తరుణ్తో `అనుభవించు రాజా` అంటున్న నాగ్
on Mar 1, 2021
యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్.. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కింగ్ నాగార్జున నిర్మించిన `ఉయ్యాలా జంపాలా`తో మొదలైంది. తొలి ప్రయత్నంలోనే తరుణ్ కి మంచి విజయం దక్కింది. ఆ సెంటిమెంట్ తోనే ఐదేళ్ళ తరువాత నాగ్ నిర్మాణంలో `రంగుల రాట్నం` చేశాడు రాజ్. అయితే, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం నాగ్ నిర్మాణంలో మరో మూవీ చేశాడు రాజ్ తరుణ్. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి `అనుభవించు రాజా` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. తండ్రి, తాతలు ఆర్జించిన సంపాదనతో విలాస పురుషుడిగా మారిన ఓ యువకుడికి.. అనుకోకుండా ఎదురయ్యే ఇబ్బందుల నేపథ్యంలో `అనుభవించు రాజా` రూపొందిందట.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోందని సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేయనున్నారు.
మరి.. `ఉయ్యాలా జంపాలా` తరహాలో ఈ సినిమా కూడా రాజ్ తరుణ్ కి మెమరబుల్ హిట్ ని అందిస్తుందేమో చూడాలి.