ఒక్క ఓట్ కూడా రాని శ్రీసత్య.. యునానిమస్ గా గెలిచిన రోహిత్ !
on Dec 6, 2022
బిగ్ బాస్ టాస్క్ లతో ప్రేక్షకులను అలరిస్తాడు. కాగా ఈ టాస్క్ లలో కొన్ని ట్విస్ట్ లు, కొంత ఓపిక కావాలి అని చెప్తాడు. అందులోనే భాగంగా బిగ్ బాస్ సరికొత్త టాస్క్ ను తెచ్చాడు. అది 'ఇట్స్ పే బ్యాక్ టైం' టాస్క్. "ఈ టాస్క్ లో గెలిచి మీరు ఎంత డబ్బుని అయితే కోల్పాయారో, అంత డబ్బుని మళ్ళీ పొందవచ్చు. అయితే ఈ డబ్బు పొందాలంటే మీరందరూ కలిసి జాగ్రత్తగా ఓటింగ్ వేయాలి. మీలో ఇద్దరు కలిసి టాస్క్ ఆడుతారు. ఎవరైతే ఓడిపోతారు అని అనుకుంటున్నారో వారికి ఓటింగ్ వేసి సీక్రెట్ గా బ్యాలెట్ బాక్స్ లో వేయాలి" అని చెప్పాడు బిగ్ బాస్.
"ఇది మనకి బిగ్ బాస్ ఛాలెంజ్ కాబట్టి మనం ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కలిసి ఆడుదాం" అని రేవంత్ చెప్పగా హౌస్ మేట్స్ అంతా ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఫస్ట్ టాస్క్ కోసం రోహిత్, శ్రీసత్యను రేవంత్, హౌస్ మేట్స్ అంతా కలిసి ఏకాభిప్రాయంతో ఎంచుకున్నారు. ఇక శ్రీసత్య, రోహిత్ ని గార్డెన్ ఏరియాకి రమ్మని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత రేవంత్ ని కన్ఫెషన్ రూంకి రమ్మన్నాడు. "మీరు మొదటి చాలెంజ్ లో పోటీ పడటానికి ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో చెప్పండి" అని బిగ్ బాస్ అడుగగా, " రోహిత్, శ్రీసత్య ఇద్దరు బాగా ఆడుతారు. కానీ రోహిత్ స్ట్రాంగ్ కాబట్టి నేను రోహిత్ గెలుస్తాడని అనుకుంటున్నా బిగ్ బాస్. శ్రీసత్య ఓడిపోతుందని ఓటు వేస్తున్నాను" అని చెప్పి ఓటు వేసి బయటకొచ్చాడు రేవంత్.
ఆ తర్వాత శ్రీహాన్ ని కన్ఫెషన్ రూంకి పిలిచాడు బిగ్ బాస్. " చెప్పండి శ్రీహాన్.. ఎవరు ఓడిపోతారు ఈ టాస్క్ లో?" అని అడుగగా, "శ్రీసత్య ఓడిపోతుందని అనుకుంటున్నా బిగ్ బాస్" అని శ్రీసత్యకి ఓట్ వేసాడు శ్రీహాన్. ఇలా ఒక్కొక్కరుగా కన్ఫెషన్ రూంకి వచ్చి ఓట్లు వేయగా, అందరూ శ్రీసత్య ఓడిపోతుంది అని ఓట్లు వేసారు. ఒక్కరంటే ఒక్కరు కూడా శ్రీసత్య గెలుస్తుందని ఓటు వేయలేదు. హౌస్ మేట్స్ అందరు తమ ఓట్లతో యునానిమస్ గా రోహిత్ ని గెలిపించారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. టాస్క్ లో శ్రీసత్య గెలిచింది. రోహిత్ ఓడిపోయాడు. దీంతో "హౌస్ మేట్స్ కి ఇక 'పే బ్యాక్' అనేది రాదు" అని బిగ్ బాస్ చెప్పాడు.
Also Read