మీకు జుట్టు రాలే సమస్య వేధిస్తోంటే అసలు కారణం ఇదే కావ్చచు!  ఇప్పటికాలంలో అమ్మాయిలు జుట్టు రాలడమనే సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సరైన కారణాన్ని తెలుసుకోకుండా కనిపించిన మార్గమల్లా ఫాలో అవ్వడంతో కేవలం జుట్టు రాలే సమస్య కాస్తా జుట్టు పలుచగా, సున్నితంగా మారిపోవడానికి, జీవం కోల్పోవడానికి కారణం అవుతుంది. అయితే దీనికి అసలు కారణం.. కారణానికి తగిన పరిష్కారం తెలుసుకుంటే.. శరీరంలో కొన్ని విటమిన్లు మరియు మినరల్స్ లోపించడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సమస్యల్లో ఒకటి జుట్టు రాలడం. ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం గురించి ఫిర్యాదు చేస్తున్నారు. రోజురోజుకూ తమ జుట్టు పల్చబడి పొడిబారడంతోపాటు చిట్లిపోతుందని కూడా కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. పరిష్కారాలను వెతుక్కుంటూ చాలామంది బ్యూటీ ప్రొడక్ట్స్, షాంపూల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ, కొన్నిసార్లు, శరీరంలో ఇదొక్కటి తగినంత మొత్తంలో లేకపోవడం వల్ల జుట్టురాలిపోవడం జరుగుతుంది. మీ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం నుండి శరీరంలో వివిధ రకాల విధులను సజావుగా నిర్వహించడం వరకు సహాయపడేది ఇదే.. ఇంత ప్రముఖ పాత్ర పోషించే పదార్థమే ఒమేగా-3 ఫ్యాట్స్..   జుట్టు రాలే సమస్య బాగా  ఎదుర్కొంటుంటే లేదా మీ జుట్టు పలుచబడటం లేదా పొడిగా,  పెళుసుగా ఉన్నట్లు అనిపిస్తే, ఒమేగా-3 తీసుకోవడం గురించి ఆలోచించాల్సిందే.. ఒమేగా-3 కొవ్వులు చర్మంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి, అవి  జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. జుట్టు చక్కగా.. అందంగా, మందంగా లేకపోతే  ఒమేగా-3 శరీరానికి తగిన మోదాదులో అందడం లేదని అర్థం. ఇలాంటి  పరిస్థితిలో  తప్పనిసరిగా తినవలసిన ఆహారాలను ఆరోగ్య నిపుణులు సూచించారు.  నెయ్యి, ఆలివ్ నూనె, బాదం, వాల్‌నట్‌లు, అవిసె గింజలు,  చియా విత్తనాలు ఒమేగా-3 పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు. ఇవి మాత్రమే కాకుండా.. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మొత్తం జుట్టు నాణ్యతను పెంచుతుంది. ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు కాకుండా, మీ జుట్టుకు మంచి చేసే ఇతర ఆహారాలు.. గుడ్లు, బచ్చలికూర,  గింజలు, నల్ల శనగలు,  అవకాడోలు మరియు ఆకుపచ్చ ఆకు కూరలు మొదలయినవి.                                                                                                              ◆ నిశ్శబ్ద

ఆడవారి దారుణమైన నెలసరి వెనుక షాకింగ్ సమస్య ఇదే! ఎండోమెట్రియోసిస్ అనేది  గర్భాశయ కుహరం వెలుపల  గర్భాశయ  లైనింగ్ కణజాలం పెరిగే ఒక సమస్య. గర్భాశయంలోని పొరను ఎండోమెట్రియం అంటారు. ఈ పొరమీద కణజాలం పెరిగితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అని అంటున్నారు.  దీని ప్రభావం కారణంగా దీన్ని ఒక జబ్బుగా పరిగణిస్తున్నారు.   అండాశయాలు, ప్రేగులు కటి మొదలైన భాగాల్లో ఎండోమెట్రియల్ కణజాలం పెరిగినప్పుడు ఎండోమెట్రియోసిస్ వస్తుంది. కణజాలం పెల్విక్ ప్రాంతం దాటి వ్యాప్తి చెందడం చాలా అరుదుగా జరుగుతుంది. గర్భాశయం వెలుపల పెరుగుతున్న ఎండోమెట్రియల్ కణజాలాన్ని ఎండోమెట్రియల్ ఇంప్లాంట్ అంటారు. ఎండోమెట్రియోసిస్ ప్రతి స్త్రీని వేర్వేరుగా ప్రభావితం చేస్తుంది కాబట్టి దీనికి ఒక ప్రామాణికమైన చికిత్స లేదు. కొన్ని జీవనశైలి సర్దుబాట్లు, ఇంటి నివారణలు, చికిత్సా వ్యూహాలు, ఇంకా ప్రిస్క్రిప్షన్ మందులు ఈ సమస్య నుండి ఊరటను ఇస్తాయి.   ఎండోమెట్రియోసిస్ సమస్య  గర్భం దాల్చడాన్ని కష్టతరం చేస్తుంది. ఇలాంటి సమయంలో వైద్యుడిని కలిసి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. సంతానోత్పత్తి చికిత్సలో అండాశయాలను ప్రేరేపించడం నుండి ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ వరకు అన్ని ఉంటాయి . ఎండోమెట్రియోసిస్ శారీరకంగా మానసికంగా ఎదుర్కోవడం చాలా కష్టమైన అనారోగ్యం గా పేర్కొనవచ్చు. కానీ దీన్నుండి ఉపశమనం పొందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.  పోషణపై నిఘా ఉంచాలి.. సరైన భోజనం తీసుకోవడం వల్ల ఎండోమెట్రియోసిస్ నుండి రక్షణ పొందవచ్చు. మంట, ప్రోస్టాగ్లాండిన్ జీవక్రియ, ఈస్ట్రోజెన్ స్థాయిలు ఈ సమస్యపై ప్రభావితం చూపిస్తాయి. ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండటం, అలాగే తీసుకునే ఆహారం నాణ్యమైనదిగా రసాయనాలు కాకుండా సేంద్రీయంగా ఉత్పత్తి చేసినవి తీసుకోవడం మంచిది. రసాయనాలు ఎక్కువ ఉన్న ఆహారం  ఎండోమెట్రియోసిస్‌ కు కారణం అవుతుంది.  హీటింగ్ ప్యాడ్‌ ఇలా ఉండాలి.. నెలసరి సమస్యల్లో అధికంగా ఋతు రక్తం పోవడం, పొత్తి కడుపు నొప్పి, కటి భాగంలో నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. దీనికి పరిష్కారంగా హీటింగ్ ప్యాడ్ వాడుతుంటారు చాలామంది. అయితే ఇది ఎలక్ట్రానిక్ తరహా హీటింగ్ ప్యాడ్ కాకపోతే మంచిది. ఆరోగ్య వంతమైన హీటింగ్ ప్యాడ్ పొత్తికడుపు నొప్పి, కండరాల తిమ్మిర్లు తగ్గించడంలో సహాయపడుతుంది.  సహజమైనవి తీసుకోవాలి.. పశుగ్రాసంలో ఉండే కొన్ని పురుగుమందులు  డయాక్సిన్ అనే టాక్సిన్ ను కలిగి ఉంటాయి. ఇవి  ఎండోమెట్రియోసిస్‌ రావడానికి కారణం అవుతాయి.  మాంసాహారం వినియోగాన్ని తగ్గించడం ద్వారా వీలైనంత వరకు తక్కువ గ్లూటెన్, సేంద్రీయ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇవి హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతాయి. అదే రసాయనాలు ఉన్న ఆహారం తీసుకుంటే అది హార్మోన్లను అస్తవ్యస్తం చేస్తుంది.  శస్త్రచికిత్స.. గర్భం దాల్చకూడదనుకునే మహిళల్లో ఏకంగా , గర్భాశయం యొక్క తొలగింపు వరకు ఈ సమస్య వెళ్తుంది. అధిక నెలసరి ప్రవాహం,గర్భాశయ తిమ్మిరి కారణంగా బాధాకరమైన ఋతుస్రావం జరుగుతుంది . ఇలాటి సమయాల్లో చాలామంది ఇక గర్భాశయమే వద్దనుకునే స్థితిలోకి జారుకుంటారు. 35ఏళ్ల లోపు ఈ సమస్య ఎదురైతే  ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. విటమిన్ డి, విటమిన్ బి విటమిన్లను కచ్చితంగా తీసుకోవాలి.. విటమిన్ డి ని "హ్యాపీ విటమిన్" అని పిలుస్తారు, ఇది ఆందోళన, నిరాశను తగ్గిస్తుంది. ఎండోమెట్రియోసిస్ లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్న రోజుల్లో విటమిన్ B శక్తిని పెంచుతుంది. ఆహారంలో కొవ్వు ఎండోమెట్రియోసిస్ అవకాశాలను ప్రభావితం చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, అత్యధికంగా ట్రాన్స్ ఫ్యాట్‌లను తిన్నవారిలో ఎండోమెట్రియోసిస్ వచ్చే ప్రమాదం 48% పెరిగింది. ఒమేగా-3 నూనెలు ఎక్కువగా తీసుకునేవారు తక్కువ తీసుకునే వారితో పోలిస్తే ఎండోమెట్రియోసిస్ ప్రమాదాన్ని 22% తగ్గించారు. సాల్మన్, అవిసె గింజలు వాల్‌నట్స్ వంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువగా ఉన్న  ఫుడ్స్ తీసుకోవడం ఎండోమెట్రియోసిస్‌ తగ్గించడంలో ఉపయోగపడతాయి.                                           ◆నిశ్శబ్ద.

