పెసరపప్పుతో ఇలా చేస్తే చాలు.. మచ్చలేని ముఖం మీ సొంతమవుతుంది..

పెసరపప్పుతో ఇలా చేస్తే చాలు.. మచ్చలేని ముఖం మీ సొంతమవుతుంది.. పెసలు తెలుగు రాష్ట్రాలలో తక్కువగా ఉపయోగిస్తుంటారు. మహా అయితే పెసరట్టు, లేదంటే పులగం కోసం మాత్రమే పెసలు ఉపయోగిస్తారు. పాయసం అయినా, పొంగలి అయినా, పప్పు అయినా, సలాడ్ అయినా పొట్టుతీసిన పెసరపప్పు వినియోగిస్తారు. పెసలు గొప్ప పొష్టికాహారం మాత్రమే కాదు, శరీరంలో వేడి తగ్గించి చలువ చేస్తుంది. అయితే కేవలం ఆరోగ్య పరంగానే కాదు. సొందర్యం కోసం కూడా పెసలు అధ్బుతంగా పనిచేస్తాయి. పెసలను ఆయుర్వేదంలో  పప్పుల రాణి అని పిలుస్తారు. కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు వంటి వాటితో పోలిస్తే పెసరపప్పు ఎంతో శ్రేష్టం. ఇక పెసరపప్పును ముఖాన్ని మెరిపించడానికి ఉపయోగించవచ్చు. ముఖం మీద మచ్చలు, మంగు, నలుపు వంటివన్నీ పోయి ముఖం అందంగా తయారుకావడానికి పెసరపప్పు ఉపయోగించి తయారుచేసుకునే 5ఫేస్ ప్యాక్ లు ఉన్నాయి.  అవెలా తయారుచేసుకోవాలో తెలుసుకుంటే.. సన్ టాన్ తొలగడానికి.. సన్ టాన్ ముఖం రంగును పాడు చేస్తుంది. ఇది తొలగించడానికి పెసరపప్పు, పెరుగు పేస్ ప్యాక్ వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసిన పెసరపప్పు పొడి నాలుగు స్పూన్లు, పెరుగు రెండు స్పూన్లు తీసుకోవాలి. రెండింటిని మిక్స్ చేసి ముఖానినకి పేస్ ఫ్యాక్ వేసుకోవాలి. 10నిమిషాల తరువాత దీన్ని కడిగేసుకోవాలి. సన్ టాన్ తొలగడమే కాకుండా చర్మం మృదువుగా మారుతుంది. అవాంఛిత రోమాలు తొలగడానికి.. ముఖం మీద అవాంచిత రోమాలు ఉన్నట్టేతే ఈ పేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల వాటిని తొలగించుకోవచ్చు. నాలుగు స్పూన్ల పెసరపప్పును నానబెట్టాలి. బాగా నానిన తరువాత వీటిని గ్రైండ్ చేయాలి. ఇందులో రెండు స్పూన్ల నారింజ తొక్కల పొడి, రెండు స్పూన్ల గంధపు పొడి  కలపాలి. ఇది బాగా గట్టిగా ఉంటే ఇందులో కాసిన్ని పాలు జోడించాలి. మందంపాటి పేస్ట్ గా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖం మీద పట్టించి 10నిమిషాల తరువాత దీన్ని రబ్ చేస్తూ తొలగించాలి. ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖం మీద అవాంచిత రోమాలను తొలగిస్తుంది. డ్రై స్కిన్ కోసం.. డ్రై స్కిన్ ఉన్నవారు ఏ పేస్ ప్యాక్ వాడితే ముఖం అందంగా మారుతుందనే విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. రెండు టేబుల్ స్పూన్ల నానబెట్టిన పెసరపప్పును గ్రైండ్ చేయాలి. దీంట్లో కొద్దిగా పచ్చిపాలు వేయాలి. ఒకవేళ పెసరపప్పు గ్రైండ్ చేసేటప్పుడే పాలు జోడించవచ్చు. దీన్ని మెత్తని పేస్ట్ లా చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15నిమిషాల తరువాత ముఖం కడుక్కోవాలి. ఈ ప్యాక్ డ్రై స్కిన్ ఉన్నవారికి చక్కని ఫలితాన్ని ఇస్తుంది.  ముఖ చర్మాన్ని తేమగా,మృదువుగా మారుస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేయడానికి..  వాడిపోయిన చర్మాన్ని తిరిగి తాజాగా, కాంతివంతంగా మార్చడంలో ఈ ఫేస్ ప్యాక్ సమర్థవంతంగా పనిచేస్తుంది. నానబెట్టిన రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పును గ్రైండ్ చేయాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ బాదం నూనె, ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని పేస్ ప్యాక్ వేసుకోవాలి. 15నిమిషాల తరువాత ముఖం కడుక్కోవాలి. ఇది చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేస్తుంది. ముఖానికి కాంతిని ఇస్తుంది. మొటిమలు తగ్గడానికి.. చాలామందికి మొటిమలు ప్రధాన సమస్య. ఈ సమస్య తొలగడానికి ఈ ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. 4స్పూన్ల పెసరపప్పు పేస్ట్ లో రెండు స్పూన్ల నెయ్యి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత ముఖం కడిగేయాలి. దీన్ని రెగులర్ గా ఫాలో అవుతూ ఉంటే ముఖం మీద మొటిమలు, మచ్చలు, మంగు వంటివన్నీ తొలగిపోతాయి. ముఖం చాలా తాజాగా కనిపిస్తుంది. (Note: ఇంట్లోనే మెత్తగా  గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు  పొడి అయినా వాడచ్చు. లేదా.. నానబెట్టిన పెసరపప్పు ను గ్రైండ్ చేసుకుని అయినా ఈ పేస్ ప్యాక్ లలో ఉపయోగించుకోవచ్చు.)                                 *నిశ్శబ్ద.

ఇంట్లోనే ఫేస్ టోనర్.. ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు..!

ఇంట్లోనే ఫేస్ టోనర్.. ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు..! ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి ఈ కాలంలో స్త్రీలు, పురుషులు అందరూ  ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులు వాడటం,  ఖరీదైన చర్మ  చికిత్సలు చేయించుకోవడం చేస్తున్నారు. కొందరు వైద్యులు సూచించిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ చాలా సార్లు అవి ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వవు.  లేదా అవి వాడినన్ని రోజులు మాత్రమే చర్మం బాగుంటుంది.  ఆ తరువాత చర్మం మళ్లీ మొదటికి వస్తుంది. ఆ ఉత్పత్తులను వాడటం ఆపివేసిన తర్వాత, చర్మం నిస్తేజంగా మారుతుంది.ఇలాంటి ముఖాన్ని తిరిగి తాజాగా మార్చుకోవడం కోసం చాలా కష్టపడుతుంటారు. కానీ ఇంట్లోనే ఫేస్ టోనర్ తయారు చేసుకుని వాడటం వల్ల ముఖ చర్మం చాలా ఆరోగ్యంగా మారుతుంది. ఇంతకీ ఈ పేస్ టోనర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుంటే.. టోనర్ తయారు చేయడానికి కావలసినవి.. ఇంట్లో టోనర్ తయారు చేయడానికి  ప్రధానంగా అవసరం అయ్యేవి..  రోజ్ వాటర్ - 2 టేబుల్ స్పూన్లు, కలబంద జెల్ - 1 టేబుల్ స్పూన్, దోసకాయ రసం - 2 టేబుల్ స్పూన్లు, కోల్డ్ గ్రీన్ టీ. టోనర్ తయారు చేసే విధానం.. ఇంట్లో టోనర్ తయారు చేసుకోవడం చాలా సులభం. దీని కోసం రోజ్ వాటర్, కలబంద జెల్, దోసకాయ రసం, గ్రీన్ టీ వంటి అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.  తరువాత ఈ మిశ్రమాన్ని  ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. ఈ టోనర్ ను  ఫ్రిజ్‌లో ఉంచవచ్చు.  దీన్ని ఫ్రిజ్‌లో ఉంచితే అది  చర్మానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంట్లో తయారుచేసిన టోనర్ ఒక వారం మాత్రమే ఉంటుంది.  కాబట్టి టోనర్ ను ఒక వారంలో వాడగలిగినంత మాత్రమే తయారు చేసుకోవడం మేలు.   ఉపయోగించే పద్దతి.. టోనర్ వాడటం చాలా సులభం. దీని కోసం, ముందుగా ముఖం కడుక్కున్న తర్వాత, కాటన్ ప్యాడ్ ఉపయోగించి లేదా నేరుగా స్ప్రే చేయడం ద్వారా టోనర్‌ను ముఖంపై అప్లై చేయాలి.  ఇప్పుడు ముఖాన్ని 2 నుండి 3 నిమిషాలు ఇలాగే ఉంచాలి. తద్వారా అది చర్మంలోకి శోషించబడుతుంది. టోనర్‌ను స్ప్రే బాటిల్‌లో ఉంచినట్లయితే, టోనర్‌ను ముఖంపై స్ప్రే చేసి అలాగే ఉంచాలి. ఎప్పుడు ఉపయోగించాలి? టోనర్ ను ముఖంపై క్రమం తప్పకుండా ఉపయోగించగలిగినప్పుడే టోనర్ ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. దీని కోసం ఉదయం,  సాయంత్రం  ముఖాన్ని కడుక్కోవాలి. ఆ తరువాత టోనర్ ఉపయోగించండి.                          *రూపశ్రీ.

