ఆగస్టు నుంచి ఫ్లాష్బ్యాక్ సీన్స్తో '#PSPK28'!
on May 17, 2021
'గబ్బర్ సింగ్' (2012) వంటి సెన్సేషనల్ హిట్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - స్టార్ కెప్టెన్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకి రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నారు. ఇందులో పవన్కి జోడీగా 'బుట్టబొమ్మ' పూజా హెగ్డే నటించనున్నట్లు సమాచారం.
కాగా, '#PSPK28' అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ని ఆగస్టు నుంచి ప్రారంభించడానికి హరీశ్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు.. ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్స్తో చిత్రీకరణకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. మరి.. ఈ ప్రచారంలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవన్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్, 'హరిహర వీరమల్లు'తో బిజీగా ఉన్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్లో దగ్గుబాటి స్టార్ రానాతో కలిసి నటిస్తున్నారు పవర్ స్టార్. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ ఏడాది చివరలో ఈ రీమేక్ రిలీజ్ కానుంది.
ఇక 'హరిహర వీరమల్లు' విషయానికొస్తే.. వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ పిరియడ్ డ్రామా 2022 సంక్రాంతిని లక్ష్యంగా చేసుకుని నిర్మాణం జరుపుకుంటోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతానికైతే ఈ రెండు చిత్రాల షూటింగ్కి తాత్కాలికంగా బ్రేక్ పడింది.