పండంటి బిడ్డ పుట్టాలంటే గర్భిణీ స్త్రీలు వీటిని తప్పక తీసుకోవాలి! స్త్రీలు సాధారణ సమయాల్లో తీసుకునే జాగ్రత్తల కంటే.. వారు గర్భవతులుగా ఉన్న సమయంలో తీసుకునే జాగ్రత్తలు చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడం కోసం, గర్భిణీ స్త్రీ తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీని కోసం, గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మంచి ఆహారం గర్భిణీ స్త్రీని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఆ ఆహారం పిల్లల ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అదే సమయంలో, గర్భిణీ స్త్రీ ఆహారం ద్వారా డెలివరీ సమయంలో సంభవించే సమస్యలను కూడా నివారించవచ్చు. గర్భధారణ సమయంలో స్త్రీ ఏది తింటే అది పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుంది. గర్భిణీ స్త్రీలకు పూర్తి పోషకాహారం లభిస్తే, ప్రసవం తర్వాత ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుంది. కాబట్టి గర్భధారణ సమయంలో స్త్రీ తప్పనిసరిగా కొన్ని పదార్థాలు తినాలి. గర్భిణీ స్త్రీకి, పుట్టబోయే బిడ్డకు మేలు చేసే ప్రెగ్నెన్సీ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు ఏమి తినాలంటే…  పాలకూర పచ్చి కూరగాయలలో అన్ని పోషకాలు ఉంటాయి. ఇందులో పాలకూర తీసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. పాలకూరలో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు అనేక ఖనిజాలు ఉంటాయి. పిల్లల అభివృద్ధికి, మెరుగైన ఆరోగ్యానికి బచ్చలికూర తీసుకోవడం అవసరం. గర్భిణీ స్త్రీలు పాలకూర తీసుకోవడం వల్ల  పుట్టబోయే బిడ్డకు మంచి ఆరోగ్యం, తీక్షణమైన బుద్ధి లభిస్తాయి. గుడ్డు గుడ్డు కూడా పోషకాలతో నిండి ఉంది. గుడ్డులో ప్రొటీన్లతో పాటు విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. గుడ్లలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. శిశువు మెదడు అభివృద్ధికి విటమిన్ డి ముఖ్యమైనది. అందుకే గర్భిణీ స్త్రీలు గుడ్లు తినాలి. బాదం బాదంలో చాలా పోషకాలు ఉన్నాయి. బాదంపప్పు తింటే గుండె ఆరోగ్యం  పదునవుతుంది.  ఇది గర్భిణీ స్త్రీలకు వారి పిల్లలకు కూడా మంచిది. బాదంపప్పులో ఎన్నో పోషకాలు లభిస్తాయి. గర్భధారణ సమయంలో స్త్రీలు బాదంపప్పును తీసుకోవాలి. ఇది పిల్లల మెదడు అభివృద్ధిని మెరుగుపరుస్తుంది. తాజా పండ్లు తాజా పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తాజా పండ్ల నుండి విటమిన్లు లభిస్తాయి. స్త్రీ గర్భధారణ సమయంలో నారింజ, అరటి, మామిడి, ద్రాక్ష, యాపిల్ మొదలైన పండ్లను తీసుకోవాలి. కావాలంటే ఫ్రూట్ జ్యూస్ చేసి తాగొచ్చు. పెరుగు గర్భిణీ స్త్రీలు పెరుగు తీసుకోవడం వల్ల బిడ్డకు ఆరోగ్యకరం. ఇది చాలా మేలు చేస్తుంది. పెరుగులో విటమిన్ సి సహా చాలా ప్రోటీన్లు ఉంటాయి. రోజూ పెరుగు తీసుకోవడం వల్ల డెలివరీ తర్వాత ఆరోగ్యవంతమైన మరియు అభివృద్ధి చెందిన బిడ్డ పుడుతుంది. పాలు పిల్లలైనా, పెద్దలైనా, ప్రతి ఒక్కరూ పాలు తీసుకోవాలని సూచిస్తారు. ఒక గ్లాసు పాలలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీకి కఫుపులో బిడ్డకు పాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీంతో శరీరానికి బలం చేకూరుతుంది. ఆరోగ్యం ఏర్పడుతుంది.  అందరికీ అందుబాటులో ఉండే ఈ పదార్థాలు తీసుకోవడం గర్భిణీ స్త్రీలకు ఎంతో ముఖ్యం.                                  ◆నిశ్శబ్ద.

మీ ఆరోగ్యానికి అద్భుత మంత్రం! ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అయితే ఒంట్లో బాగోలేకున్నా, మనసు భారంగా ఉన్నా అన్నీ భరిస్తూ ఇంటి పని, బయటి పనులు చక్కబెట్టుకుంటూ కుటుంబాన్ని ముందుకు నెట్టుకొచ్చే మహిళలు ఎంతోమంది ఉన్నారు. మగవారు బయటికెళ్లి ఉద్యోగం చేసొస్తే వారికి అన్ని సేవలు చేస్తూ, పిల్లలను, అత్తమామలను చూసుకుంటూ తమ గురించి తాము మరచిపోతారు మహిళలు. ఈ కారణంగా మహిళలు శారీరకంగా బలహీనం అవుతారు. ఇక సంపాదన పరంగా మగవారు ఆడవారిని చాలా తొందరగా మాటలు అనేస్తుంటారు. ఇవి మాత్రమే కాకుండా కుటుంబంలో జరిగే ఎన్నో గొడవలకు మూల కారణంగా మహిళలనే చేస్తుంటారు. బయట ఎన్ని గొడవలు, ఒత్తిడులు ఉన్నా అవన్నీ ఇంటికొచ్చి మహిళల మీద చూపంచే భర్తలు, తండ్రులు, అన్నలు, ఉన్నారు. మరొక విషయం ఏమిటంటే ఆడవారికి ఆడవారే శత్రువులు అన్నట్టు.. సాటి ఆడవారే చులకనగా చూసి, అవమానిస్తుంటారు. ఈ కారణాల వల్ల మహిళలు మానసికంగా బలహీనం అయిపోతుంటారు. శారీరకంగా, మానసికంగా మహిళలు ఎంతో దృఢంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అందుకోసం మహిళలు చేయాల్సిన కొన్ని పనులున్నాయి.. ఇవి అద్భుత మంత్రాలనే చెప్పొచ్చు.. మీకోసం.. మీరు.. కుటుంబం, భర్త, పిల్లలు, అత్తమామలు ఇలా ఎందరున్నా ప్రతి మహిళ తన ప్రాధాన్యతను తాను గుర్తుంచుకోవాలి. మొదట తన గురించి తాను జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాలి. తన సంతోషాన్ని, తన సమయాన్ని తాను ప్రత్యేకంగా గడపగలగాలి. భారతీయ మహిళకు ఇలాంటి పని కాస్త కష్టమే.. కానీ అసాధ్యం కాదు. కుటుంబానికి కావలసినవన్ని ఓ మహిళ ఇస్తున్నప్పుడు, ఆ మహిళల తనకు కావలసింది తాను తీసుకోవడంలో తప్పు లేదుగా.. ఇలా చేస్తే మహిళలు మానసికంగా బలవంతులు అవుతారు. ఆరోగ్యం.. మీ బాధ్యత… మీ ఆరోగ్యం గురించి భర్త, పిల్లలు పట్టించుకుని వారు మిమ్మల్ని  డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తేనే వెళ్లే వర్గానికి చెందినవారు మీరైతే.. ఇప్పుడే మీ పద్ధతి మార్చేసుకోండి. సహజంగా మహిళలకు ప్రతి దశలో ఎన్నో ఆరోగ్యం సమస్యలు వస్తుంటాయి. ఏ పెయిన్ కిల్లరో.. మరే సిరప్పో.. వేసుకుని అప్పటికి సమస్య తగ్గిపోయిందనిపించుకుని ఏళ్లకేళ్ళు గడిపేసే మహిళా మణులు చాలామందే ఉన్నారు. అవన్నీ వదిలి శరీరం సౌకర్యంగా అనిపించకపోయినా, ఏదైనా ఇబ్బంది తలెత్తిన చక్కగా వైద్యులను సంప్రదించాలి.  ప్రతి మహిళా కాల్షియం, ప్రోటీన్, విటమిన్, బోన్ స్ట్రేంగ్త్ పరీక్షలు, హిమోగ్లోబిన్ పరీక్షలు ఆరు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి అయినా చెక్ చేయించుకోవాలి. పోషకారం మీకే ముఖ్యం.. మీగడ పెరుగాంతా భర్తకూ, పిల్లలకూ వడ్డించి తనకు మాత్రం నీళ్లు కలిపి పలుచని మజ్జిగతో భోజనాన్ని మ్యా.. మ్యా.. అనిపించే మహిళలు బోలెడు ఉన్నారు. మగవాళ్ళు ఎక్కువ తినాలి అనే మాటతోనో.. ఎదిగే పిల్లలకు పెట్టాలి కదా అనే సమర్థింపుతోనో ఇంటివారికి ఎక్కువ పెట్టడంలో తప్పు లేదు.. అది వారి మీద ఇల్లాలికి ఉన్న ప్రేమ. కానీ.. ఆడవారికే ఆహారం అవసరమే కదా.. ఉదయం లేచి ఇల్లు ఊడవడంతో మొదలుపెట్టే పనికి రాత్రి భోజనాలు అయ్యాక తిన్నవి కడిగి సర్దిపెట్టే వరకు విరామం అనేది ఉండదు. కాబట్టి ఇంట్లో భర్త, పిల్లలకు పెట్టే దానికంటే ఎక్కువగా, మంచి పోషకాహారం ఆడవారికే అవసరం. యోగా.. ధ్యానం...కావాలి.. యోగా.. ధ్యానం మనిషిని శారీరకంగా, మానసికంగా దృఢంగా చేస్తాయి. యోగ లోని ఆసనాల వల్ల  మహిళల శరీరంలో వివిధ అవయవాల పనితీరు మెరుగవుతుంది. కండరాలు, ఎముకలు బలోపేతం అవుతాయి. రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి, శరీరంలో అదనపు కొవ్వు, దాని ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. గర్భాశయం, థైరాయిడ్, హార్మోన్స్ అసమతుల్యత వంటివి ఆమడ దూరం పోతాయి. ధ్యానం వల్ల చక్కని ఏకాగ్రత, దృఢ నిర్ణయం తీసుకునే సామర్థ్యము పెరుగుతుంది. మానసిక ఒత్తిడులు అధిగమిస్తారు. నెలసరి సమయంలోనూ, గర్భధారణ, ప్రసవం, పిల్లల పెంపకం, భర్తతో అనుబంధం, మెనోపాజ్ దశ ఇలా అన్ని సమయాలలో ఒత్తిడి సహజంగా ఉంటుంది మహిళల్లో. ఈ ఒత్తిడిని డీల్ చేయడానికి ధ్యానం బాగా సహకరిస్తుంది. గమనిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకునే మహిళల్లో అస్తిత్వం మెరుగ్గా ఉంటుంది. ప్రతి మహిళా కుటుంబాన్ని, గృహిణి బాద్యతనూ కలిగి ఉంటారు. అయితే వాటితో పాటు ప్రపంచాన్ని కూడా శాసించగలిగేవారు కొందరే ఉంటారు. ప్రతి మహిళా ప్రపంచాన్ని శాసించక పోయినా.. తన ప్రపంచాన్ని తాను శాసించుకోగలిగే శక్తిమంతురాలు కావాలి. తన ఆరోగ్యాన్ని తాను కాపాడుకోవాలి.  అప్పుడే మహిళా దినోత్సవ అర్థానికి సార్ధకత చేకూరుతుంది.                                    ◆నిశ్శబ్ద .

