అనసూయ.. రోజుకి లక్షన్నర!
on May 6, 2021
బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతోంది. స్పెషల్ సాంగ్స్, స్పీకర్ రోల్స్ అంటూ బిజీగా గడుపుతోంది. నిడివి తక్కువ రోల్ అయినప్పటికీ తనదైన ముద్ర వేస్తోంది. దీంతో చాలా మంది దర్శకులు ఆమె కోసం పాత్రలు రాసుకుంటున్నారు. తాజాగా ఈ బ్యూటీ నటించిన 'థ్యాంక్ యు బ్రదర్' సినిమా మే 7న 'ఆహా'లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా గురించి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
ఈ సినిమాను కరోనా సమయంలో చిత్రీకరించడంతో తక్కువ సిబ్బందితో తెరకెక్కించారు. చాలా రోజుల క్రితమే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటికీ.. సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తరువాత థియేటర్లు బంద్ అయ్యాయి. దీంతో ఓటీటీలో సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇది చిన్న సినిమానే అయినప్పటికీ అనసూయకి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం అనసూయ రోజూవారీ రెమ్యునరేషన్ తీసుకుందట.
రోజుకి లక్షన్నర చొప్పున పారితోషికం తీసుకుందట. అలా సినిమా కోసం 17 రోజులు కేటాయించిందట. అంటే మొత్తంగా రూ.25 లక్షల వరకు తీసుకుందని అంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే కొత్త హీరోయిన్లకు ఇచ్చే రెమ్యునరేషన్ కంటే అనసూయకే ఎక్కువ వస్తుందన్నమాట. మొన్నామధ్య 'చావు కబురు చల్లగా' సినిమాలో ఐటెం సాంగ్ లో నటించినందుకు రూ.6 లక్షల వరకు తీసుకుందట ఈ హాట్ యాంకర్.
Also Read