గెస్ట్ హౌస్ లో రిషికి మర్దన చేసిన వసుధార!
on Jan 25, 2023
'గుప్పెడంత మనసు' సీరియల్ ఎపిసోడ్ -668 లోకి అడుగుపెట్టింది. కాగా మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో... జగతి, మహేంద్ర లు వచ్చేసరికి వసుధార క్యాబిన్ లో కూర్చుంటుంది దేవయాని. "వసుధారని కాలేజీ నుంచి తొలగించడం మీ వల్ల కావడం లేదు కదా... ఆ పని చెయ్యడానికి నేను వచ్చాను" అని దేవయాని అంటుంది. అప్పుడే వసుధార వచ్చి "మేడమ్ అది నా క్యాబిన్" అని అనగానే "ఇది నా కాలేజీ" అని దేవయాని అంటుంది. కాలేజీ మీదే కానీ క్యాబిన్ నాది. మీరు కావాలంటే MD సార్ క్యాబిన్ లో కూర్చోండని అనగానే కోపంగా దేవయాని వెళ్ళిపోతుంది.
రిషి గెస్ట్ హౌస్ లో ఉంటాడు. అక్కడ ఉన్న ఆఫీస్ బాయ్ ని పిలుస్తాడు. అంతలోనే వసుధార వస్తుంది. వసుధారని చూడకుండా ఆఫీస్ బాయ్ అనుకుని "కాస్త తలనొప్పిగా ఉంది... మర్దన చెయ్" అని అనగానే అక్కడే ఉన్న వసుధార మర్దన చేస్తుంది వెంటనే వెనక్కి చూసి... " ఏంటీ వసుధార ఇలా చెయ్యడం మర్యాద కాదు...ఎందుకు వచ్చావ్" అని రిషి అనగా "మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడటానికి" వచ్చాను అని వసుధార చెప్తుంది. ఇద్దరు కలిసి కాలేజీ మీటింగ్ కి వెళ్తారు.
మీటింగ్ లో వసుధారకి ప్రాజెక్ట్ లో సపోర్ట్ గా జగతి మేడంని ఉండమని చెప్తాడు రిషి. దానికి జగతి ఒప్పుకోదు. అల్ ది బెస్ట్ వసుధార గారు అని చెప్పి వెళ్ళిపోతాడు. మరో వైపు చక్రపాణి వసుధార దగ్గరికి వస్తాడు. "రిషి సర్ దగ్గరి వెళ్లి క్షేమించమని అడగాలి" అని చక్రపాణి వెళ్తుండగా... "వద్దు నాన్న నేనే మాట్లాడుతా" అని వసుధార చెప్తుంది. "నిన్ను రిషి సర్ ని పక్క పక్కన చూడాలి అమ్మా" అని చక్రపాణి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.