గర్భనిరోధక మాత్రలు మిమ్మల్ని ఎలా నాశనం చేస్తాయో తెలుసుకోండి! ఈ సృష్టిలో ఒక ఆడపిల్ల గర్భం దాల్చడం, ఓ బిడ్డకు జన్మను ఇవ్వడం చాలా అద్భుతమైన విషయం. అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుత కాలంలో పెళ్లికి ముందు నచ్చిన వ్యక్తితో కలవడం, పెళ్లి తరువాత కూడా ఇంకా కెరీర్ ప్లానింగ్ పేరుతో ప్రెగ్నెన్సీ రాకూడదని ప్రయత్నాలు చేస్తుంటారు. దీని కోసం ఎక్కువ మంది ఆధారపడే మార్గం బర్త్ కంట్రోల్ పిల్స్ (birth controal pills) ఉపయోగించడం.  అయితే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి కేవలం గర్భాన్ని రాకుండా చేస్తాయేమో కానీ అనేక సమస్యలను మాత్రం పక్కాగా వెంటబెట్టుకొస్తాయి. అండోత్సర్గాన్ని నిరోధించడానికి ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్ల మిశ్రమాన్ని కలిగి ఉన్న చాలా గర్భనిరోధక మాత్రలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. నెలవారీ మహిళల్లో వచ్చే నెలసరి సమయంలో అండాలు విడుదల అవుతాయి. వీటిని ఫలదీకరణం చెందించకుండా ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ లో ఉన్న మిశ్రమాలు ఆపుతాయి.  ఇవి ఎలా పని చేస్తాయంటే.. ఈ పిల్స్ గర్భాశయం చుట్టూ ఉన్న శ్లేష్మాన్ని చిక్కగా చేయడం ద్వారా  పనిచేస్తుంది, స్పెర్మ్ గర్భాశయంలోకి ప్రవేశించడం, విడుదలైన అండాలను చేరుకోవడం కష్టతరం చేస్తుంది.  పిల్‌ లోని హార్మోన్లు అప్పుడప్పుడు ఈ  గర్భాశయ లైనింగ్‌ను మార్చగలవు, గర్భాశయ గోడలను అంటిపెట్టుకుని ఉండే అండాలను విచ్చిన్నం అయ్యేలా చేస్తాయి. గర్భధారణను నిరోధించడానికి మాత్రమే ఈ బర్త్ కొంట్రోల్ పిల్స్ ఉపయోగపడతాయని చాలామంది అనుకుంటారు.  ఇతర  జనన నియంత్రణ మార్గాల కంటే ఇది బాగా సక్సెస్ మార్గమైనప్పటికీ దీని వల్ల కలిగే మార్పులు మాత్రం కేవలం గర్భం రాకుండా అపడంతో అయిపోవు. ఇలాంటి టాబ్లెట్స్ వాడిన తరువాత  నెలసరిలో ఎక్కువ ఋతుస్రావం, నెలసరి క్రమం తప్పడం, ఎండోమెట్రియోసిస్, అడెనోమియోసిస్, హిర్సూటిజం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు చాప కింద నీరులా చేరతాయి. మరొక విషయం ఏమిటంటే ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ అందరికీ ఒకే విషయమై పలితాన్ని ఇవ్వవు. ఒక్కొక్కరిలో ఒకో విధమైన ఎఫెక్ట్ ఉంటుంది. చాలామందిలో ఇవి వాడిన తరువాత గర్భధారణ సామర్థ్యము తగ్గిపోతుంది.    అమ్మతనం అనేది ఓ ప్రాణికి జీవితాన్ని ఇవ్వడం. స్వార్థ ప్రయోజనాలకోసం ఎంతో మంది మహిళలు అనుసరిస్తున్న ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల మహిళలు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా తరువాత అమ్మ అయ్యే అవకాశానికి వారే పెద్ద సమస్యను ఉత్పన్నం చేసుకుంటున్నారు. ఒకవేళ గర్భనిరోధక మార్గం అనుసరించాలని అనుకుంటే మగవారు కండోమ్ వాడటం ఆడ, మగ ఇద్దరికీ ఆరోగ్యకరమైనదని వైద్యులు చెబుతున్నారు. ఆలోచించండి మరి..                                    ◆నిశ్శబ్ద.

కాబోయే అమ్మలకు వ్యాయామం ముఖ్యమా? వ్యాయామం అనేది మనిషి తప్పకుండా ప్రతిరోజూ తన దినచర్యలో భాగం చేసుకోవాలి. అయితే వ్యాయామం విషయంలో ఒక్కొక్క పరిస్థితిలో ఉన్న వ్యక్తులకు ఒక్కో విధమైన నిబంధనలు ఉంటాయి. గర్భం ధరించిన మహిళలు వ్యాయామం చేయవచ్చా.. చేస్తే ఇప్పుడు చెయ్యాలి?? ఎన్ని నెలల సమయంలో మొదలుపెట్టాలి?? ప్రారంభంలోనే వ్యాయామం చేయవచ్చా వంటి ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి.  వ్యాయామం గర్భవతులు కూడా చేయవచ్చు. అయితే గర్భం గురించి తెలిసిన వెంటనే వ్యాయామం మొదలుపెట్టడం ప్రమాదం. గర్భం నిలవాలి అంటే 3 నెలల వరకు విశ్రాంతి తీసుకోవడం, జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. కాబట్టి 3 నెలల సమయంలో వ్యాయామం జోలికి వెళ్లకూడదు. ఆ తరువాత అంటే 3 నెలల తరువాత వ్యాయామం చేయడం మొదలుపెట్టవచ్చు. నెలలు నిండేకొద్ది మహిళ బరువు, శారీరక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యవంతంగా, బిడ్డకు సరైన విధంగా ప్రాణవాయువు, పోషకాలు అందడనికి కూడా వ్యాయామం సహకరిస్తుంది. శరీరం కూడా భారంగా అనిపించకుండా ఫ్లెక్సిబుల్ గా మారుతుంది.  గర్భవుతులు పెరిగే బరువును భరించడానికి అనువుగా శరీర కండరాలు, ఎముకల కదలిక సౌకర్యవంతంగా మారుతుంది. అంతే కాదు, కడుపులో పెరుగుతున్న బిడ్డ బరువు వల్ల ఆ ప్రభావం వెన్నుపూస మీద ఎక్కువ పడుతూ ఉంటుంది. అందుకే వెన్ను నొప్పి లేకుండా, మోకాళ్ళ నొప్పులు వంటివి రాకుండా చక్కగా ఉండేలా వ్యాయామాలు దోహదం చేస్తాయి. అంతేకాదు, గర్భవతులు వ్యాయామం చేస్తే డెలివరీ సమయంలో ఆ నొప్పులు భరించడం కష్టతరం అనిపించదు. ఎందుకంటే వ్యాయామం వల్ల శరీరంలో కండరాలు, ఎముకలు దృఢంగా మారి మొత్తం మీద శరీరం గట్టిదనాన్ని పొంది ఉంటుంది.  అయితే గర్భవతులు విశ్రాంతి తీసుకోవడం ఎలానో.. శ్వాస క్రియ జరపడం ఎలానో కూడా తెలుసుకోవడం ముఖ్యం. దీనివల్ల కండరాలు గట్టిపడతాయి. అలాగే వ్యాయామము చేయడానికి ప్రతిరోజు ఒకే సమయాన్ని ఎంచుకోవాలి. దీనివల్ల శరీర తత్వానికి  మంచి క్రమశిక్షణ అలవడుతుంది. వ్యాయామం చేయడానికి చదునుగా ఉన్న ఉపరితలము గల్గిన స్థలము ఎంచుకోవాలి. అలాంటిచోట మందం పాటి దుప్పటి పరచుకుని దానిమీద వ్యాయామాలు చేస్తుంటారు. అయితే జారకుండా జాగ్రత్తగా ఉండాలి.    గర్భవతులకు నెలలు నిండేకొద్ది కాళ్ళు వాపు రావడం జరుగుతుంది.  ఈ వాపు తగ్గడానికి కూడా కొన్ని వ్యాయామములు తెలుసుకోవాలి.  వాపు తగ్గడానికి వ్యాయామం.  వెల్లకిలా పడుకుని మెల్లిగా కాళ్ళు పైకి ఎత్తాలి. ఆ తరువాత కాలి పాదాలను గుండ్రంగా తిప్పాలి. దీన్ని మొదట గడియారం తిరిగినట్టు తిప్పి, ఆ తరువాత దానికి రివర్స్ లో తిప్పాలి. ఇలా చేయడం వల్ల కాళ్ళలో వాపులు తగ్గుతాయి. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కాళ్ళ తిమ్మిర్లు తగ్గుతాయి.  కాళ్ళు భారంగా ఉన్న అనుభూతి తగ్గుతుంది. కాబట్టి చిన్న చిన్న తేలికపాటి వ్యాయామాలు చేయడం గర్భవతులు ఆరోగ్యానికి మంచిది. గమనిక:- గర్భవతులు వైద్యులు, నిపుణుల సలహా లేనిది సొంతంగా వ్యాయామాలు చేయడం తల్లిబిడ్డకు కూడా ప్రమాదం. కాబట్టి వైద్యుల సలహతోనే ఏ వ్యాయామం అయినా చెయ్యాలి.                                     ◆నిశ్శబ్ద.

