Home » Day Two » నైవేద్యం-దద్దోజనం

 

 

నైవేద్యం-దద్దోజనం

 

 

 

!! కావలసినవి !!

బియ్యం - ఒక కప్పు
పెరుగు - రెండు  కప్పులు
కొత్తిమీర తరుగు - అర కప్పు
అల్లం - చిన్నముక్క
శొంటి - చిన్న ముక్క
మెంతులు - అర  స్పూన్
ఎండు మిరపకాయలు - రెండు
మినపప్పు - ఒక టీ స్పూన్
ఆవాలు - అర  స్పూన్
జీలకర్ర  - అర  స్పూన్
పచ్చిమిర్చి - రెండు
పసుపు - అరస్పూన్
ఉప్పు తగినంత    
 
 
!! తయారీ !!

 
ముందుగా అన్నం వండుకుని కొంచం చల్లరాక అందులో పెరుగు,పసుపు, ఉప్పు కలిపి పెట్టుకోవాలి.తరువాత అల్లం, శొంటి, పచ్చిమిర్చి మిక్సీలో వేసి మెత్తగా చేసి ఆ మిశ్రమాన్ని పెరుగన్నంలో కలుపుకోవాలి. ఇప్పుడుస్టవ్ వెలిగించి బాణాలి పెట్టి నూనె వేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర,  మెంతులు,ఎండు మిరపకాయలు వేసి వేయించుకుని  పెరుగు అన్నం లో కలిపి పైన  కొత్తిమిరతో అలంకరించుకుని దేవికి నైవేద్యం పెట్టాలి...