‘వీరసింహారెడ్డి’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
on Dec 3, 2022
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. బాలయ్య ముహూర్తం చూసి ఖరారు చేశాడట. జనవరి 12 న విడుదల చేయాలని. దాంతో దర్శక నిర్మాతలు వీర సింహా రెడ్డి చిత్రాన్ని 2023 జనవరి 12 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నుండి వస్తున్న చిత్రం కావడంతో 'వీర సింహా రెడ్డి'పై భారీ అంచనాలు అటు అభిమానుల్లోను ఇటు ప్రేక్షకులలోనూ మిన్నంటుతున్నాయనే చెప్పాలి.
ఈ చిత్రానికి సంబందించి ప్రమోషన్స్లో భాగంగా ముందుగా చిత్రం టైటిల్ను ఎనౌన్స్ చేశారు. తర్వాత ‘ జై బాలయ్య ….. జై జై బాలయ్య‘ అనే సాంగ్ను ఇటీవలే రిలీజ్ చేసింది. ఈ సాంగ్ రిలీజైన అతి కొద్ది గంటల్లోనే ఇప్పటివరకు వున్న యూట్యూబ్ రికార్డ్స్ను బ్రేక్ చేసింది.
తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా బాలయ్య సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది. ఇక ఈ మూవీ తర్వాత బాలకృష్ణ.. అనీల్ రావిపూడితో ఓ యాక్షన్ సినిమా చేయనున్నాడు. ఫాదర్-డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ‘పెళ్ళిసందD’ ఫేం శ్రీలీలా, బాలకృష్ణకు కూతురిగా నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇక బాలయ్యతో పాటు ఈ సంక్రాంతి బరిలో జనవరి 13న 'వాల్తేరు వీరయ్య'తో మెగాస్టార్ చిరంజీవి, తమిళ్ హీరో విజయ్ నటిస్తున్న ‘వారసుడు‘ థియేటర్లలోకి రానున్నారు. మూడు సినిమాలకు ఎటువంటి ఓపెనింగ్స్ లభిస్తాయో అని ఒకపక్క ఫ్యాన్స్ మరో పక్క ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
Also Read