మాన్సూన్.. వర్షాకాలంలో కూడా ముఖం మీద టాన్ వస్తుందా..ఇలా తొలగించుకోవచ్చు..!

మాన్సూన్.. వర్షాకాలంలో కూడా ముఖం మీద టాన్ వస్తుందా..ఇలా తొలగించుకోవచ్చు..! వర్షాకాలంలో చాలామంది   దురద, చర్మంపై మంట, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు.  అయితే  ఈ సీజన్‌లో వచ్చే  మరొక సమస్య ఉంది. ఇది ప్రతి రెండవ వ్యక్తిని బాధపెడుతుంది.  ఈ సమస్య చర్మంపై టానింగ్.  చాలామంది సూర్యరశ్మి వల్ల మాత్రమే టానింగ్ వస్తుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వర్షాకాలంలో కూడా టానింగ్ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే ఇంట్లోనే  మొండి టానింగ్ ను కూడా తొలగించుకోవచ్చు.  దీని కోసం ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కాలు తెలుసుకుంటే.. టిప్..1 మొదటి టిప్ ప్రయత్నించడానికి మీకు 2 చెంచాల శనగపిండి, 1 చెంచా పెరుగు, చిటికెడు పసుపు, కొన్ని చుక్కల నిమ్మరసం అవసరం. ఉపయోగించే విధానం.. పైన చెప్పుకున్న మూడు పదార్థాలను కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ సిద్ధమైన తర్వాత, దానిని  చేతులపై అలాగే చర్మం టాన్ అయిన చర్మంపై అప్లై చేయాలి. ఇప్పుడు 15-20 నిమిషాల తర్వాత దానిని సున్నితంగా రుద్ది కడగాలి. ఈ ప్యాక్ ఉపయోగించడం వల్ల మృత కణాలు  తొలగిపోతాయి. ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది. టిప్..2 రెండవ టిప్ కసం  పచ్చి బంగాళాదుంపలు మాత్రమే అవసరం. ఉపయోగించే విధానం.. ముందుగా బంగాళాదుంప రసాన్ని తీయాలి. పచ్చి బంగాళాదుంపను తురుమి ఆ గుజ్జును పిండితే రసం వస్తుంది.  దాని రసాన్ని తీసి చర్మానికి పూయాలి. 15 నిమిషాల తర్వాత కడగాలి. బంగాళాదుంపలో బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి ఇవి చర్మ రంగును కాంతివంతం చేస్తాయి. టిప్..3 మూడవ టిప్ పాటించడం కోసం టమోటాలు అవసరం. ఉపయోగించే విధానం..  ముందుగా  టమోటాను గుజ్జు చేయాలి. టమోటాను గుజ్జు చేసిన తర్వాత టానింగ్ ఉన్న చర్మంపై  ఆ గుజ్జును అప్లై చేయాలి.  గుజ్జు అప్లై చేసిన  ప్రాంతాన్ని తేలికగా స్క్రబ్ చేసి, 15 నిమిషాల తర్వాత  చర్మాన్ని కడగాలి. టమోటాలో లైకోపీన్ ఉంటుంది, ఇది టానింగ్‌ను తగ్గిస్తుంది.                               *రూపశ్రీ.

బ్యూటీ ప్రపంచంలో సంచలనం.. బ్లూ స్కిన్ కేర్ ట్రెండ్ ఇదే..!

బ్యూటీ ప్రపంచంలో సంచలనం.. బ్లూ స్కిన్ కేర్ ట్రెండ్ ఇదే..!    ఈ రోజుల్లో బ్యూటీ,  స్కిన్ కేర్ పరిశ్రమలో  కొత్తగా వచ్చిన ఓ ట్రెండ్ ఉంది. ఇది బ్యూటీ ప్రపంచాన్ని శాసిస్తోంది.   దీని పేరు బ్లూ స్కిన్ కేర్. దీనికి సంబంధించి చాలా విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ కూడా అవుతున్నాయి.  సాధారణంగానే ఒక పద్దతి ఏదైనా ట్రెండ్ లోకి వచ్చిందంటే ఇక అది చాలా హాట్ టాపిక్ అయిపోతుంది.  చాలామంది బ్లూ స్కిన్ కేర్ అనే పేరు వింటారు కానీ దీని గురించి మాత్రం అంతగా అర్థం కాదు.. అసలు  దీనిని స్కిన్‌కేర్ ప్రపంచంలో రాబోయే  పెద్ద ట్రెండ్‌గా ఎందుకు పరిగణిస్తున్నారు? అనే విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే.. బ్లూ స్కిన్ కేర్ అంటే.. బ్లూ స్కిన్ కేర్ లో  నీలి ఉద్రిక్తత నివారణ, శీతలీకరణ,  ట్రీట్మెంట్  చేసే అంశాలు ఉంటాయి. వాటి రంగు సాధారణంగా లేత నీలం లేదా పారదర్శక నీలంలో ఉంటుంది. ఇది వేసవి,  వర్షాకాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి పనిచేస్తుంది. బ్లూ స్కిన్ కేర్ లో ఉపయోగించే పదార్థాలు.. బ్లూ  స్కిన్ కేర్‌లో ఉపయోగంచే ఉత్పత్తులు ప్రధానంగా సముద్ర పదార్థాలను కలిగి ఉంటాయి. ఈ పదార్థాలలో బ్లూ టాన్సీ ఆయిల్, బ్లూ అజులీన్, సీ వీడ్, నీలోత్పాల్,  బ్లూ చమోమిలే ఉంటాయి. బ్లూ స్కిన్ కేర్ ఎవరికి మేలు.. సున్నితమైన డీహైడ్రేషన్ లేదా వాపుతో కూడిన చర్మం ఉన్నవారికి ఈ చర్మ సంరక్షణ సరైనది కాదు. దీనితో పాటు, సహజ, శీతలీకరణ ప్రభావంతో చర్మ ఉత్పత్తుల కోసం చూస్తున్న వారికి బ్లూ స్కిన్ కేర్  సరైనదిగా పరిగణించబడుతుంది. దీనితో పాటు, కాలుష్యం,  వేడి వల్ల చర్మం ఇబ్బంది పడే వారికి కూడా బ్లూ స్కిన్ కేర్  సరైనదిగా పరిగణించబడుతుంది. బ్లూ స్కిన్ కేర్ లో ఉపయోగించే ఉత్పత్తులు ఇవే.. బ్లూ టాన్సీ ఫేస్ ఆయిల్ బ్లూ లోటస్ హైడ్రేటింగ్ మాస్క్  మెరైన్ బ్లూ జెల్ మాయిశ్చరైజర్  సీ మినరల్స్ ఫేస్ మిస్ట్ బ్లూ స్కిన్ కేర్ ప్రయోజనాలు.. ఎరుపు,  దద్దుర్లు నుండి ఉపశమనం. సున్నితమైన,  మొటిమలకు గురయ్యే చర్మానికి పర్ఫెక్ట్. చర్మాన్ని చల్లబరుస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా,  తాజాగా చేస్తుంది. జాగ్రత్తలు.. బ్లూ స్కిన్ కేర్ ను ప్రయత్నించాలని ప్లాన్ చేస్తుంటే, ఏదైనా కొత్త ఉత్పత్తిని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి. ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు, నీలం రంగు అంటే రసాయనం కాదని గుర్తుంచుకోవాలి. పదార్థాలు సహజంగా ఉన్నాయని క్లారిటీ చేసుకోవాలి. మరోవైపు, సున్నితమైన చర్మం ఉన్నవారు ఏదైనా ఉపయోగించే ముందు ఎల్లప్పుడూ చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించి వారి సలహా మేరకు మాత్రమే ఉపయోగించడం మంచిది.                                     *రూపశ్రీ.

జెన్ జెడ్ అమ్మాయిలకు కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం అదిరిపోయే చిట్కాలు..!

 జెన్ జెడ్ అమ్మాయిలకు కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం అదిరిపోయే చిట్కాలు..!   చర్మాన్ని ప్రకాశవంతంగా,  ఆరోగ్యంగా ఉంచడానికి ఎల్లప్పుడూ జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటి తరంలో చాలా వరకు జెన్ జెడ్ అమ్మాయిలు తమ   చర్మాన్ని బాగా చూసుకోవడంలో వెనుక బడ్డారని చెప్పవచ్చు. దీనివల్ల  చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజుల్లో జెన్ Z అమ్మాయిలు  ముఖంపై గాజు లాంటి మెరుపును పొందాలని ఎంతో ట్రై చేస్తుంటారు.  కానీ కొరియన్ గ్లాస్ స్కిన్‌ పొందడంలో ఫెయిల్ అయ్యే వారు చాలామంది ఉన్నారు. ఈ కొరియన్  గ్లాస్ స్కిన్ ను  సులభంగా పొందడానికి అద్బుతమైన చిట్కాలు తెలుసుకుంటే.. కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలంటే..  కొరియన్ గ్లాస్ స్కిన్ పొందాలనుకుంటే బియ్యం నీటిని ఉపయోగించవచ్చు. బియ్యాన్ని రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని ఫిల్టర్ చేసి చర్మానికి అప్లై చేయాలి. చర్మాన్ని మెరిచేలా,  మృదువుగా చేయడానికి,  పాలు,  తేనె కలిపి  ముఖానికి పూయవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా,  ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది.  కొరియన్ గ్లాస్ స్కిన్ పొందాలనుకుంటే ముఖాన్ని రోజూ రెండుసార్లు సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.  మురికిని కూడా తొలగిస్తుంది. ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవడం ఎప్పుడూ మర్చిపోకూడదు. కొరియన్ గ్లాస్ స్కిన్ పొందడానికి ఇది చాలా ముఖ్యమైనది.  ఇది నిస్తేజంగా,  నిర్జీవంగా ఉన్న చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. వారానికి ఒకసారి అయినా  ముఖాన్ని స్క్రబ్ చేసి, మురికిని తొలగిస్తే చర్మం చాలా మృదువుగా,  మచ్చలు లేకుండా మారుతుంది.  తద్వారా కొరియన్ గ్లాస్ స్కిన్‌ను కూడా పొందవచ్చు.                          *రూపశ్రీ.  

