టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్!!
on May 13, 2021
టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. అలానే మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. వీటితో పాటు తెలుగులో పలు మల్టీస్టారర్ సినిమాలు రానున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో క్రేజీ మల్టీస్టారర్ కి రంగం సిద్ధమైందని వార్తలొస్తున్నాయి.
సీనియర్ హీరో రాజశేఖర్, యాక్షన్ హీరో గోపీచంద్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రానుందని తెలుస్తోంది. లక్ష్యం, లౌక్యం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శ్రీవాస్ ఈ మల్టీస్టారర్ ని తెరకెక్కించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలో గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరి ఈ కాంబో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.
Also Read