గర్భవతులు ఆహారం గురించి అనుమానాలా?? నిజం తెలుసుకోండి!! జీవితంలో ఏ దశలోనైనా మనం తీసుకునే ఆహారం ముఖ్యమైనది. స్త్రీ గర్భం ధరించినపుడు ఈ మాట మరీ నిజమని ఒప్పుకుంటారు. ఎందుకంటే గర్భవతి తీసుకునే భుజించే ఆహారం కడుపులో బిడ్డకు కూడా పోషకాలను అందించగలగాలి. అయితే అందరూ అనుకున్నట్టు సాధారణ రోజుల్లో తినే దానికి రెట్టింపు గర్భం మోసున్న రోజుల్లో తినాలని అర్థం కాదు. గర్భం దాల్చక ముందు కంటే గర్భం దాల్చిన తరువాత ఎక్కువ తినవలసి ఉంటుంది. అలాగే ఎక్కువ క్రొవ్వు పట్టేంతగా తినకూడదు క్రొవ్వు ఎక్కువైతే గర్భవతులు ప్రసవం కష్టమవుతుంది. అదీకాక ఈ అదనపు క్రొవ్వును కరిగించడానికి చాల కష్టపడవలసి వస్తుంది. అందుకే గర్భిణీ స్త్రీలు  ఆహారం విషయంలోనే కాదు, బరువు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.  గర్భిణీ స్త్రీలు డాక్టర్ల దగ్గరకు టెస్టుల కోసం వెళ్లినపుడు అక్కడ బరువు చూడటం అందరికీ తెలిసే ఉంటుంది. అప్పుడు డాక్టర్లే బరువు తగ్గడం, పెరగడం అనే విషయాల గురించి చెబుతాడు. బరువు విషయంలో తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. గర్భవతులు అందరికీ వర్తించే కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు ఉంటాయి. జ్యుస్ లు, లిక్విడ్స్,  మొదలైనవి  గర్భిణీ స్త్రీలు  కావలసినన్ని తీసుకోవాలి. అయితే వీటి తయారీకి పంచదార ఉపయోగించకూడదు చక్కెర అదనంగా తింటే క్యాలరీలు పెరిగి శరీరం బరువు ఎక్కువ ఆవుతుంది. మామూలుగా ఉన్న బరువుకు గర్భవతిగా వున్న సమయములో నున్న బరువుకు 20 కిలోల కంటే ఎక్కువ తేడా వుండకూడాదు. ఇంతకంటే ఎక్కువ బరువు వుండటం మంచిది కాదు. గర్భిణీ స్త్రీ తినే తిండిని బట్టే బిడ్డ పెరుగుతుంది. అందువల్ల తినే తిండి నాణ్యతగా ఉండాలి.. తల్లీ బిడ్డకు ఆరోగ్యానిచ్చే ఆహారాన్ని ఎన్నిక చేసుకోవాలి. తినే ఈ భోజనం ఎంపిక చేసుకున్న ఆహార పదార్థాల నుండి తయారు చేయాలి. పోషణ పదార్థాలు గల ఆహారాన్ని తీసుకుంటే కడుపులో బిడ్డ ఆరోగ్యకరంగా, బలంగా పెరుగుతాడు. విటమినులు, ఖనిజలవణాలు లోపించిన ఆహారాన్ని ఎన్నిక చేసుకున్నట్లయితే బిడ్డ ఆరోగ్యము నష్టానికి గురి అవుతుందనడానికి ఎలాంటి సందేహం లేదు. సారం లేని భోజనం ఎముకలు దంతాల పెరుగుదలను అరికడుతుంది. బిడ్డ దేహంలో నిరోధక శక్తి తగ్గి పుట్టిన తరువాత ప్రమాదకరమైన రోగాలకు గురి అవుతాడు. సారం లేని ఆహారం తీసుకున్న స్త్రీ గర్భవతిగా ఉన్నంత కాలము ప్రసవ సమయంలోను కష్టపడవలసి వస్తుంది. బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లికి శక్తి లేకుండా పోతుంది. గర్భిణీ స్త్రీ గర్భంలో బిడ్డ వేగంగా వృద్ధి పొందుతూ వుంటాడు. సరైన పెరుగుదలకు పోషకాలు విటమిన్లు బిడ్డకు అవసరమవుతాయి. విటమినులు కొన్ని మన శరీరంలో నిల్వ ఉండవు. అందువల్ల ఈ విటమినులలో గల ఆహార పదార్థాలు ప్రతిరోజూ తీసుకోవాలి. గర్భిణీ స్త్రీకి విటమినులు గల ఆహారం చాలా మేలు కలుగజేస్తుంది.                                       ◆నిశ్శబ్ద.

మీ పిల్లలు రజస్వల కావడం లేదా?? అయితే తప్పకుండా తెలుసుకోవలసిన విషయమిది!! మహిళల్లో రజస్వల అవడం, ఋతుస్రావం అనేవి చాలా సాధారణమైన విషయాలు. అయితే.. కొందరిలో బుతుస్రావం కనబడకపోవడం మొదటి నుంచీ ఉంటే మరి కొందరిలో సడన్ గా ఆగిపోతుంది. కొందరు ఆడపిల్లలు యుక్తవయస్సు వచ్చినా రజస్వల అవరు. పైగా పొత్తికడుపు దగ్గర ఎత్తుగా తయారవుతుంది. అది చూసిన కొందరు ఆ అమ్మాయి గర్భవతి ఏమో అనుకుని పొరబడుతూ ఉంటారు. మహిళల్లో జరగవలసిన సహజ ప్రక్రియ అయిన ఈ రజస్వల కావడం తమకు జరగలేదని ఇలాంటి అమ్మాయిలు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. ‘క్రిప్టోమెనోరియా' అనే ఒక పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఆ స్త్రీ ఎంతకీ రజస్వల అవడం ఉండదు. కాని కొంతకాలానికి పొత్తి కడుపు దగ్గర ఎత్తుగా ఎదుగుతుంది. తెలియనివారు దానిని చూసి గర్భిణీ అని కూడా 'కుంటారు ‘క్రిప్టోమెనోరియా' పరిస్థితిలో స్త్రీ నిండుగా ఉంటుంది. వక్షోజాలు పూర్తిగా వస్తాయి. రూపంలో ఎటువంటి తేడా ఉండదు.  అయినా రజస్వల అయినట్లు కనబడదు. ఇటువంటి స్త్రీలు రజస్వల అవక పోవడం ఉండదు. రక్తస్రావం మాత్రం కనబడదు. దానికి కారణం యోనిద్వారం దగ్గర కన్నె పొర పూర్తిగా మూయబడి ఉంటుంది. వీరిలో నెల నెలా బహిష్టులు అవడం ఉంటుంది.కాని రక్తస్రావం కనబడదు. వీరిలో కలిగేర రక్తస్రావము బయటకు రావడం కుదరక మర్మావయవాల లోపలే నిలువచేరి పోతుంది. అలా బహిష్టు రక్తం నిలవ చేరిపోవడంతో గర్భా శయం ఉబ్బుకు వస్తుంది. మొదట్లోనే కన్నె పొర పూర్తిగా మూసి ఉంచిన పరిస్థితిని గుర్తించకపోతే 6-7 మాసాలంత గర్బిణీలాగా కనబడే అవకాశం లేకపోలేదు. ఇలా మూసి ఉంచిన కన్నె పొరని ఆప రేషను చేసి తొలగిస్తే లోపల పేరుకుని పోయిన రక్తమంతా బయటకు వచ్చేస్తుంది. కాన్పు అయిన కడుపులాగా అంతా తగ్గిపోతుంది. కొందరు మొదట్లో నెల నెలా బహిష్టు మామూలుగా అవుతారు. ఆ తరువాత బహిష్టు రావడం ఆగిపోయి అంతు పట్టని రహస్యంగా మిగిలిపోతాయి. హార్మోన్ల లోపంవల్ల బహిష్టులు రాకపోవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళన, మెంటల్ షాక్ వల్ల బహిష్టులు ఆగిపోవచ్చు. రక్తహీనత తీవ్రంగా ఉంటేకూడా బహిష్టులు వుండవు. పిట్యూటరీ గ్రంధి, ఎడ్రినల్ గ్రంధిలో కంతులు ఏర్పడితే బహిష్టులు రావు. వయస్సు మళ్ళుతున్న స్త్రీలలో అకస్మాత్తుగా నెలసరి ఆగిపోయి తర్వాత  శాశ్వతంగా బహిష్టులు ఆగిపోవచ్చు. సాధారణంగా ఈ పరిస్థితి 40-50 సంవత్సరాల వయస్సు వారికి కనబడుతుంది. ఇదే మెనోపాజ్. ఋతుస్రావం రావలసిన విధంగా నెల నెలా రావడం వుండక ఆగిపోవడాన్ని 'సెకండరీ ఎమెనోరియా' అంటారు. ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కొన్ని కేసుల్లో కారణం ఏదై నదీ అర్థం కాకుండా అవుతుంది. రోగి జననేంద్రియాల పరీక్ష, అల్ట్రాసౌండు ఎగ్జామినేషను, యం. ఆర్. ఐ, హార్మోన్ల పరీక్ష, ఇతర పరీక్షలు జరిపినప్పుడు ఎమెనోరియాకి కారణం తెలిసే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా జననేంద్రియ సమస్యలు, మహిళల నెలసరి అనేవి చాలా సున్నితమైన అంశాలు. వీటి విషయంలో ఏదైనా సమస్య వస్తే దాన్ని సొంత వైద్యం లో పరిష్కరించుకోకుండా డాక్టర్ ను కలవడం ఉత్తమం.                                      ◆నిశ్శబ్ద.

గర్భాశయ ఆపరేషన్ గురించి ఆసక్తికర విషయాలు! మహిళల్లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు అన్నీ ఎక్కువ భాగం గర్భాశయానికి సంబంధించినవే ఉంటాయి. చాలామంది మధ్యవయసులోకి అడుగుపెట్టిన మహిళలు గర్భాశయ సమస్యలు భరించలేక ఏకంగా గర్భాశయాన్ని తొలగించుకోవడానికి సిద్ధపడుతుంటారు. ఈ గర్భాశయ తొలగింపు ఆరేషన్, దాని ప్రభావం, దానికి జాగ్రత్తలు తెలుసుకుంటే… గర్భాశయాన్ని తొలగించే ఆపరేషన్ ను  "హిస్టరెక్టమీ” అంటారు. కొన్ని సార్లు గర్భాశయంతోపాటు దగ్గరగా వున్న అండవాహికను, అండాశయాన్ని కూడా తీసేయవలసి వుంటుంది. క్యాన్సర్ వంటి వ్యాధులు ఒక్కొక్కసారి చుట్టూ వున్న అవయవాలకు కూడా వ్యాపించే ప్రమాదం వుంది. ఇలాంటి సందర్భాలలో మిగతా భాగాల్ని కూడా తీసేయాల్సివస్తుంది. గర్భాశయాన్ని ఎందుకు తీసివేయాల్సి వస్తుంది ? గర్భాశయ ముఖ ద్వారంలో క్యాన్సర్ వున్నప్పడు. గర్భాశయంలో క్యాన్సర్ ఉన్నప్పుడు, బహిస్టు సమయంలో మాత్రమే కాకుండా ఇతర సమయాలలో కూడా రక్తస్రావం అవుతున్నప్పుడు, ఈ వ్యాధులు మందులతో నయం కానప్పుడు గర్భాశయాన్ని తొలగించాల్సి వస్తుంది. రక్తహీనత, ఇతర సమస్యల వల్లా, గర్భాశయంలోపల గోడలను ఆనుకొని పెరిగే పెద్ద కణుతుల వల్లా (ఫైబ్రాయిడ్స్), విపరీత రక్తస్రావం. తరచు ఇన్ఫెక్షన్ కు గురి కావడం గర్భసంచి క్రిందికి జారటం అండవాహికలో అండాశయాలలో వ్యాధి వున్నప్పుడు, ప్రసవ సమయంలో గర్భాశయం చిరగటం లేదా ఆపటానికి వీలుకాని రక్తస్రావం అవుతుండడం మొదలైన  లక్షణాలు తీవ్రరూపం దాల్చినప్పుడు గర్భాశయాన్ని తీసివేయాల్సి వస్తుంది. గర్భాశయాన్ని తీసేస్తే ఏమవుతుంది ? కేవలం గర్భాశయాన్ని మాత్రమే తీసేసినపుడు మహిళల్లో నెల నెలా వచ్చే బహిస్టు ఆగిపోతుంది. కాని అండాశయాలు ఈస్ట్రోజన్ హార్మోనును ప్రతినెలా ఉత్పత్తి చేస్తూనే వుంటాయి. అండాశయాన్ని తీసేస్తే అకస్మాత్తుగా మెనోపాజ్ వస్తుంది. అలాంటి సందర్భాలలో హార్మోన్లు విడిగా ఇవ్వాల్సి రావచ్చు. హిస్టరెక్టమీని కుటుంబ నియంత్రణ పద్ధతిలో వాడటం కూడా ఎక్కువయింది. పిల్లలు పుట్టకుండా ఉండటానికి దీన్ని ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు. కొన్ని ముఖ్యమైన విషయాలు:-  గర్భాశయాన్ని తీసివేయడం అనేది భారీ వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. గర్భాశయ వ్యాధులు సోకినపుడు, ఆగకుండా నిరంతరం రక్తస్రావం అవుతున్నపుడు, గర్భాశయం దెబ్బ తిన్నపుడు దాన్ని తొలగించాల్సి ఉంటుంది.  ఆపరేషన్ తరువాత విపరీతమైన నొప్పి, జ్వరం రావచ్చు. పొత్తి కడుపు పుండులా అనిపిస్తుంది.  ఆపరేషన్ తరువాత కూడ రక్తస్రావం జరిగినా, కుట్ల దగ్గర చీము పట్టినా, ఇన్ఫెక్షన్ సోకినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. గర్భాశయాన్ని మాత్రమే తొలగిస్తే బహిస్టు ఆగిపోతుంది. కానీ క్యాన్సర్ లాంటి వ్యాధులు సోకినపుడు అండాశయాన్ని కూడ తొలగించాల్సి రావచ్చు. ఇలాంటి సందర్భాలలో మెనోపాజ్ వస్తుంది.  శస్త్రచికిత్స చేయాలంటే.. ఆపరేషన్ అవసరమైన వాళ్లు బరువు ఎక్కువ ఉంటే తగ్గడానికి, బరువు మరీ తక్కువ ఉన్నవాళ్లు పెరగటానికి, డాక్టర్ల సలహా తీసుకోవాలి. హిమోగ్లోబిన్ 12 గ్రాములకంటే ఎక్కువ వుండేటట్టు చూసుకోవాలి, ఒకవేళ రక్తహీనత ఎక్కువగా వుండి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే సర్జరీ కన్న ముందుగానే రక్తం ఎక్కిస్తారు. షుగర్, బి.పి. వున్నవాళ్లు వాటిని అదుపు చేసుకోవాలి. ఆపరేషన్ కోసం 2,3 బాటిల్స్ రక్తం రడీగా వుంచుకోవాలి.                                            ◆నిశ్శబ్ద.