పరువాల పాదాల కోసం

పరువాల పాదాల కోసం మనలో చాలా మంది అందం విషయంలో ముఖానికిచ్చే ప్రాధాన్యత పాదాలకి ఇవ్వరు. దాని పర్యవసానమే జీవం కోల్పోయిన పాదాలు వాటి వల్ల వచ్చే పగుళ్ళు. మొహం ఎంత అందంగా ఉన్నా పగుళ్లతో నిండిన పాదాలు చూసుకుంటుంటే మనకే బాధగా ఉంటుంది కదా. అందుకే వాటి మీద కూడా శ్రద్ధ  చూపించి పాడాలని కూడా మెరిసేలా చేద్దాం. సాదారణంగా రోజు కాళ్ళని బాగా కడిగి కొద్దిగా నూనే రాసుకుని పడుకునే వారి పాదాలు ఎంతో మృదువుగా కనిపిస్తాయి. ఇలానే ఇంకొన్ని చిట్కా వైధ్యాలతో బ్యూటీ పార్లర్ కి వెళ్ళాల్సిన పని లేకుండానే పాడాలని సంరక్షించుకుందాం. *  రోజ్ వాటర్, గ్లిజరిన్ సమపాళ్ళలో తీసుకొని దానిలో దూది ముంచి దానిని పాదాలకు రాసి పదిహేను నిమిషాలు ఆరనిచ్చి కడిగెయ్యాలి. ఇలా రెండు రోజులకి ఒకసారి నెల రోజులు చేస్తే చాలు పాదాలు మృదువుగా మారిపోతాయి. *  బొప్పాయి గుజ్జులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మర్దనా చేస్తే మడమలకున్న మురికి పోతుంది. క్రమంగా ఇలా చేస్తే మురికి తొలగడమే కాకుండా పగుళ్ళు కూడా దరి చేరవు. *  గోరువెచ్చని  నీటిలో  తేనే వేసి ఆ నీటిలో పాదాలని 20-30 నిమిషాలు ఉంచి తర్వాత కడిగినా మంచి నిగారింపు వస్తుంది. *  రాత్రి పడుకునే ముందు కాళ్ళు శుభ్రంగా కడిగి ఇంట్లో ఉండే వేసలైన్ ని పాదాలకి పట్టించి పడుకోవాలి. ఇలా చేస్తే రెండు మూడు రోజుల్లోనే మీ పాదాలలో వచ్చిన తేడాని మీరే గమనించవచ్చు. *  పాదాలు మృదువుగా తయారవ్వాలంటే నాలుగు చెంచాల ఓట్ మీల్ పొడి, మూడు చెంచాల ఆలివ్ నూనె కలిపి మర్దనా చేసి, అరగంట తరువాత చల్లని నీటితో కడగాలి. దీంతో మృతకణాలు(డెడ్ సెల్స్) కూడా తొలగిపోతాయి. *  అరటిపండుని  గుజ్జులా చేసి దానిని పాదాలకి పట్టించి పదిహేను నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగినా మెరిసే పాదాలు మీవి అవుతాయి. * నువ్వుల నూనెను గోరు వెచ్చగా వేడి చేసి రాత్రి పడుకునే ముందు రాసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. *  ఆలివ్ ఆయిల్ లో దూది ముంచి ఆ దూదిని గుండ్రటి ఆకారంలో తిప్పుతూ పాదాలని ఒక పది నిమిషాలు మసాజ్ చేసి సాక్స్ వేసుకుని ఒక అరగంట ఉంచి తర్వాత వేడి నీతితో కడిగినా  చాలు పదాలు మెరిసిపోతాయి. చూసారా పాదాల సంరక్షణకి ఇంట్లోనే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చో. మరి మొదలుపెడదామా ఏదో ఒక చిట్కాని.                                                                                                                                                                                                                     ....కళ్యాణి

ఫేస్ సీరమ్ వాడుతున్నారా...దీంతో లాభాలే కాదు.. నష్టాలూ ఉన్నాయ్..!

ఫేస్ సీరమ్ వాడుతున్నారా...దీంతో లాభాలే కాదు.. నష్టాలూ ఉన్నాయ్..!    ఫేస్ సీరం అనేది చర్మానికి లోతైన పోషణ,  తేమను అందించే చర్మ సంరక్షణ ఉత్పత్తి. ఫేస్ సీరం అనేక చర్మ సమస్యలను సులభంగా తొలగిస్తుంది. దీని రెగ్యులర్ వాడకం వల్ల చర్మం ఆకృతి మెరుగవుతుంది.  చర్మం మృదువుగా,  ఆరోగ్యంగా కనిపిస్తుంది. నేటికాలంలో ఫేస్ సీరం చర్మ సంరక్షణలో ముఖ్యమైన భాగంగా మారింది ముఖ చర్మాన్ని ప్రకాశవంతం చేయాలనుకున్నా లేదా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ కోరుకున్నా ప్రతి ఒక్కరూ ఫేస్ సీరం ఉపయోగిస్తున్నారు. కానీ ఫేస్ సీరం అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, తప్పుగా ఉపయోగిస్తే అది  చర్మానికి  హాని కూడా కలిగిస్తుంది. ఫేస్ సీరమ్ ను ఎలా ఉపయోగించాలి? దీన్ని తప్పుగా ఉపయోగిస్తే కలిగే నష్టాలేంటి? తెలుసుకుంటే.. ఫేస్ సీరం ప్రయోజనాలు.. ఫేస్ సీరం చర్మాన్ని లోతుగా పోషిస్తుంది. సీరంలో ఉండే విటమిన్ సి, హైలురోనిక్ యాసిడ్,  రెటినోల్ చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తాయి. ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని వల్ల  ముఖ ముడతలు,  ఫైన్ లైన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫేస్ సీరం వాడకం చర్మపు రంగును సమతుల్యం చేస్తుంది. మచ్చలు, మొటిమలు,  టానింగ్‌ను తగ్గిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా,  ప్రకాశవంతంగా చేస్తుంది. ఫేస్ సీరం  రోజువారీ ఉపయోగం చర్మ ఆకృతిని మెరుగుపరుస్తుంది. ఫేస్ సీరం నష్టాలు.. ఇది అలెర్జీలు,  చికాకుకు కారణమవుతుంది. సున్నితమైన చర్మంపై రెటినోల్ లేదా యాసిడ్ ఆధారిత సీరమ్‌లు చికాకు,  దద్దుర్లు కలిగిస్తాయి. అతిగా ఎక్స్‌ఫోలియేషన్ చేయడం కూడా ఒక సమస్య కావచ్చు. ఫేస్ సీరంను తరచుగా ఉపయోగించడం వల్ల చర్మం  సహజ తేమ తొలగిపోతుంది. విటమిన్ సి,  రెటినోల్ వంటి కొన్ని సీరమ్‌లు చర్మాన్ని సూర్యరశ్మికి మరింత సున్నితంగా చేస్తాయి. ఫేస్ సీరమ్‌లు మొటిమలకు కారణమవుతాయి. తప్పు సీరమ్‌ను ఎంచుకోవడం వల్ల రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు పెరుగుతాయి. సీరం సరిగ్గా ఎలా ఉపయోగించాలి? ఫేస్ సీరం  పూర్తి ప్రయోజనాలను పొందడానికి,  దుష్ప్రభావాలను నివారించడానికి దానిని సరిగ్గా ఉపయోగించడం ముఖ్యం. దీని కోసం ముందుగా ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. తరువాత అరచేతిపై కొన్ని చుక్కల సీరం తీసుకొని  చేతులతో ముఖంపై తేలికగా  అప్లై చేయాలి. దానిపై మాయిశ్చరైజర్,  సన్‌స్క్రీన్ రాయాలి. రోజుకు రెండుసార్లు, ఉదయం,  రాత్రి ఉపయోగించాలి.                   *రూపశ్రీ.  

కోల్ట్ ఫేషియల్..10నిమిషాల్లో మేకప్ లేకుండానే ముఖం మెరిసిపోతుంది..!

