కోవడం లో తీవ్రంగా విఫలమయ్యామని అత్యవసర సాయంలో సైతం ఏ చికిత్సకు ఏ పరికరాలు ఉన్నాయి కూడా తెలియదని, గ్రామీణ ప్రాంతలాలో ఆరోగ్య కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవని వాటి గురించిన కనీసపు ఆలోచన వైద్య ఆరోగ్య శాఖ కు లేకపోవడం ప్రభుత్వం విద్యారంగానికి ఏ మేరకు చిత్త శుద్ధి ఉందొ ఆర్ధం అవుతుందని నిపుణులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బడ్జెట్ లో ఉత్పదకరంగం పై నిర్లక్ష్యానికి గురి  అయ్యిందని కోవిడ్ సనయంలో అవసరమైన వైద్య పరికరాలు లేక తీవ్ర ఇబ్బంది పడ్డ విషయాన్ని ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. టెలి మెడిసిన్ కు ప్రాధాన్యత  రిగిందని కోవిడ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ వై ద్యరంగానికి కొన్నేళ్లుగా జీ డి పి లో 3 % కేటాయింపులు ఉత్త్జుతివే అని అవి ప్రకటనలకే పరిమితంయ్యిందని. నిపుణులు విమర్శిస్తున్నారు. వైద్య విద్యపై బడ్జెట్ కేటాయింపులు జీ డి పి లో 2. 5 % గత సంవత్సరం 1 37 % వై ద్యరంగానికి నిధులు కేటాయిస్తూ ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట అంటూ పతాక శీర్షికలో ప్రచురితమయ్యాయి. 22 -23 సంవత్సరం లో నాణ్యమైన వైద్యం అన్డుంచే ఆశ సామాన్యుడికి లేకుండా పోయింది. వైద్య సేవల పై నియంత్రణ వైద్య ఉత్పతుల పై నియంత్రణ లేకుంటే సామాన్యుడికి వైద్యం అన్డుయ్తుందా ? ఎవరికీ సంత్రుప్త్జి నివ్వని బడ్జెట్ కేవలం తూ తూ మంత్రంగా మాత్రమే నిర్వహుంచి నట్లిందని పసలేని బడ్జెట్ గా నిపుణులు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి మొండి చెయ్యి.   

read more