క్యూట్ పోజులతో రచ్చ చేస్తోన్న రష్మీ!
on May 13, 2021
'జబర్దస్త్', 'ఎక్ట్రా జబర్దస్త్' షోల ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది రష్మీ గౌతమ్. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. బుల్లితెరపై దూసుకుపోతున్న రష్మీ సినిమా ఆఫర్లు కూడా అందిపుచ్చుకుంటోంది. దాదాపు ఎనిమిదేళ్లుగా తన సత్తా చాటుతోన్న రష్మీ.. తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోగలిగింది. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
తాజాగా బ్లాక్ డ్రెస్ లో తీసుకున్న కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అతి తక్కువ సమయంలో ఈ ఫోటోలకు లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. ఈ ఫొటోల్లో అమ్మడు క్యూట్ పోజులతో, కొద్దిపాటి క్లీవేజ్ షోతో రచ్చ చేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు చాలా అందంగా ఉన్నావని.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోవంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఓపక్క 'ఎక్స్ట్రా జబర్దస్త్' షోతో పాటు 'ఢీ' షోలో టీమ్ లీడర్ గా వ్యవహరిస్తోన్న రష్మీ సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటుంది. మూగ జీవాలను కాపాడాలంటూ ఎప్పటికప్పుడు రష్మీ పోస్ట్ లు పెడుతూనే ఉంటుంది. అలానే లాక్ డౌన్ సమయంలో ఆకలితో ఇబ్బంది పడుతున్న వీధి కుక్కలకు ఆహరం అందేలా రష్మీ చర్యలు చేపట్టింది.
Also Read