కోల్ట్ ఫేషియల్..   10నిమిషాల్లో మేకప్ లేకుండానే ముఖం మెరిసిపోతుంది..! ఇప్పట్లో ప్రతి ఒక్కరూ మెరిసే,  ప్రకాశవంతమైన చర్మాన్ని కోరుకుంటారు. కానీ ప్రతిసారీ పార్లర్‌కు వెళ్లి ఫేషియల్ చేయించుకోవడం సాధ్యం కాదు. అలాంటి వారికి  కోల్డ్ ఫేషియల్ చాలా సులభమైన, చౌకైన,  ప్రభావవంతమైన  మార్గం.  కోల్డ్ ఫేషియల్ అంటే ముఖానికి ఐస్ థెరపీ ఇవ్వడం. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది.  ముడతలు, మచ్చలు, వాపు,  ఓపెన్ రంధ్రాలను కూడా తగ్గిస్తుంది. ఈ మధ్య కాలంలో  కోల్డ్ ఫేషియల్ ట్రెండ్ పెరిగింది. చాలా మంది నటీమణులు కూడా  ఈ ఐస్ థెరపీని తమ దినచర్యలో చేర్చుకున్నారు.  అసలు కోల్డ్ ఫేషియల్ ఎలా చేయాలో,  దాని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే.. కోల్డ్ ఫేషియల్ అంటే.. కోల్డ్ ఫేషియల్ అనేది సహజమైన చర్మ సంరక్షణ ప్రక్రియ.  దీనిలో ముఖాన్ని ఐస్ లేదా కోల్డ్ ఫేస్ మాస్క్ సహాయంతో మసాజ్ చేస్తారు. ఇది చర్మంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ముఖం తక్షణమే తాజాగా,  ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ సింపుల్  పద్ధతితో ఎటువంటి ఖరీదైన ఉత్పత్తులు లేదా పార్లర్ లకు వెళ్లకుండా  ప్రకాశవంతమైన,  ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు. కేవలం 10 నిమిషాల ఐస్ థెరపీతో, మేకప్ లేకుండా కూడా  చర్మం  క్లియర్ గా  తాజాగా,  ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కోల్డ్ ఫేషియల్ ఎలా చేయాలి? ముందుగా  ముఖాన్ని తేలికపాటి ఫేస్ వాష్ తో కడుక్కోవాలి.  తర్వాత ఐస్ క్యూబ్స్ ను కాటన్ క్లాత్ లో చుట్టాలి. చేతులతో వృత్తాకార కదలికలో  తేలికగా ఐస్ తో ముఖం మొత్తాన్ని మసాజ్ చేయాలి. ఈ ప్రక్రియను సుమారు 10 నిమిషాలు చేయాలి. ఆ తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్ లేదా కలబంద జెల్ అప్లై చేయాలి. కావాలంటే, రోజ్ వాటర్, గ్రీన్ టీ, దోసకాయ రసం లేదా కలబందను ఐస్ లో కలిపి ఐస్ క్యూబ్స్ తయారు చేసి దానితో మసాజ్ చేయవచ్చు. ఇది మరింత మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రయోజనాలు .. ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేయడం వల్ల చర్మం చల్లబడి వాపు తగ్గుతుంది. ఈ ఫేషియల్ రక్త ప్రసరణను పెంచడం ద్వారా ముఖానికి సహజమైన మెరుపును తెస్తుంది. నల్లటి వలయాలు,  ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. కోల్డ్ ఫేషియల్ తెరుచుకున్న రంధ్రాలను బిగించి చర్మాన్ని మృదువుగా, దృఢంగా చేస్తుంది. ముఖంపై దద్దుర్లు, వడదెబ్బ,  మొటిమలు కూడా ఈ చికిత్స నుండి ఉపశమనం పొందుతాయి. ఎప్పుడు చేయాలి? మెరుగైన ఫలితాలను చూడటానికి, వారానికి రెండు లేదా మూడు సార్లు కోల్డ్ ఫేషియల్ చేయడం మంచిది.. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.  ఉదయం నిద్రలేచి కోల్డ్ ఫేషియల్ చేసుకుంటే  ముఖం రోజంతా తాజాగా,  జిడ్డు లేకుండా ఉంటుంది. మేకప్ వేసుకునే ముందు కోల్డ్ ఫేషియల్ చేయడం వల్ల చర్మం నునుపుగా ఉంటుంది,  మేకప్ ఎక్కువసేపు ఉంటుంది. ముఖ్యంగా  చెమటలు ఎక్కువ పట్టేవారికి  కోల్డ్ ఫేషియల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరికి మంచిది? జిడ్డు చర్మం ఉన్నవారికి కోల్డ్ ఫేషియల్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వారు ప్రతి సీజన్‌లో కోల్డ్ ఫేషియల్ చేయవచ్చు. వేసవిలో ముఖం మీద వడదెబ్బ తగలడం సర్వసాధారణం లేదా  ముఖం మీద వాపు ఉంటే కోల్డ్ ఫేషియల్  మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది వడదెబ్బ,  వాపును తగ్గిస్తుంది. ముడతలు, ఫైన్ లైన్స్,  ఓపెన్ రంద్రాలతో బాధపడేవారు కోల్డ్ ఫేషియల్ చేసుకుంటే మేలు. చర్మం అలసిపోయి నీరసంగా మారిన వారు కోల్డ్ ఫేషియల్ చేసుకుంటే చర్మం తిరిగి తాజాగా మారుతుంది.                                   *రూపశ్రీ.

చరక సంహితలో చెప్పిన 5 చిట్కాలు పాటిస్తే చాలు..హెయిర్ ఫాల్ మాయం..!

చరక సంహితలో చెప్పిన 5 చిట్కాలు పాటిస్తే చాలు..హెయిర్ ఫాల్ మాయం..!     జుట్టు రాలడం సమస్య దాదాపు అన్ని వయసుల,  లింగాల వారిని వెంటాడుతోంది. ఈ రోజుల్లో 16-17 సంవత్సరాల పిల్లలు కూడా జుట్టు రాలడం వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. ఎక్కువగా ఈ సమస్య వాతావరణంతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా సీజన్ మారినప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది.  వర్షాకాలంలో ఈ హెయిర్ ఫాల్ సమస్య చాలా ఎక్కువ.  అయితే అసలు వర్షాకాలంలో జుట్టు రాలే సమస్య ఎందుకు పెరుగుతుంది? ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఆయుర్వేద గ్రంథం అయిన చరక సంహితలో ఎలాంటి చిట్కాలు పేర్కొన్నారు? తెలుసుకుంటే.. జుట్టు ఎందుకు రాలిపోతుంది? పిత్త స్వభావం క్షీణించినప్పుడు జుట్టు సమస్యలు వస్తాయి. ఎవరికైనా  జుట్టు రాలడం, విరిగిపోవడం,  తెల్లగా మారడం జరుగితే అది పిత్త స్వభావం క్షీణించడం వల్ల జరిగేదే. జూలై నుండి అక్టోబర్ వరకు పిత్త ధోరణి ఎక్కువగా ఉంటుంది.  ఈ కారణంగానే  చాలామందికి  జుట్టు రాలడం,  బూడిద రంగులోకి మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి.   జుట్టు సమస్యలను నివారించడానికి శరీరంలో పిత్త స్వభావాన్ని సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. దీనికోసం కొన్ని చిట్కాలు పాటించాలి. స్వీట్లు, పాలు.. శరీరంలో పిత్త స్వభావాన్ని  సమతుల్యం చేయడానికి, ఆహారం నుండి తీపి పదార్థాలు,  పాలు,  పాల  ఉత్పత్తులను తొలగించాలి. ఈ రెండు తీసుకుంటే శరీరంలో  పిత్తాన్ని సమతుల్యం చేసే ప్రక్రియ జరగదు.  జుట్టు రాలడంతో పాటు శరీరంలో అనేక సమస్యలను కలిగిస్తాయి.అందుకే స్వీట్లు, పాలు, పాల ఉత్పత్తులను మానేయాలి. నాన్ వెజ్.. శ్రావణ మాసంలో సాధారణంగా  మాంసాహారం తినవద్దని చెబుతారు. దీని వెనుక మతపరమైన కారణమే కాకుండా  శాస్త్రీయ కారణం కూడా ఉంది.  పిత్తాన్ని సమతుల్యం చేయడానికి మాంసాహారం తినకుండా ఉండాలి. ఎండ.. పిత్తాన్ని సమతుల్యం చేయడానికి ఎండలో తక్కువగా బయటకు వెళ్లాలి.  ఎక్కువ నీరు త్రాగాలి. ఇది జుట్టు రాలడం సమస్య నుండి బయటపడటానికి సహాయపడుతుంది . ఇది జుట్టుకే కాదు..   ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. చియా విత్తనాలు.. పిత్త స్వభావాన్ని సమతుల్యం చేయడానికి  చియా విత్తనాలను నీటిలో నానబెట్టి త్రాగాలి. దీని కోసం  చియా విత్తనాలను ఒక గ్లాసు శుభ్రమైన నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో తీసుకోవాలి. బాదం బంక.. బాదం బంకను గోండ్ కటిరా అంటారు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. దీన్ని కొద్దిగా నీటిలో నానబెట్టి సుమారు 4 గంటల తరువాత తినవచ్చు. ఇది జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.  జుట్టు సమస్యలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.                                *రూపశ్రీ.