Can You Really Lose Weight By Drinking More Water!     Water is an essential nutrient your body needs to use to burn body fat! That’s why drinking water to lose weight is an important consideration in your weight loss program. We are made up of 55-75% water - that’s a lot of water! We need all of it for chemical reactions in physiological processes to burn fat and calories. It’s also used to transfer by-products of waste (from fat breakdown) away and out of our bodies. In some cases, when you’re dehydrated and there isn't enough water to dilute the body's waste products, kidney stones may form. The liver then has to step in to help the kidney. This taxes the liver, causing it to perform poorly for its other functions. This is really bad for weight loss because one of the major functions of the liver is to burn fat. Another healthy benefit of drinking water is that it helps maintain the body’s proper balance of body fluids. And it’s essential for replacing the large amounts of water lost each day. But drinking more water is not a magic diet formula. Drinking water is certainly important for overall health and is a great choice for hydration because it is calorie and caffeine free. However, simply drinking water doesn't impact your hunger. Thirst and hunger are sensed by different mechanisms in your body. Thirst develops from a rise in electrolytes in your blood or a decrease in blood volume. Hunger signals stem from declines of available fuel (such as glucose) in your body. Because of these separate mechanisms, it is unlikely that your body confuses thirst with hunger. Studies comparing people who drink water immediately before, or during, meals with those that don't drink water show no difference in the amount of calories that they consume. Drinking water can help with weight loss if you find that, in the absence of hunger, you still eat just to have something in your mouth. Drinking water, instead of eating, in these instances can help you decrease your overall daily calorie intake. Each day, drink enough water so that your urine is clear. A recent study showed that your metabolic rate jumps within 10 minutes of drinking ice-cold water, and it stays up for an additional 30 minutes after you drink it. Research has also found that drinking an average of 6.5 cups of water per day helped people consume 200 fewer calories a day. Drinking water is essential for keeping energy up, aiding the metabolism, burning fat, and more. It's the fluid your body needs for life, and it's an instrumental part in your weight loss. Other fluids can be useful, but water is obviously the best choice as it is calorie free. Forget about that whole eight cups a day thing, instead keep yourself hydrated whenever you can and the benefits of it are just good for your body and your health. So stay Hydrated and stay fit! ...Divya

గర్భవతులలో మార్పులు కారణాలు..  మహిళల్లో ఒక అపురూపమైన దశ గర్భం ధరించడం. గర్భం మోసే 9 నెలలు మహిళల జీవితం ప్రతిరోజు, ప్రతి క్షణం అద్భుతం లాగే ఉంటుందని అందరూ అంటారు. అయితే నిరంతరం వారిని ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తూ ఉంటాయి.  సముద్రం మీద ప్రయాణం చేసేవాళ్ళకి అనారోగ్యం చేస్తుంది. అదంతా నీటి మీద ప్రయాణం వల్ల, ఆ వాసన వల్ల కలిగే ఒకానొక అసౌకర్యం వల్ల కలిగే ఇబ్బంది.  గర్భం వల్ల మహిళల్లో వచ్చే సమస్యలు కూడా అలాంటివే అని మహిళా వైద్యులు కొందరు అంటారు.  కొద్ది సెకన్లు ముఖం తిరుగడం, నీరసానికి గురవడం జరిగినా ఆ తర్వాత నిక్షేపంగా ఉంటారు. కొద్దిగా వాంతులయినా తర్వాత మామూలుగానే ఉంటుంది.  గర్భం ధరించినవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఉదయమే ఈ వేవిళ్ళు ప్రారంభమయితే మంచం మీంచి లేవకూడదు. కాస్త నిమ్మరసం త్రాగాలి దీనివల్ల నీరసం తగ్గుతుంది. ఏదో ఒక  టిఫిను తిన్న తరువాత ఇంట్లో తిరగడం చేయవచ్చు. ఇంట్లో వాళ్ళ సహాయం ఆ మాత్రం తీసుకోవాలి. కాళీ కడుపుతో ఎప్పుడూ పనులు చేయకూడదు.  అలాగే మధ్యాహ్నం వేవిళ్ళు రావటం ప్ర్రారంభిస్తే, వెంటనే మీకు ఇష్టమయిన ఆహారం ఏదో తినండి. రెండు బిస్కట్లు, కాస్త బెడ్డు, వెన్న, ఆపిల్ పండు  ఏదయినా సరే. వెంటనే కూర్చుని, ఏదో ఒకటి తినండి. వేవిళ్లు అవే సర్దుకుంటాయి. గర్భం వచ్చాక మొదటి మూడు నెలల్లోనూ ఎవరైనా కడుపునిండా రెండుసార్లు ముందులాగా భోజనం చేయటం మంచిది కాదు. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినటం మంచిది.  వేవిళ్ళు దుర్భరంగా ఉంటే వాడదగిన మందులు ఉన్నాయి. కొంతమంది బస్సులో వెడుతున్నప్పుడు ప్రయాణం పడక వాంతులు చేసుకుంటారు. ఈ వాంతులకు గర్భవతికి వచ్చే వేవిళ్ళకూ చాలా తేడా ఉంది. కాబట్టి వాటి కోసం మాత్రమే వైద్యులు సూచించే మందులు వేరుగా ఉంటాయి.  గర్భవతుల మానసిక పరిస్థితుల గురించి చాలామంది చెబుతుంటారు.  నిజమే. వారు దేనిమీదా మనస్సును కేంద్రీకరించలేరు.  తల దిమ్ముగా ఉంటుంది. ముఖం తిరుగుతున్నట్లుంటుంది. కొందరికి తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. కొందరు కృంగిపోయి విచారంగా ఉంటారు. కొందరికి చిరాకు ఎక్కువవుతుంది. కొందరు ఖుషీగా, సరదాగా ఉంటారు. ముందు ఎంతో ఇష్టపడి తినే పదార్ధాలు కొన్నింటిపై ఇప్పుడు అసహ్యం వేస్తుంది. కష్టసాధ్యమైన కొన్ని విషయాల మీద కోరిక ఎక్కువవుతుంది. డీప్ ఫ్రీజులో పెట్టిన పళ్లు యిష్టమవుతాయి. కడుపులో ఖాళీ ఉన్నట్లు అనిపిస్తుంది. అయినా మితిమించి తినకూడదు. తిండి ఎక్కువవుతుంది. అలా తింటే ఈ స్థితిలో మనిషి బరువు ఎక్కువైపోతుంది. మరీ ఘోరమేమిటంటే కొందరికి తినకూడని వాటిపై తినకోరిక ఎక్కువ కావటం.  వాటిలో బూడిద, గోడసున్నం, బొగ్గులు తెగతినేస్తారు. వీటివల్ల పళ్లుపాడయినా ప్రమాదమేమీ లేదు. శరీరం వాటిని అరాయించుకోదు. విరోచనంలో పోతాయి. కొంతమందిలో పొగతాగే అలవాటు ఉంటుంది. అయితే విచిత్రంగా వాళ్ళు గర్భవతులు అవ్వగానే వాళ్లకు ఆ వాసన పడకుండా అవుతుంది. కేవలం కడుపులో బిడ్డకు ప్రమాదమని మాత్రమే కాదు శరీరతత్వం మారడం వల్ల ఇలా జరుగుతుంది.   ◆నిశ్శబ్ద.

