కంటెస్టెంట్స్ కామెడీ చేయడం లేదు...జడ్జెస్ కామెడీ చేస్తున్నారు!
on Dec 10, 2022
ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రాంప్రసాద్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీ పెట్టి రన్ చేస్తూ ఉంటాడు. ఈ స్కిట్ లో కామెడీ పీక్స్ అని అర్థమైపోయింది. కంప్యూటర్ కి మదర్ బోర్డు లేదేంటండి అని కమెడియన్ బాబు అడిగేసరికి ఇదొక అనాధ..దీనికి అమ్మ ఉండదు అని పంచ్ వేసాడు. ఇక గెటప్ శీను రష్యా నుంచి వచ్చే ఆఫీసర్ పాత్రలో కనిపించి ఎంటర్టైన్ చేసాడు.
తర్వాత ఇండియాలో వస్తున్న జబర్దస్త్ లో ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి ..ఐతే అందులో ఒక మైనస్ ఉంది అదేంటంటే కామెడీ మీద కాన్సంట్రేట్ చేయాలి కానీ రాంప్రసాద్ జుట్టు మీద కాదు అని కౌంటర్ వేసాడు గెటప్ శీను. అంతేకాదు జబర్దస్త్ లో కంటెస్టెంట్స్ ఎవరూ కామెడీ చేయడం లేదు జడ్జెస్ కామెడీ చేస్తున్నారు..అని అన్నాడు.
ఇక ఈ ఎపిసోడ్ లో రాంప్రసాద్ కి జుట్టు అంతగా కనిపించలేదు. ఎందుకంటే ఇటీవలే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.
Also Read