తేనెలొలికె పెదాలకోసం

                                                                 తేనెలొలికె  పెదాలకోసం   మనం ఎవరితోనైనా మాట్లాడుతుంటే మనకి తెలియకుండానే ఎక్కువగా చూసేది ఎదుటివారి  పెదాలనే అట. దానిని మానసిక శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరించారు. మరి మన పెదాలు పొడిబారిపోయి ఉంటే చూడటానికి బాగోదు కదా. అందుకే కళావిహీనంగా ఉండే పెదాలు ఎర్రటి దొండపండులా  మారిపోవాలంటే కొంత మేజిక్ చెయ్యాల్సిందే. ఒక స్పూన్ పాల మీగడని బీట్రూట్ రసం లేదా దానిమ్మ రసంతో కలపండి, ఈ మిశ్రమాన్ని  పెదాలకు పట్టిస్తే ఎర్రటి మృదువైన  పెదాలని సొంతం చేసుకోవచ్చు. కొంచెం పెరుగులో టమాటా పేస్ట్ ని కలిపి పెదాలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. తేనె అనేది ఎలాంటి చిట్కాలకైనా  ఉపయోగపడుతుంది,12 టీ స్పూన్ తేనెను 12 టీ స్పూన్ నిమ్మ రసంతో కలిపి పెదాలకు పట్టిస్తే, పగుళ్ళతో జవసత్వం కోల్పోయిన పెదాలు ఎంతో అందంగా మారిపోతాయి. ఎండుద్రాక్షని రాత్రంతా నీటిలొ నానపెట్టి ఉదయాన్నె ఖాళి కడుపుతో తింటే మంచి సత్ఫలితాల్ని ఇస్తుంది.ఇది కేవలం పెదాలకే కాదు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.   గులాబి రేకుల్ని పాలల్లో కలిపి ముద్దగా చేసి పెదాలకు రాసుకుంటే ఊహించని ఫలితాలు పొందవచ్చు. కొబ్బరి నూనె, బాధం నూనె సమపాళ్ళలొ కలిపి పెదాలకి పట్టించి రాత్రంతా ఉంచాలి, ఇలా 2 వారాలు చేస్తే మంచి ఫలితాల్ని పొందవచ్చు. విటమిన్ “ఈ” కలిగి ఉన్న లిప్ క్రీంని రోజు నిద్ర పోయే ముందు పెదవులకు రాసుకుంటే మర్నాటి ఉదయానికి పెదాలు మెత్తగా తయ్యారవుతాయి.  ఇలాంటి చిట్కాలు పాటిస్తూనే శరీరానికి తగినంత నీరు తీసుకోవటం మర్చిపోవద్దు.నీరు ఎంత తాగితే శరీరం అంత నిగనిగలాడుతూ ఉంటుంది.    కళ్యాణి  

ముఖానికి ఆవిరి పడితే కలిగే లాభాలు ఇవే..!

ముఖానికి ఆవిరి పడితే కలిగే లాభాలు ఇవే..! ఆడవారికి అందం మీద చాలా ఆసక్తి ఉంటుంది.  ఎవ్వరిముందైనా సరే అందంగా కనిపించాలనే కోరుకుంటారు. కొందరు మేకప్ తో అందానికి మెరుగులు దిద్దుకున్నా నేచురల్ బ్యూటీ అనే ట్యాగ్ వేయించుకోవడం అందరికీ ఇష్టం.  ముఖారవిందాన్ని ద్విగుణీకృతం చేసే చిట్కాలు చాలానే ఉంటాయి.  వాటిలో ముఖానికి ఆవిరి పట్టడం కూడా ఒకటి. బ్యూటీ పార్లర్ కు వెళితే తప్పనిసరిగా ఆవిరి కూడా బ్యూటీ ట్రీట్మెంట్  లో ఉంటుంది. ముఖానికి ఆవిరి పడితే చాలా లాభాలు ఉంటాయని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.  అవేంటంటే.. ముఖానికి ఆవిరి పడితే మూసుకుపోయిన ముఖ చర్మ రంధ్రాలు తెరచుకుంటాయి.   చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.  చర్మ రంధ్రాలలో పేరుకున్న మురికి తొలగిపోతుంది.  ఇది బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది. అలాగే బ్లాక్  హెడ్స్ రాకుండా నివారిస్తుంది కూడా.  అయితే ముఖానికి ఆవిరి పట్టడం మంచిదని దీన్ని రెగ్యులర్ గా ఫాలో అయితే చర్మం చాలా సెన్సిటివ్ అవుతుంది.  చర్మ రంధ్రాలు చాలా వెడల్పు అవుతాయి. కాబట్టి ఆవిరిని వారానికి ఒక సారి లేదా 10 రోజులకు ఒకసారి పట్టాలి. అప్పుడప్పుడు ఆవిరి పట్టడం వల్ల ముఖం పై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ క్లియర్ అవుతాయి.  చర్మం క్లియర్ గా మారుతుంది.  చర్మంలో అదనపు నూనె పేరుకోవడం తగ్గుతుంది.  ఇది జిడ్డు చర్మం నివారించడంలో సహాయపడుతుంది. చర్మం హైడ్రేట్ గా ఉండటంలో తోడ్పడుతుంది. ముఖ చర్మంలో మురికి,  నూనెలు పేరుకుపోవడం, చర్మ సంరక్షణ పాటించకపోవడం వల్ల  ముఖం మీద మొటిమలు వస్తాయి.  అదే ముఖానికి అప్పుడప్పుడు ఆవిరి పడుతూ ఉంటే చర్మ రంధ్రాలు క్లియర్ గా ఉంటాయి.  ఇది మొటిమలు రాకుండా చేయడంలో సహాయపడుతుంది. ముఖానికి ఆవిరి పట్టడం హైడ్రా ఫేషియల్ లాగా పనిచేస్తుంది.  హైడ్రా ఫేషియల్ ముఖంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.  ముఖానికి  ఆవిరి పట్టడం వల్ల కూడా అదే ఫలితాలు ఉంటాయి.  దీని వల్ల ముఖం  కాంతివంతంగా మారుతుంది. కనీసం వారానికి ఒక్కసారి ముఖానికి ఆవిరి పడుతూ ఉంటే ముఖ చర్మం రిలాక్స్ గా ఉంటుంది.  ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.  అంతేకాదు ఇలా వారానికి ఒకసారి ఆవిరి పడుతూ ఉంటే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.  ఆవిరి ప్రక్రియ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.                                                       *రూపశ్రీ.

పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలి...

 పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం ఇవ్వాలి..   పిల్లలు తరచుగా జ్వరం, ఇన్ఫెక్షన్లకు గురవుతారు. ఆకస్మిక దగ్గు, జ్వరం, జలుబు, ఆయాసం వేధిస్తుంటాయి. దీనికి ప్రధాన కారణాలు ఇన్ఫెక్షన్లు, ఆకస్మిక వాతావరణ హెచ్చుతగ్గులు. పెరిగిన శరీర ఉష్ణోగ్రత, అంటువ్యాధులతో పోరాడే ప్రక్రియ, శరీరం నుండి ఎక్కువ శక్తిని వినియోగించుకుంటుంది. అందుకే పిల్లలు జబ్బు బారిన పడగానే.. పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. కాబట్టి పిల్లలు త్వరగా కోలుకోవడానికి తల్లిదండ్రులు ఎలాంటి ఆహారాలు ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు, కరివేపాకు పొడి: పిల్లలు జ్వరంతో బాధపడుతున్నప్పుడు పసుపు, కరివేపాకు పొడిని ఆహారంలో చేర్చండి. వీటిలో శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడతాయి. మిల్క్ షేక్: రుచిలేని నాలుకకు మిల్క్ షేక్ ఉత్తమం. పిల్లలు తినడానికి ఆసక్తి చూపవచ్చు. అరటి-వాల్నట్ మిల్క్ షేక్..జ్వరంతో బాధపడుతున్నవారికి ఇవ్వాల్సిన ఆహారంలో ఒకటి.  ఇది నరాలు, కండరాలు, రోగనిరోధక శక్తి, మెదడుకు మద్దతు ఇచ్చే పూర్తి, పోషకమైన ఎంపికగా పనిచేస్తుంది. ఈ అరటి-వాల్నట్ మిల్క్ షేక్ మీరు వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. డ్రైఫ్రూట్స్: పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు డ్రై ఫ్రూట్స్‌ను కరకరలాడే స్నాక్‌గా ఇవ్వవచ్చు. ఈ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉండి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఆప్రికాట్లు, అత్తి పండ్లు, ఎండుద్రాక్ష వంటి వాటిని ఇస్తుండాలి. ఇవి ప్రేగు కదలికలను ప్రేరేపిస్తాయి. పండ్లు, కూరగాయలు: పిల్లలు త్వరగా కోలుకోవడానికి పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చాలి.  కూరగాయలతో చేసిన వంటకాలు త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి. వీటితో పాటు ఫ్రూట్ జ్యూస్, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి మరింత శక్తి లభిస్తుంది. పుచ్చకాయ దాదాపు 91% నీరు కలిగి ఉంటుంది.  జ్వరంతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేయడానికి ఇది అనువైనది. అలాగే, పుచ్చకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. వేడి నీరు: పిల్లల జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటికి వేడినీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. బిడ్డ గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా వేడిచేసిన నీటిని ఇవ్వండి. వేడి నీళ్ళు గొంతు నొప్పి, మూసుకుపోయిన ముక్కుకు ఉపశమనంగా పనిచేస్తాయి.  *నిశ్శబ్ద.

