ప్రభాస్ లంబోర్గిని కారులో సోదరి జాలీ రైడ్!
on Apr 11, 2021
ఇటీవల ప్రభాస్ ఒక సరికొత్త లంబోర్గిని అవెంటడోర్ రోడ్స్టర్ కారును కొన్నాడు. మనదేశంలోనే ఆ మోడల్ కారును సొంతం చేసుకున్న రెండో భారతీయుడు ప్రభాస్. దాదాపు రూ. 6 కోట్ల విలువైన ఆ కారుతో ప్రభాస్ ఉన్న ఫొటోలు ఆన్లైన్లో బాగా వైరల్ అయ్యాయి. ప్రభాస్ గ్యారేజ్లో ఇప్పటికే ఉన్న ఖరీదైన కార్లకు ఈ లంబోర్గిని కారు తోడయ్యింది.
ఇప్పుడు ఆ కారులో ప్రభాస్ సోదరి, కృష్ణంరాజు కుమార్తె ప్రసీద ప్రయాణం చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ను ప్రసీద తల్లి శ్యామల తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు. అందులో ప్రసీద ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్లో జాలీ రైడ్కు వెళ్తున్న దృశ్యాలున్నాయి.
అంతకు ముందు ఆ కారు పక్కన తను, భర్త కృష్ణంరాజు నిల్చొని దిగిన పిక్చర్ను కూడా శ్యామల షేర్ చేశారు. లంబోర్గిని తన ఫేవరేట్ కారని శ్యామల కామెంట్ చేశారు.
ప్రభాస్ లేటెస్ట్ ఫిల్మ్ 'రాధే శ్యామ్' నిర్మాతల్లో ప్రసీద ఒకరు. ఆ సినిమాను యువి క్రియేషన్స్తో పాటు కృష్ణంరాజు సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణా మూవీస్ కూడా నిర్మిస్తోంది. దాని తరపున ప్రసీద సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆమె అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశారు.