కోహ్లీ నా ఫేవరెట్ క్రికెటర్ కాదు.. రష్మిక సెన్సేషనల్ కామెంట్స్
on May 17, 2021
ఐపీఎల్ లో ఎవరైనా తన ఫేవరెట్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అని చెప్తే, వాళ్ళు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయ్యుంటారని అనుకుంటాం. కానీ కన్నడ భామ రష్మికా మందన్న మాత్రం తాను ఆర్సీబీ టీమ్ కి అభిమానినే అయినప్పటికీ.. విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ కాదని వ్యాఖ్యానించింది.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ క్రికెట్ ను రెగ్యులర్గా ఫాలో అవుతానని రష్మిక చెప్పింది. ముఖ్యంగా తనకి ఐపీఎల్ అంటే పిచ్చని వెల్లడించింది. ఈ ఏడాది ఆర్సీబీ ఎలాగైనా టైటిల్ గెలవాలని కోరుకున్నానని, అయితే అనుకోని పరిస్థితుల్లో లీగ్ వాయిదా పడటం తనను బాధించిందని చెప్పింది.
అయితే ఆర్సీబీ తన ఫేవరెట్ జట్టు అయినప్పటికీ తన ఫేవరేట్ క్రికెటర్ మాత్రం ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి కాదని రష్మిక చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. తనకి మాజీ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. బ్యాటింగ్, వికెట్ కీపింగ్, కెప్టెన్సీ లో ధోని సూపర్ అని ఆకాశానికి ఎత్తేసింది. క్రికెట్లో ధోనీ నా ఆల్టైమ్ హీరో అని రష్మిక చెప్పుకొచ్చింది.
ఇక రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న‘పుష్ప’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. దీంతో పాటు.. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ తో ఓ సినిమా, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిషన్ మంజు’ అనే సినిమాల్లో ఆమె నటిస్తోంది.
Also Read