పటిక ఇలా వాడి చూడితే.. ముఖం మీద ముడతలు మాయం..!

 పటిక ఇలా వాడి చూడితే.. ముఖం మీద ముడతలు మాయం..!   ముఖం మీద ముడతలు వృద్ధాప్యానికి మొదటి సంకేతం. కానీ నేటి కాలంలో ఒత్తిడి, నిద్ర లేకపోవడం, సూర్యరశ్మి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల 30 ఏళ్ల వయసుకే ముఖం మీద ముడతలు కనిపిస్తాయి. దీని కోసం చాలా మంది ఖరీదైన మార్కెట్ ఉత్పత్తులు వాడుతుంటారు. కానీ పటిక ముడతలకు అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఆయుర్వేదం కూడా సిఫారసు చేస్తుంది. పటిక  ముఖం  మెరుపును తిరిగి తీసుకురావడంలో సహాయపడుతుంది. పటికలో ఉండే క్రిమినాశక,  బిగుతు లక్షణాలు చర్మాన్ని బిగుతుగా చేయడమే కాకుండా, ముడతలను క్రమంగా తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఇది చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది.  ముఖం సహజంగా ప్రకాశవంతంగా ఉంటుంది. దీని కోసం పటికను ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే.. పటికలో ఉండే బిగుతు లక్షణాలు చర్మాన్ని బిగుతుగా చేయడానికి పనిచేస్తాయి. వయసు పెరిగే కొద్దీ, చర్మంలో కొల్లాజెన్ పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది స్థితిస్థాపకతను తగ్గిస్తుంది,   ముడతలు ఏర్పడటానికి దారితీస్తుంది. పటిక చర్మం పై పొరను కొద్దిగా కుదిస్తుంది, దీనివల్ల రంధ్రాలు చిన్నగా కనిపిస్తాయి,  చర్మం బిగుతుగా అనిపిస్తుంది. దీని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి,  చర్మ ఛాయను కూడా మెరుగుపరుస్తాయి. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల  ముఖం మీద  సన్నని గీతలు,  ముడతలు క్రమంగా తగ్గడం ప్రారంభిస్తాయి.  చర్మం కొత్త మెరుపును పొందుతుంది. పటికను ఇలా వాడాలి.. ముఖానికి పటికను పూసే ముందు, దానిని కొంచెం నీటిలో నానబెట్టి కొద్దిగా తేమగా ఉంచాలి. ఇప్పుడు దానిని ముఖం మీద సున్నితంగా రుద్దాలి. ముఖ్యంగా కళ్ళ కింద, నుదిటిపై,  బుగ్గలపై ముడతలు ఎక్కువగా కనిపించే చోట. తేలికపాటి చేతులతో సుమారు 2-3 నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత ముఖాన్ని సాదా నీటితో కడుక్కోవాలి. కొంతమంది పటికను రుబ్బి ఫేస్ ప్యాక్ కూడా తయారు చేస్తారు, దీనికి రోజ్ వాటర్ జోడించడం ద్వారా ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు. చర్మం సున్నితంగా ఉంటే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. వారానికి 3-4 సార్లు ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు లభిస్తాయి. ముడుతలకు మాత్రమే కాదు.. పటిక ముడతలకు మాత్రమే కాకుండా అనేక చర్మ సమస్యలకు కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది మొటిమలను ఎండబెట్టడంలో, మచ్చలను తేలికపరచడంలో,  చర్మపు రంగును సమం చేయడంలో కూడా సహాయపడుతుంది. దీని క్రిమినాశక లక్షణాలు చర్మాన్ని బ్యాక్టీరియా,  ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి కూడా రక్షిస్తాయి. పటిక పేస్ట్‌ను పూయడం వల్ల బ్లాక్‌హెడ్స్,  వైట్‌హెడ్స్ కూడా తగ్గుతాయి. దీనితో పాటు ఇది షేవింగ్ తర్వాత చికాకు లేదా కోతల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.                         *రూపశ్రీ.

రెండు చుక్కల నెయ్యి ముఖానికి రాయండి.. ఫలితాలు చూసి  షాకవుతారు..!

రెండు చుక్కల నెయ్యి ముఖానికి రాయండి.. ఫలితాలు చూసి షాకవుతారు..! చలికాలం చర్మానికి పరీక్ష కాలం అని చెప్పవచ్చు.   చర్మాన్ని సంరక్షించుకోవడానికి ఈ కాలంలో చాలా రకాల చిట్కాలు పాటిస్తుంటారు. వందలు, వేలాది రూపాయలు వెచ్చించి  ఫేస్ క్రీమ్ లు, లోషన్లు, మాయిశ్చరైజర్లు కొనుగోలు చేస్తుంటారు.  మరికొందరు ఇంట్లోనే చిట్కాలు ట్రై చేస్తుంటారు. అయితే ఖరీదైన వాణిజ్య ఉత్పత్తులను వదిలి కేవలం రెండు చుక్కల నెయ్యిని ముఖానికి రాసుకోమని చెబుతున్నారు  చర్మ సంరక్షణ నిపుణుల నుండి వైద్యుల వరకు. అసలు నెయ్యిని ముఖానికి రాయడం వల్ల జరిగేదేంటి? ఖరీదైన వాణిజ్య ఉత్పత్తులను మించి నెయ్యి చేసే మ్యాజిక్ ఏంటి? తెలుసుకుంటే.. ముఖం పై మచ్చలు, ముడతలు, పొడిబారడం వంటి వాటిని పోగొట్టుకోవడానికి చాలా మంది ఖరీదైన ఉత్పత్తులు వాడతారు. అలాగే చలికాలంలో వచ్చే సమస్యలను తగ్గించడానికి కూడా వాడతారు. అయితే వీటి బదులు నెయ్యి వాడవచ్చు. నెయ్యిని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మానికి మ్యాజిక్ జరుగుతుంది.  నెయ్యిని ముఖానికి రాస్తుంటే చర్మంలో తేమ నిలిచి ఉంటుంది. ఇది చర్మం చలి కారణంగా  పొడిబారడం, పగుళ్లు ఏర్పడటాన్ని నివారిస్తుంది.  నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి చర్మం దెబ్బతినకుండా కాపాడతాయి. నెయ్యిలో అరాకిడోనిక్, లినోలెనిక్ ఆమ్లం వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి దెబ్బతిన్న చర్మానికి పోషణను ఇస్తాయి. ఫలితంగా వాడిపోయి పగుళ్లు ఏర్పడిన చర్మం తిరిగి యవ్వనంగా, ఆరోగ్యంగా మారుతుంది. ముఖ చర్మం వాడిపోయి రంగు కోల్పోయినట్టుగా ఉన్నప్పుడు రెండు చుక్కల స్వచ్చమైన నెయ్యిని ముఖానికి అప్లై చేసి కాస్త మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల  ముఖం చర్మం కాంతివంతంగా మారుతుంది.  చర్మ కణాల నష్టం తగ్గుతుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు వంటివి వస్తుంటే రెండు చుక్కల నెయ్యిని ముఖానికి అప్లై చేయాలి.  ఇలా ప్రతిరోజూ రెండు చుక్కల నెయ్యి ముఖానికి పూస్తుంటే  చర్మం పై మచ్చలు,  మొటిమలు వదులుతాయి.  చర్మం మీద అన్ని రకాల మచ్చలు లేకుండా క్లిస్టర్ క్లియర్ అవుతుంది. నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయనే విషయం తెలిసిందే.  ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ముఖం మీద ముడతలను తొలగించి ముఖ చర్మాన్ని యవ్వనంగా మారుస్తుంది.  ప్రతిరోజూ నెయ్యిని ఇలా ముఖానికి రాసుకుంటూ ఉంటే ఎంత వయసు పెరిగినా చర్మం యవ్వనంగా ఉంటుంది.                                        *రూపశ్రీ.  

ఐస్ ఫేషియల్ చేసే అలవాటు ఉందా..దీంతో ఎంత డేంజర్ అంటే..!

