కొవిడ్ కాటు.. నిర్మాత సి.ఎన్. రావు మృతి
on Apr 21, 2021
కరోనా వైరస్ కాటుకు టాలీవుడ్ నిర్మాత ఒకరు బలయ్యారు. కొవిడ్-19తో పోరాడుతూ నిర్మాత సి.ఎన్. రావు (చిట్టి నాగేశ్వరరావు) మృతి చెందారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. సి.ఎన్. రావు స్వస్థలం ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం. డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన అనంతరం ప్రొడ్యూసర్గా మారారు.
మా సిరిమలమలె, అమ్మా నాన్న లేకుంటే, బ్రహ్మానందం డ్రామా కంపెనీ అనే చిత్రాలు నిర్మించారు. తమిళంలోనూ ఊరగా అనే ఫిల్మ్ తీశారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా గతంలో పనిచేసిన సి.ఎన్. రావు, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శిగా, ఫిల్మ్ చాంబర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆయన మృతిపై నిర్మాతల మండలి తీవ్ర విచారాన్ని వ్యక్తంచేసి, ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేసింది.