పవన్ కల్యాణ్లో అదే వేడి, అదే వాడి, అదే పవర్!
on Apr 10, 2021
తమ్ముడు పవన్ కల్యాణ్ను వెండితెరపై 'వకీల్ సాబ్' అవతారంలో చూసి అన్న చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. మూడు సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీదకు వచ్చిన పవన్ కల్యాణ్లో వేడి, వాడి, పవర్ ఏమాత్రం తగ్గలేదంటూ పొగిడారు. ఏప్రిల్ 9న 'వకీల్ సాబ్' మూవీ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలకు ఒక రోజు ముందుగానే తాను 9వ తేదీ సాయంత్రం ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి థియేటర్లో 'వకీల్ సాబ్' చూడబోతున్నానని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా మెగాస్టార్ తెలిపారు.
చెప్పినట్లే నిన్న సాయంత్రం అమ్మ అంజనాదేవి, భార్య సురేఖ, మిగతా కుటుంబసభ్యులతో కలిసి 'వకీల్ సాబ్' మూవీని తిలకించారు. మూడేళ్ల తర్వాత తమ్ముడిని తెరపై చూసి ఎక్సైట్మెంట్కు గురయ్యారు. ఆ సినిమా చూశాక తనకు కలిగిన ఫీలింగ్ను అందరితో పంచుకున్నారు. శనివారం తన ట్విట్టర్ హ్యాండిల్లో, "మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ పవన్ కల్యాణ్ - అదే వేడి, అదే వాడి, అదే పవర్. ప్రకాశ్రాజ్తో కోర్ట్ రూమ్ డ్రామా అద్భుతం! నివేదా థామస్, అంజలి, అనన్య వాళ్ల పాత్రల్లో జీవించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సినిమాటోగ్రాఫర్ పి.ఎస్. వినోద్ ప్రాణం పోశారు. దిల్ రాజుకి, బోనీ కపూర్కి, డైరెక్టర్ వేణు శ్రీరామ్కి, మిగతా టీమ్కి నా శుభాకాంక్షలు. అన్నిటికి మించి మహిళలకి ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యవసరమైన చిత్రం. ఈ 'వకీల్ సాబ్' కేసులనే కాదు, అందరి మనసుల్నీ గెలుస్తాడు." అని రాసిన నోట్ను షేర్ చేశారు.
చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో, తనయుడు రామ్చరణ్తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ 'ఆచార్య' మూవీని చేస్తున్నారు. మే 13న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.
Also Read