'మేజర్' టీజర్ను రిలీజ్ చేయనున్న ముగ్గురు సూపర్స్టార్లు!
on Apr 11, 2021
అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'మేజర్' టీజర్ను ఏప్రిల్ 12న రిలీజ్ చేయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. 26/11 ముంబై టెర్రర్ ఎటాక్స్లో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి, తన జీవితాన్ని పణంగా పెట్టిన ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయక జర్నీతో 'మేజర్' రూపొందుతోంది.
నిజమైన పాన్ ఇండియా మూవీగా 'మేజర్'ను ప్రొజెక్ట్ చేయడానికి టీజర్ను మూడు భాషలకు చెందిన ముగ్గురు సూపర్స్టార్లు రిలీజ్ చేస్తున్నారు. తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మహేశ్బాబు, సల్మాన్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ వరుసగా తెలుగు, హిందీ మలయాళం భాషల్లో టీజర్ను ఏప్రిల్ 12న ఆవిష్కరిస్తున్నారు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలోని విభిన్న దశలను ఈ టీజర్ చూపించనునంది. ఇప్పటివరకూ బయటి ప్రపంచానికి తెలీని ఆయన ఇన్స్పిరేషనల్ జర్నీ గురించి ప్రేక్షకులకు ఈ టీజర్ తెలియజేయనుంది.
సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో పరకాయప్రవేశం చేసిన అడివి శేష్, ఆ అమరవీరుడి వీరోచిత కృత్యాలను తెరపై ప్రదర్శిస్తూ, ఆయన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్లోని మైలురాళ్లను మనముందు ఆవిష్కరించనున్నాడు. ఉన్నికృష్ణన్గా అడివి శేష్ ఫస్ట్ లుక్ రిలీజైనప్పుడు సోషల్ మీడియాలో అది వైరల్ అయ్యింది. ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. అలాగే సయీ మంజ్రేకర్, శోభిత దూళిపాళ క్యారెక్టర్ పోస్టర్లకూ మంచి రెస్పాన్స్ వచ్చింది.
'మేజర్'లో అడివి శేష్, శోభిత దూళిపాళ, సయీ మంజ్రేకర్, ప్రకాశ్రాజ్, రేవతి, మురళీశర్మ ప్రధాన పాత్రధారులు. శశికిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సోనీ పిక్చర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ యస్ మూవీస్ కలిసి నిర్మిస్తున్నాయి.
Also Read