Home » Day Two » మహిషుని మదన మంత్రాలోచన

 

 

 

మహిషాసురుడు మహామంత్రి రాకకోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఉరుకులు, పరుగులమీద ఒగర్చుకుంటూ వచ్చి భయంతో వెర్రి చూపులు చూస్తూ మహిషుని ముందు నిలబడ్డాడు రాక్షసమంత్రి. ఆశ్చర్యంగా రాక్షసమంత్రి వంకచూస్తూ ‘ఏం జరిగింది’ అని అడిగాడు మహిషుడు. ‘అసురేశ్వరా.. మీ ఆఙ్ఞాబద్ధుడనై ఆ సుందరి దగ్గరకు వెళ్లాను. ఆమె అసమాన సౌందర్యరాశి. అష్టాదశభుజ. సింహవాహనం మీద చిరునవ్వులు చిందిస్తూ కూర్చుని ఎంతో అహంకారంగా మాట్లాడింది. మీరొక పశువట. మీవంటి పశువును వివాహం చేసుకోవడానికి తను పశువుకాదట. మిమ్మల్ని మర్యాదగా పాతాళానికి పోయి ప్రాణాలు కాపాడుకొమ్మని హెచ్చరించింది. లేకపోతే మీ ప్రాణాలు తీస్తానని తన మాటగా చెప్పమని నాతో మీకు వర్తమానం పంపింది’ అని పలికి మౌనం వహించాడు రాక్షసమంత్రి. వెంటనే మహిషుడు తన మంత్రులందరినీ సమావేశపరిచి, జరిగినదంతా వివరంగా వారికి చెప్పి, వారి అభిప్రాయాలు చెప్పమన్నాడు. అప్పుడు విరూపాక్షుడు లేచి ‘రాక్షసేశ్వరా..,  మదమెక్కిన ఓ ఆడది అహంకారంతో ఏదో మాట్లాడిందని నీవంటి వీరుడు భీరువు కారాదు. ఇన్ని మాటలెందుకు? నేననిప్పుడే వెళ్లి ఆ మోహనాంగిని సర్పపాశాలతో బంధించి తెచ్చి నీ పాదాలముందు పడేస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో’ అన్నాడు.

More...