Almond-Your Go To Healthy Snac     For all those people who want to lose weight and get more fitter, it is always suggested that they grab a fistful of dry fruits especially Almonds. Healthy fats and dietary fiber aid in weight loss because they help you feel full, which curbs overeating and unhealthy snacking. Although nuts are high in fat and calories, they prolong the feeling of satisfaction after you eat and keep your blood sugar more stable than low-fat meals do. Thus, you’re less likely to experience a roller-coaster of energy dips and food cravings.   One forth cup of Almonds contains the following health benefits:     207 calories, 5 grams fiber, 5 grams of protein, 33 milligrams iron, 7 grams of carbohydrates, 5 grams of sugar, 172 milligrams phosphorus, 0.4 milligrams, riboflavin, 0.8 milligrams manganese, 97 milligrams magnesium, 96 milligrams calcium, 16 milligrams vitamin E The body needs adequate amounts of fat in the diet in order to properly absorb “fat-soluble” nutrients, like vitamins A and D. Almonds are also considered one of the only nuts that help alkalize the digestive tract, reducing acid buildup and balancing the body’s pH. A healthy pH level is crucial for proper digestion, immunity and disease prevention. Additionally, the nutrients present in almonds may help regulate digestive enzymes that are involved in nutrient extraction, cholesterol synthesis and bile acid production. Almonds are one of the best whole food sources of vitamin E, with about one third of the daily value per ounce. Filled with minerals such as magnesium, copper. Full of potassium, phosphorus and iron and are cholesterol-free. 20-25 almonds contain as much calcium as 1/4 cup of milk. The best way to get the most nutrients out of Almonds is to soak them overnight and eat. Almonds can be difficult to digest and may stress your pancreas. Like all nuts they contain phytate which makes them difficult to digest. To get maximum nutrition it is best to soak them before they are eaten or roast them. Almonds are one of only a few nuts that will actually sprout when soaked. When you soak them it neutralizes the phytate allowing the nutrients from the nut to be released. Some studies suggest that there might be a relationship between nut consumption and reduced cancer risk in women, especially for colorectal and endometrial cancers. The antioxidants and vitamin E in almonds may have cancer-fighting benefits   ..Divya

కూర్చోవడం వల్ల వచ్చే కష్టాలు   1. కుర్చీలోంచి కదలకుండా ఓ అరగంట కుర్చున్నారో...అనారోగ్యాలు మిమ్మల్ని చుట్టుముడతాయి, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. నిజానికి స్థిరంగా కూర్చోటమన్నది మానవులకు సరిపడదుట. అలా కదలకుండా కూర్చున్నప్పుడు మన శరీరంలోని ఎల్.పి.ఎల్ పనితీరు మందగిస్తుదట. ఎల్.పి.ల్ పనితీరు మందగిస్తే నష్టం ఏంటి అంటారా! ఈ ఎల్.పి.ఎల్ వ్యాక్యూమ్ క్లీనర్ లా పనిచేస్తూ, రక్తంలోని చెడు కొలస్ట్రాల్ ను పీల్చుకుని కండరాల రూపంలోకి మారుస్తుంది, సో కదలకుండా కూర్చున్నపుడు ఈ ప్రక్రియ అంతా మందగిస్తుంది. దీంతో రక్తంలో కొవ్వు పెరిగిపోయి చివరికది పొట్ట, తదితర భాగాలలో నిల్వ ఉండిపోతుంది. అందుకే ఎక్కువ సేపు అలా కూర్చుని ఉద్యోగాలు చేసేవారికి పొట్ట త్వరగా వచ్చేది. 2). సహజంగానే ఆడవారికి పిల్లలు పుట్టాకా కాస్త నడుము, పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. అదే పనిగా కూర్చుని ఉద్యోగాలు చేసే వారి గురించి ఇక చెప్పేదిముంది. అవునూ ఇంతకీ పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే ఏమన్నా ఇబ్బందా అన్న డౌట్ వస్తోంది కదా! ఖచ్చితంగా దాని వలన ఇబ్బందే. పొట్ట భాగంలో పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైనదిట. ఇది రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచే హార్మోన్లను సైతం ఉత్పత్తి చేస్తుంది కాబట్టి. రక్తనాళాలు పూడుకు పోవటం, స్థూలకాయం అధికరక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం వుందని హేచ్చరిస్తున్నారు పరిశోదకులు. 3) చాలా సేపు కదలకుండా కూర్చుంటే ఆరోగ్యనికి మంచిది కాదు. కండరాలు క్రమేపి బిగుసుకుపోవటం, వెన్నుముక, భుజాలు, తుంటి సమస్యలు రావటం వంటి ప్రమాదాలు పొంచి వుంటాయట. అదేపనిగా ఒకేచోట కదలకుండా కూచునేవాళ్ళకి రోజు మొత్తం మీద ఒకేచోట  మూడుగంటలని మించి కూర్చోకూడదు. అదీ తప్పని సరైతే తప్ప. వీలునప్పుడు ప్రతీ అరగంటకి ఓసారి లేచి అటుఇటు కాసేపు తిరగటం మంచిది. లేదంటే ఇట్టే అనారోగ్యాల బారిన పడే ప్రమాదం వుందని తేల్చిచెప్పారు అమెరికన్ పరిశోధకులు. ఇందుకుగాను సుమారు 1.20 లక్షల మందిని పరిశీలించారు. వారి జీవనశైలి, ఎంతసేపు ఒకేచోట కూర్చుంటున్నారు వంటి విషయాలని పరిశీలించారు. విశ్రాంతి సమయంలోనైన రోజుకి 3 గంటలకి పైగ కదలకుండా కూర్చునే వాళ్ళలో గండె జబ్బులు వంటివి రావటం గమనించారట. ఎట్టి పరిస్తితిలో ఒకే చోట ఎక్కువ సేపు కూర్చో వలసి వస్తే మాత్రం మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరగటం మంచిది. 4) మన అలవాట్లే మనల్ని కొన్ని అనారోగ్యాలకి దగ్గర చేస్తున్నాయి అంటున్నారు నిపుణులు. ఇందాక చెప్పుకున్నట్టు ఒకేచోట కూర్చోవటం కొన్ని అనారోగ్యాలకి దగ్గర చేస్తే కంప్యూటర్ దగ్గర అదే పనిగా ఎక్కువసేపు  గడిపితే మరో ప్రమాదం పొంచి వుంది. ఈ మధ్య మహిళలు కూడా కంప్యూటర్ని ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఎక్కువసేపు కంప్యూటర్ దగ్గర ఉండే ఆడవారికి ముఖం మడతలు పడటం, కళ్ళు జీవాన్ని కోల్పోవడం, వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం వుందటున్నారు నిపుణులు. తీవ్రమైన రేడియేషన్ కారణంగా కంటి కింద వలయాలు రావటంతో పాటు చర్మ సాగి ముడతలు పదే ప్రమాదం కూడా ఉందట. ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు ఉండవలసి వచ్చినపుడు మధ్య మధ్యలో చిన్నపాటి విరామాలు తీసుకోవటం తప్పని సరట. -రమ

లావుగా ఉన్నవారు సన్నబడాలంటే... ఈ కాలంలో మహిళలను ఎక్కువగా వేధిస్తున్న సమస్య లావుగా హన్తాడం. దీన్నే ఊబకాయం అనికూడా అంటారు. కొందరు ఆహారం వల్ల, లైఫ్ స్టయిల్ సరిగా లేకపోవడం వల్ల లావు అవుతున్నాం అని చెప్పుకుంటూ ఉంటారు. లావు అవుతున్న కారణాలను గురించి బాగానే చెబుతారు కానీ బరువు తగ్గేందుకు పాటించే చిట్కాలను సరిగానే పాటిస్తున్నారా అనే విషయం మాత్రం సరిగా చెప్పరు. అందరికీ చిటికె వేసినంత తొందరగా పలితం రావాలని అనుకోవడమే కోరిక. ఇప్పట్లో అయితే కేవలం పాఠశాల దశ నుండే బాగా లావైపోతున్నారు అమ్మాయిలు. అయితే లావుగా ఉన్నవారి విషయంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు తెలుసుకుని వాటిని ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆవేమిటంటే…  పాఠశాల దశ నుండే.. అధిక బరువులోకి జారుతున్న ఈ కాలం అమ్మాయిలు 20 నుండి 25 సంవత్సరాల వయస్సు నుంచి ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు తీసుకొవాలి. ఈ మార్పు ద్వారా వారి పెళ్లి, ఆ తరువాత గర్భం వంటి దశలలో ఎలాంటి సమస్యా ఎదురుకాకుండా ఉంటుంది.  ఆహార పరిమాణాన్ని కొంచెం కొంచెంగా మార్చుకోవాలి. అంటే  తక్కువ ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి.  ముఖ్యంగా చక్కెర, బెల్లము మొదలైన వాటితో చేసే పిండివంటలు, వెన్న, నెయ్యి, నూనె మొదలైన వాటిని ఉపయోగించి చేసే ఆహార పదార్థాలను చాలా తగ్గించాలి. పిండిపదార్థాలు అంటే కార్భోహైడ్రేట్స్  అధికంగా ఉండే దుంపలు, బియ్యము, మొదలైనవాటిని తగ్గించాలి, నెయ్యి, వెన్న, మీగడ పూర్తిగా మానేయాలి. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఇలా అన్నిటినీ మానుకున్నా  ఆహారంలో శరీరానికి కావలసిన ప్రోటీన్ల పరిమాణం తగ్గించకూడదు. ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండి, పిండిపదార్థాలు, కొవ్వుపదార్థాలు తక్కువగా ఉండాలి. అలా ఉన్న  ఆహారం సన్నబడడానికి తోడ్పడుతుంది. ప్రోటీన్లు అధికంగా ఉన్న మాంసము, చేపలు, పప్పుపదార్థాలు తీసుకోవాలి.  వేరు సెనగపప్పులో ప్రోటీనులు అధికంగా ఉన్నా వాటికి మించి కొవ్వుపదార్ధాలు ఉన్నాయి. కాబట్టి ఈ పప్పు తినడం తగ్గించాలి. ఖనిజలవణాలు, విటమిన్లు మామూలు వ్యక్తికి ఎంత అవసరమో లావుగా ఉండేవారికి కూడా అంతే అవసరం. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు. మామూలు వ్యక్తి తీసుకొన్నట్టే తీసుకోవాలి, ఆపిల్, అరటి, సీతాఫలాలలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తక్కువగా తినాలి. సాధ్యమైనంతవరకు వాటిని తగ్గించి వాటి స్థానంలో నారింజ, బత్తాయి మొదలైన పండ్లను తినడం మంచిది. కాఫీ, టీ తాగడం తగ్గించాలి. కాఫీ, టీలలో వాడే చక్కెర మోతాదు కూడా తగ్గించుకోవడం అవసరము. సాధ్యమైతే చక్కెర లేకుండా కాఫీ, టీ తాగడం మంచిది. మధ్యమధ్యలో చిరుతిండ్లు తినడం అందరికీ అలవాటుగా ఉంటుంది. దీనివల్లనే చాలామంది లావు అవుతారు. చిరుతిండ్లు మానివేయాలి. ఒకవేళ ఆగలేక చిరుతిండ్లు తింటే.. ఆ తిన్నపూట భోజనం తగ్గించడమో లేక మానివేయడమో చేయాలి. ఆహారాన్ని తక్కువగా తీసికోవలసివస్తే అన్నం తక్కువగాను కూరగాయలు, ఆకుకూరలు, పెరుగు,  ఎక్కువగాను తింటే ఎక్కువ తిన్నట్టు ఉంటుంది, తృప్తి కూడా కలుగుతుంది. అన్నది. పచ్చిగా తినదగిన పచ్చికూరగాయలు, పండ్లు ఎక్కువగా తింటే కడుపు నిండి తృప్తిగా ఉంటుంది.  ఆహారం తగ్గించడంతోపాటు వ్యాయామం చెయ్యడం చాలా అవసరము. వ్యాయామంతో పాటు ఆహారం తినడం పెంచకూడదు. దీనివల్ల వ్యాయమం చేసిన ఫలితము ఉండదు. చేతనైనంత వరకు తమపనులను చేసుకోవడం మంచిది. లావుగా ఉన్నవారు ఎక్కువ కష్టమైన వ్యాయామం చేయడం మంచిదికాదు. శరీరానికి తగిన వ్యాయామాలను ఎంచుకుని చేయాలి. ఇవన్నీ చేస్తే లావుగా ఉన్నవారు తొందరగానే సన్నబడతారు.                                    ◆నిశ్శబ్ద.