ఐస్ ఫేషియల్ చేసే అలవాటు ఉందా..దీంతో ఎంత డేంజర్ అంటే..!   ఐస్ ఫేషియల్.. ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయ్యింది.  ఐస్ ముక్కలను ముఖం మీద రుద్దడం ఇందులో భాగం.  ఇలా చేయడం వల్ల ముఖ చర్మం మెరుస్తుందని, ముఖ చర్మానికి రక్తప్రసరణ బాగుంటుందని అంటారు.  చాలామంది అమ్మాయిలు ఈ ఐస్ ఫేషియల్ చేసుకోవడానికి ఇష్టపడతారు కూడా. అయితే ఇది అందరూ చెప్పుకుంటున్నట్టు అంత ఆరోగ్యకరమైనది ఏమీ కాదని కొందరు చెబుతున్నారు. దీనికి కారణం ఐస్ ఫేషియల్ వల్ల లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉంటాయి. అవేంటో తెలుసుకుంటే.. చర్మం చాలా సున్నితంగా ఉండే వ్యక్తుల చర్మాన్ని ఇది మరింత దెబ్బతీస్తుంది. చాలా చల్లగా ఉన్న ఏదైనా ఎక్కువసేపు  చర్మానికి నేరుగా వర్తించినప్పుడు చర్మం రఫ్ తేమను కోల్పోతుంది. దీనివల్ల చర్మం తొందరగా దెబ్బతింటుంది. పగుళ్లు రావడం,  ఎర్రగా మారడం జరుగుతుంది. ఐస్ ఫేషియల్‌లో ఐస్  క్యూబ్‌ను నేరుగా ముఖంపై రుద్దితే అది చర్మంపై మంట లేదా చికాకు కలిగించవచ్చు. అందువల్ల కాటన్ లేదా హ్యాండ్‌కర్చీఫ్‌లో ఐస్ క్యూబ్‌ను ఉంచి దాంతో ముఖాన్ని మసాజ్ చేయాలి. ఇలా ముఖానికి ఐస్ క్యూబ్స్ ఫేషియల్ చేసుకున్న తరువాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. కొందరు ఐస్ పేషియల్ చేసుకోవాలనే  తొందరలో  ముఖం కడుక్కోకుండా ఐస్ ఫేషియల్ చేసుకుంటారు.  దీని వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ చర్మ రంద్రాలలో బ్యాక్టీియా చిక్కుకుంటుంది. సున్నితమైన చర్మం ఉన్నవారికి ఐస్ ఫేషియల్ మంచిది కాదు.  ఇలా చేయడం వల్ల ముఖం మీద మంటగా అనిపిస్తుంది. అంతేకాకుండా ముఖం  చర్మం రంగు  కూడా నిస్తేజంగా మారుతుంది. పొడి చర్మం ఉన్నవారు ప్రతిరోజూ ఐస్ ఫేషియల్స్ చేస్తే  ముఖంపై పింక్ రాషెస్ ఏర్పడవచ్చు. ఐస్ ఫేషియల్ చర్మంలో రక్త ప్రసరణను అడ్డుకుంటుంది.  ఇప్పటికే ఏదైనా చర్మ సంబంధిత సమస్యతో  ఇబ్బంది పడుతున్నట్లైతే ఐస్ ఫేషియల్ చేయకపోవడమే మంచిది. ఐస్ ఫేషియల్ చేయడం వల్ల  చర్మం చాలా కఠినంగా మారుతుంది. చర్మం గీతలు పడిపోతుంది. ఐస్ ఫేషియల్ చెయ్యాలి అనుకుంటే ముఖం మీద నేరుగా ఐస్ ను అప్లై చేయకూడదు.                                           *రూపశ్రీ.  

ఇంట్లోనే తయారు చేసిన ఈ క్రీమ్ వాడితే చాలు.. కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి..!

 ఇంట్లోనే తయారు చేసిన ఈ క్రీమ్ వాడితే చాలు.. కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి..!      ఒకరి ముఖం చూసి వారి అందం గురించి చెప్పేస్తారు.  ముఖారవిందంలో చాలా విషయాలు ీలకపాత్ర పోషిస్తాయి. కళ్లు, పెదవులు, కనురెప్పలు,  కనుబొమ్మలు.. ఇలా అన్నీ ముఖారవిందాన్ని పెంచేవే.   ముఖం సహజ సౌందర్యం  వెంట్రుకలపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎంత బాగా రెఢీ అయినా సరే.. కనురెప్పలు,  కనుబొమ్మలు ఒత్తుగా అందంగా ఉంటే ముఖ వర్చaస్సు మరింత పెరుగుతుంది.  చాలామంది ముఖం అందంగా కనిపించడం కోసం కనురెప్పలకు మస్కారా వేసుకుంటారు.  ఇంకొంతమంది కృత్రిమ  కనురెప్పలు పెట్టుకుంటారు. కనురెప్పలను, కనుమ్మలను సహజంగా ఒత్తుగా పెంచుకోవడం కోసం ఇంట్లోనే ఒక అద్బుతమైన క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఇదెలా తయారు చేయాలో.. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. ఆముదం కలబంద జెల్ విటమిన్ ఇ టాబ్లెట్స్ (పై పదార్థాలు అన్నీ కావలసిన మోతాదు మేరకు పెంచుకోవచ్చు) తయారీ విధానం.. ఒక డ్రాపర్ బాటిల్ తీసుకోవాలి. అందులో ఆముదం,  కలబంద జెల్,  విటమిన్-ఇ ఆయిల్.. మూడు పదార్థాలు వేయాలి. దీన్ని బాగా షేక్ చేయాలి. దీన్ని డ్రాపర్ బాటిల్ లో కాకుండా సాధారణ కంటైనర్ లో కూడా నిల్వ చేసుకోవచ్చు. ఇది దాదాపు కాస్త చిక్కగా క్రీమ్ లాగా మారుతుంది.  దీన్ని ఇయర్ బడ్ సహాయంతో కనురెప్పలకు అప్లై చేయవచ్చు.  ఇది కనురెప్పలలో కొత్త వెంట్రుకల పెరుగుదలకు అవసరమైన పోషణను ఇస్తుంది.  తద్వారా కనురెప్ప వెంట్రుకలు మూలాల నుండి బలంగా పెరుగుతాయి. ఈ క్రీమ్ ను ప్రతిరోజూ 10 నుండి 15 నిమిషాల పాటు కనురెప్పల మీద ఉంచుకున్నా సరే.. చాలా అద్బుతమైన ఫలితాలు ఉంటాయట. అంతేకాదు.. దీన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కనురెప్పలకు అప్లై చేయవచ్చు. రాత్రంతా అలాగే ఉంచుకోవచ్చు.  ఇది మరింత మెరుగైన ఫలితాలు ఇస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్స్ట్ ఉండవు.                                  *రూపశ్రీ.

నలుపు ఈజీగా పోగొట్టే చిట్కాలు తెలుసా..

నలుపు ఈజీగా పోగొట్టే చిట్కాలు తెలుసా.. అమ్మాయిలలో అందం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందుకే అమ్మాయిలు చాలా అందంగా, హుందాగా తయారు కావడానికి ఇష్టపడతారు. కొందరు ప్యాషన్ దుస్తులు ధరించడానికి, ముఖ్యంగా స్లీవ్ లెస్ దుస్తులు వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. దీనికి కారణం అండర్ ఆర్మ్ నల్లగా ఉండటం.  చంకల కింద నలుపు కారణంగా కొన్ని అందమైన దుస్తులు వేసుకోలేక బాధపడే అమ్మాయిలు బోలెడుమంది ఉన్నారు. అయితే ఈ నలుపును ఇంటి దగ్గరే ఈజీగా తొలగించుకోవచ్చు. అందుకోసం కింది టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. కావలసిన పదార్థాలు.. కాఫీ పొడి.. కోల్గేట్ టూత్ పేస్ట్.. పసుపు..   రోజ్ వాటర్.. పైన చెప్పుకున్న మిశ్రమాలలో కాఫీ పొడిని ఒక చిన్న కప్పులో తీసుకుని అందులో కోల్గేట్ పేస్ట్,  చిటికెడు పసుపు,  రోజ్ వాటర్ వేసి పేస్ట్ లాగా మిక్స్ చేయాలి.  దీన్ని చంకల కింద నలుపు ఉన్న ప్రాంతంలో పట్టించి 10నిమిషాలు అలాగే వదిలేయాలి.  తరువాత శుభ్రమైన నీటితో కడిగేయాలి.  ఈ టిప్ ను వారానికి ఒక్కసారి అయినా ఫాలో అవుతుంటే కేవలం 15 రోజులలోనే తేడా స్పషంగా కనిపిస్తుంది. చంకల కింద, మెడ వెనుక భాగంలో ఉండే నలుపు తగ్గించుకోవడానికి మరొక చిట్కా కూడా ఉంది.  ప్రతి రోజూ తాజా కలబంద జెల్ ను చంకల కింద నలుపు ఉన్న ప్రాంతంలో, మెడ వెనుక నల్లగా ఉన్న ప్రాంతంలో పూయాలి. 15 నుండి 20 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఒక చెంచా కొబ్బరి నూనెలో ఒక చెంచా టూత్ పేస్ట్,  అర చెంచా ఉప్పు వేసి మెడ వెనుక నలుపు ఉన్న ప్రాంతంలో,  చంకల కింద నలుపు ఉన్న చోట అప్లై చేయాలి. వారానికి ఒక్కసారి ఇలా చేస్తే 15 రోజుల్లోనే ఫలితం ఉంటుంది.                                      *రూపశ్రీ.

చర్మాన్ని యవ్వనంగా ఉంచే కొల్లాజెన్ డ్రింక్.. తాగితే మ్యాజిక్కే..!

