శ్రీముఖి, సాయిశ్రీ చరణ్ మధ్య ఏం జరుగుతోంది?
on Jul 5, 2022
శ్రీముఖి ఇటీవల అన్ని షోస్ లో కనిపిస్తూ అలరిస్తోంది. ఇప్పుడు 'సరిగమప' షోకి హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. కోటి, శైలజ, స్మిత, అనంతశ్రీరాం జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ఈ స్టేజికి ఈ వారం క్రేజీ ఫెలో టీం వచ్చి సందడి చేసింది. గత ఎపిసోడ్స్ నుంచి చూస్తే గనక శ్రీముఖి.. చరణ్ మీద జోక్స్ వేయడం, చరణ్ గురించే ప్రత్యేకంగా మాట్లాడడం చేస్తుండేసరికి ఇద్దరి మధ్యన ఏముందో అని గుసగుసలాడుకుంటున్నారు ఆడియన్స్. శ్రీముఖితో చరణ్ కలిసి డాన్స్ చేయడం, అతని డాన్స్ కి ఫిదా ఐపోయి శ్రీముఖి కూడా హగ్ ఇవ్వడం చూసాం. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ బోనాల స్పెషల్ షోకి గెస్ట్ గా వచ్చిన ఆది సాయికుమార్ "నీకు, చరణ్ కి సంబంధించి ఒక క్రేజీ వీడియో చూసాను. ఏం జరుగుతోంది ఇద్దరి మధ్య?" అని శ్రీముఖిని అడిగాడు.
"చరణ్ 'తొలిప్రేమ'లో పాట పాడినా మీకు అర్ధం కాలేదా?" ఇంకా అని అడిగింది శ్రీముఖి. అప్పుడు ఆది అర్థమైనట్టు తలూపాడు. "నా మనసులో మాట ఎన్నో సార్లు చెప్పాను. కానీ ఆయన మాత్రం చెప్పడు" అంటూ చరణ్ గురించి కామెంట్ చేసింది శ్రీముఖి. "ఒక అమ్మాయి ఇన్నిసార్లు ఐ లవ్ యు చెప్పినా చరణ్ పట్టించుకోవట్లేదు చూసారా ఆది గారు" అంది.
ఇక చరణ్ కూడా శ్రీముఖికి ప్రొపోజ్ చేయడానికన్నట్టు స్టేజి మీదకు వచ్చేసరికి అందరు కూడా ఒక్కసారి షాక్ అయ్యి అలానే చూశారు. శ్రీముఖి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది. కానీ ఫైనల్ గా చరణ్ మోకాలి మీద కూర్చుని షూ లేస్ కట్టుకున్నాడు. అది చూసేసరికి శ్రీముఖికి నోటమాట రాకుండా పోయింది. "నాలో అర సెకను ఆశ రేపావు చరణ్. నువ్ లూజ్ అని తెలుసు. షో లేస్ ఐనా టైట్ గా కట్టుకో" అంటూ బాధపడింది శ్రీముఖి.