తెల్లకుసుమ వ్యాధి వేధిస్తోందా?? ఇదిగో చిట్కాలు.. మహిళలను వేధించే సమస్యలు చాలా ఉన్నాయి. వాటిలో అధిక రతుస్రావం కావడం ఒకటైతే, అసలు రక్తస్రావం సరిగా కాకపోవడం రెండవ సమస్య. వీటికి విభిన్నంగా మహిళల్లో ఎదురయ్యే మరొక సమస్య ఉంది. అదే వైట్ డిశ్చార్జ్. తెల్లబట్ట అని అందరూ పిలుచుకునే ఈ సమస్యను ఆయుర్వేదం ప్రకారం తెల్లకుసుమ వ్యాధి అని అంటారు. ఈ వ్యాధికి సాధారణ ఇంగ్లీషు వైద్యంలో ఎన్నో మందులు ఉన్నా అవి వాడినన్ని రోజులు ఆరోగ్యం బాగుంటుంది కానీ మందులు వాడటం ఆపగానే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. అదే ఆయుర్వేదంలో సహజ మార్గాల ద్వారా, అందరికీ అందుబాటులో ఉండే పదార్థాలను ఉపయోగించి సమస్యలను తగ్గించుకునే మార్గాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని తెలుసుకుంటే… తెల్ల బట్ట అవుతున్నప్పుడు అందరూ సులువుగా పాటించగలిగే చిట్కా ఒకటుంది.  మొదటి 3 రోజులు వరకు ఒక్కొక్క చెంచా ఆముదాన్ని తాగాలి. ఇలా ఆముదాన్ని తీసుకున్న తరువాత తెల్లబట్టకు వైద్యులు సూచించిన మెడిసిన్ వాడాలి. దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి.  అలాగే మహిళల్లో ఈ సమస్య ఉన్నప్పుడు ఈ చిట్కా పాటించేటప్పుడు మగవారికి దూరంగా ఉండాలి.   మహిళలకు అందరికీ అందుబాటులో ఎంతో సులువుగా పాటించగలిగే మరొక చిట్కా వంటింట్లో దాగుంది. ప్రతి రోజు అన్నం చేయడానికి మహిళలు బియ్యం కడుగుతూ ఉంటారు. మొదటిసారి బియ్యం కడిగేసాక అందులో దుమ్ము మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది. రెండవసారి బియ్యం కడిగిన నీటిని విడిగా తీసుకోవాలి. ఈ బియ్యం కడిగిన నీళ్లలో అయిదు గ్రాముల  జీలకర్ర, అయిదు గ్రాముల పటిక బెల్లముల పొడిని తీసుకుని ఆ పొడిని బియ్యం కడిగిన నీళ్లలో కలిపి త్రాగాలి. ఇలా చేయడం వల్ల తెల్లబట్ట సమస్య నుండి మంచి ఫలితం ఉంటుంది.  గ్రామీణ ప్రాంతాల్లో మోదుగ చెట్లు చాలా విరివిగా పెరుగుతుంటాయి. ఈ చెట్లకు పూలు కాస్తాయి. 10-15 మోదుగ పూలను, తీసుకోవాలి. 100-200 మి.లీ. ల నీటిలో తీసుకున్న మోదుగపూలను నానబెట్టి ఆ తరువాత పూలను తీసేయాలి.  ఆ నీటిని త్రాగటం తెల్లబట్ట సమస్య తగ్గిపోతుంది. లేదంటే మరొక పరిష్కారం కూడా ఉంది.   5 తాజా గులాబీ పూలను తీసుకోవాలి. ఈ పూలను ఉదయం, సాయంత్రం రెండు పూటలా పటిక బెల్లముతో తిని ఆవుపాలు త్రాగాలి. ఇలా చేస్తుంటే తెల్లబట్ట సమస్య క్రమంగా తగ్గిపోతుంది. పైన చెప్పుకున్న ఎంతో సులువైన, అందరికీ అందుబాటులో ఉన్న పదార్థాలతో చిట్కాలు పాటించి తెల్లబట్ట సమస్యను తగ్గించుకోవచ్చు.                                   ◆నిశ్శబ్ద.

గర్భవతులు ప్రయాణాల్లో ఇవి పాటిస్తే పండంటి బిడ్డ పుడతాడు! మహిళల జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది తల్లి కావడం. పెళ్ళైన పరిస్థి అమ్మాయి తల్లి కావాలని అనుకుంటుంది. తాను గర్భవతినని తెలిసినప్పుడు ఎంత సంతోషపడుతుందో మాటల్లో వర్ణించలేనిది. ఒకానొక కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది. అంతేనా మరొక ప్రాణాన్ని మోస్తూ ఈ ప్రపంచానికి కొత్త ప్రాణాన్ని పరిచయం చేయబోతున్నాను అనే భావం కూడా చాలా బావోద్వేగాన్ని కలిగిస్తుంది. అయితే గర్భం ధరించిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. కుటుంబ సభ్యులు తన విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రమే కాకుండా తన మీద తాను చాలా జాగ్రత్త వహించాలి.  మరీ ముఖ్యంగా గర్భవతులకు ప్రయాణాలు అనేవి సహజం. కనీసం డాక్టర్ చెకప్ లకు అయినా వెళ్లాల్సి ఉంటుంది. కొందరికి సరైన డాక్టర్లు దగ్గర్లో లేక కాసింత దూరమే వెల్లడి వస్తుంది. గర్భం ధరించిన  మహిళలు ప్రయాణం సమయాల్లో తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు….. గర్భం ధరించిన తరువాత ఎంత కాదనుకున్నా ప్రయాణాలు తప్పవు. ఉద్యోగాలు చేసే మహిళలు అయితే కచ్చితంగా తిరగాల్సి ఉంటుంది. కాబట్టి గర్భవతులు ప్రయాణములో బాగా కాచి చల్లార్చిన నీటినే త్రాగాలి. బయటి నీరు, డ్రింక్స్, సోడాలు, ఇతర ద్రవాలు త్రాగకూడదు!!  చాలామందికి ఎత్తు మడమల చెప్పులు వేసుకోవడం అలవాటు ఉంటుంది. పెళ్ళయ్యి గర్భం దాల్చేవరకు అమ్మాయిల లైఫ్ స్టైల్ లో ఈ ఎత్తుమడమల చెప్పులు సాధారణం. కానీ  గర్భవతులైన స్త్రీలు ఎత్తుమడమల చెప్పులు వేసుకోకూడదు. వదులుగా, ఫ్లాట్ గా ఉండే చెప్పులు  వాడాలి!!  గర్భవతులు వాంతులు కావడం సహజం. వేవిల్లు అని పిలిచే ఇవించెప్పలేనంత నీరసాన్ని తెచ్చిపెడతాయి. ప్రయాణములో వాంతులయ్యే అలవాటు ఉన్న వారికి గర్భ సమయములో ఇంకా పెరుగుతాయి. కాబట్టి... ముందుగానే వైద్యుని సంప్రదించి, తగిన మందులు తీసుకెళ్ళాలి. ప్రయాణంలో ఆకలి అనేది సహజం. అయితే గర్భవతులు మాత్రం తమతో పాటు  కొన్ని రకాల  పండ్లను వెంట ఉంచుకోవాలి, ప్రయాణంలో ఆకలి అనిపిస్తే పండ్లనే తినాలి!  అంతేకానీ బస్సులు, ట్రైన్లు ఆగినప్పుడు అడ్డమైన తిండి కొనుక్కుని తినకూడదు. బయటి పదార్థాలను తినకపోవడం మంచిది!! ఇంట్లో గర్భవతులు ఉన్నారంటే చాలామంది కాలు కింద పెట్టకుండా రెస్ట్ తీసుకోమని చెబుతుంటారు. వారి మీద ప్రేమ అలా చేయిస్తుంది. అయితే ఇలా గర్భవతులకు ఏ విధమైన పనులు లేకుండా ఒకే చోట కూర్చోమని చెప్పడం తప్పు.  గర్భవతులకు నడక మంచిది. సాధారణంగా గర్భవతులు నడుస్తున్నప్పుడు తొందరగా అలసిపోతారు.... అలా అలసట అనిపిస్తే.... ఆగి కొద్దిసేపు కూర్చుని.. అలసట తీరిన తరువాత తిరిగి నడవాలి. పనులు చేసుకున్నా, నడిచినా గర్భవతులు బరువులు మాత్రం ఎత్తకూడదు, మోయకూడదు!! ఒకవేళ ఎత్తవలసిన పరిస్థితి వస్తే.... నిలుచున్న స్థితిలోకాక మోకాళ్ళు వంచి, కూర్చుని అప్పుడు ఎత్తాలి! కానీ బరువులు ఎత్తుకుని నడవకూడదు. గర్భవతులు  పండంటి బిడ్డను పొత్తిళ్ళతో చూసుకొని ఆనంద పడాలంటే.... ప్రయాణములో పై పద్దతులను తప్పక ఆచరించాలి.                                     ◆నిశ్శబ్ద.

