సుక్కు శిష్యుడితో రానా చిత్రం?
on Mar 6, 2021
ఈ ఏడాది వేసవిలో నెల రోజుల వ్యవధిలో రెండు ఆసక్తికరమైన చిత్రాలతో సందడి చేయనున్నాడు రానా. మార్చి 26న త్రిభాషా చిత్రం `అరణ్య` విడుదల కానుండగా.. ఏప్రిల్ 30న `విరాట పర్వం` రిలీజ్ కానుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలసి నటిస్తున్న `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ ఏడాది ద్వితీయార్ధంలో థియేటర్స్ లోకి రానుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా రానా మరో ఆసక్తికరమైన చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ వివరాల్లోకి వెళితే.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ వద్ద గత కొంతకాలంగా సహాయకుడిగా పనిచేస్తున్న వెంకీ.. రీసెంట్ గా రానాకి ఓ స్టోరీ చెప్పాడట. అది నచ్చడంతో రానా వెనువెంటనే ఈ సినిమాకి అంగీకారం తెలిపాడట. అంతేకాదు.. ఇదివరకెన్నడూ కనిపించని పాత్రలో ఈ దగ్గుబాటి స్టార్ దర్శనమివ్వనున్నాడని టాక్. త్వరలోనే రానా, వెంకి కాంబో మూవీకి సంబంధించి మరింత సమాచారం వెలువడే అవకాశముంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రొడ్యూస్ చేయనుందని తెలిసింది.
మరి.. `ఉప్పెన`తో సుక్కు శిష్యుడు బుచ్చిబాబు సెన్సేషన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో.. వెంకి కూడా అదే బాట పడతాడేమో చూడాలి.
Also Read