చర్మాన్ని యవ్వనంగా ఉంచే కొల్లాజెన్ డ్రింక్.. తాగితే మ్యాజిక్కే..!   మెరిసే,  మృదువైన చర్మం కావాలని కోరుకోని అమ్మాయిలు ఎవరూ ఉండరు. ఇది ఎప్పటికీ యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది కాబట్టి చర్మం మెరుస్తూ,  మృదువుగా ఉండాలని కోరుకుంటారు.   ఇందుకోసం చాలా ఖరీదైన ఉత్పత్తులు,  స్కిన్ ట్రీట్మెంట్ వైపు దృష్టి సారించేవారు ఎక్కువ.  మరికొందరు మందులు కూడా వాడతారు.  చర్మం యవ్వనంగా,  మెరుస్తూ, మృదువుగా ఉండాలంటే శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి ఆశించినంతగా ఉండాలి.  కానీ 30 ఏళ్ల వయసు తర్వాత కొల్లాజెన్  ఉత్పత్తి తగ్గుతుంది. కొల్లాజెన్ అంటే.. శరీరంలో కొల్లాజెన్ అత్యంత సమృద్ధిగా లభించే ప్రోటీన్ . ఇది  శరీరంలోని మొత్తం ప్రోటీన్‌లో దాదాపు 30% ఉంటుంది. కొల్లాజెన్  శరీరం యొక్క చర్మం, కండరాలు, ఎముకలు, స్నాయువులు.. ఇతర బంధన కణజాలాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని అనేక భాగాలలో, రక్త నాళాలు,  పేగు లైనింగ్ వంటి వాటిలో కూడా కనిపిస్తుంది. కొల్లాజెన్ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.  స్థితిస్థాపకతను పెంచుతుంది. కొల్లాజెన్ ను ఎలా పెంచాలో  తెలుసుకుంటే.. కొల్లాజెన్ ఐస్ క్యూబ్స్.. కావలసిన పదార్థాలు.. దోసకాయలు నానబెట్టిన చియా విత్తనాలు బీట్‌రూట్ పౌడర్ పుదీనా ఆకులు నిమ్మకాయ కలబంద రసం ఎలా తయారు చేయాలి? ముందుగా  మిక్సర్ తీసుకోవాలి. అందులో తరిగిన దోసకాయ వేసి, పైన పేర్కొన్న అన్ని ఇతర పదార్థాలను కలిపి, నీరు కలపాలి. అన్ని పదార్థాలను బాగా గ్రైండ్ చేసుకోవాలి.  ఇప్పుడు ఈ ద్రవాన్ని ఐస్ ట్రేలో పోసి ఫ్రీజర్‌లో ఉంచాలి. ఎలా ఉపయోగించాలి?  ఐస్ క్యూబ్స్ గడ్డకట్టిన తర్వాత, ఒక గ్లాసు నీటిలో 3 క్యూబ్స్ కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో త్రాగవచ్చు. ఇది  ముఖంపై సహజమైన మెరుపును తెస్తుంది. ఈ పానీయం తాగిన తర్వాత  రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. అలాగే చాలా యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ సి,  ఇతర పోషకాలు లభిస్తాయి. ఇది  చర్మాన్ని లోపలి నుండి మెరిసేలా చేస్తుంది .  ఈ ఐస్ క్యూబ్‌లను 10 నుండి 12 రోజుల వరకు నిల్వ చేయవచ్చు. ఒకవేళ ఓపిక,  పదార్థాలు అన్ని అందుబాటులో ఉంటే దీన్ని అప్పటికప్పుడు తాజాగా కూడా తయారుచేసుకుని తాగవచ్చు.                                    *రూపశ్రీ.

ముఖం మీద మచ్చలను 7రోజులలో మాయం చేసే చిట్కా.. కేవలం 5 రూపాయలు ఖర్చు చేస్తే చాలు..!

ముఖం మీద మచ్చలను 7రోజులలో మాయం చేసే చిట్కా.. కేవలం 5 రూపాయలు ఖర్చు చేస్తే చాలు..! ముఖం మీద మచ్చలను తరచుగా వయస్సు పెరుగుతున్నందుకు సంకేతం అనుకుంటారు. కానీ పెరుగుతున్న వయస్సుతో పాటు, చర్మం విషయంలో తీసుకునే అజాగ్రత్తల వల్ల కూడా ఇది జరుగుతుంది.   జీవనశైలి మారడం, సరైన ఆహారం తీసుకోకపోవడం,  నిద్ర సరిగా లేకపోవడం వంటి కారణాలు ముఖం మీద  మచ్చలు రావడానికి కారణం అవుతాయి. . దీని కారణంగా ముఖం వృద్ధాప్యంగా లేదా వయస్సు కంటే పెద్దదిగా కనిపిస్తుంది. చాలామంది అమ్మాయిలు  ముఖంపై మచ్చలను తొలగించడానికి క్రీములు,  చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు. అయితే, ఈ క్రీములలో అధిక రసాయనాలు ఉపయోగించబడతాయి.   ఇది ముఖానికి ప్రయోజనాల కంటే చాలా రెట్లు ఎక్కువ హాని కలిగిస్తుంది.  సహజంగా ఎలాంటి  సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మీద మచ్చలను తొలగించడానికి కేవలం 5 రూపాయలు ఖర్చు చేస్తే చాలు. ఇంతకీ ఈ చిట్కా ఏంటి? తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు. బంగాళాదుంపలు నీరు కలబంద జెల్ పసుపు తయారీ విధానం.. మొదట  బంగాళాదుంపలను తీసుకోవాలి. ఇప్పుడు  ఈ బంగాళాదుంపలను కట్ చేసి మిక్సర్‌లో వేయాలి. ఇప్పుడు మిక్సర్‌లో కొంచెం నీరు కలపాలి, నేరుగా రుబ్బుకోవడానికి ప్రయత్నించవద్దు. ఈ బంగాళాదుంపలు బాగా రుబ్బుకున్న తర్వాత, ఒక గిన్నెలో దాని రసాన్ని విడిగా తీసుకోవాలి.  దీన్ని 10 నిమిషాలు అలాగే ఉంచితే, స్టార్చ్ గిన్నె అడుగున పేరుకుపోతుంది.  ఈ స్టార్చ్‌ను విడిగా తీయాలి. ఇప్పుడు దానికి కలబంద జెల్, చిటికెడు పసుపు,  విటమిన్-ఇ క్యాప్సూల్ జోడించాలి .  ఈ పదార్థాలన్నింటినీ బాగా కలపాలి. దీన్ని ఫేస్ మాస్క్ గా ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలి? రాత్రి పడుకునే ముందు ఈ పేస్ట్‌ను అప్లై చేయాలి. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత  ముఖాన్ని కడుక్కోవాలి.  ఈ రెమెడీని 7 రోజుల పాటు నిరంతరం పాటిస్తే, ముఖం  పిగ్మెంటేషన్ మాయమవుతుంది. అలాగే ముఖం పూర్తిగా శుభ్రంగా,  సహజంగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.                        *రూపశ్రీ.

ఉల్లిపాయ రసం వాడినా జుట్టు పెరగట్లేదా.. ఇదిగో ఇలా వాడితే షాక్ అవుతారు..!

ఉల్లిపాయ రసం వాడినా జుట్టు పెరగట్లేదా.. ఇదిగో ఇలా వాడితే షాక్ అవుతారు..!   మార్కెట్లో అమ్ముడవుతున్న జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో ఉల్లిపాయను 'హీరో'గా చూపించి ఉత్పత్తులు అమ్ముడుపోయేలా చేస్తుంటారు ఉత్పత్తి దారులు.   ఉల్లిపాయ జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో బాగా ప్రాచుర్యం పొందింది. నూనె, షాంపూ, కండిషనర్ వంటి చాలా జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో ఉల్లిపాయను సారాన్ని చేర్చుతున్నారు. ఉల్లిపాయపై చూపే ఈ ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఉల్లిపాయ జుట్టుకు బాగా పనిచేస్తుందని ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది అందరికీ.   కానీ దానిని ఉపయోగించినా జుట్టు పెరుగుదల సరిగా లేక చాలామంది నిరాశకు లోనవుతూ ఉంటారు.  అయితే ఉల్లిపాయ జుట్టుకు చేసే మేలు ఏంటి? దాన్ని ఎలా ఉపయోగించడం కరెక్ట్.. మొదలైన విషయాలు తెలుసుకుంటే.. జుట్టు సంరక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దేశంలోని 90% మందికి ఉల్లిపాయ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదట. అందుకే  జుట్టు పెరుగుదలలో ఎటువంటి తేడా కనిపించడం లేదని అంటున్నారు.  దీని కారణంగా అసలు ఉల్లిపాయ జుట్టు పెరుగుదలకు నిజంగానే మేలు చేస్తుందా అనే ప్రశ్న చాలామందిలో సందేహంగా మిగిలి ఉంది. అయితే  ఉల్లిపాయ రసం కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.  జుట్టు రాలడాన్ని ఆపుతుంది.  లేదా తగ్గిస్తుంది . వైద్యుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజూ ఉల్లిపాయ రసం రాయడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగవుతుంది.   పులియబెడితే.. ఉల్లిపాయను గ్రైండ్ చేసి రసాన్ని ఫిల్టర్ చేసిన తరువాత ఆ రసాన్ని నేరుగా తలకు అప్లై చేస్తుంటారు కొందరు. అయితే ఇది కరెక్ట్ పద్దతి కాదట.  ఉల్లిపాయ రసాన్ని 72 గంటలు అంటే  మూడు రోజుల పాటు దాన్ని పులియబెడితే అది మ్యాజిక్ లాగా పనిచేస్తుందట.  ఇలా పులియబెట్టడం వల్ల  ఆ ఉల్లిపాయ రసంలో క్వెర్సెటిన్ స్థాయిలు పెరుగుతాయట,  PH తల చర్మానని అసమతుల్యం చేస్తుందట. కొత్త విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఏర్పడతాయట. పై విధంగా తయారైన ఉల్లిపాయ రసాన్ని తలకు అప్లై చేస్తే  జుట్టు చాలా ఆరోగ్యంగా, వేగంగా పెరుగుతుంది.                                *రూపశ్రీ.