గుమ్మడి విత్తనాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు! వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి అని చిన్నప్పుడు భలే ఆడుకునేవాళ్ళం. అయితే ఇప్పుడేంటట అనే ప్రశ్న వద్దులెండి. గుమ్మడికాయ ఒక కాయగూర గానే కాకుండా భారతీయ హిందూ సాంప్రదాయంలో కూడా భాగం. క్రమక్రమంగా మాంసాహారం వైపు మళ్ళుతూ సాంప్రదాయ వంటకాలను కూరగాయలను మరుగున పడేస్తున్నారు నేటితరం వారు. ఇప్పుడు గుమ్మడికాయ స్తోత్రం ఎందుకట అనే ప్రశ్న గనుక మీరు వేస్తే దానికి సమాధానం గంపెడంత గుమ్మడి పొట్టలో మెరిసే విత్తనాల రాజసం గురించి చెప్పాలి. దోస, గుమ్మడి, పుచ్చకాయ వంటి విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒకప్పుడు ఈ కాయలలో వేటిని కట్ చేసినా పండు తినేసి విత్తనాలు పడెస్తూ ఉండేవారు. ఏ కొద్దిమందో ఆ విత్తనాలను ఎండబెట్టుకుని టైంపాస్ గా తింటూ ఉంటారు.అయితే ప్రస్తుత కాలంలో వీటికి ప్రాధాన్యత పెరిగింది. దోస, గుమ్మడి, సన్ ఫ్లవర్ సీడ్స్, కర్భూజ వంటి విత్తనాలను ప్రతిరోజు కొద్ది మోతాదులో తీసుకోవాలని పోషకాహార నిపుణులు మొత్తుకుని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు వీటిని ఎంత తీసుకుంటే అంత మంచిదని అంటున్నారు. ఇంతకూ గుమ్మడికాయ విత్తనాలు ఎందుకు తీసుకోవాలి వాటి వల్ల కలిగే లాభాలు ఏమిటి వంటి విషయాలలోకి వెళితే.. విత్తనం చిన్నదే అయినా అందులో ఉన్న పోషకాలు మాత్రం చాలా ఎక్కువ. గుమ్మడి విత్తనాలలో పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, కాపర్, జింక్ సహా  ఆరోగ్యకరమైన క్రొవ్వులు ఉంటాయి. ఈ క్రొవ్వులు శరీరంలో అధిక శాతంలో ఉండే చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. దీని ఫలితంగా చాలా మందిని ఇబ్బంది పెట్టే టైప్-2 డయాబెటిస్ రాకుండా చేయడంలో గుమ్మడి విత్తనాలు సహాయపడతాయి.  ఇక గుమ్మడి విత్తనాలు నిద్రకు మంచి మందు అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. వీటిలో ఉండే ట్రిప్టోఫాన్, జింక్ అనే రెండూ కలసి సెరటోనిన్ గా మార్పు చెందుతుందట. ఈ సెరటోనిన్ కూడా మెలటోనిన్ అనే హార్మోన్ గా రూపాంతరం చెందుతుంది. మంచి నిధ్ర పట్టడానికి ఈ మెలటోనిన్ అనే హార్మోన్ చాలా సహాయపడుతుంది. అందుకే రాత్రి నిద్రపోయే ముందు ఓ పది గుమ్మడి విత్తనాలు తిన్నా అద్బుతమైన నిద్ర సొంతం చేసుకోవచ్చు.  నిద్రకే కాదు అధిక బరువు ఉన్నవారికి కూడా ఈ గుమ్మడి విత్తనాలు వరమని  చెప్పవచ్చు. ఎందుకంటే వీటిని కొద్దీ మొత్తంలో తీసుకున్న తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. దీని వల్ల ఎక్కువసేపు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండే వెసులుబాటు కలుగుతుంది. ఎలాగూ ఇందులో ప్రోటీన్లు, కెలోరీలు అధికంగా ఉంటాయి. అయితే ఇవి ఆరోగ్యకరమైన క్రొవ్వులు కాబట్టి, వీటిని తక్కువ మొత్తంలోనే తీసుకుంటాం కాబట్టి వీటి ద్వారా శరీరానికి అందే క్రొవ్వులు ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే… ఈ కారణంగా ఇది జీర్ణాశయంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడంలో బెస్ట్ గా పని చేస్తుంది. అధిక బరువుకు దూరంగా కూడా ఉండవచ్చు. ఇమ్యూనిటీ బూస్టర్!! గుమ్మడి విత్తనాలు గొప్ప ఇమ్యూనిటీ బూస్టర్ గా పని చేస్తాయి. వీటిలో ఉండే జింక్ గాయాలను, బాక్టీరియా, వైరస్ లతో సమర్థమవంతంగా పోరాడగలుగుతుంది, వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇక ఇందులో ఉండే మాంగనీస్, విటమిన్ కె శరీరంలో ఎక్కడైనా  గాయాలు అయితే అవి నయం అవడంలో సహాయపడతాయి. ఉదయం టిఫిన్ తినే సమయంలో లేదంటే మధ్యాహ్నం లంచ్ చేయడానికి ముందు లేదంటే ఉదయం నుండి  అప్పుడప్పుడు బ్రేక్ సమయాల్లో గుమ్మడి గింజలను ఓ 10 నుండి 15 వరకు తిన్నా సరిపోతుంది. చెప్పలేనంత శక్తి, రోగనిరోధక శక్తి లభిస్తాయి.  కురులకోసం.. చాలామంది ఇప్పట్లో గుమ్మడి విత్తనాలను వాడేది కేవలం జుట్టు సంరక్షణ కోసమే. జుట్టు పెరుగుగుదలకు  తోడ్పడే కుకుర్ బిటాసిన్, అమినో యాసిడ్స్ గుమ్మడి విత్తనాల్లో పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఇ, కేరోటినాయిడ్లు జుట్టు ఎదుగుదలకు తోడ్పడతాయి. కొల్లాజెన్ తయారవడానికి దోహదం చేసి జుట్టు, చర్మం, గోర్లు  ఆరోగ్యవంతంగా ఉండటానికి దోహదపడుతుంది. చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఇవీ గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.                                       ◆నిశ్శబ్ద.

మహిళల్లో ఒత్తిడికి కారణాలు, వాటికి పరిష్కారాలు!! ఒత్తిడి ఎలా ఉంటుంది గొంతు మీద కత్తి పెట్టి దాన్ని మెల్లగా లోపలికి దింపుతూ ఉంటే శరీరంలో ఉన్న ప్రాణం మెల్లగా జారిపోతుంటే ఎలా అనిపిస్తుందో... అలాంటివేమీ జరగకపోయినా అదే ఫీలింగ్ ఇస్తూ మనిషిని మానసికంగా బలహీనంగా మార్చేస్తూ ఉంటుంది. చెప్పలేనంత అసహనం, చిరాకు, నిరాశ, నిస్పృహ అన్నిటికీ మించి ఓ దశలో చనిపోవాలనే ఆలోచన కూడా ఒత్తిడిని ఎదుర్కొనేవారిలో ఉంటుంది. చిన్నపిల్లలు, మహిళలు, పెద్దలు ఇలా అన్నిరకాల వర్గాల వారు ఒత్తిడి భూతానికి బలి అవుతూ ఉంటారు. ముఖ్యంగా మహిళల్లో బయటి విషయాలకే కాకుండా హార్మోన్ సమస్యల వల్ల కూడా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఒత్తిడి ఎలా ఎదురవుతోంది దాని పరిష్కార మార్గాలు ఏమిటి వంటి విషయాలు ప్రతి మహిళ తప్పక తెలుసుకుంటే….. ఇంట్లో ఉండే ఆడవారు అయినా, యువత అయినా, విద్యార్థులు అయినా వారి వారి మానసిక పరిస్థితి ప్రభావం ఆధారంగా మనుషుల్లో నీరసం, నిస్సత్తువ, ఆసక్తి లేకపోవడం వీటితో పాటు సరైన నిద్రలేకపోవడం వల్ల అది క్రమంగా ఒత్తిడిగా రూపాంతరం చెందుతుంది. అందరూ చేస్తున్న తప్పుల వల్లనే ఒత్తిడి అనే సమస్య ఎదురవుతోంది. మొబైల్ ఫోన్:-  ఇప్పటి కాలంలో మొబైల్ ఫోన్ వల్ల మహిళల్లో మానసిక ఒత్తిడి స్థాయిలు అధికం అవుతున్నాయి. చాలా సులభమైన విషయం చెప్పాలంటే మొబైల్ చేతిలో ఉంటే గంటలు గంటలు దానితో గడిపేస్తుంటారు. ఫలితంగా ఎన్నో పనులు పూర్తికాకుండా అలా మిగిలిపోతాయి.  దీనివల్ల తెలియకుండానే ఒత్తిడిలోకి జారుకుంటారు. ఇదొకటి అయితే ఈ సోషల్ మీడియాలో కొందరు తొందరగా ఓపెన్ అయిపోయి అన్ని షేర్ చేసుకుంటారు. ఆ తరువాత అదే పెద్ద సమస్య అయి కూర్చుంటుంది. సోషల్ మీడియా లో ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకే అందరూ తొందరగా ఒత్తిడిలోకి జారుకుంటారు. కాబట్టి మొబైల్స్, సిస్టం, టాబ్స్ ఇలా అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కి దూరం ఉండాలి. గడిపే సమయం!! సమయం గడిపే విధానంలో ప్రణాళిక ఎలాగైతే అందరికీ ముఖ్యమో…. అనవసర విషయాలు వదిలి కుటుంబం తో ఎక్కువ సమయం గడపడం అంత ముఖ్యం. ఏదైనా ఇబ్బంది అనిపించినా, సమస్య ఎదురైనా బయట ఎవరికో చెప్పుకుంటే వారు కేవలం వింటారు, ఆ తరువాత దాన్ని ఇతరులతో ఒక గాసిప్ గానో, ఫ్రెష్ న్యూస్ గానో మార్చి ప్రచారం చేస్తారు. కానీ కుటుంబ సభ్యులు అలా కాదు. సమస్య ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో చెబితే వారు మొదట్స్ కోప్పదినా, తిట్టినా, ఆ తరువాత ఖచ్చితంగా మంచి సలహా ఇవ్వడం, తోడుగా వెంట ఉండటం, పరిష్కారం అయ్యేవరకు ధైర్యం చెప్పడం చేస్తారు. కాబట్టి ఎప్పటికీ కుటుంబమే అందరికీ తోడు అని గుర్తుపెట్టుకోవాలి. ఒంటరితనం, బాధ వంటివన్నీ కుటుంబ సభ్యుల సమక్షంలోనే పోగొట్టుకోగలం. బ్యాలెన్స్డ్ లైఫ్!! ఇల్లు, కుటుంబం, ఉద్యోగం, ఇతర పనులు వీటన్నింటినీ సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటే…. వేటికి ఇవ్వాల్సిన సమయం వాటికి ఇస్తూ ఉంటే ఒత్తిడి అనే మాట పారిపోతుంది.  నియంత్రణ!! ఒత్తిడికి లోనయ్యాము అని గుర్తించినప్పుడు దాన్ని నియంత్రించే మార్గాలు కూడా కనుక్కోవాలి. ఇప్పట్లో ఎన్నో రకాల స్ట్రెస్ రిలీఫ్ పనులను యూట్యూబ్ వంటి ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లలో షేర్ చేస్తుంటారు.అనుభవం కలిగిన వారు, నిపుణులు చెప్పే విషయలు ఫాలో అవ్వాలి.  కొత్త విషయాలు ఫాలో అవ్వడం, కొత్త పనులు చేయడం, ప్రతిరోజు కొత్తగా మొదలు పెట్టడం వంటివి చెయ్యాలి. ఎవరికి వారు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అనేవి ఉంటే ఒత్తిడిని చెవులు పిండి తరిమేయచ్చు.                                       ◆నిశ్శబ్ద.