వాళ్ళు పత్తి ఏరేవాళ్ళా ? ఆర్టిస్టులా?
on Aug 3, 2022
బుల్లితెర మీద రెమ్యూనరేషన్ గురించి ప్రొడక్షన్ ఫుడ్ గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒక షోలో తక్కువిస్తున్నారంటూ ఇంకో షోకి వెళ్లిపోవడం.. ఫుడ్ బాలేదని ఇంటర్వ్యూల్లో చెప్పడం తెలిసిన విషయమే. ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల జాతరలో రెమ్యూనరేషన్ గొడవ మళ్ళీ మొదలయ్యింది. ఆది ఈ రెమ్యూనరేషన్స్ మీద కౌంటర్ లు వేస్తాడు. ఈ ఎపిసోడ్ లో మధుప్రియ ఫామిలీ, కనకవ్వ వచ్చేసారు. కనకవ్వతో ఆది, నాటి నరేష్ ఫన్ చేస్తారు. ఆ తరువాత ఆది కనకవ్వ ఇట్రా అని పిలిచి వీళ్లెవరో తెలుసుగా వర్ష, భాను ..వీళ్ళను ఎక్కడైనా చూసావా ? అని అడుగుతాడు.
"ఆ చూసాను పత్తి ఏరడానికి మా ఊరికొచ్చినప్పుడు చూసా" అనేసరికి వాళ్ళ మొహాలు మాడిపోతాయి. "వాళ్ళు పత్తి ఏరేవాళ్ళు కాదు ఆర్టిస్టులు అంటాడు. వర్షకు 2 వేలు ఇస్తే చాలు..భానుకు 200 లు ఇచ్చి రెండు పూటలా భోజనం పెడితే చాలు" అని వాళ్ళ పరువు తీసేతాడు ఆది. భాను వెంటనే రియాక్ట్ అయ్యి ఆదిని పక్కకు తోసేస్తుంది. వెంటనే వర్ష మేమొచ్చాకే పండగ అందం వచ్చింది తెలుసా అంటుంది..కనకవ్వ వర్ష తెలుసుగా నీకు అంటాడు. కామెడీ చేస్తదా అని అడుగుద్ది కనకవ్వ. కామెడీ చేయదు. మధ్యమధ్యలో విసిగిస్తూ ఉంటది అని అంటాడు. "ఏదైమైనా సరే స్టేజి చాలా నిండుగా ఉంది" అంటుంది హరిత. "స్టేజి నిండుగా ఉండాలంటే ఎవరో అక్కర్లేదు మీరు, నవీన ఇద్దరు ఉంటె చాలు" అంటూ పంచ్ వేస్తాడు ఆది.