మలయాళం స్టార్ హీరోకు కరోనా పాజిటివ్!
on Oct 20, 2020
మలయాళం స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్కు టెస్ట్లో కొవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కొచ్చిలో జరుగుతున్న తన లేటెస్ట్ ఫిల్మ్ 'జన గణ మన' షూటింగ్లో పాల్గొంటున్న ఆయనకు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్లు పరీక్షల్లో వెల్లడైంది. ఆయనతో పాటు, ఆ మూవీ డైరెక్టరర్ డిజో జోస్, మరికొంత మంది యూనిట్ సభ్యులకు కూడా కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది.
ఇటు హీరో, అటు డైరెక్టర్ ఇద్దరూ ఇన్ఫెక్షన్ బారిన పడటంతో, 'జన గణ మన' సినిమా షూటింగ్ను నిలిపి వేశారు. షూటింగ్కు హాజరవుతున్న యూనిట్ మెంబర్స్ అందరూ క్వారంటైన్లోకి వెళ్లారు. ఈ సినిమాలో ఇటీవలే ఉత్తమ నటుడిగా కేరళ ప్రభుత్వ అవార్డ్ పొందిన స్టార్ కమెడియన్ సూరజ్ వెంజరమూడు కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారు.
పృథ్వీరాజ్కు కొవిడ్-19 పాజిటివ్ అని తేలినప్పటికీ, ఆయనలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు. మే నెలలో 'ఆడుజీవితమ్' షూటింగ్ సందర్భంగా జోర్డాన్కు వెళ్లొచ్చినప్పుడు ఆయనకు టెస్టుల్లో కొవిడ్-19 నెగటివ్ అని తేలింది. మోహన్లాల్ నటించగా ఇండస్ట్రీ హిట్ అయిన 'లూసిఫర్' మూవీని డైరెక్ట్ చేసింది పృథ్వీరాజే.
Also Read